పోర్టు బ్లెయర్‌ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా.. | Central Govt Renames Port Blair As Sri Vijaya Puram | Sakshi
Sakshi News home page

పోర్టు బ్లెయర్‌ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా..

Published Fri, Sep 13 2024 6:40 PM | Last Updated on Fri, Sep 13 2024 7:21 PM

Central Govt Renames Port Blair As Sri Vijaya Puram

ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడంలో బిజీగా ఉంది. ఉత్తరాదిలో ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లను మార్చిన కేంద్రం.. తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక, నుంచి పోర్టు బ్లెయిర్‌ పేరును శ్రీ విజయపురంగా పిలవాలని సూచించింది.

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్‌బ్లెయిర్‌ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్‌ నికోబార్‌ పాత్ర ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. 

 

 

 

 

ఇది కూడా చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement