తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్ | Janhvi Kapoor Visit Tirumala By Walk On Her Mother Sridevi Birth Anniversary, Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: మెట్ల దారిలో తిరుమల చేరుకున్న జాన్వీ

Published Tue, Aug 13 2024 12:10 PM | Last Updated on Tue, Aug 13 2024 1:57 PM

Janhvi Kapoor Visit Tirumala By Walk Sridevi Birthday

'దేవర' సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్న జాన్వీ కపూర్‪‌కి తిరుపతి వేంకటేశ్వర స్వామి చాలా సెంటిమెంట్. ఎప్పటికప్పుడు స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. మంగళవారం తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా మరోసారి స్వామి వారిని దర్శించుకుంది. కాకపోతే మెట్ల దారిలో కొండ పైకి చేరుకుంది.

(ఇదీ చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. రేర్ ఫొటోలు)

ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో తల్లి శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. ఇందులో తల్లితో చిన్నప్పటి ఫొటోని, మెట్ల దారిలో తాను దిగిన ఓ ఫొటోని జాన్వీ షేర్ చేసింది.

హిందీలో చాన్నాళ్ల క్రితమే హీరోయిన్‪‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో 'దేవర', రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండింటిపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే మాత్రం జాన్వీ దశ తిరిగినట్లే!

(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement