పాలన సౌలభ్యం కోసం ఒకే ఎన్నిక
వేమనపల్లి: పాలన సౌలభ్యం కోసమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే భా వన రాజకీయ, ఆర్థిక పరిపాలన సామర్థ్యాన్ని పెంపొదిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసా రి లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమర్థవంతమైన పాలనను అందించవచ్చని తెలిపారు. అధికార యంత్రాంగానికి కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకా శం ఉంటుందన్నారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ముల్కలపేట, నాగారాం, వేమనపల్లికి చెందిన పలువురు బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వెంకటేశ్, అజయ్కుమార్, శ్రీకాంత్, మొహిద్ఖాన్, మధునయ్య, చరణ్రాజ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment