క్యాన్సర్ చికిత్సకు లీనాక్ మిషన్ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ చికిత్సలో భాగమైన లీనాక్ మిషన్ను బుధవారం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 శాతం వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే ఓపీ సేవలు, ఇన్పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, మరికొన్ని ఆపరేషన్ థియేటర్ పరికరాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే త్వరలో ఆపరేషన్ థియేటర్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమనళిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment