Sridevi
-
అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!
సెలబ్రిటీల లైష్స్టైల్, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు. అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్లో దేవర మూవీతో దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఇల్లు అంటే క్రేజ్ మామూలుగా ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్తో కలిసి ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్లో నివసిస్తుంది. పాలి హిల్లోని విలాసవంతమైన ఈ భవనం విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్లో బోనీ కపూర్ అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి అంత అదమైన భవనం, సౌకర్యాల గురించితెలుసుకుందాం. ఫరాఖాన్ అందించిన వివరాల ప్రకారం తొలి చూపులోనే పాలి హిల్లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో, లగ్జరీ లుక్తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్లు, ఫోటోలు, ఇతర కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని ఈ అపార్ట్మెంట్ను 2022లో కొనుగోలు చేసిందట జాన్వి. తన జుహు అపార్ట్మెంట్ని రాజ్కుమార్ రావ్కి విక్రయించి మరీ ఆ ఇల్లును ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్ లాంటి స్టార్లు జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో నిర్మించిన ఈ గృహంలో ఓపెన్ కిచెన్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్,పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి. బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.శ్రీదేవి పెయింటింగ్ అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్రూమ్లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్ కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే ఫోటో, ఇతర మెమరీస్ ఫోటోలుగా అమరాయి. పొడవైన చెక్క డైనింగ్ టేబుల్పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్తో డైనింగ్ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోని ఆర్ట్వర్క్ అంతా తన తల్లి శ్రీదేవే సెలెక్ట్ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా స్వయగా జాన్వీనే తెలిపింది. తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్వర్క్లేనని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని చెప్పింది. -
చాలా సింపుల్గా ఆ గుడిలోనే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి(Sridevi) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మూలాలు తమిళనాడులోనే అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో బాల తారగా నటించి అందరి మన్ననలను పొందిన శ్రీదేవి ఆ తర్వాత కథానాయకిగా తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించారు. అలాంటి శ్రీదేవి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మొదట హిందీలో కథానాయకిగా తెరంగేట్రం చేసిన ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపైన దృష్టి సారించారు. అలా ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మరిన్ని అవకాశాలు జాన్వీ కపూర్ వైపు చూస్తున్నాయి. అలా త్వరలోనే కోలీవుడ్లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక తిరుపతి , తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం అంటే జాన్వీకి చాలా ఇష్టం. గతంలో తన అమ్మగారు శ్రీదేవి నిత్యం తిరుమల వచ్చేవారు. ఆమె మరణం తర్వాత జాన్వీ ప్రతి ఏడాదిలో శ్రీవారిని నాలుగైదు సార్లు దర్శించుకుంటుంది. ముఖ్యంగా తన తల్లి పుట్టిన రోజు, వర్ధంతి రోజు కచ్చితంగా తిరుమలకి వెళ్లి దైవదర్శనం చేసుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఈమె తిరుపతి నుంచి కాలినడకన 3550 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇటీవల కొత్త ఏడాది ప్రారంభ సమయంలో కూడా జాన్వీ కపూర్ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే ఈమెకు ఎంతో ఇష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? డెస్టినేషన్ ప్లేస్ ఏమైనా ఉందా..? అని జాన్వీని ప్రశ్నించారు. తన వద్దకు పెళ్లి ప్రస్తావన రాగానే తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని పేర్కొంది. అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టింది. నిజంగా ఇదే జరగాలని నేను ఎప్పుడూ కోరుకుంటానని ఆమె తెలిపింది. జాన్వీ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, జాన్వీ మాత్రం తిరుమలలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో తనలోని ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంది. -
ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
ఆరంభం అదిరిపోతే ఆ కిక్కే వేరుంటుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మహారాజ్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో గతేడాది విడుదలై ట్రెండింగ్లో నిలిచింది. తొలి సినిమానే సక్సెస్ సాధించాడని ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం జునైద్.. లవ్యాపా మూవీ (Loveyapa Movie) చేస్తున్నాడు. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ వెండితెరపై కనిపించబోయే తొలి చిత్రం ఇదే కావడం విశేషం!సాంగ్ రిలీజ్ఖుషి గతంలో ద ఆర్చీస్ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇకపోతే లవ్యాపా నుంచి ఇటీవలే లవ్యాపా హో గయా అనే పాట రిలీజ్ చేశారు. ఇది చూసిన జనాలు పాట బాగుంది, కానీ ఈ లవ్ట్రాక్ మాత్రం కాస్త విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే జునైద్ తండ్రి, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. పాట మాత్రమే కాదు సినిమా కూడా అదిరిపోయిందంటున్నాడు.శ్రీదేవిని చూసినట్లే ఉందితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లవ్పాయా సినిమా రఫ్ కట్ చూశాను. మూవీ చాలా బాగుంది. వినోదాత్మకంగా ఉంది. నాకు నచ్చింది. సెల్ఫోన్ల వల్ల మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనేది చక్కగా చూపించారు. అందరూ బాగా నటించారు. సినిమాలో ఖుషిని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) ని చూసినట్లే ఉంది. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆవిడ ఎనర్జీ నాకు అక్కడ కనిపించింది అని చెప్పుకొచ్చాడు.(చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!)మరీ ఇంత అబద్ధమాడాలా?ఇది చూసిన నెటిజన్లు ఖుషిని గొప్ప నటి శ్రీదేవితో పోల్చవద్దని వేడుకుంటున్నారు. ప్లీజ్ యార్.. మరీ ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, పిల్లలపై ప్రేమతో ఏదైనా అనేస్తావా?.. అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్యాపా విషయానికి వస్తే.. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు ఇది రీమేక్గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా ఫాంటమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కొత్త హీరోహీరోయిన్లను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!ఖుషి అక్క ఆల్రెడీ సత్తా చాటుతోంది!ఇప్పటికే ఖుషి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. సౌత్లో దేవర మూవీతో కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పెట్టింది. రామ్చరణ్తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మల తల్లి శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.గొప్ప నటి శ్రీదేవితెలుగులో కార్తీకదీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలతో అలరించింది. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ అగ్రకథానాయికగా స్టార్డమ్ సంపాదించుకుంది. 2013లో శ్రీదేవిని భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే 2018లో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్ -
ఆ హీరోయిన్తో సినిమా చేయను : ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ..సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ను కూడా షేక్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తీస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఆయన పెట్టే పోస్టులు వైరల్గా మారుతుంటాయి. ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకున్న అలవాటు. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. సినిమా విషయాల్లోనే కాదు పర్సనల్ విషయాల్లోనూ అలానే వ్యవహరిస్తాడు. తాజాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదన్నాడు. దానికి గల కారణం ఏంటో కూడా వివరించాడు.శ్రీదేవి అంటేనే ఎక్కువ ఇష్టంరామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆమె మరణించినా.. తనపై ఆర్జీవీకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. చిన్న సందర్భం దొరికినా.. ఆమె గురించి గొప్పగా మాట్లాడతాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితోనూ పోల్చలేం. ఆమె అందం, అభినయం ఎవరికి రాలేదన్నారు. ‘పదహారేళ్ళ వయసు’ లేదా ‘వసంత కోకిల’.. సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్ననే విషయం మర్చిపోయా. ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి’ అని ఆర్జీవీ అన్నారు.జాన్వీతో సినిమా చేయనుశ్రీదేవి(sridevi) కూతురు జాన్వీ కపూర్తో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకుల ఆర్జీవీ సమాధానం ఇస్తూ ఇప్పట్లో ఆ ఉద్దేశమే లేదన్నారు. శ్రీదేవిని జాన్వీతో పోల్చడం సరికాదన్నారు. శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఏ విషయంలోనైనా ఆమెతో పోల్చలేమని అన్నారు. ‘నాకు శ్రీదేవి అంటే ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా. ఇన్నేళ్ల కెరీర్లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే జాన్వీతో కూడా కనెక్ట్ కాలేదు. ఈ జనరేషన్ వాళ్లకి జాన్వీనే గొప్పగా కనిపిస్తుందేమో. నాకు మాత్రం శ్రీదేవినే గొప్ప. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఇప్పుడైతే జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదు’ అని ఆర్జీవీ అన్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న జాన్వీశ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ధడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్లోనూ రాణిస్తోంది. గతేడాది విడుదలైన ‘దేవర’లో జాన్వీ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటించబోతుంది. -
శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్
ఇప్పటికీ నా భార్య నాతోనే ఉన్నట్లుంది అంటున్నాడు నిర్మాత బోనీ కపూర్. బరువు తగ్గడమే పనిగా పెట్టుకున్న ఆయన దాదాపు 14 కిలోలు తగ్గిపోయాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మొదట్లో నాకు తెలియకుండానే కొంత బరువు తగ్గాను. దాదాపు 13-14 కిలోల మేర తగ్గానని తెలుసుకున్నప్పుడు మరింత బరువు తగ్గాలనిపించింది. పైగా కాస్త సన్నబడ్డాక నా శరీరాకృతి కూడా మారింది. అలా అధిక బరువు ఉన్న నేను 95 కిలోలకు వచ్చాను. నాకు నేనే నచ్చలేదునా ఎత్తూపొడుగుకు 87-88 ఉండాలట! అంటే ఇంకా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాల్సి ఉంది. తు ఝూటి మే మక్కర్ సినిమా సమయంలో అయితే బొద్దుగా ఎప్పటిలాగే ఉన్నాను. ఎప్పుడైతే నన్ను నేను స్క్రీన్పై చూసుకున్నానో నాకు నేనే నచ్చలేదు. అందుకే ఆ సినిమా తర్వాత నేను సన్నబడాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా భార్య శ్రీదేవి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపించేది. తనతో కలిసి వాకింగ్కు వెళ్లేవాడిని, జిమ్కు వెళ్లేవాడిని.నా వల్ల కాలేదుఎప్పుడు, ఏం తినాలనే విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించేది. నేనూ ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. కానీ గత రెండేళ్లుగా నన్ను నేను చూసుకున్నప్పుడు మార్పు అవసరం అనిపించింది. ఈ ప్రయాణంలో శ్రీదేవి నావెంటే ఉన్నట్లుగా ఉంది. బరువు తగ్గడానికి తను నన్ను ప్రేరేపిస్తున్నట్లనిపిస్తోంది. ఇప్పుడు నా లుక్ చూసి పై లోకంలో ఉన్న నా భార్య కచ్చితంగా గర్వపడుతుంది అంటున్నాడు. కాగా శ్రీదేవి- బోనీకపూర్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషి కపూర్ సంతానం. 2018లో శ్రీదేవి మరణించింది.చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్ -
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక) -
మంత్రి సవిత తక్షణం మహిళలకు క్షమాపణలు చెప్పాలి
-
'జాన్వీకపూర్ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరినీ పలకరించినా దేవర పేరే వినిపిస్తోంది. మరో పది రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం దేవర. ఇందులో యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మూవీటీమ్ చిట్ చాట్ నిర్వహించింది.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్పై ప్రశంసలు కురిపించారు. జాన్వీ నటన, హావభావాలు అచ్చం శ్రీదేవిలాగే ఉన్నాయని ఎన్టీఆర్ కొనియాడారు. తనకు తాను నటన ప్రదర్శించుకున్న తీరు శ్రీదేవిని గుర్తు చేసిందని అన్నారు.(ఇది చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్?)జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము ఒక ఫోటోషూట్ కోసం లుక్ టెస్ట్ చేశాం. అక్కడే జాన్వీ పడవలో కూర్చుని కెమెరా వైపు చూస్తోంది. ఆ ఫోటో చూడగానే అచ్చం శ్రీదేవిలా కనిపించింది. తను కేవలం కెమెరాలో కొంత భాగాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన విధానం, స్మైల్ మళ్లీ క్యాప్చర్ చేయగలరని నేను అనుకోను. అవీ చూడగానే శ్రీదేవి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చాయి' అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. జాన్వీ స్పందిస్తూ.. తెలుగులో నటించడం తనకు సొంత ఇంటిలా అనిపించిందని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. -
‘లోకేష్, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’
కర్నూలు, సాక్షి : నిజాలు తెలుసుకోకుండా మంత్రులు నారా లోకేష్, అనితా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయలేదు. టీడీపీ పార్టీ నేతల వర్గా విబేధాలుతోనే ఈ హత్య జరిగింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు, మంత్రి బురద జల్లే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. హోసూరులో జరిగిన హత్యను తప్పు పుట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. హోసూరు గ్రామంలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా మా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. -
తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్
'దేవర' సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్న జాన్వీ కపూర్కి తిరుపతి వేంకటేశ్వర స్వామి చాలా సెంటిమెంట్. ఎప్పటికప్పుడు స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. మంగళవారం తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా మరోసారి స్వామి వారిని దర్శించుకుంది. కాకపోతే మెట్ల దారిలో కొండ పైకి చేరుకుంది.(ఇదీ చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. రేర్ ఫొటోలు)ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో తల్లి శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. ఇందులో తల్లితో చిన్నప్పటి ఫొటోని, మెట్ల దారిలో తాను దిగిన ఓ ఫొటోని జాన్వీ షేర్ చేసింది.హిందీలో చాన్నాళ్ల క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో 'దేవర', రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఈ రెండింటిపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే మాత్రం జాన్వీ దశ తిరిగినట్లే!(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)Our Thangam #JanhviKapoor At Lord Venkateswara Swamy Temple In Tirumala Today 💛🤩. #Chuttamalle pic.twitter.com/FMQ5tkHcGq— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) August 13, 2024 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. మధుర జ్ఞాపకాలుగా ఆ ఫోటోలు
-
అమ్మ బతికుండగా పట్టించుకోలేదు.. కానీ: జాన్వీ కపూర్
దేవర భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావుకు జంటగా కనిపించనుంది. క్రికెట్ నేపథ్యంలో అపూర్వ మోహతా, కరణ్జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి మరణం తర్వాత నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా తిరుమలకు తరచుగా వెళ్లడానికి గల కారణాన్ని వివరించారు.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'అమ్మకు దైవ భక్తి ఎక్కువ. కొన్ని విషయాలను బాగా నమ్మేది. స్పెషల్ డేస్లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అని చెప్పేది. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేది. అంతే కాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దనేది. కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని లైట్ తీసుకున్నా. కానీ అమ్మ దూరమయ్యాక నమ్మడం మొదలుపెట్టా. ఇప్పుడు నేనే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని' తెలిపింది.జాన్వీ కపూర్ తిరుమలరు వెల్లడంపై మాట్లాడుతూ..' అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలచేది . షూటింగ్ గ్యాప్లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటూ ఉండేది. ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచుగా వెళ్తుంటానని' చెప్పుకొచ్చింది. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. -
సీరియల్ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)
-
గాంధీ-అంబేడ్కర్ అప్పుడేం మాట్లాడుకున్నారో వినాలనుకుంటున్నా : జాన్వీ కపూర్
ఒక టైమ్ మెషీన్లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్ అనే మహిళ డాన్స్ తెగ వైరల్ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్ హిట్. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్ సావన్ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్తో వేసే స్టెప్స్ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ సేమ్ చాందినీ సినిమాలోని లొకేషన్ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్ షూట్ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్’లాంటి పాటలకు డాన్స్ చేయడానికి లొకేషన్స్ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!) -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్బీఎన్బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవి బయోపిక్కు అనుమతి ఇవ్వను
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్లో మరణించిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవిపై ఫీలింగ్స్.. అమ్మకు తెలిసి రాఖీ తీసుకొచ్చింది: నిర్మాత
దివంగత నటి శ్రీదేవి.. ఈమె అందాన్ని ఆరాధించినవాళ్లెందరో! నిర్మాత బోనీ కపూర్ సైతం శ్రీదేవిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. మనసులో తన పేరు లిఖించుకున్నాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయింది. అతడి భార్య పేరు మోనా షౌరీ. ఈ జంటకు అర్జున్, అన్షులా కపూర్ సంతానం. బోనీ ప్రేమ విషయం భార్యకు కూడా తెలుసు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవిని ఐదారేళ్లపాటు ఆరాధించాను. నా ప్రేమ విషయం నా భార్యకు సైతం తెలుసు. అబద్ధాలు చెప్పి తనను మోసం చేయాలనుకోలేదు. శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు కూడా ఆమెను నా భార్య ఇంట్లోనే ఉంచాను. రాఖీ కట్టించాలని చూసింది శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్ మా అమ్మ పసిగట్టేసింది. రాఖీ పండుగ రోజు పెద్ద పళ్లెంలో అక్షింతలు, రాఖీ పెట్టి తీసుకొచ్చి శ్రీదేవికి ఇచ్చి నాకు రాఖీ కట్టమని చెప్పింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లింది. నువ్వేం బాధపడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్లేటు నీ గదిలోనే ఉంచమని చెప్పాను. అసలు నాకు రాఖీ ఎందుకు కట్టమని చెప్పిందో తనకేం అర్థం కాలేదు' అని నవ్వేశాడు. కాగా బోనీ తన మొదటి భార్య మోనాకు 1996లో విడాకులిచ్చాడు. అదే ఏడాది జూన్ 2న శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. మళ్లీ కనిపిస్తే బాగుండు!
మంజుల-విజయ్ కుమార్ల వారసురాలిగా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్కుమార్. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తెలుగులో 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్గా నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్ లాంటి చిత్రాల్లోను కనిపించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అయితే ప్రభాస్కు మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తోంది. అయితే ప్రభాస్కు జంటగా నటించిన ఈశ్వర్ చిత్రం 2002లో రిలీజైంది. ఈ మూవీ విడుదలై దాదాపు 22 ఏళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా.. వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరిపై ఓ అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈశ్వర్ సినిమా రిలీజై 22 ఏళ్లు అవుతున్నా ఇద్దరు ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు.. రాబోయే ప్రభాస్ అన్నయ్య సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తే బాగుండు అని రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రీదేవి పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడని వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది ముద్దుగుమ్మ. Prabhas 1st Heroine #SrideviVijayKumar ❤️🔥 Eeshwar release ayyi 22 years ayna still they both look good together 😍#Prabhas Anna future movies lo edho okka chinna role lo ayna kanapadithe bagundu ❤️#Kalki2898AD #Spirit #TheRajaSaab pic.twitter.com/o3Hhm7Ne8l — Ayyo (@AyyAyy0) March 29, 2024 -
ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
వాలెంటైన్ డే మూడ్లో రష్మిక.. బ్లాక్ డ్రెస్లో నిహారిక లుక్స్ వైరల్!
వాలెంటైన్ డే ప్లాన్ చెప్పమంటోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. బ్లూ కలర్ శారీలో శ్రీదేవి స్మైలీ లుక్స్.. బ్లాక్ డ్రెస్లో నిహారిక డిఫరెంట్ లుక్స్.. చిన్ననాటి పుస్తకాల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటోన్న సామ్ బాలీవుడ్ భామ మౌనీ రాయ్ పోజులు View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) -
ఈమె ఒకప్పటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడేమో ఫ్యాషన్ డిజైనర్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. మంచి మంచి హిట్ సినిమాలు చేసింది. జస్ట్ ఐదేళ్లలో ఏకంగా 30 సినిమాలు చేసింది. కానీ ఏమైందో ఏమో సడన్గా యాక్టింగ్ కెరీర్కి టాటా చెప్పేసింది. అయితే ఈమె పేరు చెబితే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. అలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా గుర్తొస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మహేశ్వరి. గుర్తొచ్చిందా? అవును మీరనుకున్న బ్యూటీనే. అతిలోక సుందరి శ్రీదేవికి ఈమె బంధువు అవుతుంది. అంటే ఈమె.. శ్రీదేవి అక్కకు పుట్టిన కూతురు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేశ్వరి.. 1994లో ఇండస్ట్రీలోకి వచ్చింది. తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చాలావరకు తెలుగు చిత్రాలే చేసింది. ఈమె చేసిన వాటిలో 'పెళ్లి', గులాబీ, దెయ్యం లాంటి హిట్ సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో అకస్మాత్తుగా నటన పూర్తిగా పక్కనబెట్టేసింది. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) 1994-2000 వరకు దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన మహేశ్వరి.. యాక్టింగ్ పక్కనబెట్టేసిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉంది. అలా 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక 2010లో సీరియల్ యాక్టర్గా కెరీర్ షురూ చేసింది. ఓ నాలుగేళ్లు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన తర్వాత దాన్ని కూడా పక్కనబెట్టేసింది. ఇక ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం మహేశ్వరి.. ఫ్యాషన్ డిజైనర్గా డిఫరెంట్ కెరీర్ని ఎంచుకుంది. హైదరాబాద్లో ఈమెకు ఓ స్టోర్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్తో మహేశ్వరి అప్పుడప్పుడు కనిపిస్తోంది. వరసకు వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు అవుతారు. కానీ మహేశ్వరి ఒకప్పుడు హీరోయిన్ కాగా.. జాన్వీ మాత్రం ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అమ్మ నన్ను తిట్టేది:జాన్వీ కపూర్
దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయేది.. పక్కింటి అమ్మాయిగా కనిపించేది, కల్మషం లేని నవ్వుతో కవ్వించేది.. అమ్మాయిలు అసూయ చెందేలా అందంతో అల్లాడించేది.. కంటిచూపుతో చంపడం, నవ్వుతుంటే ముత్యాలు రాలడం ఈమె విషయంలో నిజమయ్యేది.. ఆవిడే అందాల తార శ్రీదేవి. ఈమె తల్లిది తిరుపతి.. తండ్రిది తమిళనాడులోని శివకాశి. దీంతో చిన్నప్పటినుంచే తెలుగు, తమిళ భాషల్లో శ్రీదేవి అనర్గళంగా మాట్లాడేది. కాందన్ కరుణై అనే తమిళ చిత్రంతో ఈమె బాలనటిగా మారింది. మా నాన్న నిర్దోషి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హీరోల కంటే ఎక్కువ పారితోషికం తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో బాలనటిగా, హీరోయిన్గా మెప్పించింది. రజనీకాంత్, కమల్ హాసన్, అంబరీష్, కృష్ణ, నందమూరి తారక రామారావు, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, అమితాబ్ బచ్చన్, జితేంద్ర, రాజేశ్ ఖన్నా, అనిల్ కపూర్.. ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. 1996లో నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడింది. బోనీకి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సంతానం. దొంగతనం చేసి దొరికిపోయేదాన్ని జాన్వీ ఇప్పటికే హీరోయిన్గా క్రేజ్ సంపాదించగా ఖుషీ ఈ మధ్యే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మ గదికి వెళ్లి తన లిప్స్టిక్లు దొంగిలించి జేబు నిండా నింపుకునేదాన్ని. అమ్మ నన్ను ఆపి నీ జేబు చూపించు అని అడిగేది. నేనేమో ఏమీ తెలియనట్లు జేబులో ఏం లేదమ్మా.. అని అబద్ధం చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ.. నా కొడకా.. అని తిట్టేది. తను ఎప్పుడూ అలాగే తెలుగులో తిడుతూ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఎంత క్యూట్గా తిట్టిందో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా జాన్వీ.. దేవర సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయం కానుంది. Naa Kodaka... 😁 pic.twitter.com/dReIBc6Urw — Imho (@Artoo_Detwo) January 3, 2024 చదవండి: సామ్కు బాలీవుడ్లో ఆఫర్.. ఊ అంటుందా? ఉఊ అంటుందా? -
అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్- దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 2018లో 'ధడక్' సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈ మధ్యే 'ద ఆర్చీస్' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్స్టార్లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓపక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని చెప్పుకొచ్చింది. ఖుషీ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని చెప్పుకొచ్చింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో కన్నుమూసింది. చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా దూసుకుపోతుంది. బాలీవుడ్తో పాటు తాజాగా టాలీవుడ్లోనూ జాన్వీ గ్రాండ్గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో ఖుషీ ధరించిన డ్రెస్ అండ్ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్ ఐకాన్గా ఖుషీ కపూర్కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ. గతంలో ఇదే డ్రెస్ను దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్ను రిపీట్ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్ చోకర్నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్లో ఖుషి కపూర్తో పాటు సుహానా ఖాన్, వేదాంగ్ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ కిడ్స్ ఉండటంతో ది ఆర్చీస్పై ఇప్పటికే హైప్ నెలకొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చిన్నారి శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది.. గతంలో చంద్రమోహన్ పంచుకున్న విశేషాలు
చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్.. నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అనారోగ్యంతో శనివారం (నవంబర్ 11) తుది శ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్ని చేశారు.వారిలో దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూడా ఉన్నారు. ఆమె గురించి గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చంద్రమోహన్. శ్రీదేవి మరణించిన రోజు(2018) ‘సాక్షి’తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు చంద్రమోహన్ శ్రీదేవి గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే .. (ఇది 2018లో శ్రీదేశి మరణించిన రోజు చంద్రమోహన్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ) శ్రీదేవిగారికి తెలుగులో మీరు ఫస్ట్ హీరో. ‘పదహారేళ్ల వయసులో’ మీ ఇద్దరు జంటగా చేసినప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారా? చంద్రమోహన్: ఆ సినిమాకి శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కానీ కమల్హాసన్తో ఇదే సినిమాలో తమిళంలో బాగా చేసిందని రాఘవేంద్రరావుగారు కన్విన్స్ చేశారు. నాక్కూడా శ్రీదేవితో చేయడానికి అభ్యంతరం అనిపించలేదు. తననే కథానాయికగా తీసుకున్నాం. బ్రహ్మాండంగా నటించింది. హీరోయిన్గా అందనంత దూరం వెళ్లిపోయింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా మీతో ఒక సినిమా చేసినట్లున్నారు? అవును. ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర చేసింది. ఆ సినిమాలో నేనేమో నారదుడి పాత్ర చేశాను. అప్పుడు శ్రీదేవికి ఏడెనిమిదేళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే చాలా క్రమశిక్షణగా ఉండేది. చాలా ముచ్చటేసేది. బిస్కెట్లు తింటూ కూర్చునేది. నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తను ఆ తర్వాత మూడేళ్లకు నా పక్కన హీరోయిన్ (‘పదహారేళ్ల వయసులో)గా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అయితే ‘యశోద కృష్ణ’ సినిమా చేస్తున్నప్పుడు తను పెద్ద స్థాయికి వెళుతుందనుకున్నాను. (చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) బాలనటిగా ఆమె మీ సినిమాలో చేసినప్పుడు జరిగిన సంఘటనలేమైనా గుర్తు చేసుకుంటారా? ‘యశోద కృష్ణ’ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి వేరే తమిళ సినిమా ఒప్పుకుంది. మర్నాడు మద్రాసు వెళ్లాలి. ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అప్పట్లో మేం మద్రాసులో ఉండేవాళ్లం. నా షెడ్యూల్ కంప్లీట్ అయిపోవడంతో నా కారులో శ్రీదేవిని తీసుకు రావడానికి వీలు పడుతుందా? అని ఆమె అమ్మగారు అడగడంతో సరే అన్నాను. దాదాపు 14 గంటలు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది. జాగ్రత్తగా వాళ్ల అమ్మకు అప్పజెప్పాను. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) మీతో సినిమా చేయకముందు నుంచే శ్రీదేవిగారి కుటుంబంతో మీకు పరిచయం ఉందా? మద్రాసు టీ నగర్లో మావి పక్క పక్క ఇళ్లే. మా పిల్లలతో శ్రీదేవి ఆడుకునేది. వాళ్ల అమ్మగారికి కూతుర్ని పెద్ద హీరోయిన్ని చేయాలని ఉండేది. అమ్మ కలని కూతురు నెరవేర్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హిందీలో చాలా బాగా సక్సెస్ అయిన మన తెలుగు పిల్ల అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరి శ్రీదేవి. తనలా ఎవరూ ఉండరు. పుట్టరు. శ్రీదేవి శ్రీదేవే. మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా ఆ తర్వాత స్టార్ అవుతారనే సెంటిమెంట్ శ్రీదేవిగారి విషయంలో కూడా నిజమైంది కదా? అప్పట్లో ఆ సెంటిమెంట్ ఉండేది. ‘పదహారేళ్ల వయసులో’ సూపర్ డూపర్ హిట్టయి శ్రీదేవికి చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు తన అమ్మగారు ‘చంద్రమోహన్గారి సినిమాతో హీరోయిన్గా మా అమ్మాయి అరంగేట్రం అయింది. స్టార్ అయిపోయింది’ అనేవారు.జయప్రద, జయసుధ.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఆ సెంటిమెంట్ని ఆపాదించారు. ‘నాదేం లేదు.. అంతా మీ స్వయంకృషి’ అనేవాణ్ణి. విశేషం ఏంటంటే... తన భర్త బోనీకపూర్కి నన్ను పరిచయం చేసినప్పుడు ‘నా ఫస్ట్ హీరో’ అని చెప్పింది. ఓసారి నా తెలుగు సినిమా షూటింగ్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి చేస్తున్న సినిమా షూటింగ్ పక్క పక్కనే జరిగాయి. అప్పుడు అమితాబ్కి ‘నా ఫస్ట్ హీరో. లక్కీ హీరో’ అని నన్ను పరిచయం చేసింది. ‘పదహారేళ్ల వయసులో’ తమిళ మాతృకలో కమల్హాసన్గారు చేశారు. ఎప్పుడైనా నటనపరంగా మీ ఇద్దరికీ శ్రీదేవిగారు పోలిక పెట్టారా? ఆ సినిమా విజయోత్స వేడుకలో నాకన్నా చంద్రమోహన్గారు బాగా చేశారు అని కమల్హాసన్ అన్నారు. ‘నేను తప్ప ఆ క్యారెక్టర్ని వేరే ఎవరూ బాగా చేయలేరనుకున్నా. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. చంద్రమోహన్గారు గొప్పగా నటించారు’ అని కమల్గారు అన్నారు. శ్రీదేవి కూడా ఆ మాటే అంది. వాస్తవానికి ‘స్వాతిముత్యం’ సినిమాలో నేనే చేయాల్సింది. ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ‘పదహారేళ్ల వయసు’ క్యారెక్టర్లానే ఉంటుంది. అయితే ఆ సినిమాని తమిళ్లో కూడా ప్లాన్ చేశారు. అక్కడ కమల్గారికి మార్కెట్ ఉంది కాబట్టి, బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఆయనతో చేయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నటిగా శ్రీదేవిగారిలో ఉన్న మంచి లక్షణాల గురించి? నేను భానుమతిగారు, సావిత్రిగార్లతో సినిమాలు చేశాను. వాళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా రాజీపడేవారు కాదు. ఆ లక్షణాలను శ్రీదేవిలో చూశాను. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు ఆ తర్వాత శ్రీదేవి స్థాయిలో హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోయారు. శ్రీదేవి గొప్ప నటి. ఎన్టీఆర్, ఏయన్నార్, కమల్హాసన్, రజనీకాంత్.. ఇలా ఎవరి పక్కన చేసినా తన నటన ప్రత్యేకంగా ఉండేది. ఆడియన్స్ తననే చూసేంత గొప్పగా నటించేది. అందుకే అన్ని లాంగ్వేజెస్లో రాణించగలిగింది. చివరిసారిగా మీరు ఆమెను ఎప్పుడు కలిశారు? వైజాగ్లో జరిగిన టీయస్సార్ అవార్డు ఫంక్షన్లో కలిశాం. అప్పుడు సన్నిహితులెవరో ‘నీ ఫస్ట్ హీరోయిన్ వచ్చారు’ అంటే, ‘నా ఫస్ట్ హీరో వచ్చారు’ అని శ్రీదేవి నా దగ్గరకు నవ్వుతూ వచ్చింది. ఎంత స్టార్ అయినా తనలో ఎప్పుడూ నేను భేషజం చూడలేదు. నటిగా అందనంత దూరానికి వెళ్లింది. ఇప్పుడు కూడా అందనంత దూరానికి వెళ్లింది. క్షణాల్లో మిస్సయిసోయింది. అని చద్రమోహన్ ఎమోషనల్కు గురయ్యారు. -
హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. (చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) ♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ♦ చంద్రమోహన్పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. ♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది ♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. ♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్తో నటించిన తర్వాతే స్టార్గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి'
ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'మొదటగా డైరెక్టర్ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్కు వెళ్లాము.' అని చెప్పాడు. మెరిల్ స్ట్రీప్తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్ శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్తో పోలుస్తూ.. ఆమె 'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. శ్రీదేవి, జాన్వీ కపూర్ల మధ్య పోలికలు శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్ వివరించాడు. జాన్వీ తన తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్ చేయడం చాలా కష్టమైన పని.. కానీ జాన్వీ కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్ ఉంది. కచ్చితంగా భవిష్యత్లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్ తెలిపాడు. టాలీవుడ్లో జూ.ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. -
నటి శ్రీదేవి విజయ్కుమార్ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!
శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్ గదిలో మరణించింది. (ఇది చదవండి: ప్రభాస్ బర్త్డే నాడు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..?) హీరోల కంటే ఎక్కువ పారితోషికం శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది. అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది. (ఇది చదవండి: బూతులు బిగ్ బాస్లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ) -
షూటింగ్ టైంలో ఆమె నాకు వార్నింగ్ ఇచ్చింది
-
పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా?.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
అలనాటి అందాల నటి శ్రీదేవి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి భర్త బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జాన్వీ కపూర్ పుట్టిన రోజుపై వస్తోన్న రూమర్స్పై ఆయన స్పందించారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) గతంలో కూడా జాన్వీకపూర్ కూడా వారికి పెళ్లికి ముందే పుట్టారని వార్తలొచ్చాయి. అయితే బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో ఆ వార్తలపై నోరు విప్పారు. ఆ రూమర్స్ ఎలా వచ్చాయో స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే శ్రీదేవి-బోనీ కపూర్ వివాహంపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ మాట్లాడుతూ..'నేనూ శ్రీదేవి 1996లో షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నాం. కొద్ది నెలలకే మా పెళ్లి విషయాన్ని బయటికి చెప్పాం. ఆ తర్వాత 1997లో జనవరిలో మరోసారి అందరి సమక్షంలో పెళ్లిచేసుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాం కూడా. మాకు జాన్వీ కపూర్ 1997 మార్చిలో పుట్టింది. అయితే జాన్వీ మా పెళ్లికి ముందే పుట్టిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అవీ ఇప్పటీకీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. తన పుట్టినరోజు గురించి స్వయంగా నేను చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు' అంటూ వెల్లడించారు. అలాగే శ్రీదేవికి దైవభక్తి ఎక్కువని అన్నారు. తన పుట్టినరోజున కచ్చితంగా తిరుమల వెళ్లేవారని తెలిపారు. (ఇది చదవండి: 'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!) -
శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!
అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు శ్రీదేవి. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. కొన్ని దశాబ్దాల పాటు మన దేశవ్యాప్తంగా సినిమాలకు మకుటం లేని మహారాణిగా పేరు సంపాదించింది. పెళ్లి-ఫ్యామిలీ కోసం కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి.. రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. కానీ 2018లో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో అభిమానులకు లెక్కలేనన్ని అనుమానాలు. ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఏం జరిగింది? 2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్టబ్లో జారిపడి చనిపోయిందన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) బోనీ ఏం చెప్పారు? 'స్క్రీన్పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. మా పెళ్లి తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో-బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు చనిపోయింది' 'దీంతో దుబాయి పోలీసులు నన్ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజులు తర్వాత నాగార్జున ఓసారి కలిశారు. డైట్ కారణంగా ఓసారి సెట్లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు' అని బోనీ కపూర్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో రతిక రెమ్యునరేషన్ ఎన్ని లక్షలో తెలుసా?) -
శ్రీదేవి అంటే నాకు చాలా గౌరవం : రామానాయుడు
-
చిరంజీవి, శ్రీదేవి సినిమా ఎందుకు చేయలేదు అంటే..!
-
కోలీవుడ్ కబురు?
దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్కు కోలీవుడ్ నుంచి కబురు వెళ్లిందట. తమిళ నటుడు అథర్వ హీరోగా ఆకాష్ అనే కొత్త దర్శకుడు ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఖుషీ కపూర్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఖుషీకి ఈ కథ నచ్చిందని, ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఖుషీ కపూర్ నటించే తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘పయ్యా (‘ఆవారా’)’ సినిమాకు సీక్వెల్గా ‘పయ్యా 2’ రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంపికయ్యారనే టాక్ గతంలో కోలీవుడ్లో వినిపించింది. అయితే ‘పయ్యా 2’ సీక్వెల్లో ఖుషీ కపూర్ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక హిందీలో ‘ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్లో ఖుషీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. -
'శ్రీదేవి చనిపోయినా రాని సొంత చెల్లెలు'... అసలు కారణం అదేనా!
అతిలోకసుందరి అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రంలో తన అమాయకపు మాటలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో స్టార్ హీరోలందరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. అప్పటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే శ్రీదేవికి ప్రత్యేకస్థానం ఉంటుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. సినీ కెరీర్లో తెలుగు ప్రేక్షకులు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!) అయితే తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో శ్రీదేవి జన్మించారు. రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వీరిలో శ్రీదేవి పెద్దకూతురు. అయితే ఆమె సోదరి శ్రీలత గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే శ్రీదేవిలాగా ఆమె సినిమాల్లోకి రాలేదు. అయితే ఏ సినిమా సెట్కు వెళ్లినా అక్కతో పాటే కనిపించేవారు. తల్లి రాజేశ్వరితో పాటు, శ్రీలత కూడా శ్రీదేవితో పాటే ఉండేవారు. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్స్లో శ్రీదేవితో పాటు వెళ్లేవారు. అలా 21 ఏళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచారు. అప్పట్లో వీరి కుటుంబం తమిళనాడులో శివకాశిలో ఉండేది. శ్రీదేవి కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమా సెట్స్లో శ్రీలత కనిపించారు. శ్రీలత కూడా శ్రీదేవి లాగే నటి కావాలనుకుంది. కానీ ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్గా మారింది. తల్లి మరణంతో విభేదాలు అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం వారి మధ్య దూరాన్ని పెంచింది. తల్లి మరణంతో ఇద్దరు సోదరీమణుల మధ్య విభేదాలు పెరిగాయి. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయించాలని ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేక రాజేశ్వరి 1996లో మరణించింది. దీంతో శ్రీదేవి ఆసుపత్రిపై కేసు పెట్టవలసి వచ్చింది. ఈ కేసులో చివరికీ శ్రీదేవిని గెలిచింది. తల్లి మరణంతో పరిహారంగా రూ.7.2 కోట్లు పొందింది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్ ) డబ్బుల కోసం కేసులు ఆస్పత్రి పరిహారంగా చెల్లించిన రూ.7.2 కోట్లు శ్రీదేవి తన వద్దే ఉంచుకుందని సోదరి శ్రీలత ఆరోపించింది. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శ్రీలత తన వాటా డబ్బుల కోసం శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగా లేదని.. అందుకే తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవికి బదిలీ చేసిందని ఆరోపించింది. శ్రీలత ఈ కేసులో గెలిచి తన వాటాగా రూ.2 కోట్లు దక్కించుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం అక్కా, చెల్లెల్ల బంధాన్ని చెరిపేసింది. అంతా అన్యోన్యంగా ఉండేవారు కేవలం డబ్బువల్లే శత్రువులుగా మారిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బోనీకపూర్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కాగా.. సూపర్ స్టార్గా ఎదిగిన శ్రీదేవి 2018లో దుబాయ్లో ఓ హోటల్లో మరణించారు. ఈ వివాదం వల్లే శ్రీదేవి మరణం తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థనా సమావేశంలో శ్రీలత కనిపించలేదని చెబుతున్నారు. -
తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దఢక్' సినిమాతో హీరయిన్ అయిపోయింది. కానీ ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్లో నటించే ఛాన్స్ ఈమెకు దక్కింది. నటిగా పక్కనబెడితే గ్లామరస్ ఫొటోలతోనూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) మరోవైపు బాయ్ఫ్రెండ్తోనూ షికారు చేస్తూ చాలాసార్లు కెమెరాకి చిక్కింది. అయితే ఈమెకు ఇదివరకే ఒక బాయ్ఫ్రెండ్ ఉండేవాడు. కాకపోతే అతడితో బ్రేకప్ అయ్యింది. దీని గురించి నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయటపెట్టింది. తన ఫస్ట్ లవ్ కొన్ని రోజుల్లోనే ముగిసిపోయిందని చెబుతూ బాధపడింది. 'పరిణితి లేని వయసు కారణంగా ఇద్దరం ఓ రకమైన అయోమయానికి గురయ్యాం. దీంతో మా మధ్య ప్రేమలో నిజాయితీ లోపించింది. అబద్దాలతోనే మా లవ్, రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో నా తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా హెచ్చరించారు. వారి మాటలు వింటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది. దీంతో నా తొలిప్రేమకు ముగింపు పలికాను' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర'లో హీరోయిన్గా చేస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త
ఇప్పటి జనరేషన్కి ఆమె గురించి పెద్దగా తెలియదు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా ఏ పాయింట్ తీసుకున్నా సరే అతిలోక సుందరి శ్రీదేవి ఫెర్ఫెక్ట్గా ఉండేది. తెలుగులో రెండు మూడు జనరేషన్ స్టార్ హీరోలతో నటించిన ఆమె.. 2018లో అనుకోని విధంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఆమెకు ఓ కోరిక ఉండేది. ఇన్నాళ్లకు ఆ డ్రీమ్ ని ఆమె భర్త బోనీ కపూర్ తీర్చారు. ఏంటా కోరిక? 80ల్లో హీరోయిన్గా మంచి ఊపు మీదున్నప్పుడు శ్రీదేవి.. చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్లోని బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసింది. అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంది. చాలా ఆశపడింది. కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు చనిపోయింది. దీంతో ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువ!) ఇన్నాళ్లకు అలా శ్రీదేవి చివరి కోరికను భర్త బోనీ కపూర్.. ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్నర్షిప్తో అందమైన భవనం కట్టించారు. 'ఇది శ్రీదేవి కల. అది నెరవేర్చినందుకు రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేశాం. ఫైనల్గా బీచ్ హౌస్ని పూర్తి చేశాం. చాలా ఆనందంగా ఉంది' అని బోనీ కపూర్ చెప్పారు. తల్లిలా కూతురు అయితే అమ్మ శ్రీదేవి అడుగుజాడల్లోనే కూతురు జాన్వీ కపూర్ వెళ్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'లో జాన్వీనే హీరోయిన్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం జాన్వీకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. In the late 80's during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai. Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 Boney Kapoor is happy to fulfilling Sri Devi's dream. He says, "Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house."@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
నీకు ఇంకా 35 ఏళ్లే.. అమ్మను తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకుంటోంది. అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో దఢక్ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన జాన్వీ.. కొద్ది కాలంలోనే తనదైన నటనతో మెప్పించింది. అంతేకాకుండా గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ.. ఇటీవల వరుణ్ ధావన్ సరసన బవాల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే బవాల్ నేరుగా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ శ్రీదేవి 60 జయంతి కావడంతో తన తల్లిని గుర్తు చేసుకుంది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్ ) జాన్వీ కపూర్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నానమ్మతో సినిమా సెట్లో దిగిన ఈ ఫోటో మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి అని నాకు తెలుసు. ఈ రోజు నేను కూడా సినిమా సెట్లో ఉన్నా. మీరు నాతో ఇలాగే ఉండాలని నేను గతంలో కంటే ఎక్కువగా కోరుకున్నా. వాస్తవానికి మీ 35వ పుట్టినరోజని మేము అందరినీ ఒప్పించగలము. నేను నిన్ను చూసి గర్విస్తున్నా. ఈ ప్రపంచాన్ని నీ కళ్లతో చూడగలుగతున్నా. మమ్మల్ని చూసి మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. ప్రతి రోజు నిన్ను ప్రేమిస్తునే ఉంటా అమ్మా. మీరు ఈ భూమి మీద అత్యంత ప్రత్యేకమైన మహిళ. మీరు ఇప్పటికీ మాతో ఉన్నారని నాకు తెలుసు. మేము జీవితంలో ఎదగడానికి కారణం నువ్వే. ఈ రోజు నీకిష్టమైన పాయసం, ఐస్ క్రీములు తింటావని ఆశిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్టే చేశారు. కాగా.. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్ను పెళ్లి చేసుకున్న శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. 2018లో దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఓ హోటల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఇవాళ ఆమె 60వ జయంతి కావడంతో గూగుల్ సైతం ప్రత్యేక డూడుల్తో ఆమెకు ఘన నివాళి అర్పించింది. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
వారికి ఇష్టమైన ఫోటోలతో శ్రీదేవిని గుర్తు చేసుకున్న జాన్వీ,బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన అమ్మగారిని గుర్తు చేసుకుంది. బోనీ కపూర్ తన భార్యతో కలిసి తీసుకున్న పాత ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. అక్కడ 'హ్యాపీ బర్త్డే' అని తెలుపుతూ హార్ట్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా పలు పాత ఫోటోలను షేర్ చేసి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. పలు లవ్ ఎమోజీలతో పాటు 'హ్యాపీ బర్త్డే మామా' అని రాసింది. (ఇదీ చదవండి: భార్య వల్లే ఆ హీరో కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) తాజాగ విడుదలైన 'బవాల్' చిత్రంలో కనిపించిన జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ కథనాలలో తన తండ్రి సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే తన కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా జాన్వీ కపూర్ శ్రీదేవి గురించి మాట్లాడింది. తన తల్లి మరణం తనకు చాలా కఠినమైన సమస్య అని, శ్రీదేవిని రోల్ మోడల్గా చూస్తున్నానని చెప్పింది. ఆమె మరణం తర్వాత తన కెరీర్ను కూడా శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటున్నానని జాన్వీ తెలిపింది. 40 ఏళ్లపాటు శ్రీదేవి ట్రెండ్ 1963 ఆగస్టు 13న తమిళనాడులో శ్రీదేవి జన్మించారు. శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ అనేది శ్రీదేవి అసలు పేరు. సినిమాల కోసం శ్రీదేవిగా పేరు మార్చుకుని 40 ఏళ్లపాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం,మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 250 సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ చేసిన శ్రీదేవి.. అతిలోక సుందరిగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ని వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
శ్రీదేవికి అరుదైన గౌరవం.. 60వ బర్త్డే స్పెషల్!
అతిలోక సుందరి శ్రీదేవి.. సినీ ప్రేక్షకుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి. ఇంత స్పెషల్ ఎందుకంటే ఈమె చరిష్మా అలాంటిది. హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే.. ఆడియెన్స్ గుండెల్లో చెరిగిపోని చోటు సంపాదించింది. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమెని గుర్తుచేసుకుంటున్నారు. అలా శ్రీదేవి 60 బర్త్ డే (జయంతి) సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది. (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) తమిళనాడులో పుట్టిన శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకుని శ్రీదేవి అయ్యింది. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈమెకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమె కుమార్తెలు. ఇకపోతే తన నటనతో సినీ ప్రేక్షకుల్ని అలరించిన శ్రీదేవికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. ఈ బ్యూటీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్గా శ్రీదేవి ఫొటోని డిస్ప్లే చేసింది. మంచి కలర్ఫుల్ లుక్లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూస్తే.. 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చే గోదారమ్మ' పాటనే గుర్తొస్తోంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం ఆమె ఫ్యాన్స్ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) -
Sridevi Birthday Special Pics : దివంగత నటి శ్రీదేవి బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
రజినీ కంటే ఆ హీరోయిన్కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?
సూపర్స్టార్ రజినీకాంత్ మంచి జోష్ మీదున్నారు. ఆగస్టు 10న 'జైలర్' రాబోతుంది. ట్రైలర్ అవి చూస్తుంటే హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. అయితే ఈ హిట్ రజినీకి చాలా అవసరం. ఎందుకంటే గత కొన్నేళ్లలో సినిమాలైతే చేస్తున్నారు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 'జైలర్'పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే ఓ సినిమా కోసం సూపర్స్టార్ కంటే హీరోయిన్కే పారితోషికం ఎక్కువిచ్చారు. ఇంతకీ ఆమె ఎవరు? అది ఏ మూవీనే తెలుసా? ఏ సినిమా? మీరు ఏ మూవీ తీసుకున్నా దాదాపుగా హీరోయిన్ కంటే హీరోకే పారితోషికం ఎక్కువ ఇస్తుంటారు. ఇక సూపర్స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లకైతే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో అంటే 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'మూండ్రు ముడిచ్చు' అనే సినిమా చేశారు. అంతకు మూడేళ్ల ముందు తెలుగులో వచ్చిన 'ఓ సీత' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో నటించినందుకుగానూ రజినీకి రూ.2000 మాత్రమే ఇచ్చారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) హీరోయిన్కే ఎక్కువ ఇదే సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీదేవికి మాత్రం రూ.5000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రధాన పాత్రలో నటించిన కమల్ హాసన్కి మాత్రం రూ.30 వేలు ఇచ్చారు. అప్పటికే కమల్ ఫేమస్ కావడం వల్ల ఇంత మొత్తం ఇచ్చారని శ్రీదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏదేమైనా అప్పట్లో రజినీకాంత్ కంటే శ్రీదేవి డబుల్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఆశ్చర్యపరిచే విషయం కదా! వీళ్లిద్దరూ కలిసి దాదాపు 18 సినిమాల్లో నటించడం విశేషం. 'జైలర్' సంగతేంటి? నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' సినిమాలో.. రజినీకాంత్, రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. కుటుంబంతో కలిసి వాళ్లు చెప్పినట్లు పనులు చేస్తూ ఉండే ఈయన లైఫ్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సౌమ్యంగా ఉండే రజినీ కాస్త యాక్షన్లోకి దిగుతాడు. మరి చివరకు ఏమైంది? అసలు రజినీ రెచ్చిపోవడానికి కారణమేంటి? అనేదే 'జైలర్' స్టోరీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు సమంతకు ఉన్న తేడా అదే!) -
Sridevi Ashala: స్వానుభవమే పెట్టుబడి
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్లోని హయత్నగర్లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్గా రాణిస్తున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్, ఫాస్ట్ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం. పరిశోధన అంతా ఇంట్లోనే.. అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను. అడిగినవారికి తయారీ.. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది. వేరే రాష్ట్రం కావడంతో.. సాప్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను. నెలకు 20 లక్షల టర్నోవర్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్ను రన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి. – నిర్మలారెడ్డి -
శ్రీదేవిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు: మురళీ మోహన్
జగమే మాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నటుడు మురళీ మోహన్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కీలక పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. 15 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటాననుకున్న ఆయన 50 ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నాడు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడంతో పదేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే పూర్తిగా సినిమాలకే అంకితమవ్వాలనుకుంటున్నానని ఇటీవలే మురళీ మోహన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానిని అని చెప్పే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. 'ఇండస్ట్రీలో ఉన్న శ్రీరామచంద్రుడిని నేనే అని నాగేశ్వరరావు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. శ్రీదేవి వాళ్ల అమ్మకు ఓ ఆలోచన వచ్చింది. ఈయన బుద్ధిమంతుడిలా ఉన్నాడు, బాగున్నాడు.. ఇలాంటి అబ్బాయికి మనమ్మాయినిస్తే బాగుంటుందని ఆలోచించింది. మరి తనకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు. నిర్మాతగా సినిమాలు చేద్దామంటే నన్ను సెట్స్కు రావద్దన్నారు. అవసరమైనప్పుడు డబ్బులు పంపిస్తే చాలన్నారు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి?' అన్నాడు మురళీ మోహన్. చదవండి: నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: పార్వతి -
శ్రీదేవిని ఎత్తుకుంటే పక్కన హీరోలు అలిగేవారు.. ఆ రోజులు వేరు..
-
నన్ను పెంచి పోషిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
-
Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!
కుట్టి పద్మిని దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళంలో బాల నటిగా నటన జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ బిజినెస్లో బిజీ ఆయిపోయారు. ఇటీవల ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. (ఇది చదవండి: రూమ్లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి) పద్మిని మాట్లాడుతూ.. 'కమల్ హాసన్.. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణీ గణపతితో సహా మరో ఇద్దరు నటీమణులతో కలిపి ఒకేసారి ఆరుగురితో ప్రేమ వ్యవహారం నడిపించారు. కానీ చివరికి వాణీ గణపతిని కమల్ హాసన్ పెళ్లాడారు. వీరి పెళ్లి వార్త శ్రీదేవి, శ్రీవిద్యలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రీవిద్య కమల్హాసన్ను ఎంతో ఇష్టపడింది. ఆయనకు పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నేను కమల్తో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వాణితో ప్రేమలో పడ్డారు. ఎయిర్పోర్టులో ఆమెకు బహుమతి కూడా కొన్నాడు. ఆ తర్వాత మద్రాస్కు చెందిన నటి రేఖతో ప్రేమాయణం కొనసాగించారు. ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పా. కానీ ఆమె నమ్మలేదు. కమల్కు 'సకలకళా వల్లభుడు' అన్న బిరుదు రావడానికి ఇదే కారణం.' ఆమె పేర్కొంది. (ఇది చదవండి: విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!) అయితే కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత.. శ్రీవిద్య చాలా రోజులు ఈ వాస్తవాన్ని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు పద్మిని తెలిపింది. కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే విడాకాలు తీసుకుంది. సినిమాల నుంచి తప్పుకున్న శ్రీవిద్య తిరువనంతపురంలో స్థిరపడింది. తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్కు రాసిచ్చింది. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడంతో 2006లో మరణించింది. తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీవిద్య నటించారు.ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటించారు. -
నారా లోకేష్ పై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్
-
ఇప్పటికీ ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్: నాని కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాని. ఆమెకు ఇప్పుటికీ తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణ క్షణం (1991)లో ఆమెను చూడటం తనకు ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని అన్నారు. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..'తన జీవితంపై శ్రీదేవి ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే నా డ్రీమ్ డేట్ కచ్చితంగా శ్రీదేవినే. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఈ రోజు మన మధ్య లేరు. నేను ఎదిగే కొద్దీ శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా. ఇప్పటికీ కూడా ఆమెకు పెద్ద అభిమానిని. క్షణ క్షణం సినిమాలో ఆమెను చూస్తుంటే ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తోంది.' అని అన్నారు. కాగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో నాని ధరణి అనే పాత్రలో కనిపించనున్నారు. ధరణి పాత్ర తన కెరీర్లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్గా నిలుస్తుందన్నారు నాని. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ జంటగా నటిస్తోంది. -
అగ్రహీరోలతో అలరించిన మహేశ్వరి .. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
అప్పటి తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు మహేశ్వరి. అప్పట్లో పలు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. ఇప్పటి సినీ ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 35 చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో పెళ్లి చిత్రంలో హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే మహేశ్వరి తెలుగులో అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. పెళ్లి సినిమాతోనే మహేశ్వరికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవి తేజతో కలిసి జంటగా నటించిన నీకోసం చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. గులాబీ సినిమా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అయితే 2008లో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవికి బంధువైన మహేశ్వరి ఇప్పుడేలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం. తమిళంలో ఎంట్రీ ఉల్లాసం అనే తమిళ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె తమిళంలో అజిత్, విక్రం వంటి అగ్ర నటుల సరసన నటించింది. ' జీ తెలుగు సీరియల్ 'మై నేమ్ ఈజ్ మంగతాయారు'లో నటించింది. అయితే ఈ ధారావాహిక తమిళంలో కూడా ప్రసారమయ్యేది. తెలుగులో గులాబీ, దెయ్యం, నీ కోసం, పెళ్లి, ప్రియరాగాలు, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో కనిపించింది. శ్రీదేవి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఈ మధ్య కాలంలో ఆమె కనుమరుగయ్యారు. అయితే తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్కు అండగా ఉంటున్నారామె. చెన్నైకి వచ్చినప్పుడల్లా శ్రీదేవితోనే కలిసి ఉండేవారట. ప్రస్తుతం షూటింగ్స్లో జాన్వీకి తోడుగా ఉంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి మహేశ్వరికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
శ్రీదేవిపై ఉన్న ఫీలింగ్స్ నా భార్యకు చెప్పాను: బోనీ కపూర్
భారతీయ సినీపరిశ్రమను ఏలిన అతి కొద్దిమంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. తన అందాన్ని, నటనాప్రతిభను చూసి ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం విస్తుపోయేవారు. శ్రీదేవి అందం, అభినయం చూసి బోనీ కపూర్ కూడా మంత్రముగ్ధుడయ్యాడు. అందుకే ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమెకు నటుడు మిథున్ చక్రవర్తితో పెళ్లైందంటూ వార్తలు వచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోలేదు. తనతో జీవితం కొనసాగించాలని కలలు కన్నాడు. చివరకు ఆ కల నిజం చేసుకున్నాడు. కానీ కలకాలం తనతో కలిసి ఉండాలనుకున్న కోరిక మాత్రం తీరలేదు. 2018 ఫిబ్రవరి 24న బోనీ కపూర్ను ఒంటరి చేస్తూ శ్రీదేవి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఈరోజు శ్రీదేవి వర్ధంతి కావడంతో బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నాడు. 'శ్రీదేవిని ఓ తమిళ సినిమాలో చూడగానే తనతో వెంటనే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. సోల్వా సావన్లో శ్రీదేవి గ్లామర్ రోల్ చేయనప్పటికీ తన పాత్ర నన్ను ఇంప్రెస్ చేసింది. తర్వాత తనను ఎలాగోలా కలిశాను. ఆమెతో మాట్లాడాక నాకు తెగ నచ్చేసింది. ఒక ఈవెంట్లో శ్రీదేవి తల్లిని కలిశా. అప్పుడు శ్రీదేవి రెమ్యునరేషన్ దాదాపు రూ.8 లక్షలు ఉండి ఉంటుంది. ఆమెతో సినిమా చేయాలని చెప్తే శ్రీదేవి తల్లి మాత్రం రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. నేను వెంటనే కుదరదని షాకిచ్చి ఆ వెంటనే రూ.11 లక్షలిచ్చి సర్ప్రైజ్ చేశాను. షూటింగ్స్కు తన వెంట వెళ్లేవాడిని. అలా తనకు మరింత దగ్గరయ్యాను. అప్పటికే నాకు ఓసారి పెళ్లైంది. భార్య మోనా శౌరీకి తనతో ప్రేమలో పడ్డానని, నా ఫీలింగ్స్ చెప్పాను. తనను వదులుకోలేనన్నాను. ఇకపోతే శ్రీదేవిపై ఎంతో కేర్ తీసుకునేవాడిని. అదే ఆమెను తిరిగి ప్రేమించేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు బోనీ కపూర్. కాగా బోనీ కపూర్.. నిర్మాత మోనా శౌరీని మొదటగా వివాహం చేసుకున్నాడు. 1996లో ఆమెకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు. వీరికి జాన్వీ, ఖుషీ కపూర్ జన్మించారు. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
చనిపోవడానికి ముందు శ్రీదేవి దిగిన చివరి ఫోటో ఇదే!
అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన తారలు అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అందులో స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణం కూడా ఒకటి. దుబాయ్లో బంధువుల ఫంక్షన్కు వెళ్లిన ఆమె 2018 ఫిబ్రవరి 24న బాత్రూమ్లో కిందపడి విగతజీవిగా మారింది. కోట్లాదిమంది అభిమానులను, భర్త బోనీ కపూర్, పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్లను దుఃఖ సాగరంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. రేపు శ్రీదేవి వర్ధంతి. ఈ సందర్భంగా బోనీ కపూర్ శ్రీదేవి మరణానికి ముందురోజు చివరగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో అందంగా రెడీ అయిన శ్రీదేవి కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. కల్మషం లేని చిరునవ్వు ఆమె పెదాలపై అలాగే నిలిచి ఉంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు 'శ్రీదేవికి మరణం లేదు, మా గుండెల్లో తను చిరస్థాయిగా నిలిచిపోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) చదవండి: అమెరికన్ పాపులర్ షోలో చరణ్ -
తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయిన జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ధడక్సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఆమె గుంజన్ సక్సెనా ది కార్గిల్ గాళ్ చిత్రంతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జాన్వీకపూర్ తాజాగా తల్లి శ్రీదేవిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ను షేర్చేసింది. 'ఇప్పటికీ నీకోసం ప్రతిచోటా వెతుకున్నాను అమ్మా. నేను చేసే ప్రతి పని నిన్ను గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ప్రతి పని నీతోనే మొదలవుతుంది, నీతోనే ముగుస్తుంది' అంటూ జాన్వీ తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి సుమారు ఐదు సంవత్సరాలు కావొస్తుంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్లో అనుమానాస్పదంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
శ్రీదేవి శోభన్ బాబు ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆమె నా ఆల్టైమ్ ఫేవరేట్ హీరోయిన్: మెగాస్టార్
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ఓటీటీ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోనీలివ్లో ప్రసారమయ్యే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్గా పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా.. తొలి ఎపిసోడ్లో చిరంజీవి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ షో లో పాల్గొన్న మెగాస్టార్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోని కొంతమంది నట దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో మెగాస్టార్తో స్క్రీన్ పంచుకున్నవారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. వాటి గురించి మెగాస్టార్ వివరించారు. సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్ఫెక్ట్ అని తెలిపారు. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్ఫుల్గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. దివంగత శ్రీదేవి గురించి మాట్లాడుతూ..' ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మోసగాడు', 'ఎస్పీ పరశురామ్' లాంటి సూపర్ హిట్ సినిమాలు చేయగలిగా.' అని అన్నారు మెగాస్టార్. -
పుస్తకంగా రానున్న శ్రీదేవి జీవిత చరిత్ర
దివంగత నటి శ్రీదేవిని ఎవరూ అంత తొందరగా మరచిపోరు. భారతీయ సినీ చరిత్రలో చెరగని ఒక పేజీ ఆమె పేరు. అందం, అభినయం కలిస్తే శ్రీదేవి. బాల నటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె ఆ తరువాత కథానాయకిగా మారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సూపర్స్టార్గా రాణించారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300లకు పైగా చిత్రాలు చేశారు. ప్రముఖ నటులందరితోనూ నటించారు. ఈమె నటనకు గానూ పద్మశ్రీ నుంచి పలు జాతీయ, రాష్ట్రీయ, ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. అలాంటి శ్రీదేవి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె జీవిత చరిత్ర ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. శ్రీదేవి కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్ ఆమె బయోగ్రఫిని ‘‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’’ పేరుతో పుస్తకంగా రచించారు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకపూర్ బుధవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో శ్రీదేవికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. దీన్ని ఈ ఏడాది చివరిలో వెస్ట్ల్యాండ్ బుక్ సంస్థ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా శ్రీదేవి బయోగ్రఫీని చిత్రంగా చేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా శ్రీదేవి బయోగ్రఫీలో నటించాలని పలువురు అగ్ర నటీమణులు ఆశపడుతున్నారు. కాగా ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్ పుస్తకం విడుదల అనంతరం శ్రీదేవి బయోపిక్ తెరకెక్కే అవకాశం ఉంటుందేమో చూడాలి. We are thrilled to announce that we will be publishing @AuthorDhiraj’s definitive biography of Sridevi—an iconic superstar and true legend. Out in 2023! pic.twitter.com/JVgaeYFR73— Westland Books (@WestlandBooks) February 8, 2023 చదవండి: పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషలు మాట్లాడాలి: శివ రాజ్కుమార్ -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. బొంతు శ్రీదేవి కంటతడి
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్లో మరో వర్గపోరు బయటపడింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ నడుమ వివాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలో సోమవారం ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ఎదుట.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. తన డివిజనల్లో తనకు తెలియకుండానే.. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ‘‘నేను మాత్రం ఊరుకునేది లేదు. మూడేళ్లు ఊరుకున్నా. ఇక ఊరుకోను. ఈసారి సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పదివేలు పడేస్తే.. చంపేస్తారంటూ బెదిరిస్తున్నారు. నా సత్తా ఏంటో కూడా చూపిస్తా’’ అంటూ ఆమె సవాల్ విసిరారు. కులం పేరుతో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఎమ్మెల్యే సుభాష్రెడ్డిపై ఆరోపిస్తూనే.. బీసీ సంఘాలు ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి కలిసి ఫిర్యాదు చేస్తానని బొంతు శ్రీదేవి చెప్పారు. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి సీరియస్ ఇదిలా ఉంటే.. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి. ఉప్పల్లో గత కొంతకాలంగా బొంతు, బేతి వర్గాల నడుమ విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా.. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శ్రీదేవి చేసిన అసత్య ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని సుభాష్రెడ్డి ప్రకటించారు. ఇదీ చదవండి: ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు -
'హైదరాబాద్తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా'
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు ఆమె.. అమ్మతో పోటీ పడే సౌందర్యం..అమ్మలాగే రాణించాలనే తపన.. అందుకు తగ్గట్టు అంకితభావం.. బాలివుడ్లో అరంగేట్రం చేసిన దగ్గర్నుంచీ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న స్టార్ డాటర్... ‘జాన్వీ కపూర్’..నగరం వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా జాన్వీ ‘సాక్షి’తో ముచ్చటించింది. బాలీవుడ్లో చేస్తున్నప్పటికీ నేనెప్పుడూ దక్షిణాది అమ్మాయినేనంటూ తను పంచుకున్న కబుర్లు ఆమె మాటల్లోనే... సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీతో ఎన్నో అందమైన జ్ఞాపకాలున్నాయి. సిటీలో నాన్న బోనీ కపూర్ సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు ఎక్కువగా వచ్చాను. ఇక్కడ షూటింగ్ అయిపోగానే నేరుగా తిరుపతి వెళ్లడం అలవాటు. ప్రస్తుతం ఇక్కడ సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఎంతో మార్పు వచ్చింది. విశిష్టమైన సంస్కృతి ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి అనుబంధం ఉన్న నగరానికి చాలా కాలం తరువాత వచ్చి టాప్ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్తో కలిసి బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చింది. దేశమంతా దక్షిణాది వైపే చూస్తోంది... ప్రస్తుతం దేశమంతా దక్షిణాది సినిమాల వైపే చూస్తుంది. నా వారసత్వపు మూలాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. అందుకే నేనెక్కడున్నా, ఏ సినిమాలు చేస్తున్నా దక్షిణాది అమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను. అమ్మ తెలుగులో మరుపురాని సినిమాల్లో నటించి ఇక్కడ ఆరాధ్యనటి అయింది. నాకు కూడా టాలీవుడ్లో మంచి ప్రాజెక్ట్ చేయాలనుంది. మంచి కథలకు, దర్శకులకు ఇక్కడ కొదవలేదు. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తాను. దక్షిణాది సినిమాలు, ఇక్కడి సంస్కృతి గురించి ఎక్కడైనా గొప్పగా విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా... సినిమాల వల్ల మాత్రమే వచ్చే గౌరవం, నమ్మకం చాలా ప్రత్యేకమైనవి.ఒక సినిమాతో మరో సినిమాను పోల్చలేం. దేనికదే ప్రత్యేకతను కలిగిఉంటాయి. కళపైన మక్కువ, నిరంతర కృషి, అంకితభావం మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయని గట్టిగా నమ్ముతాను. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న నా తదుపరి సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాలో పాత్రను ఛాలెంజింగ్గా చేస్తున్నాను. దీని కోసం క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ క్రమంలో నా రెండు భుజాలకు గాయాలు కూడా అయ్యాయి. చదవండి: (Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది) అమ్మే ఫ్యాషన్ గురు.. వ్యక్తిగతంగా ఎలాంటి ఫ్యాషన్ అనుకరించాలి, ఏ విధమైన దుస్తులు ధరించాలనే విషయాల్లో సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను. అమ్మకు ఫ్యాషన్పైన మంచి పట్టుండేది. నా సోదరి ఖుషీనీ, నన్ను అందంగా తయారు చేయడంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేది. అధునాతన ఫ్యాషన్ పైన ఎన్నో సలహాలను అందించేది. నా చర్మం చాలా సున్నితమైనది, అందుకే దానికి తగిన ఫ్యాబ్రిక్ మాత్రమే వాడుతాను. సింథటిక్కు దూరంగా ఉంటాను. ప్రస్తుతం ఏదైనా సలహా తీసుకోవాలన్నా, ఏదైనా పంచుకోవాలన్నా చెల్లి ఖుషీకే ప్రాధాన్యతనిస్తాను. -
Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్లో పెద్ద కూతురు జాన్వీ కపూర్ అనే విషయం తెలిసిందే. శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ తడక్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా.. అనుకున్న స్థాయిలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోలేక పోయింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటించిన కొన్ని మంచి కథా చిత్రాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెతో పాటు అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తన గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ జాన్వీ కపూర్ మాత్రం ట్రెండింగ్లోనే ఉంది. ఇటీవల రూ.70 కోట్లతో కొత్త ఇల్లు కొనుగోలు చేసిందనే ప్రచారం హోరెత్తుతోంది. మరో పక్క ఈ బ్యూటీ దక్షిణాదిలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నా, అలాంటి అవకాశం సెట్ అవ్వడం లేదు. కాగా తాజా ఆమె మాట్లాడుతూ.. వారసత్వ ముద్ర వేయడం తనకు భారంగానే అనిపిస్తోందన్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తనను సినీ వారసురాలనే ప్రచారం చేయడం మనసుకు బాధ కలిగిస్తోందన్నారు. కరణ్ జోహార్ మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్నారని, తన సంస్థ చిత్రాల్లో నటించడం అదృష్టంగా జాన్వీ కపూర్ పేర్కొంది. చదవండి: (Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే..) -
అతిలోక సుందరి శ్రీదేవి ఇల్లు చూశారా? ఇంద్రభవనంలా ఉంది..
అలనాటి అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్న ఆమె 54 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాక ఎంతో కష్టపడి, ఇష్టపడి చెన్నైలో మొట్టమొదటిసారిగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇల్లు అంటే తనకు ఎంతో ఇష్టమని స్వయంగా శ్రీదేవి పలు సందర్భాల్లో చెప్పింది. తాజాగా చెన్నైలోకి ఆ ఇంటికి వెళ్లిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన హోంటూర్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న జాన్వీ.. తన తల్లిదండ్రుల పెళ్లి ఫోటోను చూపిస్తూ.. 'వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అందుకే ఈ ఫోటోల్లో ఇద్దరూ ఒత్తిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన బెడ్రూమ్లో బాత్రూమ్కి గడియ ఉండదని చెప్పిన జాన్వీ ఇందుకు గల కారణాన్ని కూడా రివీల్ చేసింది. 'నేను బాత్రూమ్లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడతానేమో అని అమ్మ భయపడేది. అందుకే నా బాత్రూమ్కి లాక్ పెట్టించలేదు. ఇప్పటికే ఇంటికి మరమత్తులు చేసినా నా బాత్రూమ్కి మాత్రం లాక్ పెట్టించలేదు' అంటూ జాన్వీ సీక్రెట్ను రివీల్ చేసింది. మరి శ్రీదేవి లాగే ఎంతో అందమైన ఆమె ఇంటిని మీరూ చూసేయండి. -
ఆ ఘటనతో అమ్మ ఒక్కసారిగా షాక్కు గురైంది: జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. 2019 మలయాళంలో హిట్ అయిన హెలెన్కి హిందీ రీమేక్ మూవీని తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ చిట్ చాట్లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఇటలీలో శ్రీదేవికి ఎదురైన ఓ ఘటనను పంచుకున్నారు. గతంలో శ్రీదేవి ఇటలీలో ఫర్నీచర్ షాపింగ్ చేయడానికి వెళ్లినట్లు జాన్వీ కపూర్ వెల్లడించారు. చెన్నైలోని తమ ఇంటికి ఫర్నీచర్ కోసమని తన ఫ్రైండ్తో కలిసి వెళ్లిన సమయంలో ఒక ఇటాలియన్ వ్యక్తి ఆమెకు సైట్ కొట్టాడని తెలిపింది. ఈ ఘటనతో మా అమ్మ షాక్కు గురైందని పేర్కొంది. ఆ కుర్రాడి ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన శ్రీదేవి ఫ్రైండ్ ఈ విషయాన్ని బోనీ కపూర్కు ఫోన్ చేసి వివరించినట్లు పేర్కొంది. కాగా.. శ్రీదేవి, బోనీ కపూర్ హనీమూన్ ఇటలీలోనే జరిగినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం రాజ్కుమార్ రావుతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహితో సహా పలు ఇతర ప్రాజెక్ట్ల్లో నటిస్తోంది. -
అమ్మ ఆరోగ్యానికి రిస్క్..అయినా నాన్న పట్టించుకోలేదు: జాన్వీ
దక్షిణాది సినిమాల్లో సత్తా చాటిన అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ను ఓ ఊపు ఊపేశారు. స్టార్ హీరోయిన్గా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలతో జనాలను అలరించారు. అయితే మాంసాహారిగా ఉన్న ఆమె బోనీ కపూర్ వల్ల శాఖాహారిగా మారిందట. డాక్టర్లు రిస్క్ అని హెచ్చరించినా ఆమె మాంసం ముట్టలేదట. తాజాగా ఈ విషయాన్ని శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్ వెల్లడించింది. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇది చాలాకాలం క్రితం జరిగింది. నాన్న సిగరెట్లు ఎక్కువగా తాగేవాడు. నేను, ఖుషి పొద్దున్నే లేచి సిగరెట్ ప్యాకెట్లు వెతికి నాశనం చేసేవాళ్లం. సిగరెట్లను కత్తిరించేయడమో, వాటిని ఓపెన్ చేసి టూత్పేస్ట్ రాయడమో చేసేవాళ్లం. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన తన అలవాటు మానుకోలేదు. ఈ విషయంలో అమ్మ.. నాన్నతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది. నాన్న సిగరెట్లు మానేసేవరకు మాంసం ముట్టుకోనని శపథం చేసింది. కానీ అమ్మ చాలా వీక్గా ఉందని, మాంసం తినకపోతే ఇబ్బంది అవుతుందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా అమ్మ వినిపించుకోలేదు. నాన్న బతిమిలాడినా తన పట్టు విడవలేదు. చివరాఖరకు ఇప్పుడా విషయాన్ని గుర్తు చేసుకుని నాన్న బాధపడుతున్నాడు. తన కోసం ఇప్పుడైనా పొగ తాగడం మానేస్తానన్నాడు' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. కాగా శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న మరణించిన విషయం తెలిసిందే! చదవండి: రెచ్చిపోయిన ఉర్ఫీ జావెద్, కేసు నమోదు గీతూ ఓవరాక్షన్, మండిపడ్డ హౌస్మేట్స్ -
నా బిడ్డను ఆమెతో పోలుస్తారా.. అడ్డుకున్న బోనీ కపూర్
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిలి'. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్లుక్ ఈ మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మలయాళ సినిమా హెలెన్కు హిందీ రీమేక్గా వస్తోంది. ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె తండ్రి బోనీ కపూర్తో కలిసి పాల్గొన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా వ్యక్తి జాన్వీ కపూర్ను శ్రీదేవితో పోల్చడాన్ని బోనీ కపూర్ అడ్డుకున్నారు. నా బిడ్డను శ్రీదేవితో పోల్చవద్దంటూ సూచించారు. (చదవండి: ఉత్కంఠ రేపుతున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..) బోనీ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన శైలిని కలిగి ఉంటారు. అందులో శ్రీదేవి ఒకరు. జాన్వీ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటుంది. శ్రీదేవిని దాదాపు 150-200 సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. కానీ నా కుమార్తె ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభించింది. దయచేసి అమ్మతో ఆమెను పోల్చవద్దు.' అని అన్నారు. జాన్వీ కపూర్ మిలి ట్రైలర్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, ఆమె సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మిలి ట్రైలర్ను ప్రస్తావిస్తూ జాన్వీ కపూర్ టీమ్కి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ఆమె నటనను ప్రశంసించారు. నా చెల్లెలు చాలా గొప్ప పనులు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.' అన్నారు. జాన్వీ కపూర్ మిలితో పాటు స్టార్ కిడ్ రాజ్కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె క్రికెట్తో ముడిపడి ఉన్న ఓ సినిమా కోసం ప్రిపరేషన్లో బిజీగా ఉంది. వరుణ్ ధావన్తో కలిసి బావాల్ మూవీలో కూడా కనిపించునుంది. -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్గానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే..
అతిలోక సుందరి, దివంగ నటి శ్రీదేవి చీరలను వేలం వేస్తున్నారు. ఆమె నటించిన ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా తనదైన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆమె. 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో నటనకు విరామం చెప్పారు.ఆ తర్వాత 2012లో ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. చదవండి: ట్రెండింగ్లో బాయ్కాట్ ఆదిపురుష్.. ‘బాలీవుడ్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’ ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 10వ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఇంగ్లిష్ వింగ్లిష్లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించారు. అమెరికా వెళ్లిన ఆమె ఇంగ్లిష్ రాక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ తర్వాత ఇంగ్లిష్లో ఎంతటి ప్రావీణ్యం పొందారనేదే కథ. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే! -
Tollywood Actresses: వెండితెరపై నారీమణుల విశ్వరూపం
సినిమాని తీసే తీరులో మార్పొచ్చింది. చూసే విధానంలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. బడ్జెట్ పెరిగింది. క్రియేటివిటీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. కానీ హీరోయిన్ని గ్లామర్ డాల్గా చూసే పద్ధతిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరుకుతుంది. అప్పుడు వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తే దశాబ్దాల పాటు ఆ నటనని ప్రేక్షకులు గుర్తు చేసుకుని మరీ ఆనందిస్తారు. అభినందిస్తారు. ఫెర్ఫా మెన్స్ స్కో ప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే అదరహో అనేలా ఆ పాత్రకి జీవం పోసిన హీరోయిన్స్ని ఒకసారి చూసేద్దామా? అందం అభినయం. ఇవి రెండు కలిస్తే శ్రీదేవే. గ్లామర్ యాంగిల్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో యాక్టింగ్ పరంగా అంతకు మించిన పేరుంది. అయినానిజానికి నటనపరంగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం చాలా సినిమాల్లో శ్రీదేవికి లభించింది. అయితే... వసంత కోకిల చిత్రంలో పోషించిన విజయ పాత్ర శ్రీదేవి నటజీవితంలోనే మైలు రాయి. ఆరు ఏళ్ల వయ స్సు పిల్ల మైండ్లో ఉన్న ఇరవై ఏళ్ల యువతిగా అద్భుతంగా నటించింది శ్రీదేవి. హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి సౌందర్య. ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు. కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. కానీ అక్కడ ఉన్నది సౌందర్య. ఇక చెప్పేదేముంది వెండితెర మీద విశ్వరూపమే చూపించింది. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్న పేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భు తంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీనరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. గర్వం, పొగరు ఉన్న జమీందారు కూతురు పాత్రలో జీవించేసింది రమ్యకృష్ణ. తనదైన నటనతో నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది. ఛాలెంజింగ్ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు మంచు లక్ష్మీ పేరుని మిస్ అవడానికి వీల్లేదు కదా. గుండెల్లో గోదారి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాల్లో మంచు లక్ష్మీ పెర్ఫామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గోదావరి యాసలో డైలాగ్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో ముసలమ్మగా డీగ్లామరైజ్ రోల్ బాగా యాక్ట్ చేసింది. చదవండి: నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో -
సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడి
సిద్దిపేటరూరల్: సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తోర్నాల పరిశోధ స్థానం శాస్త్రవేత్తలు అన్నారు. తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం దత్తత గ్రామం ఇబ్రహీంపూర్లో ఉత్తమ సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ నిర్వహించారు. శాస్త్రవేత్త, హెడ్ డా.ఎస్.శ్రీదేవి వ్యవసాయ, ఉద్యాన పంటల్లో పోషకాలపై వివరించారు. పంటల్లో చీడపీడల నివారణకు రసాయన మందులను కాకుండా సేంద్రియ మందులు వాడాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చీడపీడలను నివారించుకునేందుకు దీపపు ఎరలు, లింగాకర్షణ బుట్టలు, జిగురు పూసిన ఎరలను వాటి ప్రాముఖ్యతను వివరించారు. పంటల్లో ఎలా అమర్చుకోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సాయినాథ్, ఎ.సరిత, ఉమారాణి, శ్వేత, డా.పల్లవి, ప్రొఫెసర్ సతీష్, సర్పంచ్, ఆర్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ కె.నగేష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
అదరగొడుతున్న బేతంచెర్ల చిన్నారి.. బింబిసారలో శార్వరిగా
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): చిన్న వయస్సులోనే బుల్లి తెరతోపాటు వెండి తెరపై రాణిస్తూ ప్రతిభ చాటుకుంటోంది బేతంచెర్లకు చెందిన శ్రీదేవి. సీరియల్స్, సినిమాల్లో చక్కన నటన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 10 సినిమాలు, 15 టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులో తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తోంది. ఈటీవీలో ప్రారంభమైన యమలీల తరువాత సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె కావడం గమనార్హం. శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమలో స్థిరపడి కంజుల ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్గా పనిచేస్తున్నాడు. పలు సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి. ఈ చిన్నారి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. నటించే అవకాశం ఇలా.. శ్రీహరి గౌడ్ 18 సంవత్సరాలుగా సినీరంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. జీ తెలుగు వారు పున్నాగ టీవీ సిరియల్స్ తీస్తున్న నేపథ్యంలో చిన్నారి పాత్ర అవసరం ఉండటంతో తన కూతురు శ్రీదేవిని వారికి పరిచయం చేశాడు. మొదట పున్నాగ సిరియల్స్లో కథానాయకుల కుమార్తెగా, కథనాయికల కుమార్తెగా నటించే అవకాశం దక్కింది. కెమెరా ముందు ఎలాంటి బెరుకు, తడబాటు లేకుండా ఆయా సన్నివేశాల్లో చక్కగా నటించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఆ సీరియల్లో నటిస్తుండగానే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కళ్యాణ వైభోగం ఇలా 15 టీవీ సీరియల్స్లో నటించే ఆఫర్స్ వచ్చాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రీదేవి బాలనటిగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న సరికొత్త ధారావాహిక యమలీల, ఆ తరువాత బాలనటిగా పలు పాత్రలను పోషిస్తోంది. సీరియల్స్లోనే కాకుండా సీని రంగంలోనూ నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో బాలనటిగా నటించింది. కథనాయిక పాయల్ రాజ్పుత్ చిన్నప్పటి పాత్రలో శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత సూపర్మచ్చి సినిమాలో రాజేంద్రప్రసాద్ కుమార్తెగా రాణించింది. అడవి శేషు నటించిన మేజర్, రవితేజ నటించిన రామారావు అన్డ్యూటీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో శార్వరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా చిత్రాల్లో బాలనటిగా రాణిస్తూ సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోది. మరికొన్నింట్లో అవకాశం శ్రీదేవి నటన, అభినయానికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటివరకు నటించిన సినిమాలు, సీరియల్స్ కాకుండా మరికొన్నింటిలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో శ్రీదేవి నటించనున్నట్లు తండ్రి శ్రీహరి గౌడ్ తెలిపారు. సినిమా రంగంతో పాటు టీవీ ప్రకటనల్లోనూ నటిస్తూ బేతంచెర్ల కీర్తి ప్రతిష్ఠలు చాటుతోంది. -
రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా ఇక లేరన్న వార్త అటు స్టాక్మార్కెట్ నిపుణుల్ని, ఇటు ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కేవలం 5 వేల రూపాయలతో స్టాక్మార్కెట్లో పెట్టుబడిదారుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఝున్ఝున్వాలా ప్రస్తుత నికర విలువ 5 బిలియన్ల డాలర్లకుపై మాటే అంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిమార్కెట్ నిపుణిగా రాకేష్ సక్సెస్ఫుల్ జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకం. ఏ స్టాక్పై ఇన్వెస్ట్ చేయాలో, దాని ఫండమెండల్స్ ఏంటో అలవోకగా చెప్పగల సామర్థ్యం అతని సొంతం. స్నేహితుల ద్వారా స్టాక్ మార్కెట్పై పెంచుకోవడమే కాదు, లాభాలను అంచనా వేయడంలో పెట్టుబడిలో, రిస్క్ తీసుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. కేవలం సంపదను ఆర్జించడమే కాదు, సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వానికి వినియోగించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఇంగ్లీష్ వింగ్లీష్ రాకేష్ ఝున్ఝున్వాలా బాలీవుడ్ సినిమాల పట్ల చాలా అభిమానం. ఈ నేపథ్యంలో మూడు బాలీవుడ్ సినిమాలను నిర్మించారు. ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్,కి అండ్ కా అలాగే 1999లో మరో నలుగురు భాగస్వాములతో కలిసి హంగామా డిజిటల్ మీడియాను కూడా ప్రారంభించారు. ఇదే తరువాత హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.గా మారింది. ప్రస్తుతం దీనికి ఆయన కంపెనీ ఛైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా 'ఇంగ్లీష్ వింగ్లీష్' తో భారీ విజయం సాధించారు. గౌరీ షిండే దర్శకత్వంలో 2012లో దివంగత అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రగా ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీని నిర్మించారు.10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 102 కోట్లను వసూళ్లతో భారీ ఆర్థిక విజయాన్ని సాధించింది. అంతేకాదు 2012 గౌరీ షిండే ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును గెలుచు కున్నారు. అంతేనా ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు కోసం ఇండియానుంచి అధికారిక ఎంట్రీగా షార్ట్లిస్ట్ అయింది. అనేక అంతర్జాతీయ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. శ్రీదేవి "మెరిల్ స్ట్రీప్ ఆఫ్ ఇండియా", "భారత మహిళా రజనీకాంత్"గా ప్రశంసలు దక్కించుకోవడం మరో విశేషం. అతను చైనీస్ వంటకాలను ఎక్కువగా ఆస్వాదించే పెద్ద ఆహారప్రియుడు కూడా. కుకింగ్ షోలను చూసి ఎక్కువ ఆనందించే వారట. సామాన్యుడికి విమాన సేవల్ని అందించాలన్న లక్క్ష్యంతో ఆకాశ విమానయాన సంస్థను స్థాపించారు. ఆగస్ట్ 7న తన సేవలను కూడా ప్రారంభించింది. సీఎన్బీసీ టీవీతో చివరిగా మాట్లాడిన ఆయన "భారతదేశం ఒక స్వర్ణకాలంలోకి అడుగుపెట్టబోతోంది,10 శాతం వృద్ధిని సాధిస్తుంది’’ అని రాకేష్ అంచనా వేశారు. కానీ ఇంతలోనే కిడ్నీ వ్యాధి, ఇస్కీమిక్ గుండె జబ్బుతో అనారోగ్యానికి గురైన ఆయన 62 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేశి తనయ జాన్వీ కపూర్ తల్లిని తలుచుకుని ఎమోషనలైంది. తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్రీ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ పాజిటివ్ టాక్తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్ నేపథ్యంలో జాన్వీ తాజాగా ఓ చానల్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా జాన్వీ తల్లితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ అమ్మ లేకుండ జీవించడం చాలా కష్టంగా ఉందంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ ఇంటర్య్వూలో తన తల్లికి, తనకు ఉన్న పోలికను గురించి జాన్వీకి ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడేందుకు జాన్వీ కాస్తా బెరుకు చూపించింది. ‘అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు గర్వం అంటున్నారు. అందుకు తన గురించి మాట్లాడాలంటే భయమేస్తుంది. తను గురించి ఏం చెప్పిన నా తన సినిమాలతో నా మూవీస్ను పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెలా ఉండటం కాదు నటనలో కూడా మీ తల్లి పేరు నిలబెట్టు అంటూ కామెంట్స్ చేస్తున్నారు’ అని చెప్పింది. చదవండి: మళ్లీ గ్రామీణ కథ అనగానే.. భయపడ్డా: కార్తీ అయితే ‘అదే ఇప్పుడు అమ్మ ఉండుండే ఈ ప్రశ్నకు చాలా సౌకర్యంగా సమాధానం చెప్పేదాన్ని. తనకు నాకు చాలా విషయాల్లో పోలిక ఉన్నా కూడా ఇప్పుడు వాటి గురించి చెప్పలేకపోతున్నా’ అంటూ జాన్వీ వాపోయింది. కాగా జాన్వీని తెరపై చూడాలన్న తన కోరిక తిరకుండానే శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. జాన్వీ తొలి చిత్రం ‘ధడఖ్’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో 2014లో దుబాయ్లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు వెళ్లగా అక్కడ శ్రీదేవి మృతి చెందారు. -
హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్
సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చూసి.. జీవితం అంటే అలా ఉండాలి అనుకుంటారు సాధారణ వ్యక్తులు. కానీ, అనుకున్నంత సులభంగా, సౌకర్యవంతంగా సినీ తారల జీవితం ఉండదు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 'దఢక్' సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ భామ తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. అలాగే వాళ్ల అమ్మ చెప్పిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ''నిజానికి ప్రతి క్షణం అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేపేది. అమ్మ ముఖం చూడకుండా నా రోజువారీ పనులు ప్రారంభించేదాన్ని కాదు. అలాటంది ఇప్పుడు అమ్మ లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అని తెలిపింది. 'ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?' అని అడిగిన ప్రశ్నకు.. ''మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొద్దనే చెప్పింది. 'నా జీవితం మొత్తం చిత్రపరిశ్రమతోనే గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకుంటున్నట్లుగా స్టార్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటీ?' అని అమ్మ ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను హీరోయిన్గా చేయడం నాకిష్టమని చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి కాదనలేక ఆమె ఒప్పుకున్నా.. 'నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కొంతమంది చేసే వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది' అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది'' అని జాన్వీ కపూర్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. అనంతరం తన సినిమాలు, నటనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ 'నేను శ్రీదేవి కూతురు కావడం వల్లే నాకు ఎక్కు విమర్శలు వస్తున్నాయి. నా మొదటి నాలుగు సినిమాలను ఆమె 300 చిత్రాలతో పోల్చి చూస్తున్నారు. నేను ఆమెలా నటించలేకపోవచ్చు. కానీ ఈ వృత్తిని ఆమెకోసం చేయాలనుకుంటున్నాను. నేను ఆమెను గర్వపడేలా చేయకుండా అలా వదిలేయలేను' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. -
సౌత్ సినిమాలు వస్తే అసలు వదులుకోను: జాన్వీ కపూర్
సినిమా అంశాలు, గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ జాన్వీ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసిన జాన్వీ కపూర్, తడక్తో హీరోయిన్గా పరిచయం అయ్యింది. తొలి ప్రయత్నంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు ఆశించినంత సక్సెస్ కాలేదు. తమిళంలో నయనతార నటించిన హీరోయిన్ కోలవవు కోకిల చిత్రాన్ని జాన్వీ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. గుడ్ లక్ జెర్రీ పేరుతో రపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా, థియేటర్లలో విడుదల కాలేదన్న బాధ ఈ అమ్మడికి ఉందట. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో తల్లి శ్రీదేవి చేసిన సినిమాలను రీమేక్ చేస్తారా అని ప్రశ్నించగా అంతటి సాహసం చేయలేనని పేర్కొంది. తన తల్లి ప్రతి సినిమాలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుందని తెలిపింది. ఇక దక్షిణాది సినిమాల్లో నటించడానికి తాను వెయిటింగ్ అని, మంచి ఆఫర్స్ వస్తే అసలు వదులకోనను చెప్పింది. చదవండి: విజయ్ దేవరకొండపై శ్రీదేవి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ
దివంగత నటి శ్రీదేవి (Sridevi) అందానికి అడ్రస్ లాంటివారు. అందుకే ఆమెను అతిలోక సుందరి అంటారు. ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్కి వెళ్లిన ఆమె అందానికి, అభినయానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె అందాన్ని వారసత్వంగా తీసుకున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ప్రస్తుతం బాలీవుడ్లో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ ఒక బ్యూటీ సీక్రెట్ను పంచుకుంది. అది కూడా వాళ్ల అమ్మ (శ్రీదేవి) చెప్పిన రహస్యమట. తాను ఇంత అందంగా మిలమిల మెరిసిపోవడానికి కారణం ఆమె తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్ అని చెప్పుకొచ్చింది. 'మా అమ్మ.. బ్రేక్ఫాస్ట్లో తినగా మిగిలిపోయిన పళ్ల ముక్కలతో అప్పటికప్పుడే అక్కడికక్కడే మొహానికి మసాజ్ చేసుకుని ప్యాక్లా వేసుకునేది. ఓ పదిహేను నిమిషాలు ఆగి కడిగేసేది. అప్పుడు చూడాలి అమ్మ మొహం.. మిలమిల మెరిసిపోయేది. ఇప్పుడు నేనూ అదే ఫాలో అవుతున్నా. బ్రేక్ఫాస్ట్లో మిగిలిపోయిన పళ్ల ముక్కలే నా బ్యూటీ సీక్రెట్' అని జాన్వీ కపూర్ తెలిపింది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ 'గాడ్ ఫాదర్' షూటింగ్.. చిరంజీవి, సల్మాన్ ఫొటో లీక్ కాగా జాన్వీ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' మూవీ నేరుగా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జులై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించి హిట్ కొట్టిన తమిళ చిత్రం 'కోలమావు కోకిల'కు రీమేక్గా తెరకెక్కింది. హిందీలో మాత్రం బాలీవుడ్ నేటివిటీకి తగినట్లు స్టోరీలో మార్పు చేశారని ఇటీవల జాన్వీ తెలిపింది. ఈ చిత్రానికి డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్త దర్శకత్వం వహించారు. చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్ -
Nagin Dance: నడిరోడ్డుపై శ్రీదేవీ పాటకు నాగిని డ్యాన్స్తో రచ్చ రచ్చ
Nagin Dance On Truck Horn: పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామెతకు కొందరు యువకులు తగిన న్యాయం చేశారు. రోడ్డుపై నాగిని డ్యాన్స్లు చేస్తూ కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బైక్ రైడర్స్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నాగిని డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నార్త్ కర్నాటకలో కొందరు బైక్ రైడర్లు రోడ్డుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ హారన్ నాగిన్ డ్యాన్స్కు సంబంధించింది. దీంతో, బైకర్లు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో డ్రైవర్ను సాంగ్ పెట్టమని సైగలు చేశారు. అదే జోష్లో ట్రక్కు డ్రైవర్.. శ్రీదేవి నటించిన 'నాగీనా'లోని "మెయిన్ తేరీ దుష్మాన్" సాంగ్ను ప్లే చేశాడు. దీంతో, రైడర్లు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. मजे है जैसे में आप ले पाओ वैसे लो 🤣#BachelorNation #party #nagindance pic.twitter.com/d0z9zvYsc1 — नटखट निड 🚩 (@natkhatnids) July 12, 2022 ఇది కూడా చదవండి: లైవ్లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్.. ఎట్టకేలకు ఆమె స్పందన -
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా రాజీవ్సాగర్
సాక్షి, హైదరాబాద్: స్త్రీ, శిశు, వికలాంగ, వయోజన సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా మేడె రాజీ వ్సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్ గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం ఆదేశాల మేరకు రెండేళ్ల పదవీ కాలంతో వీరి నియామకాలను ప్రకటిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. ►సూర్యాపేట జిల్లాకు చెందిన మేడే రాజీవ్సాగర్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశారు. 2006–2008 వరకు తెలం గాణ జాగృతి కోశాధికారిగా, 2008 నుంచి 2014 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ►కామారెడ్డికి చెందిన మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్, బీఏ, ఎల్ఎల్బీ చదివారు. టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇదివరకు రెండు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ గా, టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్గా పదవులను నిర్వహించారు. ►మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన శ్రీదేవి బీఎస్సీ చదివారు. -
అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం
గుంటూరు మెడికల్: అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఫీల్డ్ ఆపరేషన్స్ సర్వీసెస్ జేఈవో డాక్టర్ శ్రీదేవి అన్నారు. సోమవారం గుంటూరు జీజీహెచ్లో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాగళ్ల జయరామకృష్ణ అధ్యక్షతన ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఎంఎల్హెచ్పీలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2,446 జబ్బులకు, 1,973 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తోపాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ట్రస్టు పీఎంయూ జీఎం అంకయ్య, నరసరావుపేట ఆరోగ్య కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.సునీల, జిల్లా మేనేజర్ సి.హెచ్.రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
విధి మా కలలను నాశనం చేసింది.. బోనీ కపూర్ ఎమోషనల్
Sridevi Death Anniversary: Boney Kapoor Pens Emotional Post: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అకాల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఎన్నో అనుమాల మధ్య శ్రీదేవి మరణాన్ని నిర్ధరించారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి నటన, అందం, అభినయాన్ని సినీలోకం గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఎవర్ గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి గురువారం కావడంతో ఆమె ఙాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వెనిస్లో బోనీ కపూర్ శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగమైన కోట్స్ రాశాడు. 'మేము సెప్టెంబర్ 7, 2008న మిలన్ నుంచి వెనిస్కు వెళ్లాం. ఆ నగరంలో కొన్ని గంటలు మాత్రమే గడిపాం. మేము వెనిస్ని మళ్లీ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ మా ప్రణాళికలను విధి తిరస్కరించింది.' అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేశాడు బోనీ కపూర్. అలాగే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గతంలో తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
హీరోలకు సమానంగా శ్రీదేవి పారితోషికం.. ఆ సినిమాలో ఎంతంటే ?
Chiranjeevi Sridevi Remuneration In Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి నటనలో, అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అందం, అభినయంలో ఎవరికీ వారే సాటి. వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అద్భుతమైన క్లాసిక్ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమాతోనే శ్రీదేవికి 'అతిలోక సుందరి' అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం సినీ అభిమానులను అబ్బురపరిచింది. ఒక అందమైన లోకంలో విహరించేలా చేసింది. 1990 మే 9న విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి రూ. 15 కోట్లు వసూలు చేసింది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాను ఆ సమయంలో రూ. 9 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మించారట. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అందులో నటీనటుల రెమ్యునరేషన్ గురించి చెబుతూ చిరంజీవికి సుమారు రూ. 35 లక్షలు, శ్రీదేవికి రూ. 25 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవికి ఫుల్ క్రేజ్ ఉందని, హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేదన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందని, కానీ ఆచరణలోకి ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఈ సినిమాలో సుందరం మాస్టారు, ప్రభుదేవా కొరియోగ్రఫీతో పాటు మాస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా హైలెట్గా నిలిచాయి.