బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరింపజేయాలి

Published Fri, Apr 18 2025 1:35 AM | Last Updated on Fri, Apr 18 2025 1:35 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరింపజేయాలి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరింపజేయాలి

నల్లగొండ టౌన్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను మరింత విస్తరింపజేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో జరిగిన టెలికం బోర్డు సలహా సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆ దిశగా ఽఅధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అయినప్పుడే టెలికం రంగం అభివృద్ధిపదంలో పయనిస్తుందన్నారు. అంతకు ముందు ఎంపీ రవిచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గురువయ్య, అధికారులు రవిప్రసాద్‌, మురళికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement