'కల్కి' టికెట్ల ధరలు భారీగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి | AP Government has approved higher ticket prices and extra shows for the movie Kalki 2898 AD featuring Prabhas. | Sakshi
Sakshi News home page

'కల్కి' టికెట్ల ధరలు భారీగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Published Tue, Jun 25 2024 6:43 AM | Last Updated on Tue, Jun 25 2024 9:38 AM

Kalki 2898 AD Tickets Price Hiked In Andhra Pradesh

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ,శోభన ప్రముఖ పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కల్కి టికెట్ల విక్రయాలు ఆన్‌లైన్‌ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో  'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాలపాటు ఈ వెసులుబాటును ఏపీ కల్పించింది. కల్కి సినిమా కోసం టికెట్‌ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అశ్వినీదత్‌ కోరడంతో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. 

ఈ క్రమంలో టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ సాధారణ థియేటర్‌లో అయితే రూ.75,  మల్టీప్లెక్స్‌లలో అయితే రూ.125 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గత ఐదేళ్లలో ఏ సినిమాకు ఇంతలా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది లేదు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్‌ అధికార టీడీపీకి దగ్గరి వ్యక్తి కావడంతోనే ఈ వెసులుబాటు ఇచ్చారేమో అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. కల్కి సినిమాకు చేసిన తాజా పెంపుతో.. ఏపీలో రెండు వారాల పాటు టికెట్ల ధరలు గతం కంటే ఎక్కువే ఉండబోతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement