4 Terrorists Killed In Encounter By Security Forces In JK Kupwara Region, Details Inside - Sakshi
Sakshi News home page

Kupwara Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

Published Fri, Jun 23 2023 12:03 PM | Last Updated on Fri, Jun 23 2023 12:32 PM

4 Terrorists Killed In Encounter By Security Forces In JK Kupwar - Sakshi

జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్  జరిగింది. కుప్వారాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు  ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచల్​ సెక్టార్ లోని కాలా అటవీ ప్రాంతంలో  కశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నియంత్రణ రేఖ ద్వారా పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, జూన్ 16వ తేదీ ఉదయం జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.
చదవండి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: రాహుల్‌ గాంధీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement