ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి | Aditi Sharma Bitten by Scorpions During Khatron Ke Khiladi 14 stunt | Sakshi
Sakshi News home page

నన్ను తేళ్లు కుట్టాయి.. జీవితంలో ఒక్కసారి మాత్రమే..: నటి

Jul 26 2024 11:29 AM | Updated on Jul 26 2024 12:03 PM

Aditi Sharma Bitten by Scorpions During Khatron Ke Khiladi 14 stunt

ఖత్రాన్‌ కి ఖిలాడీ.. ఇదొకరియాలిటీ సో.. ఇందులో పాల్గొనే వారితో రకరకాల స్టంట్లు చేయిస్తారు. వారి భయాల్ని పోగొడుతారు. అన్ని భయాలను దాటుకుని చివరిదాకా నిలబడ్డవారే విజేతగా నిలుస్తారు. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే ఇప్పటివరకు 13 సీజన్లు విజయవంతంగా నడిచాయి. ప్రస్తుతం 14వ సీజన్‌ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే కొంత షూటింగ్‌ జరిగిపోయింది.

నా గురించి నేను తెలుసుకున్నా
దాని గురించి ఈ సీజన్‌లో పాల్గొన్న నటి అదితి శర్మ మాట్లాడుతూ.. ఇదొక క్రేజీ ప్రయాణం. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌ చేయగలం. నేను చాలా ఎంజాయ్‌ చేశాను. కొన్ని రోజులు సంతోషంగా, మరికొన్ని రోజులు కష్టంగా గడిచాయి. కానీ ఈ ప్రయాణంలో నా బలాలు, బలహీనతలు తెలుసుకున్నాను. నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని షాక్‌లు తగిలినప్పుడైతే జీవితాన్ని ఆస్వాదించడం, ఒదిగి ఉండటం నేర్చుకున్నాను. ఈ ప్రపంచం అందమైనది. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది నాకిప్పుడు అందంగానే కనిపిస్తోంది.

అవన్నీ నిజమైనవే
భారత్‌కు రాగానే అందరూ అడిగిన ప్రశ్న.. షోలో చూపించేవి నిజమైన స్టంట్సేనా? అని! అవును నిజమే.. ఎలక్ట్రిక్‌ షాక్‌లు, కీటకాలు, జంతువులు.. ఇలా ప్రతీది నిజమే.. ఓ స్టంట్‌లో అయితే కొన్ని తేళ్లు నా మెడను కుట్టేశాయి. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇలాంటివేమైనా జరిగితే స్పాట్‌లో ట్రీట్‌మెంట్‌ చేస్తారు. అయినా ఆ నొప్పి భరించలేము' అని చెప్పుకొచ్చింది. కాగా అదితి.. ఖత్రాన్‌ కి ఖిలాడీ షో కోసం రొమేనియాలో దాదాపు 40 రోజుల పాటు ఉంది. ఈ మధ్యే ఇండియాకు వచ్చింది.

చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement