అతను నా ప్రేమను రిజెక్ట్‌ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను: పాయల్‌ రాజ్‌పుత్‌ | Sakshi
Sakshi News home page

Payal Rajput: అతను నా ప్రేమను రిజెక్ట్‌ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను

Published Wed, Nov 8 2023 11:16 AM

Mangalavaram Movie Heroine Payal Rajput Shares Her Love Story - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌కి పరిచమైంది హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మాత్రం సరైన హిట్‌ పడలేదు. దీంతో కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన కెరీర్‌లో భారీ హిట్‌ అందించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

(చదవండి: హీరో విజయ్‌ విడాకుల రూమర్స్‌.. లియో నటి ఏమందంటే?)

వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి లవ్‌స్టోరీని వెల్లడించింది పాయల్‌. మీ క్రష్‌ ఎవరనే ప్రశ్నకు పాయల్‌ సమాధానం ఇస్తూ.. ‘స్కూల్‌ డేస్‌లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతన్ని చూడగానే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. దాన్నే నేను ప్రేమగా భావించాను. టెన్త్‌ క్లాస్‌ ఎండింగ్‌లో నా ప్రేమ విషయాన్ని అతనికి చెప్పాను.

(చదవండి: నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!)

కానీ అతను నా లవ్‌ ప్రపోజ్‌ని రిజెక్ట్‌ చేశాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో నేను నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పి ఏడ్చాను. ఆమె నాకు మద్దతుగా నిలిచి.. నేను మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా సహాయపడింది’అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ. ‘మంగళవారం’ షూటింగ్‌ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని, జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ ఎమోషనల్‌ అయింది. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే తనకు కిడ్నీ సమస్యల ఏర్పడిందన్నారు. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి అని పాయల్‌ విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement