
జమ్ముకశ్మీర్లో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచల్ సెక్టార్ లోని కాలా అటవీ ప్రాంతంలో కశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నియంత్రణ రేఖ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, జూన్ 16వ తేదీ ఉదయం జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.
చదవండి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు: రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment