బెంగళూరులో  సిద్ధమైన ఆర్మీ డ్రోన్లు!  | Bengaluru-based company manufactured the suicide drones Operation Sindoor | Sakshi
Sakshi News home page

బెంగళూరులో  సిద్ధమైన ఆర్మీ డ్రోన్లు! 

May 9 2025 4:29 AM | Updated on May 9 2025 4:29 AM

Bengaluru-based company manufactured the suicide drones Operation Sindoor

సాక్షి, బెంగళూరు: భారత ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్‌లను బెంగళూరులో తయారు చేశారు. స్వయం చాలితమైన ఈ డ్రోన్లు పాక్‌ ఆక్రమిత కశీ్మర్, పాకిస్తాన్‌లలోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేశాయి. బాలాకోట్‌ దాడి తర్వాత వీటిని ఆర్మీలో చేర్చారు.

 పశి్చమ బెంగాల్‌కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్‌ ఎల్బిట్‌ సెక్యురిటీ సిస్టమ్స్‌ సంయుక్తంగా ఈ డ్రోన్లను తయారు చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీల ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉండడం గమనార్హం. భారత ఆర్మీ ప్రత్యేకంగా 100 డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్‌ చేసింది. ఎలాంటి శబ్దం లేకుండా, తక్కువ ఎత్తులో ఎగురుతూ 5–10 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ డ్రోన్లకు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సత్తా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement