నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జ్‌ షీట్‌ | CBI files first chargesheet in NEET paper leak case | Sakshi

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జ్‌ షీట్‌

Aug 1 2024 8:11 PM | Updated on Aug 1 2024 9:12 PM

CBI files first chargesheet in NEET paper leak case

ఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వెందు, అశుతోష్ కుమార్-1, రోషన్ కుమార్, మనీష్ ప్రకాష్, అశుతోష్ కుమార్-2, అఖిలేష్ కుమార్, అవదేశ్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, ఆయుష్ రాజ్ వంటి నిందితుల పేర్లను చార్జిషీట్‌లో జత చేసింది.  

నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేసింది. ఇందులో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నీట్‌ పేపర్‌ లీకేజీకి సంబంధించి సీబీఐ అధికారులు 58 ప్రాంతాల్లో దర్యాప్తు సోదాలు నిర్వహించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement