![Radha Madhavam Movie Release On 1st March 2024 - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/02/18/Radha%20Madhavam.jpg.webp?itok=j544ZfA5)
గ్రామీణ ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘రాధా మాధవం’. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ప్రేమకు అర్థం చెప్పేలా మా ‘రాధా మాధవం’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం సందేశాత్మకంగా కూడా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.