![Nandamuri Kalyan Ram New Movie Launch - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/16/2.jpg.webp?itok=DJGUk0V0)
నందమూరి కల్యాణ్రామ్, రాజేంద్ర,
నందమూరి కల్యాణ్రామ్ హీరోగా నటించనున్న 19వ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై 14వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ యర్నేని, సీఈఓ చెర్రీ కలసి రాజేంద్రకు స్క్రిప్ట్ను అందించారు. ‘‘మార్చి రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యర్నేని అనిల్, సీఈఓ: చెర్రీ.
Comments
Please login to add a commentAdd a comment