కృత్తివెన్ను: మండల పరిధిలోని అడ్డపర్ర వద్ద గురువారం రాత్రి 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అడ్డపర్రకు చెందిన గార్లపాటి కోటేశ్వరరావు(65) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కృత్తివెన్ను నుంచి మచిలీపట్నం వైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కోటేశ్వరరావు కిందపడిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కోటేశ్వరరావును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment