రమ్మీ నాలెడ్జ్‌ గేమ్‌!.. నటుడు శరత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు | Actor Sarathkumar Criticised For Featuring In Online Rummy Ads | Sakshi
Sakshi News home page

Sarathkumar: రమ్మీ నాలెడ్జ్‌ గేమ్‌!.. నటుడు శరత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు 

Published Wed, Dec 14 2022 10:08 AM | Last Updated on Wed, Dec 14 2022 4:57 PM

Actor Sarathkumar Criticised For Featuring In Online Rummy Ads - Sakshi

సాక్షి, చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీ.. నాలెడ్జ్‌ గేమ్‌ అని సమత్తువ మక్కల్‌ కట్చి నేత, సినీ నటుడు శరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, బెట్టింగ్‌ గేమ్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్‌ భవన్‌ వర్గాలు పట్టించుకోలేదు. ఈ చట్టాన్ని ఆమోదించాలని అన్ని వైపుల నుంచి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై ఒత్తిడి వస్తోంది. అయితే ఆన్‌లైన్‌ రమ్మీకి ప్రచారకర్తగా సినీ నటుడు శరత్‌కుమార్‌ వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ గేమ్‌ను ప్రోత్సహించే విధంగా శరత్‌ ప్రకటనలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతున్నాయి.

దీనిపై మీడియా మంగళవారం శరత్‌కుమార్‌ను ప్రశ్నించింది. ఇందుకు ఆయన సమాధానం ఇస్తూ రమ్మీ నాలెడ్జ్‌ గేమ్‌ అని వ్యాఖ్యనించారు. అయితే, తాను చెప్పినందు  ఈ గేమ్‌లను ఆడే వాళ్లు రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తాను నిజాయితీగా ఓట్లు వేయమని అడిగితేనే వేయని వాళ్లు, తాను చెప్పినట్లుగా వింటారా?.. అని అన్నారు.

కాగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు రెండేళ్ల ముందుగానే ఈ ప్రకటన (యాడ్‌)ను చిత్రీకరించామని ఆయన వివరించారు. ప్రస్తుతం దీనిని ఆ సంస్థ ఇప్పుడు తెర మీదకు తెచ్చినట్లుందని పేర్కొన్నారు. అయితే, రమ్మీ  మేథా సంపత్తిని పెంచుతుందంటూ శరత్‌ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎక్కువయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement