మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ అని..: అన్నపూర్ణమ్మ | Actress Annapurnamma Talks About Commitment Latest | Sakshi
Sakshi News home page

Annapurnamma: ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరు

Published Sat, Mar 15 2025 9:17 PM | Last Updated on Sat, Mar 15 2025 9:17 PM

Actress Annapurnamma Talks About Commitment Latest

సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గోల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లు, లేడీ యాక్టర్స్ పలువురు ఈ విషయమై ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నారు. గతంలో పలువురు దర్శకనిర్మాతలు తమని వేధించారని బయటపెడుతున్నారు. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం మీటూ పేరుతో ఓ ఉద్యమం కూడా నడిచింది.

(ఇదీ చదవండి: ఆస్తులు కోల్పోయి మంచాన పడ్డ నటి.. 118 నుంచి 38 కిలోలకు..)

ఈ కమిట్మెంట్స్ గురించి పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు. కానీ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా మాట్లాడుకొచ్చారు.

'మీడియాలో హైలైట్ కావడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారు. ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్స్ ఉండేది. నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పనిచేశాను కాబట్టి నన్ను ఆ ఉద్దేశంతో ఎవరూ అడగలేదు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం అయితే చేయరు' అని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'బ్రహ్మానందం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement