Payal Rajput
-
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్.. ఫోటోలు
-
బాయ్ఫ్రెండ్కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తన బాయ్ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్పుత్ తన ఇన్స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
పాయల్ రాజ్పుత్ ‘వెంకటలచ్చిమి’ కొత్త సినిమా షురూ (ఫొటోలు)
-
‘వెంకటలచ్చిమి’గా అలరించబోతున్న పాయల్
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలురేపి, ‘మంగళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్(Payal Rajput).. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’(Venkatalachimi Movie)గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్బంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. ‘‘వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం’’ అని అన్నారు.హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ.. ‘‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని గారు ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్కి నెక్ట్స్ లెవల్గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.’’ అని అన్నారు.యూత్ ఆడియన్స్కు హాట్ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయింది పాయల్ రాజ్పుత్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్తో ఈ పాన్ ఇండియా సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. -
డీసెంట్ లుక్తో చీరలో మెరిసిపోతున్న పాయల్ రాజ్పుత్ (ఫోటోలు)
-
పాన్ ఇండియా మూవీలో...
పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్– అర్జున్ ఆర్ట్స్పై రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 24న హైదరాబాద్లోప్రారంభం కానుంది. ‘‘పాయల్ రాజ్పుత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించనున్న చిత్రమిది. ఆమె క్యారెక్టర్లో పలు భావోద్వేగాలు ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గ్రీన్ డ్రెస్లో బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్.. భల్లే భల్లే అంటోన్న మంగళవారం బ్యూటీ
గ్రీన్ డ్రెస్లో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్బేబీ జాన్ టీమ్తో కీర్తి సురేశ్ చిల్...బుల్లితెర భామ మౌనీ రాయ్ వేకేషన్ పిక్స్...వింటర్ ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఎమర్జన్సీ ప్రమోషన్స్తో బిజీగా కంగనా రనౌత్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న శ్రద్ధాదాస్...భల్లే భల్లే అంటోన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
అల్లు అర్జున్ పుష్ప-2.. తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్!
అల్లు అర్జున్ పుష్ప-2 నిరీక్షణకు మరో రోజులోనే తెరపడనుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరే వినిపిస్తోంది. పుష్ప డైలాగ్స్తో ఇమిటేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.అయితే ఇంతలా హంగామా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, సినీప్రియులు చేస్తారని అందరికీ తెలుసు. కానీ సినీతారలు కూడా పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్. తాజాగా పుష్ప-2 విడుదల సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆ వీడియోలో పుష్ప డైలాగ్తో అదరగొట్టింది ముద్దుగుమ్మ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ మేనరిజం చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రబృందానికి బెస్ విషెస్ చెప్పింది. ఈ మాస్టర్ పీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మరో ఓటీటీకి వచ్చేసిన మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్లోనే ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో భాషలో మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. దాదాపు 11 నెలల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంగళవారం మూవీ చూసే ఛాన్స్ దక్కింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మంగళవారం మూవీ హిందీ ఆడియన్స్ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. పాయల్ ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కించుకుంది. ‘మంగళవారం’కథేంటంటే..ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు.మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. -
అనంతపురంలో సినీ తారలు పాయల్ రాజ్పుత్,నభా నటేష్ సందడి (ఫొటోలు)
-
నిజామాబాద్లో సందడి చేసిన పాయల్, రామ్ (ఫొటోలు)
-
మెగా కోడలి డ్యాన్స్.. పాయల్ రాజ్పుత్ గ్లామర్
పుట్టినరోజు సెలబ్రేషన్స్లో హీరోయిన్ షాలినీ పాండేనవ్వుతూ డ్యాన్సులేస్తూ హ్యాపీ మూడ్లో లావణ్య త్రిపాఠిభర్తతో సోనాక్షి సిన్హా రొమాంటిక్ పోజులుపింక్ డైమండ్లా మెరిసిపోతున్న కృతిశెట్టియంగ్ బ్యూటీ శ్రీలీల స్మైలీ స్టిల్స్.. చూస్తే మతిపోయేఎండలో ఫొటోలకు పోజులిచ్చిన రాశీఖన్నాశ్రీలీల డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసిన నితిన్ View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sanjeeta Bhattacharya (@sanjeeta11) View this post on Instagram A post shared by Madhumitha H (@madhumitha.h_official) -
లెజండ్ శరవణన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరో తెలుసా..?
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్ శరవణన్' కథానాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించి నిర్మించిన 'ది లెజెండ్' చిత్రం గత 2022లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాల కథానాయక నటించారు. కాగా లెజెండ్ శరవణన్ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దురైసెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్పుత్ కథానాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పాపులర్ అయ్యారు. అదే విధంగా తమిళనాడులో ఇప్పటికే ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా శరవణన్ సరసన నటించేది ఈమెకు రెండవ చిత్రం అవుతుంది. అదేవిధంగా ఇందులో ఆండ్రియా, శ్యామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చైన్నె పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ ఆదివారం తూత్తుకుడి బయలుదేరారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో శరవణన్ మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం మంచి విజయాన్ని సాధించిందని అదేవిధంగా మంచి యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల విడుదలైన మహారాజా, గరుడన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, అదేవిధంగా దర్శకుడు దురైసెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
బాత్రూం పోజుల్లో షాలినీ పాండే.. నీడలో పాయల్ వయ్యారాలు!
బాడీ బెండు తీసేలా హీరోయిన్ పాయల్ రాజ్పుత్షూట్ గ్యాప్లో ఫన్నీగా ప్రవర్తిస్తున్న అనన్య నాగళ్లబాత్రూమ్ పోజుల్లో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండేవింటేజ్ హీరోయిన్లా రెడీ అయిపోయిన కృతిశెట్టిలంగా ఓణీలో వయ్యారంగా వితిక షేరు సోయగాలుమహారాష్ట్ర అడవుల్లో విహరిస్తున్న ఈషా రెబ్బాజీను ప్యాంటులో కారు పక్కన బిగ్ బాస్ వాసంతి View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
కరీంనగర్లో సందడి చేసిన సంయుక్త మీనన్, పాయల్ రాజ్పుత్ (ఫొటోలు)
-
ఆరెంజ్ డ్రెస్ లో హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్పుత్’ (ఫొటోలు)
-
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రక్షణ్ మూవీ రిలీజైంది. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది అంటూ మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ ఏసీపీ పాత్రలో అలరించారు. కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్లో పెడతాడు. దీంతో కిరణ్కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి.ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్కి ఆ సైకో కిల్లర్కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Lady Singam is ready to roar!👮🏻♀️Payal's 'Rakshana' is coming on aha!!🎬 #Rakshana premieres Aug 1st only on aha @starlingpayal @ActorMaanas @RajeevCo @actorchakrapani @sivannarayana_ @PrandeepThakore pic.twitter.com/sOdDmVSHKz— ahavideoin (@ahavideoIN) July 29, 2024 -
Rakshana Review: పాయల్ రాజ్పుత్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది?
టైటిల్: రక్షణనటీనటులు: పాయల్ రాజ్పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులునిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్దర్శక-నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్సంగీతం: మహతి సాగర్సినిమాటోగ్రఫీ: అనిల్ బండారిఎడిటర్: గ్యారి బి హెచ్విడుదల తేది: జూన్ 7, 2024ఆర్ఎక్స్ 100, ‘మంగళవారం’సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పాయల్ రాజ్పుత్. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘రక్షణ’. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా..పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. మంచి అంచనాలతో నేడు(జూన్ 7)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్లో పెడతాడు. దీంతో కిరణ్కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి. ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్కి ఆ సైకో కిల్లర్కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. నగరంలో వరుస హత్యలు జరగడం.. ఆ హత్యల వెనుక ఓ కిల్లర్ ఉండడం.. అతన్ని పట్టుకునేందుకు హీరో/హీరోయిన్ రంగంలోని దిగడం..తన తెలివితేటలన్నీ ఉపయోగించి చివరకు ఆ సైకో కిల్లర్ని అంతమొందించడం.. సైకో థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలన్నీ ఇంచుమించు ఒకే మూసలో సాగుతాయి. దీంటో హత్యలు జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో/హీరోయిన్ ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘రక్షణ’ విషయంలో ఇది కొంతవరకే సఫలం అయింది. సైకో కిల్లర్.. అతని నేపథ్యం ఉత్కంఠభరితంగా ఉన్నా.. కథానాయికా చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉండదు. ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్తో పాయల్ పాత్రను పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంటనే తన ప్లాష్బ్యాక్లోకి వెళ్లి.. స్నేహితురాలి హత్యను చూపించి..అసలు కథను ప్రారంభించారు. సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు చూపించకుండా కథపై ఆసక్తిని పెంచాడు. ఆ తర్వాత వెంటనే అర్జున్ పాత్రని చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేశాడు. ఫస్టాఫ్ అంతా అర్జున్, కిరణ్ల చుట్టే తిరుగుతుంది. అర్జున్ పట్టుకునేందుకు కిరణ్ చేసే ప్రయత్నం మెప్పించదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత..అసలు అతను ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సైకో కిల్లర్ ప్లాష్బ్యాక్ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు పెరెంట్స్ని ఆలోచింపజేస్తుంది. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై కూడా దర్శకుడు ఓ మంచి సందేశాన్ని అందించాడు. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై గ్లామర్గా కనిపించిన పాయల్.. ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. ఏసీపీ కిరణ్ పాత్రలో ఒదిగిపోయింది. హీరో స్థాయిలో యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. తెరపై సరికొత్త పాయల్ని చూస్తారు. బిగ్బాస్ ఫేం మానస్ తొలిసారి నెగెటివ్ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్ అరుణ్ పాత్రకి మానస్ పూర్తి న్యాయం చేశాడు. రామ్ పాత్రకి రోషన్ బాగా సెట్ అయ్యాడు. రాజీవ్ కనకాల, శివన్నారాయణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. మహతి సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల టెన్షన్ పెట్టాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత ఒక్కరే కావడంతో సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ నచ్చుతుంది. -
అందుకే రక్షణ టైటిల్ పెట్టాం: ప్రణదీప్ ఠాకోర్
‘‘ఓ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో ‘రక్షణ’ తీశాను. ఈ సినిమాలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా ఉంటుంది. బాధితుల కోసం పోరాడటంతో పాటు వారిని రక్షించేలా ఉంటుంది కాబట్టి ‘రక్షణ’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు దర్శక–నిర్మాత ప్రణదీప్ ఠాకోర్. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్గారి వద్ద ‘ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి’ సినిమాలకు అసిస్టెంట్ కో డైరెక్టర్గా పని చేశాను. ఆనంద్ రంగా ‘ఓయ్’ చిత్రానికి, భాస్కర్ ‘ఆరెంజ్’ సినిమాకి కో–డైరెక్టర్గా చేశాను. ఓ పెద్ద కథ పట్టుకుని చాలామంది వద్దకు వెళ్లాను... కానీ కుదరలేదు. అందుకే చిన్న సినిమా తీసి, నిరూపించుకోవాలని ‘రక్షణ’ తీశాను. ఇందులో పాయల్ అద్భుతంగా నటించారు. ‘రక్షణ’ తర్వాత ఆమెకు మరింత పవర్ఫుల్ రోల్స్ వస్తాయి. సినిమా తీయడం క్రియేటివ్... రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమా బాగానే తీశా. కానీ, మార్కెటింగ్లో పూర్. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే కష్టంగా మారింది’’ అన్నారు. -
పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
-
వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తను నటించిన 'రక్షణ' సినిమా టీమ్పై ఆమె సంచలన ఆరోపణ చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన ఆమె.. ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్లో కొంత తనకు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కనపెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.ఈ విషయంపై చిత్ర యూనిట్ కూడా రియాక్ట్ అయింది. ప్రమోషన్స్కు వస్తే పాయల్కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.సెటిల్మెంట్ కోరుకుంటున్న పాయల్తాజాగా పాయల్ రాజ్పుత్ మరోసారి తన సోషల్ మీడియాలో ఒక నోట్ రాసింది. 'నేను డైరెక్టర్, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను. నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది. 2020 నుంచి ఇప్పటికీ కూడా 'రక్షణ' టీమ్కు నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్ ఎంతకష్టపడుతారో నాకు తెలుసు. కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది. ఇదీ నా రిక్వెస్ట్.. నేను ఎవరికీ అపకారం చేయను. రక్షణ టీమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను. నా టీమ్ను వారు తప్పకుండా సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సమస్యలను పరిష్కరించుకుందాం.' అని పాయల్ సెటిల్మెంట్ కోరుకుంటుంది. ఫైనల్లీ ఈ గొడవకు శుభం కార్డు పడినట్టే. ఇరువురు మధ్య సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలిపింది. జూన్ 7న రక్షణ సినిమా విడుదల కానుంది. పాయల్ రాజ్పుత్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఇలా భారీ ప్రమోషన్ను ఆ సినిమాకు తెచ్చిపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్పుత్ చేసిన ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. నాలుగేళ్ల క్రితం నటించిన రక్షణ సినిమాను ప్రమోట్ చేయకపోతే టాలీవుడ్ బహిష్కరిస్తామంంటున్నారని పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీఎఫ్పీసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పాయల్ సినిమాను ప్రమోట్ చేయడానికి డేట్లు కేటాయించకపోవడంపై నిర్మాత, దర్శకుడు ప్రణ్దీప్ ఠాకూర్ నుంచి మార్చిలోనే తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అతను ఈ సినిమాను ఏప్రిల్లోనే రిలీజ్ చేయాలనుకున్నాడని తెలిపింది. కానీ ఇందుకు పాయల్ సహకరించలేదని.. మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ప్రమోషన్స్కు వస్తే ఆమెకు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వెల్లడించారు.ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలను ఖండిస్తూ.. మేనేజర్ ద్వారా పాయల్ను కలిసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని టీఎఫ్పీసీ పేర్కొంది. ఈ చిత్రంలో పాయల్ నటించినందున ప్రమోషన్స్ సమయంలో ఆమె పేరును ఉపయోగించుకునే హక్కు నిర్మాత, దర్శకుడు ప్రణ్దీప్కు ఉందని వారు పేర్కొన్నారు.బ్యాన్ చేస్తామంటూ..కాగా.. అంతకుముందు పాయల్ తనను బెదిరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రక్షణ సినిమా ప్రమోషన్లకు పాల్గొనకపోతే టాలీవుడ్లో నిషేధిస్తామంటున్నారంటూ ఆరోపించింది. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్తో నా టీమ్ ఇప్పటికే చెప్పిందని.. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదని పేర్కొంది. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది.'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. Producer & Director Sri Prandeep Thakore gave a complaint on his film "Rakshana" Heroine and Lead artist Ms. Payal Rajput at Telugu Film Producers Council pic.twitter.com/0TlzpYmA3s— Telugu Film Producers Council (@tfpcin) May 20, 2024 -
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు బెదిరింపులు
-
ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
'ఆర్ఎక్స్ 100'తో తెలుగువారికి దగ్గరైంది హీరోయిన్ పాయల్ రాజ్పుత్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమా పరిశ్రమ అంటే అమితమైన అభిమానం. అయితే, తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని పాయల్ విచారం వ్యక్తం చేసింది. 2010 నుంచి దాదాపు ఏడేళ్లపాటు ఎన్నో సీరియల్స్లలో నటించిన ఆమె 'చన్నా మేరేయా' పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది. ఆ చిత్రం పాయల్కు విజయాన్ని అందించింది. అలా 'ఆర్ఎక్స్ 100'తో టాలీవుడ్లో అడుగుపెట్టి ఇక్కడ కూడా భారీ హిట్ను అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ను సొంతం చేసుకున్న ఆమెకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100'తో మెప్పించిన పాయల్.. గతేడాది విడుదలైన 'మంగళవారం' చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చాలెంజింగ్గా నటించింది. ఇలాంటి పాత్రలు చేసేందుకు చాలామంది హీరోయిన్స్ అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. కానీ పాయల్ దుమ్మురేపింది. 'మంగళవారం' ఆమె కెరీర్లో ఒక ప్రత్యేకత గల పాత్రగా మిగులుతుంది. ఆ విజయమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది.'2019-2020 సమయంలో నేను 'రక్షణ' అనే సినిమాను ఒప్పకున్నాను. ముందుగా ఆ చిత్రానికి అనుకున్న టైటిల్ '5Ws'. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయింది. కానీ, రీసెంట్గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం నేను కూడా అందుబాటులో లేను. కానీ నా టీమ్ ఆ చిత్ర యూనిట్తో టచ్లో ఉంది. సినిమా ప్రమోషన్స్కు రాకపోతే తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్తో నా టీమ్ ఇప్పటికే చెప్పింది. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదు. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను.' అని ఆమె తెలిపింది. 'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
విచిత్రమైన పోజుల్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీలతమ్ముడు చనిపోయి మూడేళ్లు.. హీరోయిన్ నిక్కీ ఎమోషనల్ పోస్ట్చీరలో మరింత అందంగా బిగ్బాస్ ఫేమ్ స్రవంతిసొగసులు చూపిస్తూ రెచ్చగొట్టేస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి45 ఏళ్ల వయసులోనే చూపుతిప్పుకోనివ్వంత బ్యూటీతో జ్యోతిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by ANANTARA (@label_anantara) -
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
'వారికి దూరంగా ఉండటమే మంచిది'.. మంగళవారం బ్యూటీ పోస్ట్ వైరల్!
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోనూ అడుగుపెట్టి యూత్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్. గతేడాది మంగళవారం సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసింది. అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే పాయల్ టాలీవుడ్లో అంతకుముందు ఆర్డీఎక్స్ లవ్’, వెంకీమామ, డిస్కోరాజా, తీస్ మార్ఖాన్, జిన్నా చిత్రాల్లో కనిపించింది. మంగళవారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటో మీరు చూసేయండి. పాయల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగేందుకు యత్నిస్తారో అలాంటివారికి దూరంగా ఉండండి. అలాగే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం పెట్టండి. మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా' అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
షాపింగ్లో మంగళవారం బ్యూటీ.. ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్!
బ్లూ డ్రెస్లో రకుల్ ప్రీత్ హోయలు.. షాపింగ్తో బిజీగా ఉన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్... ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్.. అలాంటి డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో రితికా సింగ్ బోల్డ్ లుక్స్.. గ్రీన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
అమ్మకు ఆపరేషన్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన హీరోయిన్
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తన తల్లికి సర్జరీ చేయించింది. గతకొంతకాలంగా మోకాలి నొప్పుతో బాధపడుతున్న తల్లికి ఆపరేషన్ చేయించింది. ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమ్మకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిందని, ఇది చాలా నొప్పితో కూడుకున్నదని పేర్కొంది. ఆపరేషన్ విజయవంతమైందని, అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపింది. తనకోసం ప్రార్థించండి అని వేడుకుంది. ఆపరేషన్ అనంతరం తన తల్లి నడిచేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి.. పాయల్ కెరీర్ విషయానికి వస్తే.. మొదట్లో ఆమె హిందీ సీరియల్స్ చేసింది. దాదాపు ఏడేళ్లపాటు బుల్లితెరకే పరిమితమైన ఆమె 2017లో చన్నా మెరియా అనే పంజాబీ సినిమాతో వెండితెరపైకి అరంగేట్రం చేసింది. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పాయల్ పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. మంగళవారంతో సత్తా చాటిన పాయల్ వరుస పెట్టి సినిమాలు చేసింది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. గతేడాది రిలీజైన మంగళవారం సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించింది పాయల్. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో కిరాతక అనే మూవీలో నటిస్తోంది. చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మీనాక్షి చౌదరి' హిట్ సినిమా -
పబ్లో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్పుత్. ఇంకేముంది.. ఒక్క హిట్టు పడటంతో తనకు టాలీవుడ్లో తిరుగులేదనుకున్నారు. కానీ ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. అనగనగనగా ఓ అతిథి సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించింది. 3 రోజెస్ అనే సిరీస్ కూడా చేసింది. ప్రియుడితో వాలంటైన్స్ డే కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఆమెకు అజయ్ భూపతి మంగళవారం సినిమా ఛాన్స్ ఇచ్చాడు. గతేడాది రిలీజైన ఈ మూవీ హిట్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇకపోతే పాయల్కు సౌరభ్ ఢింగ్రా అనే ప్రియుడు ఉన్నాడు. తరచూ వీళ్లిద్దరు షికార్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) ఇలా సెలబ్రేట్ చేసుకున్నానంటూ పాయల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇంకోసారి కొట్టాల్సింది పబ్బులో ఉన్న ఆమె.. తన ప్రియుడు సౌరభ్ నెత్తిని బాటిల్తో పగలకొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్ చేసింది. ఈ కామెంట్కు సౌరభ్ స్పందిస్తూ.. చాలా బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో రియల్ కాదు, రీల్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఏదైనా ఓ సినిమా షూటింగ్లో భాగంగా పాయల్ ఇలా చేసిందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) చదవండి: ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్ -
అక్కడ అవార్డుల ఖాతా తెరిచిన అజయ్ భూపతి 'మంగళవారం'
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్పుత్ అద్భుతమైన నటనతో పాటు థ్రిల్లింగ్ రెస్పాన్స్తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ హాట్ స్టార్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులని గెలుచుకుంది. దీంతో ఈ సినిమాకు పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉందని డైరెక్టర్ అజయ్ భూపతి తెలిపారు. డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్లో చెప్పినట్లుగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులను 'మంగళవారం' సినిమా గెలుచుకుందని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెలిపారు. తమ చిత్రానికి ఈ అవార్డ్స్ దక్కడం చాలా సంతోషం అని విన్నర్స్ పేర్లు వెల్లడించారు. కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు. ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో 'ఎ' క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి ఈ చిత్ర నిర్మాణంలోకి భాగమయ్యారు. ► ఉత్తమ నటి - పాయల్ రాజపుత్ ► ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్ ► ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్ -
సంక్రాంతి మాకెంతో ప్రత్యేకం
‘సంక్రాంతి పండగ అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటున్నారు పాయల్ రాజ్పుత్. ‘సంక్రాంతికి ఫుల్ ఎనర్జీతో భోగి మంటలు వేస్తుంటాను’ అన్నారు మానసా చౌదరి. ‘సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడమంటే చాలా ఇష్టం’ అంటున్నారు మాళవికా శర్మ. ఇలా సంక్రాంతిని తాము ఎలా జరుపుకొంటామో అంటూ ఈ కథానాయికలు సాక్షితో పంచుకున్న విశేషాలు.. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి – పాయల్ రాజ్పుత్ నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంజాబీ ఆడియన్స్ కు హ్యాపీ లోహ్రీ. సంక్రాంతి పండగ అంటే నాకు ఎన్నో జ్ఞపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు చేస్తాం.. ఇష్టమైన వంటకాలు చేసుకుంటాం. చిన్న తనంలో సంక్రాంతి పండక్కి గాలిపటాలను ఎగరవేసేదాన్ని. కానీ, నా జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి గాలిపటాలను ఎగరవేసే సమయంలో మనలో కలిగే ఆ ఆనందపు అనుభూతిని కొంతకాలంగా మిస్ అయ్యాను. ఈ సారి ఢిల్లీలో నా స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగర వేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా సిబ్బందిలో కొంతమంది హైదరాబాదీలు ఉన్నారు. వారితో పాటు సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. నేను భోజన ప్రియురాలిని. ప్యూర్ వెజిటేరియన్ ని. మసాలా కిచిడీ, లడ్డు అంటే చాలా ఇష్టం. ఇలా మా అమ్మగారు పండక్కి చేసిన వంటకాలను ఇష్టంగా తింటాను. ఇక నేను నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’ మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.. నా అభిమానులకు కూడా థ్యాంక్స్. ఓ నటిగా మంచి కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం – మాళవికా శర్మ సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండగ. వారు ఎంతోకష్టపడి పండించిన పంటలు ఈ సంక్రాంతికి వారి చేతికి వస్తాయి. సూర్యభగవానుడికి పూజలు చేయడంతో మా సంక్రాంతి మొదలవుతుంది. మా అమ్మమ్మ మాకు ప్రతి సంక్రాంతికి కొత్త దుస్తులు ఇస్తుంటారు. నువ్వుల లడ్డూలు ఇస్తారు. లక్కీగా మా అమ్మమ్మగారి బర్త్ డే కూడా సంక్రాంతి రోజునే. మేము కూడా స్వీట్స్ను పంచిపెడతాం. మేం చేయగలిగినంతలో పేదలకు సాయం చేస్తుంటాం. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరిలానే నాకు గాలిపటాలను ఎగరవేయడం చాలా ఇష్టం. ఆకాశంలో కనిపిస్తున్న రంగు రంగుల గాలిపటాలు.. భూమిపై రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు ప్రతీకగా నేను భావిస్తుంటాను. నాపై తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలకు చాలా రుణపడి ఉంటాను. ముంబై నా జన్మభూమి అయితే హైదరాబాద్ నా కర్మభూమి. ఎందుకంటే.. నేను ఇక్కడే మూవీస్ చేస్తున్నాను. నేను నటించిన గోపీచంద్గారి ‘భీమా’, సుధీర్బాబుగారి ‘హరోంహర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో నా పాత్ర చాలా ఎగై్జటింగ్గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం – మానసా చౌదరి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు స్వగ్రామం. నాన్న మధుసూదన్ నాయుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మేము చెన్నైలో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఊరు వెళతాం. అక్కడ నాన్న, అమ్మ సుజాత, నేను, తమ్ముడు చేతన్ కలిసి మా బంధువులతో ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈ ఏడాది ఊరు వెళ్లలేకపోయాను. మా బంధువులు, కజిన్స్ ఫోన్ చేసి.. ‘ఏంటి? హీరోయిన్ అయిపోయావని ఊరికి రావా?’ అంటున్నారు. అయితే ఆదివారం భోగి పండగని చెన్నైలోనే జరుపుకొన్నాను. మేము ఉన్న వీధిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉంటారు.. సెలబ్రేట్ చేసుకుంటాం. ► సంక్రాంతి పండగలో తొలిరోజు వచ్చే భోగి అంటే మరీ ఇష్టం. తొలిరోజు కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉంటా. ఉదయాన్నే లేచి పెద్ద భోగిమంటలు వేసేవాళ్లం. ఆ తర్వాత ఆయిల్ బాత్ చేసి, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవాళ్లం.. థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తాం. ఆ తర్వాత మకర సంక్రాంతిన పొంగల్ చేయడం ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా తింటాను. ప్రత్యేకించి నాటుకోడి కూరతో రాగిసంకటి తినడం చాలా ఇష్టం. అలాగే మటన్ నా ఫేవరేట్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఎవరైనా గాలిపటాలు ఎగర వేస్తుంటే చూస్తుంటాను. కానీ నేను గాలిపటాలు ఎగరవేయలేదు. తెలుగులో ‘బబుల్గమ్’ సినిమాకి ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ, చేయలేదు. ‘బబుల్గమ్’ తర్వాత కథలు వింటున్నాను. అయితే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కెరీర్లో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్లాలనుకుంటున్నాను. -
అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్ చేసిన మంగళవారం బ్యూటీ!
టాలీవుడ్లో 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో మెరిసింది. తాజాగా అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం 'తంత్ర'. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవిచైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ధీరే ధీరే అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్, అనసూయ చేతుల మీదుగా విడుదల చేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్పుత్, అనసూయ ప్రత్యేక కృతజ్ఞతలు' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఫస్ట్-లుక్, టీజర్కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. Happy to launch "Dheere-Dheere" song from @TantraTheMovie making visuals 😊 Very breezy and authentic! Best wishes to the entire team @AnanyaNagalla @srini_gopisetti @rrdhruvan @anuragkulkarni_ @veerapanenisc #DheereDheere #TantraFilm #AnasuyaBharathwajWishes #AnanyaNagalla… pic.twitter.com/BLpkZmdBSQ — Anasuya Bharadwaj (@anusuyakhasba) January 12, 2024 -
'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం
పాయల్ రాజ్పుత్.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్కి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరూ అవాక్కయ్యేలా చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్గా 'మంగళవారం' సినిమాతో క్రేజీ హిట్ కొట్టింది. తాజాగా ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం పాయల్కి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి టైంలో ఈ బ్యూటీ ఇంట్లో విషాదం నెలకొంది. (ఇదీ చదవండి: 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే!) ఇయర్ ఎండింగ్లో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది. ఈ విషయాన్ని బాధతో చెప్పుకొచ్చిన పాయల్.. క్షమించు, నిన్ను బతికించుకోలేకపోయాను అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. పెట్ డాగ్తో ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుని పలు వీడియోల్ని షేర్ చేసింది. 'నీ హగ్స్, నీ ప్రేమని మిస్ అవుతా.. ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది.. నిన్ను ఎంతగానో ప్రేమించా.. ఇకపై నా జీవితాంతం మిస్ అవుతూనే ఉంటా.. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్.. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని హీరోయిన్ పాయల్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఈమె బాయ్ఫ్రెండ్తో పాటు పలువురు స్పందిస్తున్నారు. పాయల్ కెరీర్ విషయానికొస్తే 'మంగళవారం' సినిమాతో సూపర్ కమ్బ్యాక్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్లైన్స్.. అరబ్ ఎమిరేట్స్లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్లైన్ సిబ్బందిగా తన కెరీర్ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే
సాధారణంగా కొత్త మూవీస్ ఏ శుక్రవారమో శనివారమో ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కొన్నికొన్నిసార్లు మాత్రం డిఫరెంట్గా వారం మధ్యలో విడుదల చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తెలుగు హిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంది. అదే 'మంగళవారం'. పాయల్ రాజ్పుత్- అజయ్ భూపతి కాంబో.. ఈ మూవీతో మరో క్రేజీ హిట్ అందుకున్నాడు. హిట్ సినిమా 'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆ తర్వాత 'మహాసముద్రం'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'మంగళవారం' మూవీ తీశారు. తనకు అచొచ్చిన పాయల్ రాజ్పుత్ ఇందులో హీరోయిన్గా చేసింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. (ఇదీ చదవండి: బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత) ఆ ఓటీటీలోనే అయితే థియేటర్లలో 'మంగళవారం' సినిమా.. నవంబరు 17న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్ ఉండటంతో దీన్ని జనాలు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. థియేటర్లలో ఈ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు గానీ ఓటీటీలో మాత్రం మంగళవారమే రిలీజ్ చేశారండోయ్. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో 'మంగళవారం' స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకండి! కథేంటి? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
పాయల్ రాజపూత్ స్పెషల్ వీడియో
-
Payal Rajput: పాయల్కు కలిసొచ్చిన ‘మంగళవారం’
ఒక్క హిట్తో ఊహించని స్టార్డమ్ను సాధించింది నటి పాయల్ రాజ్పుత్. కానీ కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడిప్పుడే వరుస చాన్స్లతో మళ్లీ బిజీ అవుతోంది. ఆ విషయాలే క్లుప్తంగా.. ► పాయల్ స్వస్థలం ఢిల్లీ. తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్.. టీచర్. తల్లి నిర్మల్ రాజ్పుత్.. గృహిణి. ఢిల్లీలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్ స్కూల్లో చదివింది. యాక్టింగ్ కోర్స్లో డిప్లొమా పూర్తి చేసింది. ► ‘సప్నోం సే భరే నైనా’ అనే హిందీ సీరియల్తో మొదట బుల్లితెరకు, తర్వాత పంజాబీ సినిమా ‘ఛన్నా మేరేయా’తో సినీ ప్రేక్షకులకూ పరిచయం అయింది. 2018లో ‘ఆరెక్స్ 100’తో టాలీవుడ్లోనూ అడుగుపెట్టి యూత్లో క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ► ఆ పాపులారిటీ ఆమెకు ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’, ‘తీస్ మార్ఖాన్’, ‘జిన్నా’ వంటి తెలుగు సినిమాలతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటనావకాశాలను తెచ్చిపెట్టింది. సక్సెస్ గ్రాఫే సస్టెయిన్ కాలేకపోయింది. ► సినీఫీల్డ్లో పాయల్ కాస్త స్లో అయిన సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్ ఆమెకు వెల్కమ్ చెప్పింది. ‘3 రోజెస్’, ‘అనుకోని అతిథి ’ వంటి వెబ్ సిరీస్లతో ఆకట్టుకుంది. ఇటీవలే ‘మంగళవారం’ మూవీతో మళ్లీ హిట్ సాధించి.. డేట్స్ ఖాళీలేని అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడ్డాను. జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవే. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి: పాయల్ రాజ్పుత్ -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' మూవీ సందడి కనిపిస్తోంది. మూవీ లవర్స్ అందరూ ఈ వీకెండ్ అయ్యేలోపు ఎలా అయినాసరే ప్రభాస్ సినిమా చూసేయాలని తెగ ట్రై చేస్తున్నారు. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో అవకాశాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఓ తెలుగు హిట్ మూవీ రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) ఇప్పుడు సినిమా హిట్ కావాలంటే ఒకటి స్టార్స్ అయినా ఉండాలి లేదంటే కంటెంట్ అయినా డిఫరెంట్గా ఉండాలి. అలా నవంబరు ట17న పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ 'మంగళవారం'. కాకపోతే సరిగ్గా దీని రిలీజ్ టైంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగడం వల్ల ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ తేదీని డిస్నీ ప్లస్ హాట్స్టార్ తాజాగా ప్రకటించింది. డిసెంబరు 26న అంటే మంగళవారం రోజునే 'మంగళవారం' మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. ఓవైపు 'సలార్' థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం కచ్చితంగా ప్లస్ అవుతుందని అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
సాధారణంగా ఓ సినిమా తీస్తున్నారంటే చాలామంది యువనటీనటులు.. అందులో ఛాన్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి ఓ పాన్ ఇండియా మూవీ కోసం ఏకంగా ప్రముఖ హీరోయినే ప్రయత్నిస్తే? అవును మీరు సరిగానే విన్నారు. ప్రస్తుతం 'కాంతార' మూవీకి ప్రీక్వెల్ తీసే పనిలో హీరో రిషభ్ శెట్టి బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో క్రేజీ హీరోయిన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలాడుకుంది. ఏంటి విషయం? కన్నడ హీరో రిషభ్ శెట్టిని.. రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ని చేసి మూవీ 'కాంతార'. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా గతేడాది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీస్తున్నారు. మొన్నీమధ్యే పోస్టర్ రిలీజ్ చేయగా, తెగ వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) ఛాన్స్ అడుక్కుంది అయితే 'కాంతార-1' సినిమాలో తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఎక్స్ (ట్విట్వర్) వేదికగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పోస్ట్ పెట్టింది. 'రిషభ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్.. కాంతార చాప్టర్-1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఈ మధ్య విడుదలైన 'మంగళవారం'లో నా యాక్టింగ్ని అందరూ ప్రశంసించారు. మీరు కాస్త టైం కేటాయించి నా సినిమా చూస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించే అభిమానులు థ్యాంక్స్' అని పాయల్ రాసుకొచ్చింది. మరి పాయల్ కోరుకున్నట్లు.. 'కాంతార-1' హీరో గానీ మూవీ యూనిట్ గానీ ఈ ట్వీట్ చూసి, ఛాన్స్ ఇస్తే మాత్రం పాయల్ ని అదృష్టం వరించినట్లే. చూద్దాం మరి ఈ బ్యూటీ అనుకున్నది జరుగుతుందో లేదో? (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) @shetty_rishab @hombalefilms I've learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Magalavaaram, has garnered significant praise for my performance. I would appreciate if you could spare some time to… — paayal rajput (@starlingpayal) December 12, 2023 -
ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'మంగళవారం'. మిస్టీరియస్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్పూత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్పూత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమా మాదిరే ఇందులో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది పాయల్. ఇందులో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవుతారు.. అంతలా ఈ సినిమా కోసం ఆమె గ్రౌండ్ వర్క్ చేసిందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో కథలో ట్విస్ట్లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్లో ఒక్కొక్కటి రవీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చివరి 45 నిమిషాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. 'కాంతార'కు అజనీష్ అందించిన మ్యూజిక్ మంగళవారం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు ఆయన అందించిన మ్యూజిక్తో పూనకాలు వచ్చేస్తాయి. -
Payal Rajput: అదిరిపోయిన మంగళవారం హీరోయిన్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Birthday Special: మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
నడుము అందాలతో ఆ ఇద్దరు.. శ్రద్దా దాస్ మాత్రం ఓరకంట చూస్తూ!
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి క్యూట్నెస్తో చంపేస్తున్న బిగ్బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నాజూకు నడుముతో టెంప్ట్ చేస్తున్న తేజస్వి ప్రకాశ్ మత్తెక్కించే చూపులతో 'జైలర్' బ్యూటీ మిర్నా కాటుక కళ్లతో భయపెడుతున్న హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ మేకప్ లేకుండా అందాల విందు చేస్తున్న పూనమ్ బజ్వా రెడ్ డ్రస్లో మహేశ్ భార్య నమ్రత గ్లామర్ ట్రీట్ కారిడార్లో విచిత్రమైన డ్రస్తో పోజులిచ్చిన మెహ్రీన్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shailaja Priya Machiraju (@priyaartist) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Uorfi (@urf7i) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
నెటిజన్కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది.(ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!)అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్పుత్పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. -
పాయల్ Cute స్పీచ్ మంగళవారం సినిమా గురించి
-
‘మంగళవారం’ మూవీలో మాస్క్లో ఉంది ఎవరో తెలుసా...(ఫొటోలు)
-
మంగళవారం మూవీ సక్సెస్ మీట్.. పాయల్ రాజ్పుత్ సందడి (ఫోటోలు)
-
Payal Rajput: 'మంగళవారం'తో హిట్ అందుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
మంగళవారం మూవీ.. ఆ టాలీవుడ్ హీరోను దించేశారుగా!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత ఒక్క సరైనా హిట్ పడలేదు. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ జతకట్టింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన మంగళవారం మూవీ నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్100 మూవీతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించారు అజయ్ భూపతి. అయితే ఆ తర్వాత అజయ్ మహాసముద్రం మూవీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్తో కలిసి ‘మంగళవారంతో దూసుకొచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) అయితే ఈ చిత్రం గురించి పాత్రలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ ఈ సినిమాలోని ఓ లీడ్ క్యారెక్టర్ పేరును మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతలా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో పేరును బయటకు రాకుండా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అజయ్ భూపతి చేసి చూపించారు. ఆ పాత్రలో నటించింది మన టాలీవుడ్ హీరోనే కావడం మరో విశేషం. ఇంతకీ అతనెవరో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. మొత్తానికి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది పాయల్ రాజ్పుత్. కానీ మన తెలుగు హీరో పేరును దాచి ఆడియన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అజయ్. ఆ హీరో మరెవరో కాదు.. బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన బలగం సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లీక్ అవుతున్నాయి. అలాంటిది ప్రియదర్శి నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటే మంగళవారం చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే. (ఇదీ చదవండి: Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ) #Mangalavaram in Theatres now 💥💐💥💐 pic.twitter.com/8pOArYDuPZ — Moviezupp Entertainment (@moviezupp) November 17, 2023 -
Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ
టైటిల్: మంగళవారం నటీనటులు: పాయల్ రాజ్పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి దర్శకత్వం:అజయ్ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి విడుదల తేది: నవంబర్ 17, 2023 ‘మంగళవారం’కథేంటంటే.. ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు. మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ టచ్తో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది. దాంతో పాటు మహిళలకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని కూడా అందించారు. అయితే ఆ సందేశాన్ని ఇచ్చేందుకు దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా ఉన్నా.. ప్రేక్షకులు చూసే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. ఈ కథలో దర్శకుడు అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన ‘హైపర్ సెక్స్ డిజార్డర్’ అనే మానసిక, లైంగిక రుగ్మత, వివాహేతర సంబంధాల గురించి చర్చించారు. అలా అని ఇది మెసేజ్ ఓరియెంటెంట్ ఫిల్మ్గా సాగదు. కథ ప్రారంభం నుంచే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమా ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంటర్వెల్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు.. అసలు కథ ప్రారంభం కాదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అద్భుతమైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడు అజయ్ భూపతి. శైలు చిన్ననాటి ఎపిసోడ్తో కథ ప్రారంభం అవుతుంది. తల్లి చనిపోవడం..తండ్రి మరోపెళ్లి చేసుకోవడం..అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం.. ఇలా మొదటి నుంచే హీరోయిన్ క్యారెక్టర్పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు. శైలు, రవిల చిన్ననాటి ప్రేమ కథను కాసేపు చూపించి..ఆ తర్వాత వెంటనే స్టోరీని పదేళ్ల ముందుకు అంటే 1996కు తీసుకెళ్లాడు. అక్కడ వరుస మరణాలు.. గోడపై ఆక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాయడం.. మరుసటి రోజే వాళ్లు శవాలై కనిపించడం.. ఇలా ప్రతి మంగళవారం జరగడం.. దాని వెనుక ఉన్నదెవరని ఎస్సై మాయ చేపట్టే విచారణ.. అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ఊరి ప్రజలు రంగంలోకి దిగడం.. ఇలా చాలా ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది. హీరో హీరోయిన్లు పాత్రలు లేకుండానే ఫస్టాఫ్ను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు శైలు పాత్రకు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. శైలు లవ్స్టోరీ ఎపిసోడ్తో చాలా ఎమోషనల్గా ద్వితియార్థం ప్రారంభం అవుతుంది. తెరపై శైలు పాత్ర బోల్డ్గా చూపిస్తూనే. ఆమెపై సానుభూతి కలించేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. అలా చేయడం చాలా కష్టమైన పని.. కొంచెం తేడా కొట్టినా.. ఫలితమే మారిపోతుంది. కానీ అజయ్ మాత్రం బలమైన స్క్రిప్ట్తో ఈ సాహసం చేసి విజయం సాధించాడు. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం.. బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం కాస్త మైనస్. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్పుత్ చాలా సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ గాళ్గానే చూపించారు. కానీ మంగళవారం చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్ని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసింది. శైలు పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. గ్లామర్తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఇక ఎస్సై మాయగా నందిని శ్వేత మరో డిఫరెంట్ రోల్ ప్లే చేసి మెప్పించింది. అయితే నటనకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు ఆమెది. అజయ్ ఘోష్, లక్ష్మణ్ పాత్రలు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వారిద్ధరి మధ్య సంబాషణలు నవ్వులు పూయిస్తాయి. శైలు చిన్ననాటి ప్రియుడు, మాస్క్ ధరించిన వ్యక్తి( ఈ నటుడి ఎవరనేది తెరపై చూస్తేనే థ్రిలింగ్గా ఉంటుంది) కూడా అద్భుతంగా నటించాడు. ఆర్ఎంపీ డాక్టర్గా రవీంద్ర విజయ్, జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళైతో పాటు శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అతను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త లుక్ని అదించింది. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'మంగళవారం' ప్రమోషన్స్ లో పాయల్ రాజ్పుత్ (ఫొటోలు)
-
'మంగళవారం' ఛాన్స్ కోసం డైరెక్టర్ వెంటపడ్డా: పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఆ మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే 'మంగళవారం' చేసింది. ఈ శుక్రవారం (నవంబరు 17)న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్పై పోలీస్ కేసు) 'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డా. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని చెప్పారు. అలానే కొన్నాళ్లకు ఫోన్ రాగానే ఓకే చెప్పేశా. నాకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. ఇండియాలో ఈ టైప్ క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం. శైలు పాత్ర హెయిర్, మేకప్ కోసం ప్రతిరోజు రెండు గంటలు పట్టేది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేకపోయాను. నా చేతిపై గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు నటించిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని ప్రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జు చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ అని పాయల్ రాజ్పుత్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) -
స్నేహానికి వ్యాపారాన్ని ముడిపెట్టలేను
పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమర్ ప్రధాన పాత్రధారులుగా, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్పై స్వాతీరెడ్డి గునుపాటి (వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె), ఎం. సురేష్ వర్మ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రనిర్మాతలు మాట్లాడారు. స్వాతీరెడ్డి గునుపాటి మాట్లాడుతూ – ‘‘అజయ్ భూపతిగారు చెప్పిన ‘మంగళవారం’ కథ విని, ఈ సినిమా చేస్తే బాగుంటుందనిపించి చేశాను. ఓ సెన్సిటివ్ ఇష్యూని ఆయన సందేశాత్మకంగా చెప్పిన విధానం నాకు నచ్చింది. పాయల్కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. అజనీష్ మ్యూజిక్ బాగుంటుంది. ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అగ్రతారలతో పరిచయం ఉంది. నేను అడిగితే వారు నాతో సినిమాలు చేస్తారు. కానీ నిర్మాతగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. వాళ్ల స్థాయికి తగ్గ సినిమాలను నిర్మించే అవకాశం ఉన్నప్పుడు వారితో నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదు’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు నుంచే అల్లు అర్జున్గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక చిన్నతనం నుంచి చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన మా ట్రైలర్ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. -
‘మంగళవారం’ టైటిల్ ఎందుకు పెట్టామంటే: అజయ్ భూపతి
‘‘మంగళవారం’ అంటే మంచిది కాదని ఓ అభిప్రాయం ఉంది. అయితే మంగళవారం చాలా శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. గతంలో మనకు ఆ రోజే సెలవు ఉండేది.. బ్రిటీషర్లు వచ్చాక ఆ సెలవుని ఆదివారానికి మార్చారు. ‘మంగళవారం’ టైటిల్ ΄పోస్టర్ విడుదల చేయగానే సీనియర్ డైరెక్టర్ వంశీగారు ఫోన్ చేసి, ‘చాలా మంచి టైటిల్ అజయ్. నేను చాలాసార్లు ఆ టైటిల్ అనుకుంటే నిర్మాతలు ఒప్పుకోలేదు’ అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. ΄పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, ఎం.సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘ఎ’ క్రియేటివ్ వర్క్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి చెప్పిన విశేషాలు. ∙‘మహాసముద్రం’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ‘మంగళవారం’ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాను. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ, ‘మంగళవారం’ లాంటి చిత్రం తీయడం చాలా కష్టం. డైరెక్షన్ అండ్ టెక్నికల్ వేల్యూస్, ఆర్టిస్టుల యాక్టింగ్ వంటివి చాలా ఉంటాయి. అలాగే నటీనటులతో ΄పాటు సాంకేతిక నిపుణులందర్నీ ఒక్క తాటిపైకి తీసుకు రావడం కష్టంగా అనిపించింది. ∙‘మహాసముద్రం’ సమయంలో అదితీరావు హైదరీకి కూడా ‘మంగళవారం’ కథ చెప్పాను.. ఆమె చేస్తానన్నారు. అయితే ఆ తర్వాత ఆమెను నేను సంప్రదించలేదు. ‘మంగళవారం’ కోసం సుమారు 40, 50 మందిని ఆడిషన్ చేశా. ఆ తర్వాత ఓ రోజు ‘మనం మళ్లీ సినిమా చేద్దాం’ అంటూ ΄పాయల్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆ పాత్రకు తను సరిపోతుందా? లేదా అని విజువలైజ్ చేసుకున్నాను.. రెండు రోజుల తర్వాత ఫొటోషూట్ చేశాం. తను సరిపోతుందని తెలిశాక ఓకే చేశా. ∙‘మంగళవారం’ ఏ స్థాయి సినిమా అని నేను ముందు ఊహించకోకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. అల్లు అర్జున్గారికి ఏడాదిన్నర క్రితమే ఈ కథ చెప్పాను. అందుకే ఆయన ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఊహించి, మాట్లాడారు. మా బ్రదర్ సురేష్ వర్మ, స్వాతి రెడ్డిగార్లతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవడం సంతోషంగా ఉంది. ‘మంగళవారం’ సినిమాకు కొనసాగింపు ఉంటుంది’’ అన్నారు. -
'మంగళవారం'లో జీరో ఎక్స్పోజింగ్... చివరి 45 నిమిషాలు మాత్రం!
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తీసిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించింది. నవంబర్ 17న తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజయ్ భూపతి.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!) 'మంగళవారం' ఐడియా అలా! 'మహాసముద్రం' తీస్తున్నప్పుడు 'మంగళవారం' ఐడియా వచ్చింది. చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. ఇలాంటి సినిమాకు దర్శకత్వం అంత సులభం కాదు. పాయల్ క్యారెక్టర్ అలా పాయల్ రాజ్పుత్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. తనకు నా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకొంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) 'మంగళవారం'లో జీరో ఎక్స్పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే... కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి 'బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్' అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు. మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ''మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు'' అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
'మంగళవారం'లో చాలా బోల్డ్ విషయం ఉంది.. దానికి ధైర్యం కావాలి: అల్లు అర్జున్
RX100తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ చిత్ర నటి పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ ‘మంగళవారం’. ఈ చిత్రం వచ్చే శుక్రవారం థియేటర్స్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఇక ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పాయల్ నటించిన RX100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి మైల్స్టోన్ అవుతుంది. అజయ్ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇందులో చాలా బోల్డ్ విషయం ఉంది. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.నాకు ఈ సినిమా టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. నాకు అజయ్ డైరెక్షన్లో వచ్చిన RX100 సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్. గొప్ప డైరెక్టర్ అనే నమ్మకం ఉంది. నేను ఈ టీజర్ను సుకుమార్ గారికి చూపించాను. ఆయన టీజర్ చూసి షాక్ అయ్యారు. చాలా బాగా చేశాడు డైరెక్టర్ అన్నారు. లైఫ్లో మనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే మన సక్సెస్ని వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు స్వాతి, ప్రణవ్లు అలాంటి వాళ్లే. ఇది వాళ్ల ఫస్ట్ సినిమా. వాళ్లు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. వాళ్ల కోసం వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. -
'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్గా బన్నీ (ఫొటోలు)
-
మంగళవారం ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్గా ఐకాన్ స్టార్!
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 11న హైదరాబాద్ జేఆర్సీ కన్వెషన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తే 'ఆర్ఎక్స్ 100' తరహాలో ఈ మూవీనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా.. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. #AlluArjun𓃵 Anna Chief guest For #Mangalavaram Pre-Release Event 🔥😁 Pics Loading⚡💥#Pushpa2TheRule | #MangalavaramPreReleaseEvent pic.twitter.com/KlOj07hkwZ — BUNN¥_BØ¥🪓🦁 (@Aa_cult_boy) November 7, 2023 #Mangalavaram Pre Release Event Passes Available contact me pic.twitter.com/xGbelnAMgr — Gogarla Srikanth Icon (@SrikanthGogarl3) November 9, 2023 -
అతను నా ప్రేమను రిజెక్ట్ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను: పాయల్ రాజ్పుత్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్కి పరిచమైంది హీరోయిన్ పాయల్ రాజ్పుత్. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మాత్రం సరైన హిట్ పడలేదు. దీంతో కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన కెరీర్లో భారీ హిట్ అందించిన ‘ఆర్ఎక్స్ 100’ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: హీరో విజయ్ విడాకుల రూమర్స్.. లియో నటి ఏమందంటే?) వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి లవ్స్టోరీని వెల్లడించింది పాయల్. మీ క్రష్ ఎవరనే ప్రశ్నకు పాయల్ సమాధానం ఇస్తూ.. ‘స్కూల్ డేస్లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతన్ని చూడగానే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. దాన్నే నేను ప్రేమగా భావించాను. టెన్త్ క్లాస్ ఎండింగ్లో నా ప్రేమ విషయాన్ని అతనికి చెప్పాను. (చదవండి: నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!) కానీ అతను నా లవ్ ప్రపోజ్ని రిజెక్ట్ చేశాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో నేను నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పి ఏడ్చాను. ఆమె నాకు మద్దతుగా నిలిచి.. నేను మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా సహాయపడింది’అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ. ‘మంగళవారం’ షూటింగ్ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని, జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ ఎమోషనల్ అయింది. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే తనకు కిడ్నీ సమస్యల ఏర్పడిందన్నారు. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి అని పాయల్ విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్లో.. సినీనటి 'పాయల్ రాజ్పుత్' సందడి!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట్ డివిజన్ మదీనాగూడలో సినీనటి పాయల్ రాజ్పుత్ శుక్రవారం సందడి చేసింది. హైదరాబాద్లో జోస్ అలుక్కాస్ 4వ నూతన షోరూంను ఆమె సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుక్కాస్లో ఆభరణాలన్నీ నాణ్యతో కూడి అందంగా ఉన్నాయన్నారు. శుభమాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్, ఫెస్టివల్ ఎడిషన్, పరంపర కలెక్షన్స్, ఐవీ కలెక్షన్స్ లాంటివి జోస్ ఆలుక్కాస్ ప్రత్యేక బ్రాండ్స్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
ఆవకాయ తాండ్ర...
‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమీర్ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్ లోక్నాథ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, గణేష్ ఎ. రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్ భాస్కర్ నటించడం విశేషం. ‘‘తరుణ్ భాస్కర్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్ భూపతి. -
వారాలను వాడేస్తున్న డైరెక్టర్స్.. టాలీవుడ్లో ఈ టైటిలే ట్రెండింగ్!
ఒకప్పుడు సినిమా టైటిల్ చూడగానే దాని కథ ఏంటి? ఏ జానర్ ఫిల్మ్? అనేది ఈజీగా తెలిసిపోయేది. కానీ ఇప్పటి సినిమాలకు మాత్రం విచిత్రమైన టైటిల్స్ పెట్టేస్తున్నారు. కొన్ని టైటిల్స్కి కథతో సంబంధం ఉంటే.. మరికొన్నింటికి మాత్రం మీనింగే ఉండడం లేదు. కొత్తగా, ట్రెడింగ్లో ఉన్న పదం కనిపిస్తే చాలు అదే సినిమా టైటిల్ అవుతుంది. ఇక టాలీవుడ్లో అయితే ఇటీవల వారాల పేర్లనే సినిమా టైటిల్స్గా వాడేస్తున్నారు దర్శకులు. ఆదివారం నుంచి శనివారం వరకు వారాల పేర్లతో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. ‘శనివారం’వాడేసిన నాని ‘అంటే సుందరానికీ.. ’తర్వాత నాని, వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా సోమవారం టైటిల్ని ప్రకటిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో నాని మాస్ లుక్లో కనిపించాడు. ‘యాక్షన్ మాస్ ఎంటర్టైనర్’గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘మంగళవారం’కోసం పాయల్ ఎదురుచూపులు ‘మంగళవారం’ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్ రాజ్పుత్. ‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక ఊర్లో ప్రతి మంగళవారం జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రెండేళ్ల క్రితమే ‘గురువారం’ వాడేసిన శ్రీసింహా రెండేళ్ల క్రితమే గురువారాన్ని తన టైటిల్గా వాడేశాడు కీరవాణి కొడుకు శ్రీసింహా. ఆయన హీరోగా మణికాంత్ గెల్ల దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. కానీ ఆ కామెడినీ ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఆడవాళ్ల కోసం ఆదివారం ఇక ఆదివారాన్ని సైతం తమ సినిమా టైటిల్గా వాడేసుకున్నారు మన తెలుగు దర్శకుడు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’అనే చిత్రం 2007లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు. ఇవే కాదు.. సోమ, బుధ, శుక్రవారం పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి. ఏ వెన్నెస్ డే(బుధవారం) పేరుతో నసీరుద్దీన్ షా ప్రేక్షకుల ముందుకు రాగా.. అది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఈనాడు’తో కమల్ సినిమా వచ్చింది. శుక్రవారం, సోమవారం పేరుతో కూడా గతంలోనే సినిమాలు వచ్చాయి. మొత్తానికి మన దర్శక నిర్మాతలు అన్ని వారాలను వాడేశారు...ఇక మిగిలింది నెలల పేర్లే.. రానున్న రోజుల్లో జనవరి.. ఫిబ్రవరి.. అంటూ నెలల పేర్లు కూడా టైటిల్స్గా వస్తాయేమో చూడాలి. -
మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు. 100 పర్సెంట్ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్ రాజ్పుత్, అజ్మల్ ఆమిర్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్ని రిలీజ్ చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్ థ్రిల్లర్. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్ని టచ్ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్ వర్మ. ‘‘నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్ ఇచ్చారు అజయ్గారు’’ అన్నారు పాయల్. -
ఈ కారణంతో సర్జరీ కూడా చేపించుకోలేదు: పాయల్ రాజ్పుత్
ఆర్ఎక్స్100తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి మహాసముద్రంతో ఫ్లాప్ ఇచ్చాడు. చాలారోజుల గ్యాప్ తర్వాత పక్కా ప్లాన్తో ఈసారి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. 1980లో ఒక గ్రామంలో వరుస హత్యల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ రిలీజ్.. బిగ్ అప్డేట్) ఈ కథపై హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తాజాగా ఒక విషయాన్ని ఇలా షేర్ చేసింది. 'అజయ్ నన్ను అప్రోచ్ అయ్యే టైమ్కు నా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. సర్జరీకి వెళ్లాల్సిందే అని వైద్యులు సూచించారు. అయితే అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తాను.' అని అప్పుడే చెప్పాను. ఇదొక అద్భుతమైన కథతో రూపొందిన సినిమా అని. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అలాగే తనకు కూడా తెలుగులో మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నట్లు పాయల్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను చిరంజీవి ఎందుకు లాంచ్ చేశారంటే ‘మంగళవారం’ సినిమా నిర్మాత స్వాతిరెడ్డి గునుపాటి తన కుమార్తె శ్రీజకి మంచి స్నేహితురాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. స్వాతిరెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి అని.. అలాంటి అమ్మాయి నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయడమే కాకుండా తనే దగ్గరుండి ఒక సినిమాను నిర్మిస్తే కచ్చితంగా ప్రోత్సహించాలని మెగాస్టార్ చెప్పారు. ‘మంగళవారం’ ట్రైలర్ను ఎక్స్ ద్వారా విడుదల చేసిన చిరంజీవి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) -
ఆ ఊర్లోని చావులకు కారణం ఎవరు?.. ఆసక్తికరంగా ‘మంగళవారం’ ట్రైలర్
‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మంగళవారం’. . పాయల్ రాజ్పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఒక ఊర్లో జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లను ఓ అజ్ఞాతవాసి గోడపై రాస్తుంటాడు. ఆ గోడమీద రాస్తున్నదెవరు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రతి మంగళవారం ఊర్లో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ ‘ట్రైలర్’ సాగుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
డబ్బు కోసం సీరియల్స్ యాంకరింగ్ చేస్తుండేది: పాయల్ రాజ్పుత్
-
ఆర్ఎక్స్ 100 మూవీతో ముంబై, హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకున్న
-
కాస్టింగ్ కౌచ్ కు నేను బాధితురాలినే..!
-
ఒక రోజుకి నా రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది అంటే..!
-
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్లో సందడి చేసిన పాయల్ రాజ్పుత్ (ఫొటోస్)
-
మంగళవారం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్...!
-
శుక్రవారం రిలీజ్ కానున్న మంగళవారం!
ఆర్ఎక్స్ 100, మహా సముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తెరకెక్కిస్తోన్న మంగళవారం. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో పోషిస్తుండగా.. శ్రీతేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి.. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంగళవారం' నవంబర్ 17న విడుదల కానుంది. (ఇది చదవండి: కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!) గ్రామీణ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచాయి. కాగా.. ఈ సినిమాలో చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కన్నడ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!) గతంలో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'మంగళవారం' చిత్రాన్ని డిఫరెంచ్గా తెరకెక్కిస్తున్నట్లు అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్తో ఈ సినిమా చేస్తున్నామని.. ఇందులో మొత్తం 30 పాత్రలున్నాయని తెలిపారు. ఆర్ఎక్స్ 100 తరహాలోనే అజయ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Excited to show y'all a story that'll twist your heart like never before🦋#Mangalavaaram #Mangalavaar #Chevvaikizhamai #Chovvazhcha Releasing Worldwide in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada on November 17th 🔥 An @AJANEESHB Musical 🥁@starlingpayal @Nanditasweta… pic.twitter.com/1G9OjAAn0w — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 26, 2023 -
అనసూయ విచిత్రమైన షర్ట్.. సెగలు రేపుతున్న దక్ష
పింక్ కలర్ ఔట్ఫిట్లో అదితి వయ్యారాలు విచిత్రమైన షర్ట్తో కనిపించిన అనసూయ డిమ్ లైట్ వెలుగులో టెంప్ట్ చేస్తున్న శ్రీలీల అందాల విందు చేస్తున్న 'బంగార్రాజు' బ్యూటీ దక్ష తమిళ పాటకు అనుపమ క్యూట్ స్టెప్పులు సోయగాలతో సెగలు పుట్టిస్తున్న సుప్రీత సెల్ఫీతో కేక పుట్టిస్తున్న 'చిరుత' హీరోయిన్ నడిరోడ్డుపై హీరోయిన్ నభా నటేశ్ పోజులు View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
పాయల్ రాజ్పుత్ 'మంగళవారం' నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్
‘అమ్మా డంగురు డంగురు డంగురుమా... అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా... హారతందుకో... మమ్ము ఆదుకో..’ అంటూ మొదలవు తుంది ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియో. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ చిత్రంలోనిదీ పాట. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ భూపతి నిర్మాణ భాగస్వామిగా, స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. బి. అజనీష్ లోక్నాథ్ స్వరపరచిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా వీఎం మహాలింగం పాడారు. ‘‘కొన్నేళ్లపాటు జాతరలలో ఈ పాట వినిపిస్తుంది’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఓ కీలక సందర్భంలో ఈ పాట వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
పెళ్లైనవారు సైతం అదే పనిలో ఉన్నారు.. హీరోయిన్ పోస్ట్ వైరల్!
పాయల్ రాజ్పుత్ పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ కొట్టిన ప్రస్తుతం మంగళవారం సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే మనముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో నటిస్తోన్న పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లో ఉంటోంది ముద్దుగుమ్మ. తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందో తెలుసుకుందాం. ఇప్పుడు తాజాగా పాయల్ చేసిన పోస్ట్లో ఏముందంటే..' నీకు ఇంకా సోల్ మేట్ దొరకలేదని బాధపడకు. పెళ్లైన వారు కూడా సోల్ మేట్ కోసం వెతుకుతూనే ఉన్నారు.' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పాయల్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వారితో పాటు.. పెళ్లయిన వారు కూడా అభద్రతతో ఉన్నారని ఆ పోస్ట్ సందేశం. దీంతో ఈ భామ చేసిన పోస్ట్పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఆర్ఎక్స్100 తర్వాత తెలుగులో సరైన హిట్ దక్కలేదు. వెంకీమామ, డిస్కో రాజా, తీస్మార్ ఖాన్, జిన్నా చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. అందం ఉన్నా ఈ అమ్మడుకి కలిసిరావడం లేదు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న మంగళవారం సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పడుతుందో వేచి చూడాల్సిందే. -
చెమటతో తడిసిపోయిన పాయల్.. బీచ్ ఒడ్డున అతుల్య
కెనడా ట్రిప్లో హీరోయిన్ రీతూవర్మ వర్కౌట్ దెబ్బకు పాయల్కు చెమటలు పలుచటి చీరలో మీనాక్షి మెరుపులు బీచ్ ఒడ్డున హీరోయిన్ అతుల్య పోజులు పొట్టి స్కర్ట్లో అరియానా హాట్ స్టిల్స్ తమన్నా పాటకు రమ్యకృష్ణ స్టెప్పులు ఐశ్వర్యా రాజేశ్ హీటెక్కించే ఫొటోలు కేజీఎఫ్ బ్యూటీ కనువిందు చేసే పోజుల్లో View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) #payalrajput pic.twitter.com/DimV0vWESL — 🎭 (@MrXholic69) July 29, 2023 View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by ✨Prakruthi Ananth 💄🎨✨ (@prakatwork) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
Payal Rajput In Kedarnath Temple Pics: కేదార్నాథ్ క్షేత్రంలో పాయల్ రాజ్పుత్ (ఫొటోలు)
-
పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్తో!
'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్ రాజ్పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా 'మంగళవారం'. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకటిరెండు డైలాగ్స్ మాత్రమే ఉన్నప్పటికీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ టీజర్ లో చాలా క్యారెక్టర్స్ ని చూపించారు. వాళ్లందరూ ఆకాశంలో ఏదో వింతను చూస్తున్నట్లు ఉన్న సీన్స్ మాత్రమే చూపించారు. చివర్లో పాయల్ అరుస్తున్న సన్నివేశం, నగ్నంగా ఉన్న సీన్స్ అయితే 'మంగళవారం'పై ఆసక్తిని పెంచుతున్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మేజర్ హైలెట్ గా నిలిచింది. విడుదల తేదీ ప్రకటించలేదు గానీ ఇదేదో బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) -
టాలీవుడ్ డైరెక్టర్లపై పాయల్ రాజ్పూత్ సెన్సేషనల్ కామెంట్స్
2018 జులై 12.. 'ఆర్ఎక్స్ 100' థియేటర్లో విడుదలైంది. సినిమా హిట్.. అందాల విందుతో పాటు అదిరిపోయే నటనను ప్రదర్శించిన పాయల్ రాజ్పూత్ గురించి అప్పట్లో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్డమ్ సాధించింది..’ అనుకున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ లిస్ట్లో ఉంటుందని అందరూ భావించారు కానీ అది నిజం కాలేదు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఆమెకు ఫ్యాన్ బేస్ పెరిగింది కానీ. తరువాత తను చేసిన సినిమాల విషయంలో ఎంపిక సరిగా లేకపోవడంతో పాయల్ వెనకపడిపోయింది. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఇలా చెప్పింది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత టాలీవుడ్లో నన్ను కొంతమంది తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే నేను మాత్రమే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను. దాంతో ఇక్కడున్న కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో వారు నన్ను మిస్ గైడ్ చేశారు. పలాన సినిమా మాత్రమే చయండి.. వారితో ఇలా మెలగండి అంటూ సలహాలిచ్చేవారు. చివరకు కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించి, అప్పట్లో నాకున్న ఫేమ్ను వాడుకున్నారని' సంచలన కామెంట్స్ చేసింది పాయల్. ప్రస్థుతం అన్ని రకాలుగా అలోచించే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని పాయల్ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్లో తనకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది. ఎటువంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని తెలిపింది. సినిమా రంగంలో ఎవరైనా టాప్ లోకి వెళతాం.. అలాగే కిందకి కూడా పడిపోతాం ఇదీ సహజం. కానీ వాటిని తట్టుకొని నిలబడాలని ఈ బ్యూటీ పేర్కొంది. నెగటివిటీని వదిలేసి.. పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాని తెలిపింది. 'ఆర్ఎక్స్ 100'తో లైఫ్ ఇచ్చిన అజయ్ భూపతినే తనకు మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబోలో 'మంగళవారం' సినిమాతో మళ్లీ రాబోతున్నారు. ప్రభాస్పై కామెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని పాయల్ తెలిపింది. ప్రభాస్తో కలిసి నటించేందుకు ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నానని తను తెలిపింది. ఆయన హైట్కు తగినట్లు మ్యాచ్ అవుతానని ఈ బ్యూటీ చెప్పింది. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఈ బ్యూటీ ప్రభాస్ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. ఐకాన్ స్టార్ బన్నీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) (ఇదీ చదవండి: Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..) -
మాయ పేటికా మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
మాయా సెల్ఫోన్
‘‘మాయా పేటిక’ సినిమాలో నా మనసుకు దగ్గరైన పాత్ర నాది.. అందుకే ఎంతో ఇష్టపడి చేశాను. సెల్ఫోన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అని హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రమేష్ రాపర్తి మాట్లాడుతూ– ‘‘మాయా పేటిక’ ద్వారా సెల్ఫోన్ కథ చెబుతున్నాం. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘రెగ్యులర్ కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు మాగుంట శరత్ చంద్రా రెడ్డి. ‘‘నా కెరీర్లో ‘మాయా పేటిక’ ముఖ్యమైనది’’ అన్నారు పాయల్ రాజ్పుత్. ‘‘అద్భుతమైన డ్రామా, వినోదం, సంగీతం ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సిమ్రత్ కౌర్. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్యామల, రజత్ రాఘవ్ మాట్లాడారు. -
నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే: పాయల్ రాజ్పుత్
‘తండ్రీకూతుళ్ల అనుబంధం అపురూపమైనది.. మాటల్లో వర్ణించలేనిది. నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే. అర్ధరాత్రివరకూ సాగే కబుర్లు, సరదా ఆటలు, చిన్నపాటి సాహసాలు వంటివి తండ్రీకూతుళ్ల అనుబంధాలను చాలా స్పెషల్గా మార్చుతాయి. మా లైఫ్లో అలాంటి ప్రత్యేక సమయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారే నా బలం. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆయనే’ అని పాయల్ రాజ్పుత్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి విమల్కుమార్ రాజ్పుత్ గురించి పాయల్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ► జీవితం అంటే ఏంటో మా నాన్న నాకు నేర్పించారు. అలాగే మనతో మనం నిజాయతీగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో డైరెక్షన్లో వెళుతుంది. తండ్రీ కూతురి జీవితం కూడా అంతే. మా లైఫ్ వెళ్లే డైరెక్షన్ ఏదైనా మా బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. అది ‘అన్బ్రేకబుల్’. ► చాలా విషయాల్లో మా నాన్న నాకు స్ఫూర్తిగా ఉంటారు. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి తిరిగి ఎలా పుంజుకోవాలి? అనే విషయాలు మాత్రం నాన్న నుంచే నేర్చుకున్నాను. అలాగే తోటివారితో ఎలా మసులుకోవాలో కూడా ఆయన్ను చూసే తెలుసుకున్నాను. హార్డ్వర్క్ చేసేవారికి ఉండే విలువ ఏంటో నాన్న నాకు చెప్పారు. అలాగే మనం నమ్మిన విషయానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. నా కలల విషయంలో రాజీ పడకుండా నన్ను నేను ఓ బెటర్ పర్సన్గా తీర్చిదిద్దుకోవడానికి మా నాన్నగారి మాటలు, ఆచరణ విధానాలే నాకు దోహదపడ్డాయి. ► మా నాన్న చాలా ట్రెడిషనల్. నేను యాక్టింగ్ని కెరీర్గా ఎంచుకున్నా.. నటనపై నాకు ఉన్న ప్యాషన్ను, సినిమా ఇండస్ట్రీ పంథాను అర్థం చేసుకున్నాక నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వృత్తిపరంగా నిరూపించుకునే విషయంలో అసలు ఏ మాత్రం తగ్గొద్దు అని అంటుంటారు. అంతేకాదు..కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. నిజానికి మా నాన్న ఒకప్పుడు యాక్టర్ కావాలనుకున్నారు. అయితే కుదరలేదు. ఇప్పుడు ఆయన కలను నేను నిజం చేసినందుకు గర్వంగా ఉంది. ► ఓ నటిగా నా కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మా నాన్న నాతో మరింత ఆప్యాయంగా మాట్లాడతారు. ‘నీ ప్రయాణంలో జయాపజయాలు ఓ భాగం మాత్రమే. వైఫల్యాలు ఎదురైతే వాటిని మైండ్కు ఎక్కించుకోకు. ఏదైనా తాత్కాలికమే. ఏదీ శాశ్వతం కాదు. సో.. జీవితం ఎలా వస్తే అలా ఉండు.. హ్యాపీగా ఉండు’ అంటారు. -
పాయల్ రాజ్పుత్ ‘మంగళవారం’ షూటింగ్ పూర్తి
‘ఆర్ఎక్స్ 100’ వంటి హిట్ మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉండగా, ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది’’ అన్నారు. స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు రానటువంటి కొత్త జానర్ కథతో ‘మంగళవారం’ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 99 రోజులు చేస్తే.. అందులో 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
మాయా పేటిక రిలీజ్ డేట్ ప్రకటించిన కీర్తి సురేశ్
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. విడుదల తేదీని హీరోయిన్ కీర్తీ సురేష్ ప్రకటించారు. రమేష్ రాపర్తి మాట్లాడుతూ – ‘‘ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘కొత్త కథతో ‘థ్యాంక్ యూ బ్రదర్’ చిత్రాన్ని నిర్మించాం. ఆ సినిమాకి లభించిన ఆదరణతో ఎంతో నమ్మకంతో మరో కొత్త కథాంశంతో ‘మాయాపేటిక’ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్. -
బోల్డ్ లుక్ లో పాయల్ రాజపుత్...
-
పాయల్ రాజ్పుత్ సెన్సేషనల్ ఫస్ట్ లుక్
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్ ఫస్ట్లుక్ని విడుదల చేశారు మేకర్స్. 'మంగళవారం' సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు. ఆ లుక్ చూస్తే... పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాయల్ లుక్ నెట్టింట్ వైలర్ అవుతోంది. (చదవండి: రాహుల్ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?) ఈ సినిమా గురించి అజయ్ మాట్లాడుతూ.. 'గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది' అని అన్నారు. ‘ 'ఆర్ఎక్స్ 100'లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ 'మంగళవారం'లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది’ అన్నారు నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. Shailuu... will stay in your hearts for a long while 🔥 Presenting @starlingpayal in a never-seen-before role from our new-genre film #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋@DirAjayBhupathi @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/IYJmL7eHd1 — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 25, 2023 -
షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాయల్ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన అనారోగ్యం గురించి చెప్పి షాక్ ఇచ్చింది. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తెలిసిందే. 'నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని ఫలితంగా ఇలా జరిగింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అడ్డంకులు ఎదురైనా అధిగమించాలి. అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్. ఇక నాలా మీరు మాత్రం చేయకండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి' అంటూ పాయల్ సూచించింది. ఆర్ఎక్స్ 100తో హిట్ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్లోనే పాయల్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
హిట్ కాంబినేషన్స్ రిపీట్.. ఆ హీరోయిన్సే కావాలంటున్న డైరెక్టర్స్!
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్కు చాలా క్రేజ్ ఉంటుంది. హిట్ అయిన సినిమాలో హీరో, హీరోయిన్స్ మళ్లీ నటిస్తున్నారన్నా.. సక్సెస్ సాధించిన సినిమా డైరెక్టర్, హీరో కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందన్నా.. సినీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వసూళ్లు...మార్కెట్ లెక్కలు మారిపోతుంటాయి. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇలా హీరోయిన్-డైరెక్టర్ కాంబోకి కూడా బాక్సాపీస్ దగ్గర ఫుల్ క్రేజ్ వుంది. ప్రజెంట్ టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమకు సక్సెస్ అందించిన డైరెక్టర్స్ మూవీస్లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో హీరోయిన్గా నటించింది పూజాహెగ్డే. బుట్టబొమ్మ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా నుంచే పూజాహెగ్డే బుట్టబొమ్మగా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన పూజా... ఇప్పుడు #SSMB 28 లో మహేశ్కు జోడీగా నటిస్తోంది. త్రివిక్రమ్-పూజాహెగ్డే కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న #SSMB 28 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మే నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను ఉగాది రోజు వెల్లడించనున్నారు. ఇక సమంతకు డైరెక్టర్ శివనిర్వాణ మజిలీ సినిమాతో మరుపురాని హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి . ఈ సినిమాలో సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ ఖుషి మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ తర్వాత ధియేటర్స్ లోకి వచ్చే చాన్స్ వుంది. తన డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 తోనే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్పుత్ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మంగళవారం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ 30 పాత్రల్లో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతో పాటు...తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తన డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పరిచయం చేసిన హీరోయిన్ మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన మహానటిలో కూడా మాళవికనాయర్ నటించింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ బ్యూటీ కన్ఫార్మ్ కూడా చేసింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సైంధవ్..ఈ పాన్ ఇండియా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుహానీ శర్మ సెలెక్ట్ అయింది. గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో రుహానీ శర్మ నటించింది. క్రేజీ కాంబినేషన్స్ గా రాబోయే ఈ కాంబో మూవీస్ బాక్సాపీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి! -
'ఆర్ ఎక్స్ 100' డైరెక్టర్తో పాయల్ రాజ్పుత్.. ఈసారి హిట్టు గ్యారెంటీనా?
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో సూపర్హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా యూత్కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ జోష్తో ఆయన మహాసముద్రం సినిమాను రూపొందించారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్తో రానున్నారు. ఇప్పటికే దీనికి 'మంగళవారం' అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్పుత్ హీరోగా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. లేడీ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ ఈ వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. -
నీ వల్లే నా జీవితం ఇలా.. పాయల్ రాజ్పుత్ భావోద్వేగ పోస్ట్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్పుత్. తొలి సినిమాతోనే తనదైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ గతంలో పంజాబీ నటుడు, గాయకుడు సౌరభ్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది భామ. తాజాగా అతనిపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తపరిచింది. ఇవాళ సౌరభ్ బర్త్డే సందర్భంగా అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. తన ఇన్స్టాగ్రామ్లో మరింత సన్నిహితంగా దిగిన చిత్రాలను షేర్ చేసింది పంజాబీ భామ. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. పాయల్ తన ఇన్స్టాలో రాస్తూ..'గత కొన్నేళ్లు మీకు చాలా కష్టంగా గడిచాయని తెలుసు. జీవితం చాలా కఠినమైంది. అలాగే మీరు కూడా కఠినం. నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ చిరునవ్వు, ప్రేమ నా జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా చేస్తాయి. నేను నిరాశగా ఉన్నప్పుడు మీరు నన్ను నవ్విస్తారు. మీరు నాకు బహుమతులిచ్చారు. నా జీవితాన్ని పంచుకోవడంలో చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి మీరే. ఆ దేవుడు మీకు దీర్ఘాయువుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే గతంలోనూ సౌరభ్తో ఉన్న అనుబంధాన్ని తెలిపింది పాయల్ రాజ్పుత్. ఓ ప్రోగ్రామ్లో సౌరభ్తో కలిసి పాయల్ డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత సౌరభ్కు లిప్ కిస్ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్న పాయల్ రాజ్పుత్ సౌరభ్తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. అయితే టాలీవుడ్లో ఇటీవల ఆమె నటించిన జిన్నా మూవీ అంత సక్సెస్ కాలేదు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
ఒంగోలులో నటి పాయల్ రాజ్పుత్ హంగామా.. బ్లూ డ్రెస్లో మెరిసిన బ్యూటీ
-
విజయనగరంలో సినీ తారల సందడి.. పోటోలు వైరల్
సాక్షి, విజయనగరం: విద్యలనగరమైన విజయనగరంలో సినీ తారలు శుక్రవారం సందడి చేశారు. అభిమానులను చూసి పులకరించిపోయారు. ముగ్గురు నటీమణులు పట్టణానికి వస్తున్నారని తెలుసుకున్న యువతీయువకులు అంబటిసత్రం జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డుకు చేరుకున్నారు. అభిమాన హీరోయిన్లను చూసేందుకు పోటీపడ్డారు. అంబటిసత్రం కూడలి వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూంను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. షాపింగ్మాల్ దినదినాభివృద్ధి చెందాలని, విజయనగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత కలిగిన వ్రస్తాలను, నగలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సర్దార్ ఫేమ్ రాశి ఖన్నా, ఆర్ఎక్స్ 100, జిన్నా ఫేమ్ పాయల్ రాజ్పుత్లు షోరూమ్ను సందర్శించారు. అన్నిరకాల వ్రస్తాలు, బంగారు ఆభరణాలను చూసి మురిసిపోయారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్ను సందర్శించి, నచ్చినవి కొనుగోలు చేయాలని కోరారు. తమ సినీ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే, రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సీఎమ్ఆర్ షాపింగ్ మాల్ పునఃప్రారంభంలో పాల్గొన్న ఊర్వశివో.. రాక్షసివో సినీ ఫేమ్ అనూ ఇమాన్యూయేల్ అభిమానులతో కేరింతలు కొట్టించారు. సినీ డైలాగ్లతో అలరించారు. -
కామెడీ పేటిక
పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సునీల్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, శ్రీనివాస రెడ్డి, హిమజ, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రమేష్ రాపార్తి దర్శకుడు. శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేసిన నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను.. చాలా బాగుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ తరహా సినిమాలు చేయాలంటే చాలా పరిశోధన చేయాలి’’ అన్నారు పాయల్ రాజ్పుత్. ‘‘సెల్ఫోన్ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాశాను. మంచి కామెడీతో ఫుల్ఫ్యాక్డ్గా ఉన్న సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు రమేష్. ‘‘ఈ చిత్రంలో నక్కిలిసు గొలుసు నారాయణ అనే వాచ్మెన్ పాత్ర చేశాను. కొత్తదనానికే కొత్తగా ఉంటుందీ చిత్రం’’ అన్నారు సునీల్. ‘‘మా బ్యానర్ నుంచి కరోనా సమయంలో వచ్చిన ‘థ్యాంక్యూ.. బ్రదర్’ సినిమాను వీక్షకులు ఆదరించారు. ఆ ధైర్యం, నమ్మకంతోనే ఇప్పుడు ‘మాయా పేటిక’ చిత్రంతో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత శరత్. శ్రీనివాస్రెడ్డి, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. -
'జిన్నా' మూవీ రివ్యూ
టైటిల్: జిన్నా నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, సునీల్, నరేశ్, రఘుబాబు, సత్యం రాజేశ్, చమ్మక్ చంద్ర,సద్దాం తదితరులు నిర్మాణ సంస్థలు: అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాతలు: మోహన్బాబు, మంచు విష్ణు కథ, స్క్రీన్ప్లే: కోన వెంకట్ దర్శకత్వం: ఇషాన్ సూర్య సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు ఎడిటర్: చోటా కే ప్రసాద్ విడుదల తేది: అక్టోబర్ 21, 2022 మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్స్గా నటించారు. స్క్రీన్ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం. జిన్నా కథ ఏంటంటే.. గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్హౌస్ నడుపుతుంటాడు. అప్పుచేసి మరీ టెంట్హౌస్ పెడతాడు. అయితే అతను టెంట్హస్ వేస్తే పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అంతకంతకూ అప్పు పెరిగిపోతుంటుంది. మరోవైపు ఓ గుండా దగ్గర జిన్నా అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే.. తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చేసినట్లే అని కండీషన్ పెడతాడు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్)ఊర్లోకి దిగుతుంది.దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా.. తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్పుత్)తో కలిసి వేసిన పథకం ఏంటి? చివరకు జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగితా కథ. ఎవరెలా నటించారంటే.. జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఢీ సినిమాను గుర్తుచేస్తాయి.యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్గా అనిపించినా తన అందంతో ఆకట్టుకుంటుంది. సన్నీలియోన్ పాత్ర అందరిని మెస్మరైజ్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేశాక, ఆమె పాత్ర కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేశ్, నరేశ్, రఘుబాబు, సునీల్, ‘సత్యం’ రాజేశ్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, ‘వెన్నెల’ కిశోర్, భద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.బిగ్బాస్ ఫేమ్ దివి, త్రిపురనేని చిట్టి గెస్ట్ అప్పీరియన్స్లో కనిపించారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఎలా ఉందంటే..జిన్నా కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్నెస్ ఏమీ లేదు కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సాగుతున్న కథకు ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్పై క్యూరియాసిటీని పెంచింది. సన్నీ లియోన్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. సెకండాఫ్ను కొంచెం డిఫరెంట్గా డీల్ చేసే ప్రయత్నం చేశారు.వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్ ఉన్నట్లు అనిపించడంతో కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదు.ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్ రివ్యూ
మంచు విష్ణుటైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్న ‘మోసగాళ్లు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. తనకు అచ్చొచ్చిన కామెడీ యాక్షన్తో మళ్లీ వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు.ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. Story okish and lil sloppy .. But when vishnu meets sunny Adrenaline kicks in … Action sequences and visuals are awesomest 🔥🔥 Vishnu’s perfection in terms of diction n super heroic swag 👌👌 Climax🔥🙏 3.23/5#Ginna @iVishnuManchu proud of u anna..super undi movie — pakash raj pspk (@pakash787791) October 20, 2022 ‘కథ ఫర్వాలేదు. సినిమా కాస్త నెమ్మదించింది. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్స్ అదిరిపోయాయి’ అంటూ 3.23 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. I completed watching the #Ginna Movie , @iVishnuManchu comeback with his comedy timing like in #dhee, those who went for #sunnyleone will definitely not feel regret , #vishnumanchu did a right choice selecting horrorcomedy zonner,rest is mouth talk. Rating:3/5⭐ Congrats team❤️ — Movie Buff (@UnitedTwood2108) October 20, 2022 #ginna Positive: @iVishnuManchu looks fun nd superb.@SunnyLeone looks beautiful and impressive.@starlingpayal scroes well.Gud Casting.@anuprubens music are backbone.Dances are good.Comedies are worked well. Negative: 1 hlf feel length. Verdict:Fun Entertainment Rating:3.0/5 — pakash raj pspk (@pakash787791) October 21, 2022 #ginna sunny Leone 🔥 intervel twist is shocking Awesome songs and dance . Anup bgm for sunny is goosebumps #randaka #randaka — vishnu admirer (@ranap03816208) October 21, 2022 మరోవైపు ఈ సినిమాపై మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ఆగడం లేదు.. కావాలనే కొంతమంది నెగిటివ్గా ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బాగోలేదంటూ విషప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఓ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారని, ఇది తాను ముందే ఊహించానని విష్ణు ట్వీట్ చేశాడు. As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? 🙄. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj — Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022 -
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మంచు విష్ణు జిన్నా మూవీ ప్రమోషన్స్(ఫొటోలు)
-
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
పాన్ ఇండియా సినిమాల పై మంచు విష్ణు కామెంట్స్
-
దసరాకు మంచు విష్ణు సర్ప్రైజ్.. జిన్నా ట్రైలర్ అవుట్
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు మేకర్స్. దసరా కానుకగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృదం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఇవాళ విడుదలై ట్రైలర్ చూస్తే కామెడీ, హార్రర్ను తలపిస్తోంది. ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
Tees Maar Khan: ఓటీటీలో ‘తీస్మార్ఖాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆది సాయికుమార్ కథానాయకుడిగా విజన్ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తీస్మార్ఖాన్’. అతనికి జోడిగా పాయల్ రాజ్పూత్ నటించింది. ఈ సినిమాలో సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్ జి.గోగణ దర్శకత్వం వహించగా.. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. (చదవండి: Tees Maar Khan Teaser: రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి.. ఆసక్తిగా టీజర్) లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించాడు. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ విలన్గా మెప్పించాడు. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్ జి. గొగణ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
పాయల్ రాజ్పుత్కు చేదు అనుభవం, ఆ ఎయిర్లైన్పై ఫైర్..
‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది వల్లే తనకు ఇలా జరిగిందంటూ పాయల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ఎయిర్ పోర్ట్ సిబ్బంది తన లగేజ్ని డ్యామేజ్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తింది. ఈ సందర్భంగా తన లగేజ్ ఫొటోలను షేర్ చేస్తూ ఇండిగో విమాన సంస్థ సిబ్బందిపై ఫైర్ అయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల పాయల్ ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. దీంతో తన లగేజ్ డ్యామేజ్ అయ్యిందంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది ఆమె. చదవండి: అషురెడ్డి బర్త్డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి ‘డ్యామేజ్ అయిన నా బ్యాగులు చూడండి. ఇందుకు ఇండిగో విమాన సిబ్బందే కారణం. నా లగేజ్ని ఇష్టానుసారంగా విసిరారు. వారి నిర్లక్ష్యం కారణంగా నా లగేజ్ దారుణంగా పాడైంది. ఈ ప్రయాణం నాకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని ఇచ్చింది’ అంటూ ఇండిగో ఎయిర్లైన్ను ట్యాగ్ చేసింది. అనంతరం కాసేపటికే ఆమె మరో ట్వీట్ చేస్తూ ఇండిగో ఎయిర్లైన్పై ప్రశంసలు కురిపించింది. ఇండిగో సిబ్బంది తన సమస్యను పరిష్కరించిందని చెబుతూ థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు తన అభ్యర్థనపై ఇండిగో ఎయిర్లైన్ స్పందించిన తీరుపై ఆమె హర్షం వ్యక్తి చేసింది. వెంటనే స్పందించి తన సమస్యను పరిష్కరించిన ఇండిగో సేవలకు ధన్యవాదాలు అంటూ పాయల్ తన పోస్ట్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే పాయల్ ప్రస్తుతం మంచు విష్ణు ‘జిన్నా’ చిత్రంలో నటిస్తోంది. Check in luggage damaged by Indigo, brutally handled by the staff. Worst experience guys! @IndiGo6E pic.twitter.com/B0dwvtWj0Y — paayal rajput (@starlingpayal) September 14, 2022 Highly elated to share my regards ,Thanks @IndiGo6E for acknowledging my problem. It’s resolved now . Thanks for the quick service . Best wishes from my side 👍 ✈️ #indigo — paayal rajput (@starlingpayal) September 14, 2022 -
మంచు విష్ణు 'జిన్నా' టీజర్ వచ్చేసింది
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఇందులో టెంట్ హౌస్ నిర్వహించే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నట్లు తెలుస్తుంది. 'వీడేందిరా మనల్ని దొబ్బుతున్నాడు..'అంటూ విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. Excited to share #Ginna teaser. Quite eager to bring the movie to you soon. ✊🏽❤️ || #Hindi @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory pic.twitter.com/YUot8WLVC3 — Vishnu Manchu (@iVishnuManchu) September 9, 2022 -
‘తీస్మార్ ఖాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : తీస్మార్ ఖాన్ నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్, సునీల్, పూర్ణ తదితరులు నిర్మాణ సంస్థ :విజన్ సినిమాస్ బ్యానర్ నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ:బాల్ రెడ్డి ఎడిటర్: మణికాంత్ విడుదల తేది: ఆగస్ట్ 19, 2022 ‘ప్రేమ కావాలి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ‘లవ్లీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘తీస్మార్ఖాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 19) విడుదలైన ‘తీస్మార్ ఖాన్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తీస్మార్ ఖాన్(ఆది సాయికుమార్) ఓ అనాధ. తనకు ఒక్కపూట అన్నం పెట్టిందని మరో అనాధ అమ్మాయి వసూధ అలియాస్ వసు(పూర్ణ)ని అమ్మలా చూసుకుంటాడు. వీరిని ఓ పోలీసు కానిస్టేబుల్ దత్తత తీసుకొని పెంచుతాడు. అతను చనిపోయిన తర్వాత వసు భర్త చక్రి(సునీల్), తీస్మార్ ఖాన్ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ జిమ్ సెంటర్ నడుపుకుంటున్న తీస్మార్ ఖాన్ జీవితంలోకి అనుకోకుండా జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తాడు. జీజా రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న ఓ గ్యాంగ్స్టర్. అతని అరాచకాలను ఆడ్డుకునేందుకు నేరుగా హోంమంత్రి శ్రీరంగ రాజన్(శ్రీకాంత్ అయ్యంగార్)నే రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వసు హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు? జీజాకు ఈ హత్యతో ఏదైనా సంబంధం ఉందా? హోమంత్రి రంగ రాజన్కు తీస్మార్ ఖాన్ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? తల్లిలా భావించే వసు మరణం తర్వాత తీస్మార్ ఖాన్కు హోంమంత్రి ఎలాంటి సహాయం చేశాడు. అవారాగా తిరిగే తీస్మార్ ఖాన్ ఎస్సై ఎలా అయ్యాడు? తీస్మార్ ఖాన్పై ముంబై మాఫీయా డాన్ తల్వార్(కబీర్ ఖాన్) ఎందుకు పగ పెంచుకున్నాడు? చివరకు వసుని హత్య చేసిన వారిని తీస్మార్ ఖాన్ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పోలీసు కథా నేపథ్యంలో యాక్షన్, లవ్, థ్రిల్లర్, ఎమోషనల్ ఎలిమెంట్స్తో రూపొందిన చిత్రమిది. కొత్త కొత్త ట్విస్ట్లతో దర్శకుడు కథను బాగా రాసుకున్నప్పటికీ..తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడపడ్డాడు. హీరో ఎలివేషన్కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. తీస్మార్ ఖాన్, వసు బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలతో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే బాల్యం ఎపిసోడ్ కాస్త సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. తీస్మార్ ఖాన్, అనగ కలిసిన తర్వాత సినిమాలో వేగం పుంజుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటి సీన్స్, లవ్ ట్రాక్ సరదాగా సాగుతుంది. వసు మృతి... కథను మలుపు తిప్పుతుంది. ఇంటర్వెల్ ముందు తీస్మార్ ఖాన్ ఎస్సైగా ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్లో వచ్చే ట్విస్ట్లు సినిమాపై ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. మొదట్లో కాస్త సాగదీసినట్లు అనిపించినా.. జీజా మరణం తర్వాత కథలో మరింత వేగం పెరుగుతుంది. అయితే కథలో వచ్చే కొన్ని ట్విస్ట్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. కథ, కథనంలో మరింత జాగ్రత్త పడితే ‘తీస్మార్ ఖాన్’ ఫలితం మరోలా ఉండేది. కమర్షియల్, థ్రిల్లర్ సినిమాను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తీస్మార్ ఖాన్ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ మూడు పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్గా కనిపిస్తూ యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్స్ని కూడా అద్భుతంగా పండించాడు. అనగ పాత్రకు రాజ్పుత్ పాయల్ న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించిది. పాయల్ రాజ్పుత్తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు గుర్తిండిపోతాయి. ఇక పూర్ణ తన పాత్రకు న్యాయం చేసింది. చక్రిగా సునీల్ మెప్పించాడు. ఆయన పాత్రలోని వేరియషన్ ఆడియన్స్ని థ్రిల్కు గురి చేస్తుంది. ఇక ఈ చిత్ర నిర్మాత నాగం తిరుపతి రెడ్డి కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. హోమంత్రిగా శ్రీకాంత్ అయ్యంగార్, విలన్స్గా కబీర్ సింగ్, అనూప్ సింగ్ తమ తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. ఒక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్. రొమాంటిక్ సాంగ్ తెరపై మరింత రొమాంటిగ్ ఉంటుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మణికాంత్ తన కత్తెరకు ఇంకాస్తా పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్లోని కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
మంచు విష్ణు 'జిన్నా' టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే కోన వెంకట్ అందించారు.’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
నేనేం స్టార్ కిడ్ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్పుత్
మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పుత్ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్కు గాయాలు ! ''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. ‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ పేర్కొంది. -
ఆ సినిమాలు నమ్మకాన్ని ఇచ్చాయి: ఆది సాయికుమార్
‘‘తీస్ మార్ ఖాన్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత థియేటర్స్కు జనాలు వస్తారా? రారా అని భయం ఉండేది. అయితే ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2’ చిత్రాలు అందరికీ మంచి నమ్మకాన్ని ఇచ్చాయి. ఆ చిత్రాల్లానే మా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఆది సాయికుమార్. ‘నాటకం’ ఫేమ్ కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా నటించారు. డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఇది. తిరుపతి రెడ్డిగారు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అన్నారు తిరుపతి రెడ్డి. ‘‘ఇప్పటివరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీశాను. ఇప్పుడు పక్కా కంటెంట్, కమర్షియల్ను మిక్స్ చేసి తీసిన సినిమా ఇది’’ అన్నారు కల్యాణ్ జి. గోగణ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యాళ్ల తిర్మల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొన్నారు. -
రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్.. స్టయిలిష్ లుక్లో సన్నీ లియోన్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుక పాత్రలో సన్నీ కనిపిస్తారు. బుధవారం స్టయిలిష్గా ఉన్న రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. ‘‘కమర్షి యల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ విడుదల కానుంది. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి నృత్యాలు అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఉర్రూతలూగించే సంగీతం అందించగా, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఏ అమ్మ కొడుకునైనా కొడతా.. ఆసక్తిగా ట్రైలర్
Aadi Saikumar Tees Maar Khan Trailer Released: ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. 'మా అమ్మని తప్పుగా చూశారు. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతా' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్లోని సన్నివేశాలు చూస్తుంటే పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆది లుక్స్, డైలాగ్ డెలీవరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఆది.. స్టూడెంట్, రౌడీ, పోలీస్ వంటి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసిందే. -
హీరోయిన్ పాయల్ ఇలా మారిపోయిందేంటి?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్పుత్ నటించనుంది. ఈ సినిమాలో ఆమె పచ్చళ్ల స్వాత్రి అనే పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా పాయల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించి ఫస్ట్లుక్ పోస్టర్ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
ఆది, పాయల్ రాజ్పుత్ కెమిస్ట్రీ బాగుంది: నిర్మాత
Producer Nagam Thirupathi Reddy: మంచి కథ పుట్టాలన్నా.. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలన్నా కూడా దాని వెనుక నిర్మాత అభిరుచి, ఇష్టం దాగి ఉంటుంది. ఓ నిర్మాతకు కథ, కథనం నచ్చితే అది తెరపైకి వస్తుంది. నిర్మాతల అభీష్టం మేరకు సినిమాలు కార్యరూపం దాల్చుతాయి. ఎంతో మంది నిర్మాతలు సినిమా మీద ప్యాషన్తో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. గొప్ప గొప్ప సినిమాలను నిర్మిస్తుంటారు. అలాంటి ఓ ధ్యేయంతోనే నిర్మాత ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. డా.నాగం తిరుపతి రెడ్డి ప్రస్తుతం విజన్ సినిమాస్ బ్యానర్ మీద ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా 'తీస్ మార్ ఖాన్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి ముందుగానే ఈ సినిమాను వీక్షించారు. చదవండి: బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లోకి సినిమా.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తీస్ మార్ ఖాన్’ సినిమాను ఇప్పుడే చూశాను. ఎంతో అద్భుతంగా వచ్చింది. అనుకున్నదానికంటే సినిమా ఎంతో బాగా వచ్చింది. ఆది సాయికుమార్ చాలా కొత్తగా కనిపించారు. ఆది, పాయల్ రాజ్ పుత్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సినిమాను వీక్షించిన తరువాత మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాం. నటీనటులందరూ కూడా అద్భుతంగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్కు అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి.. ఆగస్ట్ 19న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన -
మరో విభిన్నపాత్రలో సునీల్.. పోస్టర్ రిలీజ్..
Sunil First Look Poster From Tees Maar Khan Movie: కమెడియన్గా, హీరోగా, విలన్గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ చిత్రంలో 'చక్రి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో సునీల్ సీరియస్గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్ సింగ్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్ ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. -
బీచ్లో ఆది, పాయల్ రొమాన్స్.. ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సాంగ్
ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ సింగిల్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘సమయానికే’ అంటూ సాగే ఈ మెలోడీ ట్యూన్కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా శ్రుతి ఆలపించారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ వీడియో సాంగ్లో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పుత్లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు. ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఆగస్ట్ 19న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
పాయల్తో ఆది సాయి కుమార్ రొమాన్స్.. ఆసక్తిగా 'తీస్ మార్ ఖాన్' టీజర్
Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released: 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో అలరించాడు. ఇటీవల 'బ్లాక్' మూవీతో సందడి చేసిన ఆది సాయి కుమార్ అంతగా మెప్పించలేకపోయాడు. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు ఆది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ చేతిలో తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెలో తదితర చిత్రాలు ఉన్నాయి. తాజాగా 'తీస్ మార్ ఖాన్' మూవీ టీజర్ రిలీజ్ అయింది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. 'రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి' అంటూ డైలాగ్తో వచ్చే ఆది ఎంట్రీ బాగుంది. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ విలన్గా అలరించనున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్ జి గొగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్ కీలక పాత్రు పోషిస్తున్నారు. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. -
స్టేజ్పై లవర్కు లిప్లాక్ ఇచ్చిన పాయల్ రాజ్పుత్..
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్పుత్d. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు, గాయకుడు సౌరభ్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం సంకోచించదు పాయల్. తాజాగా మరోసారి తన లవర్ సౌరభ్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది పాయల్ రాజ్పుత్. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ప్రోగ్రామ్లో సౌరభ్తో కలిసి పాయల్ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ తర్వాత సౌరభ్కు లిప్ కిస్ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అంతేకాకుండా యాంకర్ అడిగే ప్రశ్నలకు సిగ్గుతో తబ్బిబ్బయింది. హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్న పాయల్ రాజ్పుత్ సౌరభ్తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కిరాతక, తీస్మార్ఖాన్ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్గా స్పందించిన హీరోయిన్ -
హన్మకొండలో పాయల్ రాజ్పుత్ సందడి
వరంగల్లో సినీ నటీ పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించిన బిగ్గెస్ట్ బ్రైడల్ మేకప్ కాంపిటేషన్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మాయిలందరితో కలిసి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. మేకప్ కాంపిటీషన్కు పలు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది మోడల్స్ పాల్గొన్నారు. ఫ్యాషన్ షో తో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. కాగా పాయల్ రాజ్పుత్ బిగ్బాస్ తెలుగు ఓటీటీ నాన్స్టాప్ షోలో బిందుమాధవికి మద్దతు పలికిన విషయం తెలిసిందే! నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి అంటూ బిందుకు సపోర్ట్ చేసింది. చదవండి 👇 ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
బిగ్బాస్ తెలుగు నాన్స్టాప్లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిచి రియాలిటీ షో బిగ్బాస్. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారి ఈ సో బిగ్బాస్ ఓటీటీ నాన్స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవుతుంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షోకి కూడా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ షో చివరి వారానికి చేరుకుంది. బిగ్బాస్ ఓటీటీ తొలి సీజన్ టైటిల్ను సొంతం చేసుకునేదెవరో తెలిసేందుకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌజ్లోని కంటెస్టెంట్స్ అంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. చదవండి: Bigg Boss Non Stop: బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే! ఈ నేపథ్యంలో బిగ్బాస్ నాన్స్టాప్లో తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్పుత్ కూడా సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. చదవండి: సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో బిందు ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్ చేసింది పాయల్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్లో ట్రోఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. -
నెల్లూరులో సందడి చేసిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ (ఫొటోలు)
-
‘గాలి నాగేశ్వరరావు’ సందడి మళ్లీ మొదలైంది
గాలి నాగేశ్వరరావు (మంచు విష్ణు చేస్తున్న పాత్ర పేరు) సందడి హైదరాబాద్లో మళ్లీ మొదలైంది. మంచు విష్ణు, పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ ప్రధాన తారాగణంగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు మోహన్బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. విష్ణు, సన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్లో విష్ణు, సన్నీ చేసిన ఓ సరదా రీల్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కోన వెంకట్, కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
శ్రీవారిని దర్శించుకున్న పాయల్ రాజ్పుత్.. ఫోటోలు వైరల్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పాయల్
Heroine Payal Rajput Visits Tirumala: ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తిరుమలలో సందడి చేసింది. ఆదివారం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. సాంప్రదాయబద్దంగా లంగా ఓణీలో తిరుమలకు విచ్చేసింది. తిరుమలకు రావడం సంతోషంగా ఉందని పేర్కొంది ఇక దర్శనం అనంతరం ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కాగా ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నట్లు చెప్పింది. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని, వీటితో పాటు తీస్మార్ఖాన్, గోల్మాల్, కిరాతక వంటి సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. -
ఆది సాయికుమార్ ‘తిస్మార్ ఖాన్’ షూటింగ్ పూర్తి
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై పాయల్ రాజ్పుత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ హై యాక్షన్ వోల్టేజ్ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్ ఇప్పటికే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమా చేశాను. కథ తగ్గ హీరో ఆది సాయి కుమార్ ఎంతో అద్భుతంగా నటించారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు ఏదైతే కథ చెప్పాడో అదే తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు. దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆది సాయి కుమార్ను సరికొత్తగా ఆవిష్కరించే సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. -
సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్గా స్పందించిన హీరోయిన్
Payal Rajput Response On Trolls Over Her PhotoShoot Video: పంజాబీ భామ పాయల్ రాజ్పుత్ ఓ ఫోటో షూట్ చేసి ట్రోల్స్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఒపెన్ టాప్తో ఫొటోలకు పోజుల ఇచ్చి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదుర్కొంది ఈ బోల్డ్ బ్యూటీ. కాగా పాయల్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమాలోనే బోల్డ్గా నటించింది. అయితే ఆ సినిమా తర్వాత వెంకి మామ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఈ భామకు తక్కువే ఉన్నాయి. చదవండి: సిరివెన్నెల చివరి పాటపై సాయి పల్లవి భావోద్వేగం ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పాయల్.. ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకోవడానికి హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. అలా ఫోటో షూట్స్ చేసి వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల ఓ ఫోటోషూట్కు సంబంధించి ‘బి హైండ్ ది సీన్స్’ అంటూ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండటంతో వెంటనే తేరుకుని డిలీట్ చేసేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు డౌన్లోడ్ చేసి తెగ వైరల్ చేశారు. చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన ఆ వీడియో షేర్ చేస్తూ పాయల్ను ట్రోల్ చేశారు విమర్శకులు. ఈ క్రమంలో ట్రోల్స్పై స్పందించిన పాయల్ విమర్శకులను నిందిస్తూ ‘ఇతర మహిళల వద్ద ఉన్నదే నా దగ్గర ఉంది. వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు’ అంటూ బోల్డ్గా కౌంటర్ ఇచ్చింది. అలాగే ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చూసి టార్గెట్ చేయడం మానుకోవాలని విమర్శకులను కోరింది. ఆన్లైన్లో పని లేని వాళ్ళు వీడియోను మార్ఫింగ్ చేసి దానిని వ్యాప్తి చేశారని ఆమె ఆరోపించింది. లోదుస్తులు లేకుండా కోటుతో చేసిన ఫోటోషూట్లో పాయల్ అభ్యంతరకరంగా కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ -
Payal Rajput: అందాల భామ.. ఆరాధ్య నాయిక!
ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన అందాల భామ పాయల్ రాజ్పుత్. గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ. బోల్డ్ ఫోటోలతో సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్తో రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్న పాయల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రియుడి సెన్సేషనల్ ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. నేడు(డిసెంబర్ 5) ఈ బ్యూటీ 29వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పాయల్ రాజ్పుత్ స్పెషల్ వీడియో మీకోసం.. -
వైరల్ అవుతోన్న హీరోయిన్ త్రోబ్యాక్ పిక్, ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?
ఈ మధ్య సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన తారలంతా మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తమ త్రోబ్యాక్ ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. దీంతో నెట్టింట త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. తాజా మరో హీరోయిన్ చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తుంది. గుర్తపట్టనంతగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తించడం కొంచం కష్టంగా ఉన్న పట్టిపట్టి చూడగా ఆమె ఎవరో చెప్పేస్తున్నారు నెటిజన్లు. చదవండి: సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా? ఇంతకి ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టరా? అయితే ఇక్కడే ఓ లుక్కేయండి. రెండు పిలకలు వేసుకుని చక్కగా ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు తెలుగునాట క్రేజీ హీరోయిన్. తన అంద చందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. మొదటి సినిమాతోనే అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది ఈమె. ఎవరో గుర్తుపట్టారా.? ఈమె నటించిన తొలి చిత్రానికి దర్శకుడు అజయ్ భూపతి.. కనిపెట్టేశారా.? ఆమెవరో కాదు పంజాబి భామ పాయల్ రాజ్పుత్. రేపు ఆమె బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. చదవండి: విషాదం... అఖండ మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్పుత్.. ఆ సినిమాలో నటనకు గానూ మంచి మార్కులు కొట్టెసింది. అంతేకాకుండా బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్టరస్గా కూడా సైమా అవార్డు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాయల్ రాజ్పుత్ తమిళ, పంజాబీ, కన్నడ, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్ట్స్కు సంతకం చేసింది. -
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి ఫోటోలు
-
గోవాలో పాయల్తో ‘తీస్ మార్ ఖాన్’ రొమాన్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తోంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది. హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయల్ రాజ్పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా, ఇది వరకు చూడని సరికొత్త క్యారెక్టరరైజేషన్తో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్పై మంచి రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలవనుంది. విజన్ సినిమాస్ పతాకంపై ఈ సినిమా ను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు. -
బిగ్బాస్: ఆ కంటెస్టెంట్ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్!
19 మందితో కళకళలాడిపోయిన బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు ఆరుగురు వెళ్లిపోగా అందులో ఐదుగురు ఆడవాళ్లే కావడం గమనార్హం. ఇక ఈ వారం ఒకరిని పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఈసారి కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో.. ఇలా 8 మంది నామిషన్లో ఉన్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈపాటికే ప్రచారానికి దిగిన విషయం తెలిసిందే! అయితే ఓ కంటెస్టెంట్ కోసం ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్కు ఓటేయమంటూ జనాలను అభ్యర్థిస్తోంది. ఆమె మరెవరో కాదు 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్పుత్. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపిందీ భామ. 'నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్బాస్ హౌస్లో ఉన్నాడు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. నేను కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామ్ పర్ఫామెన్స్ చూసి ఓ మై గాడ్ అనుకున్నాను. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ నీకెప్పుడూ ఉంటాయి. శ్రీరామ్కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదేనని గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చింది. -
Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్!
-
కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి.. వీకెండ్ తలుపు తీసిన లావణ్య
►► కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి ►► వీకెండ్లో అక్కడ ఎవరంటున్న లావణ్య త్రిపాఠి ►► పికాసో పెయింటింగ్లా పాయల్ రాజ్పుత్ ►► సముద్రంలో హన్సిక మోత్వానీ ►► రెడ్ డ్రెస్లో అదరగొడుతున్న ‘అల వైకుంఠపురంలో’ బ్యూటీ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
సినీ నటి పాయల్ రాజపుత్ పై కేసు నమోదు
-
పాయల్ రాజ్పుత్పై కేసు నమోదు
సాక్షి, పెద్దపల్లి: సినీనటి పాయల్ రాజ్పుత్పై కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. జూనియర్ సివిల్ ఇన్చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. (చదవండి: జగిత్యాలలో పాయల్ రాజ్పుత్ సందడి) -
సరికొత్త లుక్లో ఆది సాయికుమార్
డిఫరెంట్ జోనర్ మూవీస్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్. ఇప్పుడు ఆది కథానాయకుడిగా నాటకం ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విజన్ సినిమా బ్యానర్ ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం(ఆగస్ట్ 15) రోజున టి.ఎం.కె(TMK) అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్రెడ్డి సినిమాటోగ్రాఫర్, మణికాంత్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. -
శాండల్వుడ్కి సై అంటున్న పాయల్ రాజ్పుత్
కన్నడ పరిశ్రమ నుంచి ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్కు పిలుపొచ్చింది. కన్నడ హీరో ధనుంజయ నటిస్తున్న తాజా చిత్రం ‘హెడ్ బుష్’లో హీరోయిన్గా పాయల్ రాజ్పుత్ నటించనున్నారు. ఆదివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. శూన్య డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం బెంగళూరులో ప్రారంభం కానుంది. ఓ డాన్ జీవితం ఆధారంగా 1960–1980 కాలంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందనేది శాండల్వుడ్ టాక్. బెంగళూరుతో పాటు మైసూర్, కోలార్ ప్రాంతాల్లో ‘హెడ్ బుష్’ సినిమా షూట్ను ప్లాన్ చేశారట. అంతేకాదు.. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కన్నడ పరిశ్రమలో హీరోయిన్గా పాయల్ రాజ్పుత్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు తెలుగులో ఆదీ సాయికుమార్ సరసన ‘కిరాతక’, తమిళ చిత్రం ‘ఏంజెల్’ చిత్రాలు చేస్తున్నారు పాయల్ రాజ్పుత్. ఇక పోలీసాఫీసర్గా పాయల్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘5 డబ్ల్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
జగిత్యాలలో పాయల్ రాజ్పుత్ సందడి
సాక్షి, జగిత్యాలటౌన్: తెలుగు సినిమా కథానాయకి పాయల్ రాజ్పూత్ జిల్లా కేంద్రంలో ఆదివారం సందడి చేశారు. పట్టణంలోని మోచీబజార్లో ఏర్పాటు చేసిన ఆనంద్ షాపింగ్ మాల్ను ఆమె ప్రారంభించారు. ఆర్ఎక్స్–100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరయ్యారు. సినీ హీరోయిన్ వస్తున్నారనే సమాచారంతో వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో మోచీబజార్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పాయల్ రాజ్పూత్ మాట్లాడుతూ జగిత్యాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను ఆదరిస్తున్న అభిమానులు, ఆనంద్ షాపింగ్ మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. -
క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్తో `కిరాతక’, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే..
ఆది సాయికుమార్, పాయల్రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం‘కిరాతక’.ఎం.వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు.కిరాతక టైటిల్తో పాటు ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ముగించుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ .. ఆది, వీరభద్రమ్ల హిట్ కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్తో వస్తోన్న చిత్రమిది. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ టెక్నికల్గా హైస్టాండర్స్లో నిర్మించబోతున్నాం. కిరాతక తప్పకుండా కమర్షియల్గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’అని అన్నారు. ఆదిసాయి కుమార్, పాయల్ రాజ్పుత్ మధ్య కెమిస్ట్రీ తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు దర్శకుడు ఎం వీరభద్రమ్. -
అది రిలేషన్ కాదన్న నటి, బెదిరించిన మంచు లక్ష్మి
► చబ్బీ లుక్లో అనుపమ పరమేశ్వరన్ ► ఫిష్ కట్ గౌనులో అషూ రెడ్డి అందాలు ► రిలేషన్షిప్ మూడు నెలలకన్నా ఎక్కువ కాలం నిలవలేదంటే దాన్ని ఇంటర్న్షిప్ అని పిలవండంటోన్న ఊర్వశి రౌతేలా ► అద్దంలో కనిపించే వాళ్లే మీకు పోటీ అంటున్న అఖిల్ సార్థక్ ► బ్లాక్ డ్రెస్లో కవ్విస్తోన్న పాయల్ రాజ్పుత్ ► గొడ్డలి పట్టుకుని బెదిరిస్తున్న మంచు లక్ష్మీ ► ఒక వీడియోలో నవ్విస్తూ మరో వీడియోలో ఏడిపిస్తోన్న మెహబూబ్ దిల్సే ► చెన్నైక్ టాటా చెప్పేసి ముంబై చేరుకున్న శ్రద్దాదాస్ ► పూల చీరలో సాక్షి అగర్వాల్ పరువాలు ► క్యూట్గా అనిపిస్తోందంటోన్న హంసా నందిని View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by ANMOL CHAUDHARY (@anmolchaudharyofficial) -
బాయ్ఫ్రెండ్ను హీరోగా చేసేందుకు పాయల్ ప్రయత్నాలు
పాయల్ రాజ్పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకుంది. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు .. గాయకుడు అయిన సౌరభ్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. తాజాగా తనకున్న పరిచయాలతో సౌరభ్ను తెలుగులో హీరోగా చేసేందుకు పాయల్ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. తనకున్న పరిచయాలతో ఇప్పటికే ఓ సినిమాలో ప్రియుడు సౌరభ్ను హీరోగా సెట్ చేసిందని ఫిల్మ్నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఇక పాయల్ ప్రస్తుతం సాయికుమార్ సరసన ‘కిరాతక’అనే మూవీలో నటిస్తుంది. జన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్తో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. -
క్రైమ్ థ్రిల్లర్గా ఆది ‘కిరాతక’ మూవీ, ఫస్ట్లుక్ విడుదల
ఆది సాయికుమార్, పాయల్రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాతక’. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ను ఇటీవల ప్రకటించగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం(జూలై 8) ‘కిరాతక’ ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ స్పష్టం వెల్లించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్పూత్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటివరకు చాలా కథలు విన్నాను. కానీ ఈ థ్రిల్లర్ కథ బాగా నచ్చింది.పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే ఆదితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వీరభద్రమ్, నిర్మాత నాగం తిరుపతిరెడ్డిలకు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ తెలిపింది. నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా విజన్ సినిమాస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3గా ‘కిరాతక’ మూవీ రూపొందుతోంది. మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్ హిట్ కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్తో వస్తున్న ఈమూవీ మేకింగ్ విషయంలో ఎక్కడ తగ్గకుండా నిర్మిస్తున్నాము. డైరెక్టర్ వీరభద్రమ్ కథ వివరించగానే బాగా నచ్చింది. తప్పకుండా మా సినిమా కమర్షియల్గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ జరిపి ఆగస్ట్ 13 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు. అలాగే దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అలాగే దాసరి అరుణ్ కుమార్, దేవ్గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆది ఇంత వరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. ‘కిరాతక’ మూవీ కథ నచ్చి సింగిల్ సిట్టింగ్లోనే ఈ సినిమాలో నటించడానికి పాయల్ రాజ్పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘కిరాతక’గా ఆది సాయికుమార్.. పాయల్తో రొమాన్స్కి రెడీ
ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాతక` అనే పవర్ఫుల్ టైటిల్ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా పాయల్ రాజ్పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ - ‘ఆది కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్పూత్ హీరోయిన్గా నటిస్తుంది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్రెడ్డి గారి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి`` అన్నారు. చిత్ర నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ - ‘‘మా విజన్ సినిమాస్ బ్యానర్లో ఆది సాయికుమార్ , ఎం. వీరభద్రం గారి కాంబినేషన్లో `కిరాతక`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్తో డైరెక్టర్ వీరభద్రం గారు చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం’ అన్నారు. -
Bigg Boss 5: తన నిర్ణయమేంటో చెప్పిన పాయల్
ఒక్కసారైనా బిగ్బాస్ షోలో పాల్గొనాలని కొందరు సెలబ్రిటీలు కలలు కంటుంటారు. అయితే వీరికి భిన్నంగా మరికొందరు మాత్రం బిగ్బాస్ హౌస్లోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్తుంటారు. దీనికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. బిగ్బాస్ హౌస్కు వెళ్లిన చాలామంది ఇమేజ్ డ్యామేజ్ అయితే, కొందరు కంటెస్టెంట్లు మాత్రం షో ద్వారా వచ్చిన పాపులారిటీతో తమ కెరీర్కు పూలబాటను నిర్మించుకున్నారు. ఇదిలా వుంటే తెలుగులో త్వరలో బిగ్బాస్ ఐదో సీజన్ ప్రారంభమవుతుందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎప్పటిలాగే బుల్లితెర స్టార్లతో పాటు ఒకరిద్దరు హీరోయిన్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఆర్ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్పుత్ బిగ్బాస్లో అడుగు పెట్టబోతుందన్న పుకారు ఫిల్మీదునియాలో మార్మోగిపోయింది. ఈ వార్త పాయల్ దాకా చేరినట్లుంది. దీంతో ఈ పుకారుకు చెక్ పెడుతూ తాను బిగ్బాస్ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్బాస్ ఐదో సీజన్లో ఎంట్రీ ఇవ్వడం అనేది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తల్లోకి తనను లాగొద్దని కోరుతూ ట్వీట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు పాయల్ బిగ్బాస్లోకి వెళ్లకపోవడమే మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు. I’m not going to be a part of Big boss 5 telugu . It’s a fake news 🙏🏻 .. it’s a humble request plz don’t drag such rumours! #bigbosstelugu5 — paayal rajput (@starlingpayal) June 10, 2021 చదవండి: బిగ్బాస్ 5 : ముహూర్తం ఫిక్స్, షణ్ముఖ్, దుర్గారావు సహా కంటెస్టెంట్లు వీరే! -
‘బిగ్బాస్’లోకి ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ.. గ్లామర్ డోస్ పెరిగినట్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై రెండో వారంలో ఈ షోని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే ఐదో సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ను జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారట. వారం పదిరోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్ను ఖరారు చేసి, వారిని క్వారంటైన్లో ఉంచి తర్వాత సీజన్ను స్టార్ట్ చేస్తారట. ఇక ప్రతి సీజన్లో కనీసం ఒక్క హీరోయిన్ని అయినా తీసుకురావడం బిగ్బాస్ షో అనవాయితీగా మారింది. ఐదో సీజన్లో కూడా ఆ ఆనవాయితీని కొనసాగించబోతున్నారట. ఈ సారి ఆ అవకాశం ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్ దక్కినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు.. ఐదో సీజన్కి కంటెస్టెంట్గా రావాలని పాయల్ని కోరారట నిర్వాహకులు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. దీనికి పాయల్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలుగు బిగ్బాస్తో పాయల్కి మంచి అనుబంధం ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 లో అతిథిగా మెరుపులు మెరిపించింది ఈ హాట్ బ్యూటీ. తన డ్యాన్స్ షోతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. అందుకే ఇప్పుడు ఏకంగా సీజన్ మొత్తానికి తాను కావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఒకవేళ పాయల్ గనుక బిగ్బాస్ హౌస్లోకి వస్తే.. గ్లామర్కి కొదవే ఉండదని చెప్పొచు. ఈ సీజన్లో పాయల్తో పాటు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, టిక్టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా పాల్గొనబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్బాస్ 5 : ముహూర్తం ఫిక్స్, షణ్ముఖ్, దుర్గారావు సహా కంటెస్టెంట్లు వీరే! -
తళుకు బెళుకు తారలు, అందాల సొగసులు..
♦ అదితి భాటియా సెల్ఫీ మోడ్ ♦ నేనిలాగే ఉంటా, కానీ ఇది యాటిట్యూడ్ మాత్రం కాదంటోన్న కౌశల్ మండా ♦ ఆకాశమే హద్దుగా సాగిపో అని చెప్తోన్న ముమైత్ ఖాన్ ♦ మంచు లక్ష్మీకి కూతురి సర్ప్రైజ్ ♦ అప్పట్లో ఎంతో సేఫ్గా ప్రయాణించేవాళ్లమంటోన్న నోయల్ సేన్ ♦ గుడ్ హెయిర్డే అంటోన్న మాధురీ దీక్షిత్ ♦ ఎందుకో తెలీదు గానీ నిన్నుచూసిన మరుక్షణం నా పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుందంటోన్న అషూ రెడ్డి ♦ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆర్ ఎక్స్ 100 భామ ♦ నన్ను నమ్మండి, నేను నిజంగానే పని చేస్తున్నాను అంటోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niveditha Gowda 👑 (@niveditha__gowda) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
ఏ సాంగ్స్ చేయడం లేదు: పాయల్ రాజ్పుత్
కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వెల్గా వస్తోంది 'బంగార్రాజు'. 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇందులో నాగ్ బంగార్రాజు పాత్రకు అద్భుత స్పందన రావడంతో అదే పేరు మీద సీక్వెల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో పాయల్ రాజ్పుత్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పాయల్.. 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చె బుల్రెడ్డి..' పాటలో ఆడి అలరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మరోసారి ఐటమ్ సాంగ్కు రెడీ అయిందని సోషల్ మీడియాలో కథనాలు రాగానే నిజమేనని నమ్మేశారు అభిమానులు. కానీ ఈ ప్రచారానికి చెక్ పెడుతూ అవన్నీ వుట్టి పుకార్లేనని బదులిచ్చిందీ హీరోయిన్. తాను ఏ స్పెషల్ సాంగ్లో కనిపించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్స్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్లు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. చైతూ జోడిగా ఆయన భార్య, హీరోయిన్ సమంత కనిపించనున్నట్లు సమాచారం. Posting just to make clear I’m not going to be part of any song . Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0 — paayal rajput (@starlingpayal) May 24, 2021 చదవండి: తెలుగు సినిమా చరిత్ర విశేషాలతో ఓ మ్యూజియమ్ ఏర్పాటు చేయాలి -
ఆ నిశ్శబ్దం భయంకరం
‘కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి. లైట్గా జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ని కలవండి’’ అన్నారు పాయల్ రాజ్పుత్. పాయల్ బాయ్ఫ్రెండ్ సౌరభ్ తల్లి మృతి చెందారు. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ – ‘‘నేను, సౌరభ్ హైదరాబాద్లో ఉన్నాం. అనితా ఆంటీ (సౌరభ్ తల్లి) ఢిల్లీలో ఉంటున్నారు. ఒకరోజు ఆంటీ ఫోన్ చేసి జ్వరం వచ్చిందని చెబితే, అది మామూలు జ్వరమేమో అనుకున్నాం. ఎక్కువగా ఏసీ రూమ్లో ఉంటున్నందున శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఉంటుందని ఆంటీ కూడా భావించారు. కానీ ఆ తర్వాత ఆమెకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. సౌరభ్ వాళ్ల అన్నయ్య ఓ హాíస్పిటల్లో జాయిన్ చేశారు. సౌరభ్, నేను ఢిల్లీ వెళ్లాలనుకున్నా కుదర్లేదు. అయితే ఆకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడ్డారు. చివరికి మాకు దూరమయ్యారు. మా పెళ్లి చూడకుండానే వెళ్లిపోయారని బాధగా ఉంది. ఆంటీకి జ్వరం వచ్చిన రోజే హాస్పిటల్లో చేర్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో. ఆమె మరణంతో మా రెండు కుటుంబాల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. దయచేసి ఏమాత్రం కోవిడ్ లక్షణాలు మీలో కనిపించినా, ఆరోగ్యంపరంగా వేరే అసౌకర్యం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు’’ అన్నారు. -
గట్టిగా ఏడవాలని ఉంది : హీరోయిన్
కోవిడ్ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయానని.. ఎంతో బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్పుత్. ప్రస్తుతం తాను మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘నా జీవితంలో ఇదే అతి క్లిష్టమైన దశ. ఎంతో బాధగాఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాను. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నాను’ అని పాయల్ పోస్ట్ పెట్టారు. కాగా, పాయల్ ప్రియుడు సౌరభ్ ఢింగ్రా తల్లి అనితా కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త తనని ఎంతగానో కలచి వేసిందని పాయల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
ఎంతో ప్రేమ చూపించేవారు, కన్నీళ్లు ఆగడం లేదు: పాయల్
'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్పుత్ ఎమోషనల్ అయింది. తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ కన్నీటి పర్యంతమైంది. పాయల్ ప్రియుడు సౌరభ్ ఢింగ్రా తల్లి అనితా కరోనా కారణంగా కన్నుమూసింది. దీంతో తను ఎంతగానే ప్రేమించే ఆవిడ ఇకపై లేదని తెలిసి భావోద్వేగానికి లోనైంది. "మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ, నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. కరోనాను జయించేందుకు మీరు ఎంతో పోరాడారు. కానీ చిట్టచివరకు మిమ్మల్నే కోల్పోయాం. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం అనితా ఆంటీ. మా అమ్మలాగే మీరు కూడా నన్ను గారాబం చేసేవారు. నాపై ప్రేమ చూపించేవారు. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మళ్లీ వెనక్కు తీసుకురావాలని ఉంది. కానీ, అందుకు అవకాశం లేదు కదా!" అని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనితా ఆంటీ చివరిసారిగా.. 'నాకు ఊపిరాడటం లేదు' అని చెప్పిందన్న పాయల్.. తనకు అవకాశం ఉంటే కరోనాను అంతం చేస్తా అని పేర్కొంది. కాగా పాయల్ ప్రియుడు సౌరభ్ ఢింగ్రా తల్లి అనితా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె పరిస్థితి విషమించడంతో ఎలాగైనా బతికించండంటూ దేవుళ్లను వేడుకుంది. తను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంతగానో ఆశించింది. కానీ ఆమె కలలను కల్లలు చేస్తూ అనితా ఢింగ్రా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం విషాదాన్ని నింపింది. చదవండి: నవ్వించడం అంత ఈజీ కాదు: పూజా హెగ్డే కోలీవుడ్ నటికి లెక్చరర్ వేధింపులు ప్రియుడి తల్లి పరిస్థితి విషమం: ప్రార్థిస్తున్న పాయల్