చిరంజీవి కోసం ప్రభాస్‌ కాంప్రమైజ్‌ కానున్నాడా..? | Will Prabhas Compromise For Megastar Chiranjeevi Vishwambhara Movie? Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

చిరంజీవి కోసం ప్రభాస్‌ కాంప్రమైజ్‌ కానున్నాడా..?

Dec 7 2024 8:50 AM | Updated on Dec 7 2024 10:38 AM

Prabhas Compromise For Megastar Chiranjeevi Vishwambhara Movie

సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్‌ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

‘రాజాసాబ్‌’  చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో  నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్‌ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్‌ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి కోసం ప్రభాస్‌ కాంప్రమైజ్‌
చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్‌ ఛేంజర్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్‌ రాజాసాబ్‌ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్‌ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్‌ ఏప్రిల్‌ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం.  

ప్రభాస్‌ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి.  కె.జి.ఎఫ్‌, సలార్‌ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్‌ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్‌2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్‌ -  ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో ఒక సినిమాతో పాటు ప్రభాస్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్‌ వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా కూడా లైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement