ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Published Tue, Mar 18 2025 12:31 AM | Last Updated on Tue, Mar 18 2025 12:29 AM

నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 30 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్లు కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, బెంషాలం, ఆర్డీఓ రాంచంద పాల్గొన్నారు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 9 అర్జీలు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 9 అర్జీలు వచ్చాయని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా సీఐలు, ఎస్‌ఐలకు ఫోన్‌లో సూచించారు. ఒకవేళ ఫిర్యాదు పెండింగ్‌లో ఉంటే వాటికి సంబంధించిన సమాచారం ఫిర్యాదు దారులకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement