బోర్డులో భాగం కావడం సంతోషంగా ఉంది.. మోదీకి చిరంజీవి ధన్యవాదాలు | Chiranjeevi Respond To Prime Minister Modi Decision | Sakshi
Sakshi News home page

బోర్డులో భాగం కావడం సంతోషంగా ఉంది.. ప్రధాని మోదీకి చిరంజీవి ధన్యవాదాలు

Published Sat, Feb 8 2025 10:27 AM | Last Updated on Sat, Feb 8 2025 11:56 AM

Chiranjeevi Respond To Prime Minister Modi Decision

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సినీపరిశ్రమకు సంబంధించిన  ప్రముఖ నటీనటులతో పాటు  వ్యాపారవేత్తలను కలిపి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలను తీసుకోనుంది. అందుకు లక్ష్యంగా ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(వేవ్స్‌)’ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఎంతో ఘనంగా జరగనున్న ఆ సమ్మిట్‌ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు ఆయన తీసుకున్నారు. 

ఇందులో తాను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని సోషల్‌మీడియా వేదికగా చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతోన్న వీడియోను ఆయన షేర్‌ చేశారు. వేవ్స్‌ సమ్మిట్‌ కోసం అడ్వైజరీ బోర్డ్‌లో తాను భాగం కావడం సంతోషాన్ని ఇచ్చిందంటూ ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో చిరంజీవితో పాటు బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌,షారుఖ్‌ఖాన్‌,ఆమిర్‌ఖాన్‌,అనిల్‌ కపూర్‌, మిథున్‌ చక్రవర్తి, అక్షయ్‌కుమార్‌, హేమమాలినీ, దీపికా పదుకొణె ఉన్నారు. సౌత్‌ నుంచి రజనీకాంత్‌, నాగార్జున,ఎ. ఆర్. రెహమాన్
మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భారత ప్రముఖ వ్యాపార సంస్థల అధినేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ముకేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా కూడా ఈ  సమ్మిట్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీ పూర్తి అయిన తర్వాత మోదీ కూడా తన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement