Aditi
-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
భారత గోల్ఫర్ అదితికి 29వ స్థానం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ ‘పారిస్’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది. భారత్కే చెందిన మరో గోల్ఫర్ దీక్ష డాగర్ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ గోల్ఫర్ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్ హెన్సెలైట్ (280 పాయింట్లు; జర్మనీ), లిన్ జియా జానెట్ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ‘తొలి మూడు రోజులు సరైన షాట్లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది. -
ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి
ఖత్రాన్ కి ఖిలాడీ.. ఇదొకరియాలిటీ సో.. ఇందులో పాల్గొనే వారితో రకరకాల స్టంట్లు చేయిస్తారు. వారి భయాల్ని పోగొడుతారు. అన్ని భయాలను దాటుకుని చివరిదాకా నిలబడ్డవారే విజేతగా నిలుస్తారు. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే ఇప్పటివరకు 13 సీజన్లు విజయవంతంగా నడిచాయి. ప్రస్తుతం 14వ సీజన్ ప్రీమియర్కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే కొంత షూటింగ్ జరిగిపోయింది.నా గురించి నేను తెలుసుకున్నాదాని గురించి ఈ సీజన్లో పాల్గొన్న నటి అదితి శర్మ మాట్లాడుతూ.. ఇదొక క్రేజీ ప్రయాణం. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. నేను చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని రోజులు సంతోషంగా, మరికొన్ని రోజులు కష్టంగా గడిచాయి. కానీ ఈ ప్రయాణంలో నా బలాలు, బలహీనతలు తెలుసుకున్నాను. నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని షాక్లు తగిలినప్పుడైతే జీవితాన్ని ఆస్వాదించడం, ఒదిగి ఉండటం నేర్చుకున్నాను. ఈ ప్రపంచం అందమైనది. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది నాకిప్పుడు అందంగానే కనిపిస్తోంది.అవన్నీ నిజమైనవేభారత్కు రాగానే అందరూ అడిగిన ప్రశ్న.. షోలో చూపించేవి నిజమైన స్టంట్సేనా? అని! అవును నిజమే.. ఎలక్ట్రిక్ షాక్లు, కీటకాలు, జంతువులు.. ఇలా ప్రతీది నిజమే.. ఓ స్టంట్లో అయితే కొన్ని తేళ్లు నా మెడను కుట్టేశాయి. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇలాంటివేమైనా జరిగితే స్పాట్లో ట్రీట్మెంట్ చేస్తారు. అయినా ఆ నొప్పి భరించలేము' అని చెప్పుకొచ్చింది. కాగా అదితి.. ఖత్రాన్ కి ఖిలాడీ షో కోసం రొమేనియాలో దాదాపు 40 రోజుల పాటు ఉంది. ఈ మధ్యే ఇండియాకు వచ్చింది.చదవండి: ఎన్టీఆర్కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్ -
కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యులకు భారంగా మారిన తరుణంలో.. ప్రముఖ వైద్యసేవల సంస్థ ‘నారాయణ హెల్త్’ చౌక ప్రీమియంతో ఒక ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ ఆరోగ్య బీమా పాలసీకి ‘అతిథి’ పేరు పెట్టింది. దంపతులు, ఇద్దరు పిల్లలు (గరిష్టంగా) కలిగిన నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ప్రీమియం కేవలం రూ.10,000గా నిర్ణయించింది. ఇంటిపెద్ద వయసు 45ఏళ్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రీమియం. ఇంతకంటే అధిక వయసులోని వారికి ప్రీమియం (అది కూడా ఇతర బీమా సంస్థల కంటే తక్కువే) వేరుగా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒక ఏడాదిలో రూ.కోటి రూపాయల వరకు సర్జరీలకు ఈ పాలసీలో చెల్లింపులు లభిస్తాయి. ఇతర హాస్పిటల్ చికిత్సలకు (జ్వరం, ఇన్ఫెక్షన్ తదితర) రూ.5లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ పాలసీ కింద సేవలు నారాయణ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే లభిస్తాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 21 హాస్పిటళ్లు ఉన్నాయి. బెంగళూరులో ఏడు ఆస్పత్రులతోపాటు, మూడు క్లినిక్లు ఉన్నాయి. -
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
‘రెస్టారెంట్ మేనేజ్మెంట్’ అంటే రెస్టారెంట్కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్ప్రెన్యూర్గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్’ వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్వన్ రెస్టారెంట్గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్’ పేరుతో అదితి దుగర్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్’ రెస్టారెంట్ తక్కువ సమయంలోనే బాగాపాపులర్ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్’ దూసుకుపోయింది. మోస్ట్ ఫార్వర్డ్ – థింకింగ్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్ వెంచర్తో ఎంటర్ప్రెన్యూర్గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్ అసైన్మెంట్స్లో భాగంగా అదితి ఒక బ్రిటిష్ హోం చెఫ్తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్–వెజ్ చెఫ్ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్లో స్పెయిన్లో ఉన్న అదితికి ‘మాస్క్’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్ క్లయింట్స్ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్’ వేగానికి కోవిడ్ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్ బిజినెస్లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్ -
మలయాళ నటి అదితి రవి ఫోటోలు వైరల్
-
యంగ్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్ వైరల్!
కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్వుడ్లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్వుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్వుడ్కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్వుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్వుడ్కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్!
న్యూ ఇయర్ వేళ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది శాండల్వుడ్ భామ. తోతాపురి- 2, రంగనాయకి, దిల్మార్ చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా గర్భం ధరించినట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాదిలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా బేబీ బంప్తో ఫోటోలను పంచుకుంది. అదితి తన ఇన్స్టాలో రాస్తూ..' బంధుత్వాలలో గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుండి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం అమ్మ. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. నేను 2024లో అమ్మను కాబోతున్నా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. కాగా..నటి అదితి ప్రభుదేవాకు, వ్యాపారవేత్త యషాస్తో నవంబర్ 2022లో వివాహం జరిగింది. ప్రస్తుతం అదితి నటించిన 'అలెక్సా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
ద్రవిడ్ మా అంకుల్.. ఆయనను చూస్తే బాధేసింది: సీరియల్ నటి
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమి తననెంతో బాధించిందని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ బంధువు, మరాఠా నటి అదితి ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా తన అంకుల్ అత్యుత్తమ కోచ్గా చరిత్రలో నిలిచిపోతారంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సొంతగడ్డపై టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా ఉన్న భారత జట్టుకు షాకిస్తూ.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా అవతరించింది. దీంతో టీమిండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు చూసి టీమిండియా ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో అదితి ద్రవిడ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకుంది. రాహుల్ ద్రవిడ్ను చూసి తమ కుటుంబమంతా గర్విస్తోందని పేర్కొంది. ద్రవిడ్ మా అంకుల్ ఈ మేరకు.. ‘‘రాహుల్ ద్రవిడ్ మా అంకుల్. గత 30- 35 ఏళ్లుగా ఆయన క్రికెట్ మైదానంలో కఠిన శ్రమకోరుస్తున్నారు. మా నాన్న వినాయక్ ద్రవిడ్ కూడా రంజీ ప్లేయర్. అందుకే నాకు క్రికెట్తో అనుబంధం ఏర్పడింది. టీమిండియా ఓడిపోయిన దృశ్యాలు చూసి నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో మా అంకుల్ను చూస్తే చాలా బాధేసింది. హెడ్కోచ్గా ఆయన ప్రస్థానం కూడా ముగింపునకు వస్తోంది. ఆయనకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్కప్. ఎంతో హార్డ్వర్క్ చేసి జట్టును ఇక్కడిదాకా తీసుకువచ్చారు. కానీ ఆఖర్లో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా ఆయన బెస్ట్ కోచ్’’ అని అదితి ద్రవిడ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ది వాల్ రాహుల్ ద్రవిడ్.. హెడ్కోచ్గానూ కాగా మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్ ద్రవిడ్కు అదితి కూతురు వరుస అవుతుంది. ఆమె ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. ఇటీవల సుందర మన మధ్యే భార్లీ సీరియల్లో కనిపించింది. అంతేకాదు రెండు మరాఠా సినిమాల్లోనూ అదితి మెరిసింది. ఎంటర్ప్రెన్యూర్గానూ రాణిస్తోంది. ఇక మరాఠా మూలాలున్న రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన విషయం తెలిసిందే. తండ్రి ఉద్యోగరిత్యా కర్ణాటకకు షిఫ్ట్ కావడంతో అక్కడే పెరిగి పెద్దైన ద్రవిడ్.. దేశవాళీ క్రికెట్లో కన్నడ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున ది వాల్గా.. దిగ్గజ క్రికెటర్గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం హెడ్కోచ్గా సేవలు అందిస్తున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. -
Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. మన అమ్మాయికి మరో స్వర్ణం తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే. 19 స్వర్ణాలు బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?
‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నటి.. శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా చాన్స్లు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పడు తన ఫ్యాషన్ స్టయిల్ ఫొటోలు, పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ ఆకర్షణకు మెరుగులు దిద్దుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ఇంద్ శ్రీ హైదరాబాద్ నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ఇంద్ శ్రీ .. 2012లో తన పేరుతోనే ఓ బోటిక్ ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఇక్కడ అదితి ధరించిన ఇంద్ శ్రీ కాస్ట్యూమ్ డిజైన్ ధర రూ. రూ. 11,500 హౌస్ ఆఫ్ క్వాడ్ర హై క్వాలిటీ, లేటెస్ట్ వజ్రాభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాల్యూ. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఇదొకటి! ధరలు ఇటు సామాన్యులూ కొనేలా అటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్లైన్లోనూ లభ్యం. (చదవండి: ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్ అదిపోతుంది!) -
పాకిస్థాన్పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లు జరిగినప్పుడు ఇషాన్కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
అదరహో అదితి... ఓహో ఓజస్
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు అద్భుతం చేశారు...గతంలో ఎన్నడూ చూపించని ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టించారు... గురి తప్పకుండా లక్ష్యం చేరిన బాణాలతో మన ఆర్చర్లు ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు...అటు మహిళల విభాగంలో అదితి స్వామి, ఇటు పురుషుల విభాగంలో ప్రవీణ్ ఓజస్ వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణాలు సాధించి శిఖరాన నిలిచారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించి అదితి ఆనందం పంచిన కొద్ది సేపటికే ప్రవీణ్ కూడా పసిడి గెలవడంతో ‘డబుల్ ధమాకా’ మోగింది! చాలా గర్వంగా ఉంది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించడం సంతోషంగా అనిపిస్తోంది. వరల్డ్ చాంపియన్షిప్లో 52 సెకన్ల మన జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాను. పూర్తి ఏకాగ్రతతో షాట్పై దృష్టి పెట్టడంతో లక్ష్యం తప్పలేదు. ఇది ఆరంభం మాత్రమే. దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా – అదితి స్వామి బెర్లిన్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో ఒకే రోజు భారత్ తరఫున ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. శనివారం జరిగిన ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే 150–147 తేడాతో ల్యూకాజ్ జిల్స్కీ (పోలాండ్)ను ఓడించాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన నెల రోజుల్లోపే సీనియర్ విభాగంలోనూ అదితి విశ్వ విజేత కావడం విశేషం కాగా...టోర్నీ చరిత్రలో పురుషుల విభాగంలోనూ భార త్కు ప్రవీణ్ సాధించిందే తొలి స్వర్ణం. వీరిద్దరూ మహారాష్ట్ర సతారాలోని అకా డమీలో ఒకే చోట శిక్షణ పొందుతున్నారు. ఓవరాల్గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్ వరల్డ్ చాంపియన్షిప్లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. పూర్తి ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్ సారా లోపెజ్ను ప్రిక్వార్టర్స్లో ఓడించిన బెసెరా, అదితి మధ్య ఫైనల్ పోటాపోటీగా సాగింది. తొలి మూడు బాణాలను సమర్థంగా సంధించిన అదితి మొదటి రౌండ్లోనే 30–29తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 12 బాణాలను లక్ష్యం వద్దకు చేర్చిన అదితి మూడు పాయింట్లు ముందంజలో ఉంది. చివరి రౌండ్లో మాత్రం ఒక బాణంతో ‘9’ మాత్రమే స్కోర్ చేసినా...అప్పటికే ఆమె విజేత కావడం ఖాయమైంది. శనివారం సెమీస్, ఫైనల్లోనూ 149 పాయింట్లు సాధించిన అదితి మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయింది. ఫైనల్లో చివరి నాలుగు అవకాశాల్లోనూ ఆమె 30 పాయింట్లు సాధించడం విశేషం. పురుషుల విభాగంలో కూడా ప్రవీణ్ ‘పర్ఫెక్ట్ స్కోర్’తో పసిడి గెలుచుకున్నాడు. ప్రవీణ్ ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకపోగా, ఒత్తిడిలో పడిన ల్యూకాజ్ చివర్లో ఒక పాయింట్ పోగొట్టుకొని రజతంతో సంతృప్తి చెందాడు. జ్యోతి సురేఖకు కాంస్యం ప్రపంచ చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్ తోమ్రుక్ను ఓడించింది. ఓవరాల్గా ఆర్చరీ వరల్డ్ చాంపియన్షిప్లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది. -
రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్
-
అర్జున్ రెడ్డితో గుర్తింపు.. వరుస సినిమాలు చేస్తున్న తెలుగందం
అదితి మ్యాకాల్ పుట్టింది కామారెడ్డి. తండ్రి సదాశివపేట గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసేవారు. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్పై ఉన్న మక్కువతో తన డిజైన్స్ను తానే ధరిస్తూ కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొంది. డిజైనర్గా కంటే మోడల్గా గుర్తింపు రావడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తర్వాత ఆమె నటనారంగం వైపు నడిచింది. వాణిజ్య ప్రకటనల్లో మోడలింగ్ చేస్తూ.. యూట్యూబ్ వెబ్సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్లో నటించేది. తను నటించిన ‘పాప పి సుశీల’, ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పాష్ పోరీస్’ వెబ్ సిరీస్లు అదితికి సినిమా ఛాన్స్లను తెచ్చి పెట్టాయి. బ్లాక్బాస్టర్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అదితి వెనుతిరిగి చూడలేదు. అందులో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి గుర్తింపునే ఇచ్చింది. వరుసగా ‘అమీ తుమీ’,‘రాధ’, ‘మిఠాయ్’, ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’, ‘నేనులేని నా ప్రేమకథ’ సినిమాల్లో నటించింది. అమెజాన్ ప్రైమ్లో ప్రస్తుతం స్ట్రీమింగ్లో ఉన్న ‘ఏకమ్’ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. బిజీగా ఉండటం నాకిష్టం. ఎంతలా అంటే ఐదేళ్లలో ఇరవై సినిమాల్లో నటించేంతలా! బాలీవుడ్లోనూ నటించాలని ఉంది – అదితి మ్యాకాల్ View this post on Instagram A post shared by Aditi Myakal (@aditi.myakal) View this post on Instagram A post shared by Aditi Myakal (@aditi.myakal) చదవండి: రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం -
ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే!
Bangladesh vs India, 3rd ODI- Ishan Kishan: జార్ఖండ్ యంగ్ డైనమైట్, టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. కెరీర్లో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ యువ వికెట్ కీపర్ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. దీంతో ఇషాన్ పేరుతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అద్భుతమైన ఇన్నింగ్స్... నిన్ను ఎంత ప్రశంసించినా తక్కువే అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొనియాడగా.. టీమిండియాకు కావాల్సింది ఇలాంటి ఆటగాడే కదా అని వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకున్నాడు. ఇక స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇషూ నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఇషూ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా వీక్షించిన మరో స్టార్, రన్మెషీన్ విరాట్ కోహ్లి సైతం సూపర్ ఇన్నింగ్స్ అంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్కు ఓ స్పెషల్ పర్సన్ నుంచి అందిన విషెస్ నెట్టింట చర్చకు దారితీశాయి. ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరీ అదితి?! ఆమె పేరు అదితి హుండియా. ఇషాన్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి, అతడి గర్ల్ఫ్రెండ్గా ప్రచారంలో ఉంది. మిస్ ఇండియా ఫైనలిస్టు అయిన అదితి.. మోడల్గా కెరీర్ను కొనసాగిస్తోంది. ఈ ఇద్దరు పలుమార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇషాన్ గానీ, అదితి గానీ తమ బంధం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా బంగ్లాదేశ్తో మూడో వన్డేలో ఇషాన్ ద్విశతకం బాదడంతో అదితి అతడిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్టు వైరల్గా మారింది. ఇషాన్ను ఫొటోను ఇన్స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్ హార్ట్ ఎమోజీతో ప్రేమను చాటుకుంది. అతడి స్పెషల్ ఇన్నింగ్స్కు సంబంధించి బీసీసీఐ చేసిన పోస్టును కూడా రీషేర్ చేసింది. దీంతో ఇషాన్- అదితి పేర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగ్లాదేశ్తో మూడో వన్డే ఇషాన్ కిషన్ రికార్డులు... ►వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (126 బంతులు; పాత రికార్డు క్రిస్ గేల్ (138 బంతులు; 2015లో జింబాబ్వేపై) ►చిన్న వయసులో ద్విశతకం (24 ఏళ్ల 145 రోజులు; పాత రికార్డు రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజలు; 2013లో ఆస్ట్రేలియాపై), భారత్ తరఫున అతి తక్కువ (103) బంతుల్లో 150 పరుగుల మార్క్ (పాత రికార్డు సెహ్వాగ్ 112 బంతుల్లో; 2011లో వెస్టిండీస్పై) ►ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్ ఇషాన్ కిషన్. ఇంతకు ముందు రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకం బాదగా.. సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్ ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే AUS vs WI: 77 పరుగులకే కుప్పకూలిన విండీస్.. 419 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం -
పెళ్లికూతురైన అదితి ప్రభుదేవ.. ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఘనంగా వివాహం
సాక్షి, బెంగళూరు: శాండల్వుడ్ నటీ అదితి ప్రభుదేవ, పారిశ్రామికవేత్త యశష్ పట్లా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 28, సోమవారం ఉదయం ప్యాలెస్ మైదానంలో ఘనంగా పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో అదితి టెంపుల్ జ్యువెలరీతో.. తెలుపు, ఎరుపు రంగు పెళ్లి పట్టు చీరను ధరించగా, యశష్ పట్టు ధోతీ, చొక్కా ధరించి కనిపించారు. సోషల్ మీడియాలో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఆదిత్, యశప్లు తమ నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (Sai Pallavi: సాయిపల్లవి సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి గుడ్బై?) -
పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్వుడ్లో డిమాండ్ ఉన్న నటి. కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్ -
కార్తీ నా కంటే మంచి నటుడు: హీరో సూర్య
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమన్. ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఎస్.కె.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి మధురైలో చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా, రాజ్యసభ సభ్యుడు వెంకటేశన్ అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన ఏ చిత్రానికీ ఆడియో విడుదల వేడుక జరగలేదన్నారు. కానీ ఈసారి ఇలా వేడుక జరిపినందుకు సూర్య, జ్యోతిక, కార్తీ, 2డీ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కథానాయికగా అవకాశం ఇచ్చిన సూర్య, కార్తీకి హీరోయిన్ అదితి శంకర్ థ్యాంక్స్ చెప్పారు. ఆమె ఈ చిత్రంలో ఒక పాట పాడటం విశేషం. కార్తీ మాట్లాడుతూ తన తొలి చిత్రం పరుత్తివీరన్ షూటింగ్ ఇక్కడే జరిగిందన్నారు. ఇంతకుముందు ముత్తయ్య దర్శకత్వంలో మధురై నేపథ్యంలో కొంబన్ చిత్రంలో నటించానని, ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. రెండవసారి విరుమన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. సూర్య మాట్లాడుతూ మధురై మన్నులో కథలకు కొరతే లేదన్నారు. పలుమార్లు ఇక్కడికి వచ్చి ప్రేమాభిమానాలను పొందానన్నారు. అలాంటి ఈ గడ్డపై విరుమన్ చిత్ర ఆడియో వేడుక జరపడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఇక్కడ కథల్లో జీవం ఉంటుందన్నారు. కార్తీ నా కంటే మంచి నటుడు అని కొనియాడారు. ఆదితి శంకర్ నటిగా మెప్పించారన్నారు. తనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలో తాను తన పిల్లల విద్య విషయమై న్యూయార్క్లో ఉన్నానని, ఆ విషయం తెలియడానికి తనకు నాలుగు గంటలు పట్టిందన్నారు. అంతకు ముందే మీడియా ఆ వార్తను గ్లోబలైజేషన్ చేయడం సంతోషం కలిగించిందని తెలిపారు. చదవండి: విజయ్ దేవరకొండతో లవ్? మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు! -
డైరెక్టర్ శంకర్ కూతురు హీరోయిన్గా శివకార్తికేయన్ కొత్త సినిమా
తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్, డాన్ చిత్రాలతో విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రిన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రానికి క్లాప్ కొట్టారు. దీనికి ‘మావీరన్’అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో దర్శకుడు శంకర్ వారసురాలు ఆదితి శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈమెకిది రెండో సినిమా. కార్తీ నటించిన విరుమాన్ చిత్రంతో కథానాయికగా అదితి శంకర్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే అదితి మరో చిత్రంలో అవకాశం దక్కించుకోవడం విశేషం. కాగా శాంతి టాకీస్ సమర్పణలో అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకార్తికేయన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. విదు అయన్న ఛాయాగ్రహణంను, భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్గారు. సినిమాలు తీసేది థియేటర్స్లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంగన్వాడీలో టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి
మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రంలో ప్రమా దవశాత్తు టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మద్నూర్ మండలం రాచూర్కి చెందిన సూర్యకాంత్ కుమార్తె అదితి(5) శనివారం మినీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం ఆ బాలిక నోటి నుంచి నురగ రావడం గమనించిన అంగన్వాడీ కార్యకర్త నగరబాయి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది. దీంతో కుటుంబసభ్యులు చిన్నారిని మహారాష్ట్ర దెగ్లూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు చిన్నారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, అదితి టర్పంటాయిల్ను అంగన్వాడీ కేం ద్రంలో తాగిందా.. లేక ఆ సమీపంలోని అంగన్ వాడీ కార్యకర్త ఇంట్లో తాగిందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాప టర్పం టాయిల్ తాగి మృతి చెందిందని, దీనికి కార్యకర్త నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీడీపీవో సునంద వివరణ కోరగా, ఆదివారం ఉదయం రాచూర్కు వెళ్లి విచారణ చేపడతామని, ఆ తర్వాతే పాప మృతికి గల కారణాలు వివరిస్తామని బదులిచ్చారు. -
ఈ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సివంగి
నాలుగు అడుగులు వెనక్కి వేసిన పులి ఒక్కసారిగా ముందుకు దూకి కొట్టే పంజా దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో... అలా వరుస ఫ్లాప్ల తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకొని, ఓ భారీ హిట్ కొట్టింది అదితి పోహన్కర్. కేవలం నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘షీ’ వెబ్ సిరీస్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె ఓ సివంగి. ముంబైలో పుట్టి,పెరిగింది. బహుముఖప్రజ్ఞగల కుటుంబం ఆమెది. తండ్రి సుధీర్ పోహన్కర్ మారథాన్ రన్నర్, తల్లి శోభా పోహన్కర్ జాతీయ స్థాయి హాకీ ప్లేయర్. అమ్మమ్మ సుశీల శాస్త్రీయ సంగీత గాయని. అక్క నివేదిత రచయిత్రి, ఆమె బావ బాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మకరంద్ దేశ్పాండే. ఆ ప్రతిభా వారసత్వాన్ని అందిపుచ్చుకుంది అదితి. చిన్నతనంలో పరుగు పొటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించింది. మహారాష్ట్ర తరపున 100, 200 మీటర్ల పరుగు పందేలు, మారథాన్లలో పాల్గొంది. ముంబై విశ్వవిద్యాలయంలో కామర్స్ కోర్సు చేసింది. కాలేజీ రోజుల్లోనే నటనపై ఉన్న ఇష్టంతో ప్రఖ్యాత నాటక దర్శకుడు సత్యదేవ్ దూబే వర్క్షాపుల్లో పాల్గొనేది. అక్కడే ఆమె ఆల్రౌండర్గా మారింది.. నటిగా, సింగర్గా, డాన్సర్గా! ఇది గుర్తించిన ఆమె బావ, సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అలా 2010లో ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేనంత బిజీ అయిపోయింది. వెంట వెంటనే ‘కుణాసాఠీ కుణీతరి’ మరాఠి చిత్రం, ‘జెమినీ గణేశనం సురులి రాజానం’, ‘మన్నవన్ వన్యనాది’ తమిళ చిత్రాల్లో నటించింది. కానీ అవన్నీ ఫ్లాప్లే. 2014లో చేసిన ‘లయ్భరి’ మరాఠి చిత్రం బాగా ఆడింది. అయితే రితిశ్ దేశ్ముఖ్కు మొదటి సినిమా కావడంతో క్రెడిట్ మొత్తం అతనికి వెళ్లింది. అప్పుడప్పుడు క్యాడ్బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్టెల్, శామ్సంగ్ వంటి వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. వరుస అవకాశాలు తెచ్చిన వరుస పరాజయాలను గుర్తించి, ఇకపై ఆచి తూచి అడుగు వేద్దామని నిర్ణయించుకుంది. అందుకే.. చాలా సంవత్సరాల తర్వాత 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘షీ’ వెబ్ సిరీస్తో పెద్ద హిట్ కొట్టింది. ఇందులో గొప్ప ధైర్యం, తెలివి ఉన్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్గా నటించి, మెప్పించింది. ప్రపంచం మొత్తం నుంచి నాకు అభినందనలు వస్తున్నాయి. ఇవి నా డబ్బింగ్కు కూడా రావడం, చాలా సంతోషం. ఏదో పెద్ద కమర్షియల్ సినిమా చేసిన అనుభూతినిచ్చింది ‘షీ’. – అదితి పోహన్కర్ -
మనిషిలా ఉండే మనిషి
అదితి సింగ్ ఎక్కడా పెద్దగా కనిపించరు. వెతుక్కోవాలి ఆమెను మనుషుల్లోకి వెళ్లి! తనకు ఇష్టం లేనిదే పార్టీ చెప్పినా వినరు. తగని పని తన పార్టీ చేసినా ఊరుకోరు. పాలిటిక్స్.. ఆమెకు స్వచ్ఛంగా ఉండాలి. పార్టీ ఏదైనా మనిషి మనిషిలా ఉండాలి. ముందొక జోకు. తర్వాతొక క్రూయల్ జోకు. ∙∙ ‘‘ఎప్పుడు తిన్నాడో ఏమో, పొద్దున చేసిన ఉప్మా కాకుండా మళ్లీ ఫ్రెష్గా తీస్కోనిరా’’ అంటాడు సుధతో, తనికెళ్ల భరణి. డైనింగ్ టేబుల్ ముందుంటారు భరణి, నాగార్జున. నాగార్జునకు.. భరణి బాబాయ్. నాగార్జున పిన్ని.. సుధ. ‘‘ఎర్ర రవ్వ ఉప్మా చెయ్యనా? తెల్ల రవ్వ ఉప్మా చెయ్యనా?’’ అని మళ్లీ వచ్చి అడుగుతుంది సుధ. ‘‘ఉప్మాలా ఉండే ఉప్మా చెయ్’’ అంటాడు భరణి. (ఉవ్వెత్తున ఎగసి... ఉసూరుమని కూలి...) భర్త అంగద్తో అదితి ఇప్పుడు ఒక క్రూయల్ జోక్. ఊహు. దానికన్నా ముందు ఒక సత్యశోధన. మనిషి ఎలా ఉండాలి? ఎర్రగానా, ఎత్తుగానా, బక్కగానా, బలంగానా? నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి కారణంగా కూతురికి ఉన్న ఫాలోయింగ్ కాదు అదితికి ఉన్నది. ప్రజలతో చక్కగా మాట్లాతారు. ప్రత్యర్థులకు మాటకు మాట చెబుతారు. ప్రత్యర్థులు అవతలి పార్టీవాళ్లే అయి ఉండాలనేం లేదు ఆమెకు. తిన్నగా లేకపోతే సొంత పార్టీవాళ్లకు కూడా తను ప్రత్యర్థిగా మారిపోతారు. మనుషుల పార్టీ ఆమెది! మనిషికి కష్టం కలిగించిన వాళ్లెవరైనా, మనిషిలా ప్రవర్తించని వాళ్లెవరైనా అదితికి నచ్చరు. రాజకీయాల్లో ఈ స్వభావం పని చేస్తుందా? పని చేసే స్వభావమే రాజకీయ స్వభావం కావాలన్నది అదితి పాలసీ. పని గట్టుకుని ఆమె పాలిటిక్స్లోకి రాలేదు. పని చేయాలనుకుని వచ్చారు. ఢిల్లీలో చదువుకున్నారు. తర్వాత ముస్సోరీలో. తర్వాత యూఎస్లోని డ్యూక్ యూనివర్సిటీలో. మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు అక్కడ. ఇండియా వచ్చాక సోషల్ వర్క్ను ఎంచుకున్నారు. సోషల్ వర్క్లో చురుగ్గా ఉండేవాళ్లకు రాజకీయాలు పట్టవు కానీ.. రాజకీయాలు అలాంటివారిని ఎంత దూరాన్నుంచయినా వెంటనే పట్టేస్తాయి. అలా పాలిటిక్స్లోకి వెళ్లారు. క్రూయల్ జోక్ నుంచి పక్కకు వచ్చేశామా! లేదు. ప్రియాంక గాంధీ చేసిన ఒక పనిని క్రూయల్ జోక్ తో పోల్చింది అదితినే! ∙∙ అదితి, ప్రియాంక ఒకేపార్టీ వాళ్లు. అదితి.. ఎమ్మెల్యే మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి కూడా. ప్రియాంక తూర్పు యూపీకి పార్టీ ప్రధాన కార్యదర్శి. వలస కార్మికులకు కాంగ్రెస్పార్టీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేసింది అని ప్రియాంక ప్రకటించగానే, ఆ బస్సుల జాబితాను అధికార పార్టీ బీజేపీ తెప్పించుకుని చూసింది. వాటిల్లో సగానికి పైగా కండిషన్లో లేని బస్సులే! 297 బస్సులు తప్పుపట్టి ఉన్నాయి. 98 ఆటో–రిక్షాలు, అంబులెన్స్ వంటి కొన్ని వాహనాలు కూడా ఆ బస్సుల జాబితాలో చేరి ఉన్నాయి! 68 వాహనాలకైతే అసలు పేపర్లే లేవు! ఈ విషయమే అదితికి తన సొంత పార్టీ మీద ఆగ్రహం తెప్పించింది. ఇంతకన్నా చవకబారు రాజకీయం ఉందా? వలస కార్మికుల మీద వేసిన క్రూయల్ జోక్ కాదా ఇది అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే క్రమశిక్షణ చర్య ఒకటి అదితిపై పెండింగులో ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి.. పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ హాజరైనందుకు అదితిని ఎమ్మెల్యేగా అనర్హురాలిని చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్కు ఇచ్చిన ఆ ఫిర్యాదుపై ఇంకా ఏ నిర్ణయమూ జరగలేదు. ∙∙ ఎవరి నిర్ణయాలకూ తలొగ్గరు అదితి. అలాగే తనపై వచ్చిన ఏ నిజం కాని వార్తకూ ఆమె స్పందించకుండా ఉండరు. రాహుల్, అదితి పెళ్లి చేసుకోబోతున్నారని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చినప్పుడు ఆమె వెంటనే ఖండించారు. ‘‘రాహుల్జీ నాకు అన్నయ్య. ఆయనకు రాఖీ కూడా కట్టాను’’ అని స్పష్టంగా చెప్పి ఆ విషయంలో ఇక ఎవరి ఊహల్నీ ముందుకు వెళ్లనీయలేదు. గత ఏడాదే అదితికి అంగద్సింగ్తో వివాహం జరిగింది. ఆయన కూడా ఎమ్మెల్యేనే. అయితే పంజాబ్లో. సమావేశాలు, నియోజకవర్గ పర్యటనలు లేనప్పుడు ఢిల్లీనే ఈ దంపతుల ఇల్లు. అతడిదీ కాంగ్రెస్ పార్టీనే. లవ్ మ్యారేజ్ వాళ్లది. అదితి ఎక్కువగా ఉండేది మాత్రం తన నియోజకవర్గ ప్రజలతోనే. -
అదితి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఐటా చాంపియన్షిప్ సిరీస్లో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె అండర్–16, 18 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్ ఫైనల్లో అదితి 6–4, 6–2తో ఆర్ని రెడ్డి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర విభాగంలో ఇక్బాల్ ఖాన్ (తెలంగాణ) 7–5, 6–4తో సుహిత్ రెడ్డి (తెలంగాణ)ను ఓడించాడు. అండర్–16 ఫైనల్లో అదితి 6–3, 6–4తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర డబుల్స్లో మోహిత్ జోడీ విజేతగా నిలిచింది. అండర్–18 బాలికల డబుల్స్ ఫైనల్లో అభయ– అపూర్వ (తెలంగాణ) ద్వయం 6–3, 6–0తో వేద వశిష్ట– వేదరాజు ప్రపూర్ణ (తెలంగాణ) జోడీపై నెగ్గగా... బాలుర విభాగంలో సుహిత్ రెడ్డి (తెలంగాణ)–అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర) జంట 7–5, 6–3తో రిషికేశ్ సుంకర–కార్తీక్ నీల్ వడ్డేపల్లి (తెలంగాణ) జోడీని ఓడించి విజేతలుగా నిలిచాయి. -
అతన్ని అలా ఊహించుకోలేకపోయా
రణ్బీర్కి సిస్టర్లా నటించాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరూ ఒప్పుకోరు. అదితీ శీయ కూడా చాలా కష్టంగా ఒప్పుకున్నారట. ‘సంజు’ బయోపిక్లో సంజయ్ దత్ సిస్టర్ ప్రియా దత్ పాత్ర చేశారు అదితీ శీయ. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందా? తెలుగులో పూరి జగన్నాథ్ తీసిన ‘నేనింతే’ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు శీయ. బాలీవుడ్ బ్యూటీ చేస్తూ శియ గౌతమ్ నుంచి అదితి శీయగా పేరు మార్చుకున్నారు. ‘సంజు’ సినిమాలో యాక్ట్ చేయడం గురించి శీయ మాట్లాడుతూ – ‘‘రాజ్ కుమార్ హిరాణీ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రైనా చేయొచ్చు. సంజయ్ దత్గారి సిస్టర్ ప్రియని నేనెప్పుడూ కలవలేదు. ఆవిడ ఇంటర్వ్యూలు చూసి మేనరిజమ్స్ నేర్చుకున్నాను. రణ్బీర్ కపూర్ సింగిల్ టేక్ యాక్టర్. అచ్చం సంజయ్ దత్లానే మారిపోయారు. అతనితో వర్క్ చేసిన తర్వాత నేను అతని ఫ్యాన్ అయిపోయాను. అయితే రణ్బీర్ని బ్రదర్గా ఊహించుకోలేకపోయా’’ అని పేర్కొన్నారు. ‘సంజు’ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. -
స్క్రీన్ ప్లే 22nd June 2018
-
సింగిల్స్ విజేత అదితి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ ఓపెన్ ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు సత్తా చాటారు. అండర్–16 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన అండర్–16 బాలికల ఫైనల్లో టాప్సీడ్ అదితి ఆరే (తెలంగాణ) 6–0, 6–3తో వేద వర్షిత (తెలంగాణ)పై గెలుపొందింది. డబుల్స్ తుదిపోరులో అభయ వేమూరి–అపూర్వ వేమూరి (తెలంగాణ) ద్వయం 6–0, 6–3తో తనుషిత రెడ్డి–నిర్మయి సురాపూర్ (తెలంగాణ) జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో కోట శశిధర్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో కోట శశిధర్ (తెలంగాణ)–అశ్విన్ భట్ (కర్ణాటక) జంట 1–6, 2–6తో హితేశ్–మానవ్ శ్రీకుమార్ (తమిళనాడు) జోడీ చేతిలో, సింగిల్స్ విభాగంలో శశిధర్ 6–7 (2/7), 6–1, 1–6తో హితేశ్ (తమిళనాడు) చేతిలో పరాజయం పాలయ్యాడు. అండర్–14 బాలుర తుదిపోరులో నితిన్ (ఏపీ) 6–1, 6–3తో నితీశ్ (తమిళనాడు)పై గెలిచాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో నీలా కుంకుమ్ (తెలంగాణ) 6–4, 3–6, 3–6తో ఇషిత (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. -
అదితి.. అతిథే.!
♦ ఆమె నా రాజకీయ వారసురాలు కాదు ♦ వచ్చే ఎన్నికల్లోతాను పోటీచేయదు ♦ చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్న అశోక్ ♦ ఇంకెప్పుడూ పార్టీలో తిప్పవద్దన్న సీఎం సాక్షి ప్రతినిధి, విజయనగరం: అదితి... పూసపాటి వంశానికి వారసురాలు.. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పెద్ద కుమార్తె.. ఆయన రాజకీయ వారసురాలిగా 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయాల్సి ఉంది. కొద్ది నెలలుగా జిల్లాలో భారీ ఎత్తున జరుగుతున్న ఈ ప్రచారానికి పెద్ద దెబ్బే తగిలింది. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబే ఇకపై ఆమెను రాజకీయాల్లో ప్రమోట్ చేయెద్దని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును ఆదేశించినట్లు తెలిసింది. అమరావతిలో రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన అశోక్ గజపతిరాజుతో చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. బీజేపీలోకి వెళ్లననే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరంపై వారిమధ్య చర్చ మొదలైంది. అలాంటి ప్రచారం జరుగుతున్నందున అడ్డుకట్ట వేయడానికి తానలా వ్యాఖ్యానించినట్లు ఆశోక్ వివరణ ఇచ్చారు. అయితే కుమార్తెను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే ఆలోచనేమైనా ఉందా అని సీఎం అడిగారు. అలాంటిదేమీ లేదని, వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయాలనుకుంటున్నానని అశోక్ స్పష్టం చేశారు. అలాంటప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు తిప్పుతున్నారని సీఎం మరోసారి నిలదీశారు. అదితి తన రాజకీయ వారసురాలని ఎక్కడా చెప్పలేదని కేవలం మాన్సాస్ను చూసుకోవడం కోసమే ఆమెను బయటకు తీసుకువస్తున్నానని చంద్రబాబుకు సర్దిచెప్పుకున్నారు. రాజకీయ వారసత్వం ప్రశ్నార్థకం రాజరికానికి... ప్రజాస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచిన సంస్థానం పూసపాటి వంశం. ఈ కుటుంబ రాజరికంలో చివరి పట్టాభిషిక్తుడైన పి.వి.జి.రాజునుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు వరకూ రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. అయితే అశోక్ తర్వాత ఆయన రాజకీయ వారసులెవరనే చర్చ 2014లోనే మొదలైంది. 2019 ఎన్నికల నాటికి ఆయన పెద్ద కుమార్తె అదితి వారసురాలిగా వస్తోందనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించకముందు జనతాపార్టీలో శాసన సభ్యుడిగా పనిచేశారు అశోక్. టీడీపీ ఆవిర్భావంలోనే ఆ పార్టీలో చేరి నేటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలుపొంది కేంద్రంలో పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి చేపట్టారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరబోతున్నారని, అందుకే కుమార్తెను టీడీపీ నుంచి బరిలోకి దించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశంలో వేదికపై అదితి మొదటి వరుసలో తల్లిదండ్రులతో పాటు కూర్చున్నారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. దీనిపై ప్రత్యేకంగా పిలిచి సీఎం ప్రశ్నించడంతో అశోక్ తన వారసత్వం గురించి మాత్రమే కాకుండా తన రాజకీయ భవిష్యత్ గురించి కూడా అధినేతకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్నాళ్లూ అదితి వస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని జరిగిన ప్రచారానికి తెరపడనుంది. -
సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం
సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, కామెడీ చిత్రాల కథానాయకుడు సంతానం కలరుుకలో చిత్రం ప్రారంభమైంది. వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందన్న వార్త ప్రచారం అవగానే నిజంగా అది జరిగేనా? అన్న సందేహాలు పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి కలిగారుు. కారణం లేకపోలేదు. సెంటిమెంట్తో కట్టిపడేసే చిత్రాల దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ హాస్యచిత్రాల నటుడు సంతానం హీరోగా చిత్రం చేయగలరా? అన్నదే వారి సందేహాంగా భావించాలి. అరుుతే అలాంటి వారి సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఈ సంచలన కాంబినేషన్లో చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిలై చిత్రాన్ని పూర్తి చేసిన సెల్వరాఘవన్ సంతానం కోసమనే ఒక రొమాంటిక్ కామెడీ కథను తయారు చేశారట. ఫిలిం డిపార్ట్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సంతానంకు జంటగా నటి అదితి నటిస్తున్నారు. యువన్ శంకర్రాజా సంగీతాన్ని, లోక్నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి బహుళ ప్రాచుర్యం పొందిన పాటలోని పల్లవి అని మన్నవన్ వందానడి పేరును నిర్ణరుుంచినట్లు సమాచారం. -
సెమీస్లో అదితి, మోహన్
కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్లో అదితి, మోహన్ సుబ్బరాయన్ సెమీస్లోకి ప్రవేశించారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో శనివారం జరిగిన పురుషుల క్వార్టర్స్లో మోహన్ (జెన్సర్ టెక్నాలజీస్) 21-16, 21-5తో విశ్వాస్ గురంగ్పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో అదితి 21-6, 21-7తో మనూష పొన్నంపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్ల్లో వేదశ్రీ (సిస్కో) 21-15, 21-09తో ఆస్థా సక్సేనాపై, పల్లవి అపర్ణ (ఒరాకిల్) 21-12, 21-11తో వాసవిపై, ఆనీ జార్జ్ (టీసీఎస్) 21-4, 21-6తో పూనమ్పై గెలిచారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ల ఫలితాలు పురుషుల సింగిల్స్ : హర్ష 21-10, 21-13తో అమిత్ క్రిస్టియన్ షనోరిపై, ఉదయ్ తిరువనల్లూర్ 21-14, 21-15తో అరుణ్ కుమార్పై, ఆదర్శ్ 21-18, 21-18తో మనీశ్ కుమార్పై నెగ్గారు. పురుషుల డబుల్స్: కిరణ్ (ఐసీఐసీఐ)- విశ్వనాథ్ (ఐబీఎం) జంట 21-8, 21-16తో అనిల్- సిజో (టీసీఎస్) జోడీపై, అవినాశ్- వంశీకృష్ణ (విప్రో) జంట 21-15, 21-19తో రవి కిరణ్ (సెంచురీ హాస్పిటల్స్)- రవి (మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స) జోడీపై, ప్రవీణ్- రఘు (విప్రో) జంట 21-17, 20-21, 21-18తో రాజశేఖర్- శ్రీకీర్తి వోరుగంటి (వాల్యూ ల్యాబ్స్)పై, ఆదర్శ్ (హెచ్పీ)- మోహన్ (జెన్సర్) జంట 15-14, 15-14తో గోపీకృష్ణ (టెక్మహీంద్ర)- హర్ష జోడీపై విజయం సాధించారుు. మహిళల డబుల్స్: ఆనీ జార్జ్ (టీసీఎస్)- సౌమ్య (అమెజాన్) జంట 21-7, 21-8తో మితా - షీతల్ (పీఎన్జీ) జోడీపై, రమ్య- స్నేహ జంట 21-12, 21-16తో అఖీఫా సామియా- అన్నపూర్ణ (సీడీకే) జోడీపై, ఆస్థా సక్సేనా- దీప్తి (ఇన్ఫోసిస్) జంట 21-5, 21-10తో రమ్య- సౌజన్య జోడీపై గెలుపొందారుు. మిక్స్డ్ డబుల్స్: మోహన్- అదితి జంట 15-11, 15-12తో మనీశ్- పూజ లత్కర్ జోడీపై, అవినాశ్- ఆనీ జార్జ్ జంట 21-9, 21-9తో కిరణ్ నారాయణ్- నీరజ్ గార్గ్ జోడీపై, హర్ష్- ఆస్థా సక్సేనా జంట 21-10, 21-11తో అజయ్- షిఖా జోడీపై, రాకేశ్- కుష్బూ జంట 22-11, 21-11తో ప్రవీణ్- సుభద్ర రాణి జోడీపై నెగ్గాయి. -
ప్రియమైన ప్రధాని గారు.. చిన్నారి అదితి లేఖ!
కాన్పూర్: చిన్నారులు కూడా దేశ రాజకీయాలు, అభివృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారనడానికి నిదర్శనం ఈ ఘటన. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆరో తరగతి చదువుతున్న అదితి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఈ చిన్నారి ప్రశంసల జల్లు కురిపింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విశిష్టమైన పథకాలు అదితిని లేఖ రాసేలా కదిలించాయి. మోదీ సర్కార్ను కొనియాడుతూ హిందీలో చేతిరాతతో ఆమె లేఖను ప్రధాని చిరునామకు పంపింది. ఈ లేఖకు బదులు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బదులు రావడం అదితిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 'థాంక్యూ' అంటూ పీఎంవో నుంచి ప్రత్యుత్తరం రావడంతో ఇప్పుడు అదితి ఆనందంలో మునిగిపోయింది. -
'ప్రాజెక్ట్ అదితి'ని ప్రారంభించిన కుటుంబ సభ్యులు
-
'ప్రాజెక్ట్ అదితి'ని ప్రారంభించిన కుటుంబ సభ్యులు
విశాఖపట్నం: ప్రతి సామాన్యునికి 'ప్రాజెక్ట్ అదితి' ఓ శక్తిమంతమైన వేదిక కావాలన్నదే తమ లక్ష్యమని చిన్నారి అదితి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ వద్ద ప్రాజెక్ట్ అదితిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రారంభించారు. నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించి... వాటిని సంబంధి ప్రభుత్వ శాఖకు తెలియపరచడం ద్వారా సదరు సమస్యలు త్వరితగతిన పరిష్కారం లభించేందుకు కృషి చేయడమే ప్రాజెక్ట్ అదితి లక్ష్యమని వారు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ప్రాజెక్ట్ అదితి కోసం నిర్వహించిన అవేర్నెస్ వాక్లో స్వచ్చంధ సంస్థలతోపాటు యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 24వ తేదీన విశాఖపట్నంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అరేళ్ల చిన్నారి అదితి అప్పుడే ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలువ పడి పోయింది. ఆమె కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలోని సన్ రే బీచ్ ఒడ్డుకు అదితి మృతదేహం కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదితికి జరిగిన అన్యాయం మరోకరికి జరగకూడదని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో వారు ప్రాజెక్ట్ అదితిని ప్రారంభించారు. -
అదితి అంత్యక్రియలు పూర్తి
-
ఇంటికి చేరుకున్న అదితి మృతదేహం
-
ఆది నుంచి తుది వరకు
గుండెలు పిండే విషాదం.. ముద్దులొలికే చిన్నారి అదితి మురుగు నీటిలో మునిగిపోయిందన్న వార్త ఈనెల 24వ తేదీ సాయంత్రం దావానలంలా వ్యాపించింది. నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చింది. ఎలాగైనా అదితిని కాపాడాలని తపన పండింది. జీవీఎంసీ, నేవీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ కాల్వలు, గెడ్డల్లో, సముద్రంలో ఏడు రోజులపాటు తీవ్రంగా గాలించారు. రకరకాల వార్తలతో ఈ వారమంతా ఉత్కంఠతో గడిచింది. చివరకు కన్నీరే మిగిలింది. - విశాఖపట్నం/పెదవాల్తేరు సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు సీతమ్మధారలోని ఇంటి నుంచి అదితి డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్లోని ఐవోఎస్ ట్యూషన్ సెంటర్కు వెళ్లింది. నగరమంతా కుంభవృష్టి కురవడంతో వర్షం నీటితో మురుగు కాల్వలు పొంగిపొరలుతున్నాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతం లో ట్యూషన్ ముగిశాక కారెక్కబోతూ వర్షం నీటితో నిండిన డ్రైనేజీలో పడిపోయింది. జీవీఎంసీ సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భానునగర్ నుంచి ఎంవీపీకాలనీ సెక్టార్ వరకు గెడ్డలో గాలించారు. పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్, డీసీపీ త్రివిక్రమ్వర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సెప్టెంబర్ 25 వేకువజాము 5 గంటల నుంచి అదితి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భానునగర్ నుంచి ఇసుకతోట, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్ బేకాలనీ వద్ద సముద్రంలో కలిసే గెడ్డ వరకు నాలుగు పొక్లయిన్లతో పూడికలు, చెత్తను తొలిగించారు. 250 మంది పారిశుధ్య, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో చిన్నారి ఆచూకీ కోసం వెదికారు. నేవీ సిబ్బంది ఒక హెలికాప్టర్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో గాలించారు. 15మంది గజ ఈతగాళ్లు గెడ్డ, సముద్రంలో వెదికారు. అదితి తాత ఫిర్యాదు మేరకు ఎంవీపీకాలనీ పోలీసులు అదితి అదృశ్యమైందని కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26 ఉదయం నుంచి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది గెడ్డలో వెతకడం ప్రారంభించారు. వందమంది వరకు భానునగర్ నుంచి లాసన్స్బేకాలనీ సముద్రం వరకు గాలించారు. నేవీ గజ ఈతగాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. నేవీ డైవర్లు సముద్ర గర్భం లోపలికి వెళ్లి అదితి కోసం గాలించారు. హెలికాప్టర్ పైనుంచి సముద్రంలో గాలించారు. 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలో గాలించారు. పొక్లయిన్లతో మరోసారి గెడ్డలోని రాళ్లు తీసి క్షుణ్ణంగా వెదికారు. పోలీసులు కిడ్నాప్ అనుమానంతో అదితిని తీసుకురావడానికి వెళ్లిన కారు డైవర్ గురునాథాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్ 27 అదితి అదృశ్యం మిస్టరీగా మారింది. గెడ్డ, సముద్రంలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అదితి సహవిద్యార్ధిని తాన్వీని పోలీసులు సమాచారం అడిగారు. అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లారా చూశానని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు కూడా యధావిధిగా గెడ్డ సముద్రంలో మత్స్యకారులు, నేవీ సిబ్బంది గాలించారు. అదితి తండ్రి శ్రీనివాస్, తాత రమణమూర్తి కిడ్నాప్ చేసుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించారు. సెప్టెంబర్ 28 అదితి ఆచూకీ కోసం గెడ్డలో నీటిని నిలిపి అన్వేషించారు. 50మంది మత్స్యకారులు పది పడవల్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో 50 కిలోమీటర్ల మేర గాలించారు. అదితి ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న మెడికల్ షాప్లోని సీసీ కెమెరాల పుటేజ్లను పోలీసులు పరిశీలించారు. ట్యూషన్కు వెళ్తున్న దృశ్యం అందులో రికార్డయింది. మున్సిపల్ పరిపాలన పట్టాణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల్ వరినన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ అమిత్గార్గ్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్ను నియమించారు. సెప్టెంబర్ 29 అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు గెడ్డ, సముద్రంలో గాలించారు. భీమిలి నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వలలతో వెదికారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో విచారణ ప్రారంభించారు. కారు డైవర్ కాల్ డేటా, ఇతర వివరాలపై ప్రత్యేక బృందం దృష్టి సారించారు. నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదితి అదృశ్యంపై ఆరా తీశారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, తాత రమణమూర్తి సీఎంను కలిశారు. సెప్టెంబర్ 30 భీమిలి నుంచి గంగ వరం పోర్టు వరకు వంద కిలోమీటర్లమేర వెదికారు. రాత్రి 10 గంటల వరకు అదితి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపును నిలిపివేస్తున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. సాయంత్రం అదితి తండ్రి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు శత్రువులెవరూ లేరని, తమ పాప ఎక్కడో క్షేమంగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదితి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించారు. అక్టోబర్ 1 అదితి మృతదేహం గురువారం సాయంత్రం భోగాపురం తీరంలో బయటపడింది. -
సంద్రమంత విషాదం
-
సంద్రమంత విషాదం
భోగాపురం తీరంలో తేలిన చిన్నారి అదితి మృతదేహం నిశ్చేష్టురాలైన విశాఖ నగరం శోకతప్తులైన తల్లిదండ్రులు గుండెలు పిండే విషాదం.. ముద్దులొలికే చిన్నారి మురుగు నీటిలో మునిగిపోయిందన్న వార్త ఈనెల 24వ తేదీ సాయంత్రం దావానలంలా వ్యాపించింది. నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చింది. ఎలాగైనా అదితిని కాపాడాలని తపన పండింది. జీవీఎంసీ, నేవీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ కాల్వలు, గెడ్డల్లో, సముద్రంలో ఏడు రోజులపాటు తీవ్రంగా గాలించారు. రకరకాల వార్తలతో ఈ వారమంతా ఉత్కంఠతో గడిచింది. చివరకు కన్నీరే మిగిలింది. - విశాఖపట్నం/పెదవాల్తేరు చిరునవ్వుల చిన్నారి ఛిద్రమైంది.. ఆమె అందాల మోము కనుమరుగైంది.. మబ్బులు వీడిన చందమామలా మళ్లీ కనిపిస్తుందని ఆశించినవారికి కన్నీరే మిగిలింది.. మురుగు కాలువలో పడి గల్లంతైన అదితి తిరిగివస్తుందని తల్లిదండ్రులతోపాటు యావత్తు విశాఖ ఎదురుచూసింది.. ఆ చిరునవ్వు సజీవంగా ఉండాలని, మళ్లీ తిరిగొచ్చి కుటుంబ సభ్యుల కళ్లలో వెలుగు నింపాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది.. కిడ్నాప్ అయివుంటుందని, పోలీసులు మిస్టరీని ఛేదించి, సజీవంగా తీసుకువస్తారని పెట్టుకున్న చివరి ఆశలు కూడా ఆవిరయ్యాయి.. వారం రోజులైనా జాడ తెలీకపోవడంతో నీటిపాలు కాకుండా ఎక్కడో క్షేమంగా ఉండేఉంటుందని మిణుకుమిణుకుమన్న ఆశ చీకట్లో కలిసిపోయింది.. అదితి మృతదేహం గురువారం సాయంత్రం దయనీయ స్థితిలో భోగాపురం సముద్ర తీరంలో శవమై తేలింది.. దుస్తులు, చెవిదుద్దులను బట్టి అది తమ గారా ల పట్టి అదితేననిగుర్తించి కుప్పకూలిపోయా రు.. అదితి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరుకున్నారో.. నగర ప్రజలూ అంతగానే ఎదురుచూశారు. దుర్గంధభరితమైన మురికి కాల్వల్లో జీవీఎంసీ సిబ్బందితోపాటు సామాన్య జనం సైతం గాలించారు. ఫలితం దక్కలేదు. ప్రాణాలతో తీసుకురావాలన్న ఆశ నెరవేరలేదు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండివుం టే.. ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావన్న విమర్శకు జ వాబు లేదు. ఇది మాయని గాయం.. తీరని శోకం.. సముద్రమంత విషాదం సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు సీతమ్మధారలోని ఇంటి నుంచి అదితి డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్లోని ఐవోఎస్ ట్యూషన్ సెంటర్కు వెళ్లింది. నగరమంతా కుంభవృష్టి కురవడంతో వర్షం నీటితో మురుగు కాల్వలు పొంగిపొరలుతున్నాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతం లో ట్యూషన్ ముగిశాక కారెక్కబోతూ వర్షం నీటితో నిండి న డ్రైనేజీలో పడిపోయింది. జీవీఎంసీ సిబ్బంది వచ్చి గా లింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భానునగర్ నుంచి ఎంవీపీకాలనీ సెక్టార్ వరకు గెడ్డలో గాలించారు. పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్, డీసీపీ త్రివిక్రమ్వర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సెప్టెంబర్ 25 వేకువజాము 5 గంటల నుంచి అదితి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భానునగర్ నుంచి ఇసుకతోట, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్ బేకాలనీ వద్ద సముద్రంలో కలిసే గెడ్డ వరకు నాలుగు పొక్లయిన్లతో పూడికలు, చెత్తను తొలిగించారు. 250 మంది పారిశుధ్య, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో చిన్నారి ఆచూకీ కోసం వెదికారు. నేవీ సిబ్బంది ఒక హెలికాప్టర్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో గాలించారు. 15మంది గజ ఈతగాళ్లు గెడ్డ, సముద్రంలో వెదికారు. అదితి తాత ఫిర్యాదు మేరకు ఎంవీపీకాలనీ పోలీసులు అదితి అదృశ్యమైందని కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26 ఉదయం నుంచి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది గెడ్డలో వెతకడం ప్రారంభించారు. వందమంది వరకు భానునగర్ నుంచి లాసన్స్బేకాలనీ సముద్రం వరకు గాలించారు. నేవీ గజ ఈతగాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. నేవీ డైవర్లు సముద్ర గర్భం లోపలికి వెళ్లి అదితి కోసం గాలించారు. హెలికాప్టర్ పైనుంచి సముద్రంలో గాలించారు. 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలో గాలించారు. పొక్లయిన్లతో మరోసారి గెడ్డలోని రాళ్లు తీసి క్షుణ్ణంగా వెదికారు. పోలీసులు కిడ్నాప్ అనుమానంతో అదితిని తీసుకురావడానికి వెళ్లిన కారు డైవర్ గురునాథాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్ 27 అదితి అదృశ్యం మిస్టరీగా మారింది. గెడ్డ, సముద్రంలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అదితి సహవిద్యార్ధిని తాన్వీని పోలీసులు సమాచారం అడిగారు. అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లారా చూశానని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు కూడా యధావిధిగా గెడ్డ సముద్రంలో మత్స్యకారులు, నేవీ సిబ్బంది గాలించారు. అదితి తండ్రి శ్రీనివాస్, తాత రమణమూర్తి కిడ్నాప్ చేసుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించారు. సెప్టెంబర్ 28 అదితి ఆచూకీ కోసం గెడ్డలో నీటిని నిలిపి అన్వేషించారు. 50మంది మత్స్యకారులు పది పడవల్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో 50 కిలోమీటర్ల మేర గాలించారు. అదితి ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న మెడికల్ షాప్లోని సీసీ కెమెరాల పుటేజ్లను పోలీసులు పరిశీలించారు. ట్యూషన్కు వెళ్తున్న దృశ్యం అందులో రికార్డయింది. మున్సిపల్ పరిపాలన పట్టాణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల్ వరినన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ అమిత్గార్గ్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్ను నియమించారు. సెప్టెంబర్ 29 అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు గెడ్డ, సముద్రంలో గాలించారు. భీమిలి నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వలలతో వెదికారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో విచారణ ప్రారంభించారు. కారు డైవర్ కాల్ డేటా, ఇతర వివరాలపై ప్రత్యేక బృందం దృష్టి సారించారు. నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదితి అదృశ్యంపై ఆరా తీశారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, తాత రమణమూర్తి సీఎంను కలిశారు. సెప్టెంబర్ 30 భీమిలి నుంచి గంగ వరం పోర్టు వరకు వంద కిలోమీటర్లమేర వెదికారు. రాత్రి 10 గంటల వరకు అదితి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపును నిలిపివేస్తున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. సాయంత్రం అదితి తండ్రి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు శత్రువులెవరూ లేరని, తమ పాప ఎక్కడో క్షేమంగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదితి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించారు. అక్టోబర్ 1 అదితి మృతదేహం గురువారం సాయంత్రం భోగాపురం తీరంలో బయటపడింది. -
అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షల నజరానా
-
పాప బతికే ఉందన్న విశ్వాసం ఉంది
-
ఫలించని చివరి ప్రయత్నం...
-
ఫలించని చివరి ప్రయత్నం...
డ్రైనేజీలను జల్లెడ పట్టిన జీవీఎంసీ అంతుచిక్కని అదితి ఆచూకీ నిరాశపరచిన సీసీ కెమెరాల ఫుటేజి ఎంవీపీ కాలనీ: ఐదు రోజులు... 120 గంటలు... 300మంది జీవీఎంసీ సిబ్బంది... ఐదు నేవీ బోట్లు... రెండు హెలికాప్టర్లు... డేగ కళ్లతో అదితి కోసం వెదికినా ఫలితం లేకపోయింది. ఎంత గాలించినా సోమవారం కూడా చిన్నారి జాడ అంతుచిక్కడం లేదు. చివరి ప్రయత్నంగా గెడ్డల మార్గాన్ని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్ జల్లెడ పట్టించారు. ఎంవీపీకాలనీ సెక్టార్-1లోని డ్రైనేజ్ లోపల వంద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి మూడు మోటార్లతో కాలువలో నీరు తోడించారు. పూర్తిగా డ్రై చేసి 100మంది సిబ్బంది అణువణువూ గాలించారు. జోన్-2 కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు డ్రైనేజీలను 25సార్లు సిబ్బంది వెతికినప్పటికీ కనిపించలేదని చెప్పారు. నేవీకి చెందిన జెమినీ బోట్లతో సముద్రంలోని 20 కిలోమీటర్ల వరకు వెతికామన్నారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరి మీదా అనుమానం లేదు... అదితిని కిడ్నాప్ చేశారన్న అనుమానాలేవీ లేవని పాప బంధువు శాస్త్రి చెప్పారు. అయితే కాలువలో కొట్టుకుపోతూ ఎవరికైనా దొరికి ఉంటుందన్న ఆశ మాత్రం ఇంకా మిగిలేవుందన్నారు. పాప బతికి ఉంటుందని అనుకుంటున్నాం. పాప బెంగళూరులో జన్మించి రెండు సంవత్సరాలుగా తాత వద్ద పెరుగుతోందని తెలిపారు. గురువారం సాయంత్రం ఏం జరిగిందని ట్యూషన్ టీచర్ను పోలీసులు విచారించినట్లు సమాచారం. సంఘటన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజిని వెదికినా ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు నిరాశకు లోనయ్యారు. -
పాపా ఎక్కడున్నావమ్మా ?
-
అదితి క్షేమంగా ఉంటుంది!
కుటుంబ సభ్యుల ఆశాభావం సీతమ్మధార: మురుగు కాల్వలో కొట్టుకుపోయిందని భావిస్తున్న ఆరేళ్ల చిన్నారి అదితి అచూ కి నాలుగు రోజులైనా లభించకపోవడంతో కు టుంబ సభ్యుల్లో చిన్నారి సజీవంగా ఉండే ఉం టుందని ఆశలు చిగురిస్తున్నాయి. ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అదితి తాతయ్య చాడా వెంకటరమణమూర్తి తన మనోభావాలు పంచుకున్నారు. చిన్నారి పూర్తి పేరు సిహెచ్ సాయి లావణ్య అదితి అని, నాలుగేళ్లుగా సీతమ్మధారలోని తన నివాసంలోనే ఉంటూ చదువుకుంటోందని తెలిపారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండేదని, మంచి తెలివైనదని, అలాంటి బాలిక గల్లంతయిన విషయం తెలుసుకుని నిశ్చేష్టులమయ్యామన్నారు. జీవీఎంసీ, పోలీస్, నేవీ, ఫైర్, మీడియా సహకారంతో నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికి అచూకి తెలియకపోవడంతో పలు కోణాల్లో ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు. ముఖ్యంగా పాప కొట్టుకుపోవడం ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదని చెప్పడం కూడ ఆశలు కలిగిస్తోందన్నారు. సంఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరాలేకపోవడంతో ఎవరూ చూడలేకపోయామని చెబుతున్నారన్నారు. పాప వెనుక స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, సుమారు 3..5 అడుగుల ఎత్తు ఉంటుందని, అడుగున్నర మేర ఉన్న కాలువలో కొట్టుకుపోవడం కష్టతరమనిపిస్తోందని చెప్పారు. వీటినిబట్టి చూస్తే చిన్నారిని ఎవరైనా అపహరించారా.. కాలువలో నుంచి ఎక్కడైన ఎవరైన రక్షించి వారివద్ద ఉంచుకున్నారా.. అనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఏదేమైనా చిన్నారి సజీవంగా, క్షేమంగా ఉంటుందనే ఆశలు చిగురిస్తున్నాయన్నారు. అదే కోణంలో దర్యాప్తు చేపట్టి పాపను కాపాడాలని కోరారు. చిన్నారి తల్లికి ఇప్పటివరకు నీటిలో గల్లంతయిందని చెప్పలేదనిఐ ఎక్కడో తప్పిపోయిందని, వెతుకుతున్నామని చెబుతున్నామన్నారు. ఇంటిలో అదితి గీసిన చిత్రాలను చూపిస్తూ కుటుంబ సభ్యులు విలపించారు. బెంగళూరులో చదువుతున్న అదితి సోదరుడు అనీష్ (8) మాట్లాడుతూ తన చె ల్లి చాలా హుషారుగా ఉండేదని, ఎక్కడ ఉన్నా తిరిగి ఇంటికి వచ్చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. చెల్లి తిరిగి వస్తే అందరికి మంచి పార్టీ ఇస్తానని చెప్పడం అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.. అదితి అచూకి తెలికపోవడంతో ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రుల మంతా కోరుకుంటున్నామని హైదరాబాద్కు చెందిన బాలిక మేనమామ భాస్కర్తో పాటు, స్నేహితులు తెలిపారు. -
అదితి.. ఏమైంది!?
నాలుగు రోజులైనా దొరకని జాడ అదృశ్యంపై తండ్రి, బంధువుల అనుమానాలు సీసీ కెమెరాల పుటేజ్ సేకరించనున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు పెదవాల్తేరు: ఆరేళ్ల అదితి గల్లంతు మిస్టరీగా మారింది. డ్రైనేజీలు, గెడ్డలు, సముద్రంలో జల్లెడ పడుతున్నా బాలిక ఆచూకీ శూన్యం. నాలుగు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నా పాప జాడ తెలియక పోవడంతో తండ్రితో పాటు బంధువలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో 10 బోట్లలో 50 మంది జాలార్లు, డ్రైనేజీల్లో వంద మంది జీవీఎంసీ ఏర్పాటు చేసిన సిబ్బంది. రుషికొండ నుంచి ఆర్కె బీచ్ వర కు నేవీ హెలికాఫ్టర్, ఇవి కాకకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ పోలీస్ సిబ్బంది అదితి ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఇంత మంది వెతుకుతున్నా ఎక్కడా జాడ కానరాకపోవడంతో తమ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారేమోనని తండ్రి, బంధువులు సందేహం వెలిబుచ్చారు. ఇదే విషయమై ఆదివారం ఎంవీపీకాలనీ పోలీసులకు తమ అభిప్రాయం తెలిపారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, మరో బంధువు పోలీస్స్టేషన్కు చేరుకుని ఎస్ఐతో మాట్లాడారు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చని, ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులు లేరు అదితి డ్రైనేజీలో పడిపోవడం ప్రత్యక్షంగా చూసిని సాక్షులు లేరు. ఘటన స్థలంలో స్థానికులను విచారణ చేయగా ఎవరూ చూడలేదని చెప్పడంతో పోలీసులు కూడా చిన్న అనుమానం వ్యక్తం చేశారు. అదితిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన కారు డ్రైవర్ గుర్నాధంను కూడా విచారించారు. అయితే అదితితో పాటు ట్యూషన్ చదువుతున్న పన్నెండేళ్ల బాలిక ఇచ్చిన సమాచారం మేరకు అదితి డ్రైనేజీలో పడిపోయిందని పోలీసులు స్పష్టం చేసుకున్నారు. ఇదే విషయాన్ని బాలిక తండ్రికి తెలిపారు. పన్నెండేళ్ల పాపకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు కదా.. కచ్చితంగా డ్రైనేజీలో పడితేనే ప్రత్యక్ష సాక్షి చెబుతుందని పోలీసులు బాధితులకు వివరించారు. ఘటన స్థలం ఎదురుగా సీసీ కెమెరాలు భానునగర్లో అదితి చదువుతున్న ట్యూషన్ సెంటర్ ఐఓసీ ఇనిస్టిట్యూట్ భవనం ఎదురుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దిలపాలెం శాఖ ఉంది. ఈ శాఖ ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అదితి అదృశ్యమైంది. ఆ సమయంలో విద్యుత్ కూడా లేదు. అయినప్పటికి ఏటీఎంలో ఇన్వెర్టర్ ఉన్నందున వీడియో రికార్డ్ అవుతుంది. ఈ సీసీ కెమెరాలు పుటీజ్లు సోమవారం సేకరించేందుకు ఎంవీపీకాలనీ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివుంటే అదితి అదృశ్యం మిస్టరి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బ్యాగ్ జాడా లేదు అదితి అదృశ్యమైన సమయంలో ఆమె భుజానికి స్కూల్ బ్యాగ్ ఉంది. డ్రైనేజీలో బ్యాగ్తో సహా కొట్టుకుపోతే ఆ బ్యాగు కూడా లభ్యం కాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం స్కూల్ బ్యాగ్ పొదల్లోనో, రాళ్ల సందుల్లోనో లభ్యమవ్వాలి కదా అని చెప్పుకుంటున్నారు. కొనసాగుతున్న గాలింపు ఆదివారం కూడా అదితి ఆచూకి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. గెడ్డలు, సముద్రంలో విసృ్తతంగా పరిశీలించారు. నేవీ సిబ్బంది సహకారంతో బోట్లపై సముద్రంలో గాలించారు. నేవీ హెలికాఫ్టర్ తీరప్రాంతం రుషికొండ నుంచి ఆర్కె బీచ్ వరకు చక్కర్లు కొట్టి అనువణువు గాలించింది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీన్కుమార్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు జరగుతున్నాయి. అనుమానాలు లేవు అదితి అదృశ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలు లేవు. ఘటన వద్ద స్థానికులు, బాలికను తీసుకురావడానికి వెళ్లిన డ్రైవర్ కూడ డ్రైనేజీలో పడిపోవడం చూడలేదని చెప్పారు. అయితే కలిసి వచ్చిన పన్నెండేళ్ల పాప అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లార చూసింది. ఇద్దరూ కలిసి ట్యూషన్ నుంచి బయటకు వస్తుండుగా మ్యాన్హోల్ తెరిచి ఉన్న డ్రైనేజీలో పడిపోయిందని ఆ పాప తెలిపింది. అదితి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. - విద్యాసాగర్, సీఐ ఎంవీపీకాలనీ. విశాఖపట్నం సిటీ: ఆరేళ్ల చిన్నారి అదితి జాడ కోసం ఆదివారం రాత్రి వరకూ గాలించినా ఫలితం లేకపోవడంతో సోమవారం రాత్రి వరకూ మరింత విస్తృతంగా గాలించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గాలింపు చర్యలు పూర్తయిన పిదప ఉన్నతాధికారులంతా ఈ నాలుగైదు రోజులుగా చేసిన కసరత్తుపై చర్చించి తదుపరి ఏ కోణంలో దర్యాప్తు చేపట్టాలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి గాలింపు కొనసాగించాలా లేక ఇతర కోణాల్లో దర్యాప్తు మొదలెట్టాలా అనేది నిర్ణయిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 300 మందికిపైగా నిపుణులు ఈ ఆపరేషన్లో పాల్గొని అణువణువు గాలిస్తున్నారు. అయినా 72 గంటలు గడచినా అదితి ఆచూకీ కనబడలేదు. నావికాదళ ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. అదితి జాడ ఎలా అయినా పసిగట్టాలని నేవీ హెలీకాఫ్టర్లు, ఛాపర్లు, మర పడవలు, బోట్లు, సాయంతో గాలింపు తీవ్రతరం చేశారు. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్ అదితి కోసం బీచ్రోడ్డు అంతా తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం నాటికే ఆమె జాడ తెలుస్తుందని గట్టిగా నమ్మిన జీవీఎంసీ వర్గాలు ఆదివారం కూడా పాప జాడ లేకపోవడంతో మరింత లోతుగా వెదుకుతున్నారు. -
అది..తీరని వేదన
‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు భోగవంతుని విచలింపచేయగలదు.. భగవంతునికి నివేదించుకొనగలదు.. అదితీ..ఏమయిపోయావమ్మా..ఎక్కడున్నావు చిట్టి తల్లీ.. నీవు కనిపించక రెండు రోజులు దాటిపోయింది. నీవు లేకుండానే ఇంట్లో నిద్రలేని మూడు రాత్రులు గడిచిపోయాయి. రెప్పలు మూతపడటం లేదమ్మా..మానసికంగా అలసిపోయా..దిగులుతో కుంగిపోయా..కళ్లు నీళ్లింకిన బావులయ్యాయి. గుండెలు పిండేస్తున్నాయి.. నీ చిరు నవ్వులు. ముద్దు మాటల మూటలు క్షణం కూడా వీడకుండా వెంటాడుతున్నాయి. లేలేత పాదాలతో నీవేసిన చివరి అడుగు మురికి కూపంలో పడిందమ్మా..ఆ క్షణం నీవనుభవించిన బాధ గుండెల్ని మెలిపెడుతోంది.. నీకోసం వెతకని చోటులేదు..చిన్న కాలువ నుంచి పెద్ద గెడ్డల వరకూ అనువణువూ గాలించాం..చీకట్లు ముసురుకున్నా గాలింపు ఆపలేదమ్మా..కనిపించిన దారంతా కళ్లు చేసుకుని వెతికాం..అయినా నీ జాడలేదమ్మా.. విమానాలు కూలిపోతే సప్త సముద్రాలూ మధించి శకలాలేకాదు..బ్లాక్బాక్స్నూ వెలికి తీయగల సాంకేతిక సంపత్తి సొంతం చేసుకున్నాం. ప్రపంచాన్నే అరచేతిలో బంధించామంటూ గర్వపడుతున్నాం. గూగుల్తో సర్వాన్నీ చిటికెలో శోధిస్తున్నాం..సాధిస్తున్నాం.. కానీ ఏం ప్రయోజనం.. కాల్వలో పడి కళ్లముందే కొట్టుకుపోయిన నిన్ను రక్షించుకోలేకపోవడం ఎంతటి ఘోరవైఫల్యం.. మురికి కాలువలు కలిసే సాగరం చెంత హెలికాప్టరు గాలించి నిట్టూరిస్తూ వెనుతిరిగింది. 15మంది గజ ఈతగాళ్ల శ్రమా నిష్ఫలమైంది..250మంది నాలుగు పొక్లయిన్లతో చేసిన భారీ అన్వేషణా ముగిసిపోయింది. నీ జాడ గుర్తించలేకపోయింది....కానీ ఓడిపోయామని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని మా గుండెలు పదే పదే ఓ కవి హృదయ ఘోష రూపంలో ఆర్తిగా ఇలా పలవరిస్తున్నాయి... ‘ఒక తల్లి నీరవాక్రోశ రవమ్ము విన్నంతవరకూ ఒక క్షత దుఃఖిత హృదయమూరడిల్లనంతవరకూ నాకు శాంతికలగదింక నేస్తం..ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను. చిన్నమ్మా..వీళ్ల మీద కోపగించకు.. వీళ్లనసహ్యించుకోకు... అదితి ఆచూకీ ప్రశ్నార్థకం - మూడురోజులవుతున్నా లభించని అదితి జాడ - తీవ్రతరమైన గాలింపు చర్యలు - వాసుపాలెంలో కంట్రోలు రూం అదితి జాడ ఎక్కడ. రోజులు గడుస్తున్నాయి. కాలం కరిగిపోతోంది. వందల మంది సిబ్బంది. డ్రైనేజీ,గెడ్డలు జల్లెడ పడుతున్నా అదితి ఆచూకీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మద్దిలపాలెంలోని డ్రైనేజీలో పడిగల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి కోసం గాలింపు ముమ్మరం చేశారు. జీవీఎంసీ, పోలీస్, అగ్నిమాపక, నేవీ, మత్స్యకారులు, డ్రైనేజీకి ఆనుకుని ఉన్న నివాస ప్రజలు వెతుకుతున్నా జాడ కనిపించడం లేదు. ఎవరీ అదితి.. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చే స్తున్న చాడ శ్రీనివాస్, రేవతిల గారలపట్టి అదితి. ఇద్దరు మగపిల్లల సంతానం తర్వాత పుట్టిందీ సాయి లావణ్య అదితి(6). అదితి అంటే దేవత. ఈ చిన్నారి తల్లిదండ్రులు బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నందున సీతమ్మధారలోని తాతయ్య వద్ద ఉంటుంది. టింపనీ స్కూల్లో ఒకటో తర గతి చదువుతూ మద్దిలపాలెం కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్ లోని ఐఒసి ఇనిస్టిట్యూట్లో ట్యూషన్ చదువుతుంది. సిమెంట్ పలకలు వల్లే ప్రమాదం... అదితి జారిపడిన డ్రైనేజీ వంద మీటర్ల మేర సిమెంట్ పలకలు ఉన్నందున ఆచూకి తెలియలేదు. డ్రైనేజీ వంద మీటర్ల తర్వాత ఉన్న భానునగర్ గెడ్డకు అనుసంధానమవువుంది. ఈ గెడ్డ ఎంవీపీకాలనీ, లాసన్స్బేకాలనీ మీదుగా వాసవానిపాలెం తీర సముద్రంలో కలుస్తుంది. ఘటన స్థలం నుంచి మూడు కిలో మీటర్లు పొడవునా ఈ గెడ్డ ప్రవహిస్తోంది. జీవీఎంసి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఈ గెడ్డ వెంబడి సముద్రం వరకు గాలించిన అదితి ఆచూకి ఎక్కడ లభ్యం కాలేదు. గెడ్డ ఒంపుల వద్ద పూడిక పోయిన పూడికలు,రాళ్లను నాలుగు జేసీబీలతో తొలిగించినా జాడ కనించలేదు. వాసువానిపాలెంలో కంట్రోలు రూం.. శనివారం గాలింపు చర్యలు తీవ్రం చేశారు. భానునగర్ నుంచి వాసవానిపాలెం సముద్రం వరకు విసృ్తతంగా గాలించారు. ప్రతీ వంద మీటర్లకు అయిదుగుర్ని పెట్టి ఆయా ప్రాంతంలో అణువణువు పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్ వాసువానిపాలెం తీరాన్ని సందర్శించారు. రెండున్నర కిలోమీటర్ల మేర 150 మందిజీవీఎంసీ సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. వాసువానిపాలెంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనరు చెప్పారు. ఏ సమాచారం తెలిసినా ఇక్కడకు తెలియజేయాలన్నారు. సముద్రంలో పది బోట్లు ద్వారా గాలించారు. రిషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు మత్స్యకారులను కాలినడకన వెతకాలని కోరారు. నేవీ హెలికాఫ్టర్ ద్వారా సముద్రంలో గాలించారు. మరోపక్క గజ ఈతగాళ్లు తమ పని కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిపితే రూ.50వేలు అదితి బీచ్లోకి వెళ్లుంటే 48 గంటల్లో తేలితుందని మత్స్యకారులు జీవీఎంసీ కమిషనర్కు వివరించారు. ఆతర్వాత ఆచూకీ లభ్యం కాకపోతో ఏం చేయాలనే విషయమై కమిషనర్ నేవీఅధికారులతో చర్చించారు. పాపపై ఇసుకమేటలు వేసుంటే కనిపించే అవకాశం లేదు కనుకభానునగ ర్ నుంచి గెడ్డలో మీటర్ లోతు వరకు జేసీబీలతో తవ్వించాలని ఆయన సూచించారు. అదితి ఆచూకి తెలిపిన వారికి రూ.50వేలు నగదు అందించే విధంగా ప్రకటిస్తామన్నారు. కమిషనరును అదితి తండ్రి శ్రీనివాసరావు..తాత కలిశారు. తమ బిడ్డ ఆచూకీ తెలిపేలా చర్యలుతీసుకోవాలని కోరారు. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ జీవీఎంసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెన్షన్చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. జోన్-2కు చెందిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రమీలారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరరాఘవులను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. విధి నిర్వహణలో అలక్ష్యంగా ఉన్నందుకే ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. -
'అదితి' ఘటనలోముగ్గురు అధికారులపై వేటు
పెద్ద వాల్తేరు: విశాఖ నగరంలోని మద్దిలపాలెం ప్రాంతంలో రెండు రోజుల క్రితం డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలిక అదితి గల్లంతైన ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బాధ్యులైన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ఏఈలను సస్పెండ్ చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదితి గురువారం సాయంత్రం వర్షపు నీటి ఉధృతికి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని గంటా శ్రీనివాసరావు శుక్రవారం సందర్శించగా, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. మరో వైపు మద్దిలపాలెం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో బీచ్లో కలిసే మార్గం వరకు చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. -
గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ
-
అదితి.. నువ్వెక్కడ?
* డ్రైనేజీల్లో విస్తృత గాలింపు * గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ మద్దిలపాలెం(విశాఖపట్నం): ఆరేళ్ల అదితి ఆచూకీ తెలియలేదు. ఏక్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. విశాఖనగరం మద్దిలపాలెంలో గురువారం సాయంత్రం ట్యూషనుకు వెళ్లిన చిన్నారి అదితి వర్షపునీటి ఉధృతికి మురుగుకాలువలో పడి కొట్టుకుపోయింది. స్థానికులు గురువారం రాత్రి కాలువలన్నీ వెతికినా ఫలితం కనిపించలేదు. ఆలస్యంగా స్పందించిన జీవీఎంసీ సిబ్బంది బాలిక అన్వేషణలో పడ్డారు. మద్దిలపాలెం మొదలుకుని ఎంవీపీ కాలనీవరకూ డ్రెయినేజీ వ్యవస్థను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంవీపీ కాలనీ కాలువలో గజ ఈతగాళ్ల బృందం మూడు సార్లు దిగినా ఫలితం కనిపించలేదు. జీవీఎంసీ కమిషన ర్ ప్రవీణ్కుమార్ శుక్రవా రం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లికి తెలియనివ్వకుండా.. అదితి తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటుండగా ఆమె విశాఖలో తాతగారి దగ్గర ఉంటోంది. తల్లిదండ్రులు బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం సీతమ్మధార చేరుకున్నారు. అదితికి ఆరోగ్యబాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని బాలిక తల్లికి కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు గల్లంతు విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. బాలిక తండ్రి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. -
జాడలేని అదితి
కొనసాగుతున్న గాలింపు చర్యలు గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ మంత్రి గంటా.. కమిషనర్ సందర్శన {yెయినేజీలపై ఆదరాబాదరాగా సిమెంటు పలకల తొలగింపు మద్దిలపాలెం(విశాఖ): ఆరేళ్ల అదితి ఆచూకీ తెలియలేదు. ఏక్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. మద్దిలపాలెంలో గురువారం సాయంత్రం ట్యూషనుకు వెళ్లిన చిన్నారి అదితి వర్షపునీటి ఉధృతికి మురుగుకాలువలో పడి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికులు గురువారం రాత్రి కాలువలన్నీ వెతికినా ఫలితం కనిపించలేదు. ఆలస్యంగా స్పందించిన జీవీఎంసీ సిబ్బంది కూడా బాలిక అన్వేషణలో పడ్డారు. మద్దిలపాలెం మొదలుకుని ఎంవీపీ కాలనీవరకూ డ్రెయినేజీ వ్యవస్థను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంవీపీ కాలనీలో గెడ్డలో గజ ఈతగాళ్ల బృందం మూడుసార్లు దిగినా ఫలితం కనిపించలేదు. సందర్శించిన గంటా..కమిషనర్ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్ శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రయినేజి కాలువలపై ఆక్రమణల ఫలితంగానే బాలిక అన్వేషణ జఠిలమైందని గుర్తించారు. మద్దిలపాలెం పరిసరాల్లో డ్రయినేజీలపై ఉన్న సిమెంట్ దిమ్మలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.గెడ్డకు అనుసంధానంగా ఉన్న కొన్ని మ్యాన్హోల్స్ను కూడ తొలగించారు. నగరంలో 2వేల మీటర్ల మేర పెద్ద గెడ్డలు, 4వేల మీటర్ల చిన్నగెడ్డలు ఉన్నాయని వీటిలో చాలా వరకు ఆక్రమణలకు గురయిన విషయం వాస్తవమేనని కమిషనరు చెప్పుకొచ్చారు. నగరం వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బింధువుగా మారుతున్న నేపథ్యంలో ఇటువంటివి సహజమేనన్నారు. ఈ వ్యవస్థ మొత్తం ప్రక్షాలనకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మధ్యాహ్నం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గెడ్డలు, డ్రైనేజీ ఆక్రమణలు పరిశీలించారు. జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల 3.7 కిలోమీటర్ల మేర గెడ్డ ఆధునీకరణ పనులు చేపట్టడంతో నీరు నేరుగా ప్రవహిస్తూ సముద్ర జలాల్లోకి కలిసిపోతుందని, దీనికారణంగా చిన్నారి ఆచూకి తెలుసుకోవడం కష్టంగా మారిందని కమిషనర్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు వివరించారు. విస్తృతంగా గాలించండి: నారాయణ: చిన్నారి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధిశాఖామంత్రి డాక్టర్ పి.వి.నారాయణ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్ను ఆదేశించారు. బాలిక ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలతోపాటు నేవీ అధికారుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని కమిషనర్ను ఆదేశించారు. తల్లికి తెలియనివ్వకుండా.. అదితి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం సీతమ్మధార చేరుకున్నారు. అదితికి ఆరోగ్యంబాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని బాలిక తల్లికి కు టుంబ సభ్యులు చెప్పారు. ఆమె కు గల్లంతు విషయం తెలియకుం డా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. గుండెల్లో విషాదం దాచుకుని గుంభనంగా తిరుగుతున్నా రు. ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. బాలిక తండ్రి శ్రీనివాసరావుసంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పాప కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘మా ముద్దుల బిడ్డ దోరుకుంతుందని భగవంతుడుని వేడుకుంటున్నాను. నా స్నేహితులు..స్థానికులు అన్నదమ్ముళ్లులా రాత్రి నుంచి గాలిస్తున్నారు. ఇద్దరు బాబుల తరువాత పాప పుట్టింది. నిత్యం ఫోన్లో మాట్లాడేది అంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
అమ్మను మించిన అదితి
ఈ తల్లీ కూతుళ్లను చూశారా.. వీరెవరో కాదు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య శైలజా అయ్యర్, వాళ్ల కుమార్తె అదితి. ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ అయిన శైలజా అయ్యర్ స్వతహాగా నృత్య కళాకారిణి. తన కుమార్తెను కూడా తనలాగే నృత్యంలో తీర్చిదిద్దారామె. శనివారం అదితి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి చిత్రాల మాలిక ఇది. ఫొటోలు: , సాక్షి ఫొటోగ్రఫర్ - వీరాంజనేయులు