Actress Nithya Menon Visits Varadaiahpalem Kalki Ashram, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Nithya Menon: గిరిజన బిడ్డను ఎత్తుకొని ఆడించిన నిత్యామీనన్‌..ఫోటో వైరల్‌

Published Wed, Dec 28 2022 1:27 PM | Last Updated on Wed, Dec 28 2022 5:02 PM

Nithya Menon Visits Varadaiahpalem - Sakshi

ప్రముఖ సినీ నటి, హీరోయిన్‌ నిత్యామీనన్‌ మంగళవారం తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని  కల్కి ట్రస్టుకు చెందిన ఏకం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వరదయ్యపాళెం మండలం కాంబాకం గిరిజనకాలనీలో పర్యటించారు. స్థానికులు, గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఓ గిరిజన బిడ్డని ఎత్తుకొని ఆడించారు. పల్లెటూరి పాటలతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే..  ఇటీవలే ‘వండర్ విమెన్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది నిత్యా. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీ సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement