రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర | - | Sakshi
Sakshi News home page

రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర

Published Fri, Feb 21 2025 8:25 AM | Last Updated on Fri, Feb 21 2025 8:20 AM

రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర

రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్‌ ధర రూ.7వేలు దాటింది. ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే మొదటి సారి అని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యార్డుకు 2,662 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,019, కనిష్టంగా రూ.4,322 లభించింది. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,300, ఆముదా లు రూ.5,560, జొన్నలు రూ.3,751, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,195, కనిష్టంగా రూ.5,820, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,929, మినుములు రూ.7,879 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌ యార్డులో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,802 గా ఒకే ధర లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement