పర్యాటకులపై ఉగ్రదాడి హేయం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకులపై ఉగ్రదాడి హేయం

Published Sat, Apr 26 2025 12:19 AM | Last Updated on Sat, Apr 26 2025 12:19 AM

పర్యాటకులపై ఉగ్రదాడి హేయం

పర్యాటకులపై ఉగ్రదాడి హేయం

కందనూలు: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జిల్లాకేంద్రంలోని ఫాస్టర్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు పాస్టర్లు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీ చర్చి చైర్మన్‌ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలోని ప్రజలపై, సైనికులపై దాడులు చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement