Andaman Nicobar islands
-
పిల్లలతో అండమాన్ దీవిలో యాంకర్ లాస్య ఆటలు (ఫోటోలు)
-
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్షోర్ మినరల్ బ్లాక్లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్షోర్ ప్రాంతాలలో మైనింగ్ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్గా ఎదగడమే లక్ష్యం ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
అండమాన్లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
గోల్స్ సునామీ సృష్టించిన తమిళనాడు.. 60 నిమిషాల్లో 43..
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్షిప్లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి. తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు. శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది. -
చరిత్రను చెరగనివ్వని ద్వీపాలు!
అండమాన్, నికోబార్ ద్వీపవాసులు ‘పునరుద్ధరణ’ను ఆశ్రయించకుండా, చరిత్రను తిరగ రాసుకోవాలని ఉరకలెత్తకుండా తమ గాయపడిన గతాన్నే వాస్తవ వర్తమానంగానూ స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, స్వాతంత్య్ర సమర యోధులు తమ పోరాట ఫలితాలకు ప్రతీకాత్మకమైన ఆ ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించారు.ఎందుకంటే చరిత్రలో రెక్కల కూల్చివేతా ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే... దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాల్లో తమది కూడా ఒకటిగా ఉండేలా చేసింది. కానీ, మితిమీరిన జాతీయవాదంతో ఇప్పుడు అభివృద్ధి కన్నా పేర్ల మార్పుపై దృష్టి పెట్టడం విషాదం.దేశభక్తి గురించి లేదా ‘భిన్నత్వంలోఏకత్వం’ అనే రాజ్యాంగ భావన గురించి దేశం మొత్తంలో ఎలాంటి పాఠాలూ, ప్రబోధాలూ అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉందీ అంటే అవి... అండమాన్, నికోబార్ దీవులే. ఆ దీవుల జనాభాలో ఎక్కువ భాగం (సుమారు ఐదు లక్షల మంది) బ్రిటిష్ వారు ఖైదు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం కలిగి ఉన్నవారే. ఆ తర్వాతి స్థానంలో ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు, నెగ్రిటో జరావాస్, ఒంగెస్, గ్రేట్ అండమానీస్, సెంటినెలీస్ (బయటి ప్రపంచంతో సంబంధం లేని చివరి రక్షిత తెగ) లేదాషాంపెన్, నికోబారీస్ వంటి మంగోలాయిడ్ తెగలకు చెందిన స్థానిక తెగల సభ్యులు ఉన్నారు.‘భారతదేశ భావన’కు ఆధారభూతమైన ఈ సుదూర కేంద్రం నేడు భారతదేశంలోని అనేక వైవిధ్యాల అధివాస్తవిక సమ్మేళనం. స్వాతంత్య్ర పోరాటం, ‘కాలా పానీ’ అపఖ్యాతి (కఠిన శిక్షల విధింపు, సెల్యులార్ జైలు మొదలైనవి) బెంగాల్, పంజాబ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ నుండి ఖైదీలను ఎక్కువగా ఇక్కడికి రప్పించాయి. వారిలో చాలామంది జాతీయ నిర్మాణంలో గుర్తింపునకు, ప్రశంసలకు నోచు కోకుండా మిగిలిపోయారు. వారి గర్వించదగిన వారసుల కోసం మతాలు, ప్రాంతాలు, జాతులకు అతీతంగా విచిత్రమైన ‘హిందూ స్థానీ’ మాండలికాన్ని ఉపయోగించడం ద్వారా మత సామరస్య భావం నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. బెంగాలీలు, తమిళులు, పూర్వాంచలీలు, పంజాబీలు... భారత ప్రధాన భూభాగాన్ని కబళి స్తున్న విషపూరితమైన విభజన, రాజకీయ ‘విభజన’ విధానాలచెంప చెళ్లుమనిపిస్తూ ఇక్కడ తమ బతుకు తాము జీవిస్తున్నారు. దూరంగా (చెన్నై లేదా కోల్కతా నుండి 1,200 కి.మీ), ప్రధాన భూభాగంలో సాగుతున్న ‘దారుణమైన’ రాజకీయాలు అంటకుండా ఉండటం అనేది ఈ దీవులు ఆదర్శవంతమైన ‘మినీ–ఇండియా’ను తలపించేందుకు దోహదపడింది. నిజానికి ‘మేము–వారు’ అనే ఆధిపత్య ధోరణి మతాలు లేదా జాతుల మధ్య కాదు... సామూహిక ‘ద్వీపవాసులు వర్సెస్ ప్రధాన భూభాగవాసుల మధ్య కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రధాన భూభాగ స్థులను దోపిడీదారులుగా చూస్తారు. ప్రధాన భూభాగంలోని సాధా రణ అవగాహన కంటే ద్వీపాలలో చరిత్రపై అభిప్రాయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు జపనీయులతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన మూడేళ్ల పొత్తు గురించి ఇక్కడ మిశ్రమ భావాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు బ్రిటిష్ వారిని మించిన క్రూరత్వంతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి.ఈ శాంతియుత ద్వీపవాసులు పునరుద్ధరణ వాదాన్ని ఆశ్రయించలేదు. లేదా చరిత్రను తిరగరాయలేదు. సంక్లిష్టమైన, గాయపడిన చరిత్రనే తమ వాస్తవ గుర్తింపుగా స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధులు తమ బాధను సూచించే ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఎందు కంటే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కూడా సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాలలో వారు ఒకటిగా ఉండేలా చూసింది.2006లో ఆ ప్రాంతానికి ఒక అడ్మినిస్ట్రేటర్గా, గవర్నర్గా నియ మితుడనయ్యాను. 2004 డిసెంబర్ నాటి ఘోరమైన సునామీ కార ణంగా నష్టపోయిన ద్వీపాలలో ఉపశమనం, పునరావాసం నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన సామాజిక ఆర్థిక విధ్వంసాల నుండి మనం కోలుకున్న ప్పుడు, సమాజం కలిసి ఉండే విధానం వల్ల నేనెంతో ఉపకారంపొందాను. ఒక మాజీ పోరాట యోధుడిగా, నేను సామాజిక అనుకూ లత, శాశ్వతమైన దేశభక్తి, ఇంకా లేహ్ ప్రాంతంలోని సుదూర సరి హద్దు ప్రాంతాలు, కశ్మీర్ ఎతై ్తన ప్రాంతాలు లేదా లోతట్టు ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేకమైన ఒక పెద్ద జాతీయ ప్రయోజనాన్ని చూశాను. తక్కిన ‘భారతదేశం’లో ఇది కనిపించలేదు. చాలా సాధించినా, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ ద్వీపాల వ్యూహాత్మక స్థానం (మలక్కా జలసంధి వద్ద చైనీస్ ‘చౌక్ పాయింట్’ మినహా) – అలాగే హానికి లేదా దాడికి గురయ్యే గిరిజనులకురక్షణగా ఉన్న భౌగోళిక స్థితి, వీటితో పాటుగా... సహజమైన గ్రీన్ కవర్ అభివృద్ధి కోసం గోవా, కేరళ మార్గాల్లో సాంప్రదాయికతకు తలుపులు ‘తెరవడం’పై కొన్ని పరిమితులు అవసరం. ప్రైవేట్ అభివృద్ధి లేనప్పుడు ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. మౌలిక సదుపా యాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి అవకాశాల కొరత కూడా ఒక సవాలు. అయినప్పటికీ ఈ భారతదేశ ‘షైనింగ్ ఔట్ పోస్ట్’ దాని ప్రత్యేక మార్గాలకు, చరిత్రకు కట్టుబడి ఉంది.ప్రధాన భూభాగపు గాలులు, స్వచ్ఛమైన సహజ ద్వీపాలకు చేరు కోవడానికి ఎంతో కాలం పట్టదు. జాతీయవాదాన్ని ప్రోత్సహించ డానికి ప్రముఖ స్థలాల పేర్లను మార్చడం అటువంటి దిగ్విషయా లలో ఒకటి. హ్యావ్లాక్, నీల్, రాస్ దీవులకు వరుసగా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. ద్వీపాలు టూరిజంపై ఎక్కువగా ఆధారపడటం, పర్యాటక ‘బ్రాండ్’ లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లను మార్చటం తగదని మార్కెటింగ్ జ్ఞానం సలహా ఇస్తుంది. అన్నింటికంటే, వాడుకకు చెందిన స్థిరత్వం, నామకరణపు క్లుప్తత, దీర్ఘకాల గుర్తింపును నిర్మించడం అనేది సాధారణ భావన. అయినప్పటికీ, స్థానికులు కోరుకున్నందున పేర్లు మార్చడం జరగలేదు, కానీ మితి మీరిన జాతీయవాదం ఫార్ములా కారణంగా వీటి పేర్లు మార్చారు. ఈ పేరు మార్పు వెనుక చోదకశక్తిగా ఉన్నవారు నేతాజీ మనవడుచంద్ర కుమార్ బోస్. అయితే దిగ్గజ స్వాతంత్య్ర యోధుడి భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ నుండి తనకు మద్దతు లభించ లేదంటూ తర్వాత ఆయన పాలకవ్యవస్థ నుండి వైదొలిగారు.తరువాత, జనావాసాలు లేని 21 ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మార్చారు. భారతదేశపు అర్హులైన వారసులకు నివాళి గనక, ఆచరణాత్మక చిక్కులు కూడా లేవు గనక ఈ పేర్ల మార్పును అంగీకరించడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడులు, ఇంకా చాలా అంశాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అండమాన్, నికోబార్ దీవులకు సరికొత్త జాతీయవాద ఔన్నత్య ‘వైభవం’ సంప్రా ప్తించింది. రాజధాని పోర్ట్ బ్లెయిర్కు ఇటీవల ‘శ్రీ విజయపురం’ అని పేరు పెట్టారు. ఇది ‘వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయ డానికి’ జరిగిందంటున్నారు. ఆర్చిబాల్డ్ బ్లెయిర్ (ఈయన పేరునే పోర్ట్ బ్లెయిర్కు పెట్టారు) బొంబాయి మెరై¯Œ లో సాపేక్షంగా అసంగ తమైన నావికా సర్వేయర్ అని పట్టించుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అతని గురించి తీవ్రమైన దూషణలతో నిండిపోయింది. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చడం గురించి కొంతమంది ద్వీప వాసులకు చేసిన కాల్స్ ఉదాసీనత, ఉద్రేకాలతో మిశ్రమ స్పందనను రేకెత్తించాయి. ద్వీపవాసులకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి కసరత్తులు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. ఇది తప్పు కాదు కానీ ప్రత్యేకించి దేశంలోని మిగిలిన ప్రజలకు గౌరవప్రదమైన దేశభక్తి (అత్యంత తీవ్రమైన జాతీయవాదం కాదు), కలుపుగోలుతనం, లౌకికవాదం గురించి ఒకటి లేదా రెండు విష యాలు చెప్పVýæలవారికి ఇది ఉన్మాద రాజకీయాల పునరావృతమే. పేర్లు మార్పు సరే... అర్థవంతమైన అభివృద్ధి మాటేమిటి? అది జరిగే సూచనలు కనిపించటం లేదు. - వ్యాసకర్త రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్- భోపిందర్ సింగ్ -
పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా..
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడంలో బిజీగా ఉంది. ఉత్తరాదిలో ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లను మార్చిన కేంద్రం.. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక, నుంచి పోర్టు బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా పిలవాలని సూచించింది.ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…— Amit Shah (@AmitShah) September 13, 2024 Central Government renames Port Blair in Andaman and Nicobar Islands to "Sri Vijaya Puram" pic.twitter.com/pw18yukCOl— All India Radio News (@airnewsalerts) September 13, 2024 ఇది కూడా చదవండి: కోల్కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. -
అండమాన్- నికోబార్లో ఓటర్లెందరు? ఏ పార్టీకి కంచుకోట?
అండమాన్- నికోబార్ దీవులలోని ఓటర్ల సంఖ్యను ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 3,15,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 52 శాతం పురుషులు, 48 శాతం మహిళలు. అండమాన్- నికోబార్ దీవుల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బిఎస్ జగ్లాన్ తెలిపిన వివరాల ప్రకారం 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల 5300 మంది ఓటర్లు మొదటిసారి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు కాగా, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు . 2019తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 6 శాతం మేరకు పెరిగింది. ఏప్రిల్ 19న అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బిష్ణు పద్ రేకు ఎన్డిఏ కూటమి టికెట్ ఇవ్వగా, ఇండియా కూటమి నుంచి కుల్దీప్ రాయ్ శర్మను అభ్యర్థిగా నిలిపారు. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎంపీ కుల్దీప్. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి బిష్ణు పద్ రే ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ విశాల్ జాలీకి టిక్కెట్ కేటాయించింది. నాడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుల్దీప్కు 95,308 ఓట్లు రాగా, విశాల్కు 93,901 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అండమాన్ నికోబార్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ 1967లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ గణేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రివర్గంలో కూడా చేరారు. ఆయన 1971లో కూడా గెలిచారు. 1977 నుంచి 1999 వరకు కాంగ్రెస్కు చెందిన మనోరంజన్ భక్త్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1999లో బీజేపీకి చెందిన బిష్ణు పద్ రే తొలిసారిగా ఇక్కడి నుంచి ఎంపీ అయ్యారు. 2004లో మనోరంజన్ భక్త్ తిరిగి గెలిచారు. బిష్ణు పద్ రే 2009, 2014లో ఎంపీగా ఉన్నారు. కులదీప్ రాయ్ శర్మ 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. -
సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్ అమ్మ’ కు పద్మశ్రీ
సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్ అమ్మ’ వార్తల్లోనిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేషకృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో 'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. దక్షిణ అండమాన్లోని రంగాచాంగ్కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను పాటించేలా కృషి చేశారు.. తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత. సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది. స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ అవార్డు దాకా సాగిన చెల్లమ్మాళ్ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. -
Andaman Islands Earthquake: అండమాన్లో భూకంపం..
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. కాగా, రికార్ట్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN — ANI (@ANI) January 10, 2024 ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఏడాది ప్రారంభంలోనే జపాన్ను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి..
పోర్ట్ బ్లెయిర్: ఉపఖండానికి సమీపంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.0 గా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS). ఈ రోజు తెల్లవారుజామున నికోబార్ ద్వీపాల్లో 5.40 గంటలకు 9.32 లాటిట్యూడ్ 94.03 లాంగిట్యూడ్ వద్ద ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ(NCS). ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు. గడిచిన ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి కావడం విశేషం. గత నెల చివర్లో కూడా అండమాన్లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. హిందూ మహా సముద్ర తీరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకారమే అంటున్నాయి NCS వర్గాలు. An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm — ANI (@ANI) August 2, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? -
అండమాన్ను కుదిపేసిన భూకంపం
ఢిల్లీ: అండమాన్ నికోబార్ను ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. పది కిలోమీటర్ల లోతున.. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రతతో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. అండమాన్తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. 2 #earthquakes in the Indian Ocean, magnitude 6.1 Andaman Is, & mag 5.9 southwest Indian Ridge nearer to Africa. @rrichcord @LaytenHolland pic.twitter.com/1W2Vk7blFs — Cecilia Sykala (@CeciliaSykala) July 28, 2023 -
గవ్వలు కావు.. లోహ విహంగాలు ఆగే చోటిది (ఫొటోలు)
-
అండమాన్ లేదా దుబాయ్.. ఎక్కడికి వెళ్లడం ఈజీ?
భారతదేశానికి చెందినవారు విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా దుబాయ్ లేదా అండమాన్ వెళ్లాలని అనుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అటు అండమాన్ లేదా ఇటు దుబాయ్ వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడికైనా ప్రయాణమవుదామనుకుంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అయితే అండమన్ చూసివద్దామనే ఆలోచనను ప్రస్తావించగానే.. చాలామంది అక్కడకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో చక్కగా దుబాయ్ వెళ్లివచ్చేయవచ్చని చెబుతారు. మరికొందరు మాత్రం దుబాయ్ వెళ్లడం చాలా చౌక అని కూడా అంటుంటారు. దీంతో ఈ మాటలు విన్నవారు కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అండమాన్ వెళ్లాలో లేక దుబాయ్ వెళ్లాలో తెలియక తికమకపడతారు. ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ మీ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబయ్ లేదా అండమాన్కు సంబంధించిన టూర్ ప్యాకేజీకి ఎంతఖర్చవుతుందో బేరీజు వేసేందుకు మేక్ మైక్ ట్రిప్లో సమాచారం ఇలా ఉంది. దుబాయ్ వెళ్లేందుకు ఒక వ్యక్తికి సుమారు రూ. 31 వేలు అవుతుంది. ఈ ప్యాకేజీలో ఆరు రోజుల ప్లాన్ ఉంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, మరినా యాచ్ టూర్ మొదలైనవి కలిసే ఉన్నాయి. 6 రోజుల అనంతరం ఎయిర్పోర్టుకు తిరిగి వచ్చేందుకు వరకూ అయ్యే ఖర్చు దీనిలో కలిపే ఉంటుంది. హోటల్ అద్దె కూడా దీనిలో భాగమయ్యే ఉంటుంది. అయితే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్లు విడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.12 నుంచి 15 వేలు ఖర్చవుతాయి. అంటే రెండు వైపుల ఫ్లయిట్ ప్రయాణ ఖర్చులు చూసుకుంటే మొత్తంగా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకూ అవుతాయి. అంటే ప్యాకేజీ, ప్రయాణ ఖర్చులు కలుపుకుని చూసుకుంటే ఒక్కో వ్యక్తి దుబాయ్ వెళ్లి రావడానికి రూ. 60 వేలు అవుతుంది. అండమాన్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబాయ్ గురించిన సమాచారం తెలుసుకున్న తరువాత ఇప్పుడు అండమాన్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకుందాం. రాబోయే ఆగస్టులో అండమాన్ వెళ్లాలనుకుంటే ఒక్కో వ్యక్తికి రూ. 42 వేలు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హెవ్లాక్, నీల్ ఐల్యాండ్ మొదలైనవి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు చొప్పున బస చేయవచ్చు. ఈ ట్రిప్ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, ఫెరీ మొదలైన ఛార్జీలు కలిపే ఉంటాయి. అయితే అండమాన్ వెళ్లేందుకు ఫ్లయిట్ ఛార్జీ విడిగా ఉంటుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు రూ. 30 వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే అండమమాన్ వెళ్లి వచ్చేందుకు రూ. 75 వేల వరకూ ఖర్చవుతుంది. ఈ ప్లాన్ కంపేరిజన్ను అనుసరించి చూస్తే.. అండమాన్ వెళ్లడం అనేది దుబాయ్ వెళ్లేందుకన్నా ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఇది సీజన్తో పాటు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? అక్కడ ఉపయోగించుకునే లగ్జరీ సదుపాయాలు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
గురువారంకల్లా భీకర మోచా తుపానుగా అల్పపీడనం.. భారీ వర్షాలు
పోర్ట్ బ్లెయిర్/భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుపానుగా మారబోతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సంబంధిత వివరాలను భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ‘అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది గురువారంకల్లా భీకర మోచా తుపానుగా మారి ఆ దీవుల్లో భారీ వర్షాలకు కారణమవుతుంది. తర్వాత బంగాళాఖాతం ఆగ్నేయ, సమీప ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 13న కాస్తంత బలహీనపడి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్, మయన్మార్లోని క్యావూక్ప్యూ పట్టణాల మధ్య తుపాను తీరం దాటనుంది. మే 14న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లకపోవడం శ్రేయస్కరం’ అని కోల్కతా రీజియన్ డైరెక్టర్ జీకే దాస్ చెప్పారు. అత్యవసర నిర్వహణ కేంద్రాల ద్వారా నిరంతరం పరిస్థితిని అంచనావేస్తూ తీరప్రాంతవాసులను అప్రమత్తం చేస్తామన్నారు. -
చైనా దూకుడుకు చెక్ పెట్టేలా భారత్ భారీ ప్లాన్..
సాక్షి, అమరావతి: సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడుతున్న అనివార్యతకు ఇది ముగింపు పలకనుంది. దేశ భద్రత ప్రయోజనాలకు కీలక స్థావరంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా నికోబార్ దీవుల్లోని ‘గలాటియా బే’ వద్ద అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును నిర్మించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర మార్గానికి సమీపంలో నిర్మించనున్న ఈ పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలకం కానుంది. అందుకు సన్నాహకంగా 2020లోనే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్, నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్కు చెన్నై నుంచి సముద్రగర్భంలో 2,312 కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మాణానికి రూ.41వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ట్రాన్షిప్మెంట్ పోర్టు లేక ఆర్థిక భారం అతి పొడవైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ భారత్కు అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టు లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. తూర్పు తీరం, పశ్చిమ తీరంలోని పోర్టుల్లో బెర్త్ల వద్ద గరిష్ట లోతు 8 మీటర్ల నుంచి 12 మీటర్లే ఉంది. దీంతో గరిష్టంగా 75 వేల టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన కంటైనర్ నౌకలే ఈ పోర్టులకు వస్తున్నాయి. అంతర్జాతీయ లాజిస్టిక్స్ వ్యాపార ప్రమాణాల మేరకు 1.65 లక్షల టన్నుల నుంచి 1.80 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న కంటైనర్ నౌకల్లో సరుకు రవాణా జరుగుతోంది. అంత పెద్ద కంటైనర్లతో కూడిన నౌకలు రావాలంటే పోర్టుల్లోని బెర్త్ల వద్ద లోతు 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఉండాలి. అటువంటి పోర్టు లేకపోవడంతో వివిధ దేశాల నుంచి వస్తున్న భారీ షిప్లను భారత్కు సమీపంలో ఉన్న సింగపూర్, కొలంబో, క్లంగ్ (మలేషియా), దుబాయిలోని అంతర్జాతీయ షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ 75వేల టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న కంటైనర్లలోకి మార్చి భారత్లోని పోర్టులకు రప్పించాల్సి వస్తోంది. భారత్ నుంచి 75 వేల టన్నులకు మించిన కార్గో రవాణా చేయాలంటే తొలుత చిన్న కంటైనర్లలో సమీప దేశాల్లోని అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ నుంచి భారీ కంటైనర్ ద్వారా గమ్యస్థానాలకు చేర్చాల్సి వస్తోంది. అందుకోసం హ్యాండ్లింగ్ చార్జీల కింద ఒక్కో కంటైనర్ యూనిట్ కోసం 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. భారత్ మొత్తం కార్గో రవాణాలో 25 శాతం నాలుగు విదేశీ ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. అందులో 40 శాతం కొలంబో పోర్టు ద్వారానే సాగుతుండటం గమనార్హం. దీంతో భారత్ ఏటా రూ.5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. చైనా గుప్పిట్లో కొలంబో పోర్టు కొలంబో పోర్టుపై చైనా ఆధిపత్యం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. శ్రీలంక ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా చేసుకుని చైనా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చింది. కొలంబో పోర్టు పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అందుకు ప్రతిగా కొలంబో పోర్టుపై చైనా నియంత్రణను అంగీకరించింది. ఒత్తిడికి లొంగి చైనా యుద్ధ నౌకలు కొలంబో పోర్టులో లంగరు వేసేందుకు శ్రీలంక సమ్మతించింది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొలంబో పోర్టుపై ఆధారపడటం భారత్ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా సరైంది కాదని రక్షణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా కీలకం.. గలాటియా బే - వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణతోపాటు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలక వాటా కోసం నికోబార్లో ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మించాలని భారత్ నిర్ణయించింది. అందుకే అటు హిందూ మహాసముద్రం ఇటు పసిఫిక్ మహాసముద్రానికి సమీపంలో బంగాళాఖాతంలో ఉన్న నికోబార్ దీవిలోని ‘గలాటియా బే’ వ్యూహాత్మక ప్రదేశంగా ఎంపిక చేసింది. - గలాటియా బే ఉంది అంటే గంటకంటే తక్కువ సమయంలో ఆ పోర్టుకు చేరుకోవచ్చు. దీంతో సింగపూర్, కొలంబో, క్లంగ్ పోర్టుల కంటే నికోబార్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఎక్కువగా ఆకర్షించే అవకాశాలున్నాయి. - గలాటియా బే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మలక్కా జలసంధి ముఖద్వారానికి సమీపంలో ఉంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రాలను అనుసంధానించే మలక్కా జల సంధి ద్వారా ఏటా లక్ష నౌకలు రాకపోకలు సాగిస్తాయి. ప్రపంచంలో మొత్తం జల రవాణాలో 25 శాతం ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. - ఆస్ట్రేలియా, జపాన్, కొరియా సముద్ర మార్గంలో గలాటియా బే నోడల్ కేంద్రంగా ఉండటంతో ట్రాన్షిప్మెంట్ పోర్టుకు అనువైందని కేంద్ర ప్రభుత్వ జియోటెక్నికల్ నివేదిక–2016 పేర్కొంది. - అంతర్జాతీయ కార్గో రవాణాలో అగ్రస్థానంలో ఉన్న సింగపూర్, దుబాయి ట్రాన్షిప్మెంట్ పోర్టులకు దీటుగా నికోబార్లో నిర్మించే పోర్టు అభివృద్ధి చెందుతుంది. - బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో భారత్ రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా నిలుస్తుంది. - అక్కడ నిర్మించే పోర్టు బెర్త్ల వద్ద 18 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతు ఉండేలా నిర్మించేందుకు అవకాశం ఉంది. ఆ దీవి వద్ద సముద్ర అడుగు భాగం పూర్తిగా గట్టి రాయితో ఉంది. దీంతో పెద్దగా డ్రెడ్జింగ్ (ఇసుక మేటలు తీయడం) చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా నిర్వహణ వ్యయం తగ్గుతుంది. -
అండమాన్లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు
అండమాన్ నికోబార్ దీవులలోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహిత పేర్లు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పైగా జనవరి 23న పరాక్రమ దివాస్గా పాటించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమునాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. మోదీ 2018లో ఈ దీవులను సందర్శించి వాటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నేతాజీ స్మృతిని పురస్కరించుకుని అక్కడ ఉన్న రాస్ ఐలాండ్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. అలాగే నీల్ ఐస్లాండ్, హావ్లాక్ ఐస్లాండ్ వరుసగా నీల్ ద్వీప్, హావ్లాక్ ద్వీప్గా మారాయి. దేశంలో నిజ జీవితంలోని హిరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికే ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ స్ఫూర్తితోనే మందుకు వెళ్తూ.. ద్వీప సమూహంలోని 21 పేరులేని దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన దేశవీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది. (చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు) -
అత్యాచార ఆరోపణలు.. అండమాన్ మాజీ సీఎస్ అరెస్ట్
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. క అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది. నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. -
అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
వాతావరణంలో వేగంగా మార్పులు...త్వరలోనే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్, నికోబార్ దీవులతోపాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలి పింది. కానీ వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రత అనుభూతి ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నల్లగొండలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని ప్రకటించింది. -
గుడ్న్యూస్ చెప్పిన భారత వాతావరణశాఖ
-
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Forecast In Telangana.. దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ శుభవార్త చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/6NpNiMmPYG — IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022 ఇక, రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు, రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. pic.twitter.com/iR01cGDsAS — IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022 ఇది కూడా చదవండి: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు -
అండమాన్కు చలో చలో
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి పోర్టు బ్లెయిర్కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్ షిప్ నడిచేది. క్రమంగా డిమాండ్ పెరగడంతో నెలకోసారి పరుగులు తీసింది. విశాఖ పోర్టు నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులు, ముఖ్యంగా వలసదారులు ఈ నౌక ద్వారానే అండమాన్ చేరుకునేవారు. ఫుల్ డిమాండ్తో నడుస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందడం... లాక్డౌన్ కారణంగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. తాజాగా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఫుల్ స్వింగ్లో షిప్ ప్రయాణం మొదలుపెట్టింది. శనివారం సాయంత్రం బయలుదేరి.. 450 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం పోర్టుబ్లెయిర్లో పాసింజర్ కార్గో షిప్ క్యాంప్బెల్ బే బయలుదేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది ఇందులో ఉండటం విశేషం. అండమాన్ నికోబార్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరినట్లు షిప్ ఏజెంట్స్ చెబుతున్నారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ట్రాఫిక్ మేనేజర్ రత్నకుమార్ పూర్తి చేశారు. 5న ఫుల్ప్యాక్తో ప్రయాణం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఖరారైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం క్యాంప్బెల్ బే షిప్ విశాఖ నుంచి బయలుదేరనుంది. 8వ తేదీ ఉదయానికి క్యాంప్బెల్ బే.. తిరిగి పోర్టు బ్లెయిర్కు చేరుకోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత నడుస్తుండటంతో టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడు పోయాయి. మొత్తం 500 మంది సామర్థ్యం ఉండగా బుకింగ్స్ ప్రారంభించిన రెండ్రోజుల్లోనే మొత్తం టికెట్స్ విక్రయించేశారు. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను అనుసరించి క్యాంప్బెల్షిప్ని నడుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏవీ భానోజీరావు, గరుడ పట్టాభి రామయ్య అండ్ కో ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్ నేపథ్యంలో మరో షిప్ రెడీ..! క్యాంప్బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ తొలి ప్రయాణంలోనే 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఇంకా కావాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండటంతో మరో షిప్ని కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్కు ఎంవీ స్వరాజ్ద్వీప్ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్ నడిపారు. రెండేళ్ల క్రితం ఇది మరమ్మతులకు గురికావడంతో డాక్యార్డులో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు పూర్తయిందనీ.. త్వరలోనే ఎంవీ హర్షవర్ధన్ షిప్ని విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్కు రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణం చాలా చౌక అండమాన్కు చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్ అనీ.. పర్యాటకుల్ని నాన్ ఐలాండర్గా షిప్ టికెట్స్ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్కు జనరల్ టికెట్ కేవలం రూ.1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్ టికెట్ రూ.3,375 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి అండమాన్కు విమానంలో వెళ్లాలంటే రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. ఎంత లగేజ్ తీసుకెళ్లినా.. ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయడం లేదు. మొత్తం నాలుగు విభాగాలుగా టికెట్స్ విక్రయాలు జరుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. మంచి ప్రారంభం దక్కింది కోవిడ్ తర్వాత అండమాన్కు పాసింజర్ షిప్ ప్రయాణం మొదలు కావడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ప్రారంభం నుంచే ప్రయాణికులు ఆసక్తి చూపించడం శుభపరిణామం. ఈ నెల 3న వస్తున్న షిప్కు బెర్తు, ఇతర సౌకర్యాలు పోర్టు పరంగా పూర్తి చేశాం. ప్రతి ప్రయాణికుడు కనీసం 10–15 పెద్ద సైజు బ్యాగ్లు, లగేజీతో ప్రయాణిస్తుంటారు. ఇందుకనుగుణంగా పోర్టులోకి ఆర్టీసీ బస్సులను కూడా ఆ సమయంలో అనుమతిస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, విశాఖ పోర్టు చైర్మన్ (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతున్న అల్ప పీడనం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ అంచనా వేసింది. ఏదేమైనా తుపాన్ ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది మార్చి 20న అల్ప పీడనంగా మారి..మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుఫాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు. ఆ మొక్కతో పాటు ఆ పేరు కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ఆ మొక్క పేరే ‘జలకన్య’. ఆంగ్లంలో అయితే మెరమైడ్ (Meramaid). అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందట. ఆసక్తిగొలుపుతున్న ఈ మొక్క వివరాలు తెలుసుకోండి. 2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు. మొక్కకు మెరమైడ్ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఫెక్లీ బస్త్ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు. -
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు : ‘అండమాన్ జీవితం’
అండమాన్ జైలు జీవిత నరకం అనుభవించిన మహా వీరులలో ప్రతివాది భయంకరాచార్యుల వారు ప్రముఖులు. వీరి పేరు అసలు వేంకటాచార్యులు. ప్రతివాది భయంకర అనేది వీరి బిరుదనామం. వంశ పారంపర్య సంబంధి కావచ్చు. అండమాన్ జీవితం అని తెలుగులోనూ, ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని ఇంగ్లిష్లోనూ వీరు తమ జైలు జీవితానుభవాలు రాశారు. భారత స్వాతంత్య్ర ఫలసిద్ధి అమృతోత్సవం జరుపుకుంటున్న శుభవేళ ఇటువంటి పుస్తకాలు మళ్ళీ ముద్రించాలి. ఈ పుస్తకాన్ని కాకినాడ శ్రీరామ బాలభక్త సమాజం లైబ్రరీ నుంచి నేను సంపాదించగలిగాను. కాకినాడ పురవీధిలో ఇంగ్లిష్ వారి క్లబ్బు నుంచి వస్తూనో పోతూనో ఒక ఇంగ్లిష్ సార్జంట్ కనబడగా, కోపల్లె కృష్ణారావు అనే పన్నెండేళ్ల బాలుడు ‘వందేమాతరం’ అని కౌమారోత్సుకతతో నినదించినట్లూ, దీనికి కోపించి ఆ ఇంగ్లిష్ సార్జంట్ బాలుణ్ణి కొరడాతో చితకబాదినట్లూ ప్రతివాద భయంకరాచారి గారి కథనం. పరాభవ దుఃఖ తీవ్రోద్విగ్నతలో భయంకరాచారి ప్రభృతులు బాంబులు తయారుచేసే పనిలో నిమగ్నం కాగా, సర్కారు వారు అది తెలిసి ఆచార్యుల వారిని అండమాన్ పంపించినట్లు ఐతిహ్యం! అండమాన్ సెల్యులర్ కారాగారంలో ఆచార్యుల వారు కఠిన శిక్షననుభవిస్తుండగా, అక్కడి అరాచకాలను ఆ జైలు అధికారి అయిన మేజర్ క్రూక్స్కు ఫిర్యాదు చేసినట్లూ, ఈ క్రూక్స్ను జైళ్ల పరిస్థితుల విచారణసంఘం వారు సంజాయిషీ కోరగా ఆయన అండమాన్లో ఉన్నది జైలు కాదు, ప్యారడైజ్ అనాలి అని సమాధానించాడుట. దీనితో భయంకరాచార్యుల వారు క్రూక్స్ను ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని పుస్తకం రాశారు. అది రహస్యంగా ఇండియా చేరింది. అండమాన్ జైలు బీభత్సాలు బట్టబయలైనాయి. ఆచార్యుల వారి అండమాన్ జీవితం జప్తుకు, నిషేధానికి గురి అయింది. అండమాన్ సెల్యూలర్ జైలుకు పత్రికలు కూడా రానిచ్చేది కాదట బ్రిటిష్ ప్రభుత్వం. ఖైదీలు ఆందోళన చేయగా సత్యాగ్రహ వార్తలపై తారు పూసి, ఆ పత్రికలను ఖైదీలను చదవనిచ్చేవారని ఆచార్యుల వారు తమ జైలు జీవిత స్వాత్మకథలో రాశారు. ఇదీ క్రూక్స్ ప్యారడైజ్, అండమాన్ జీవిత రచనల నేపథ్యం. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
-
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రవారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (శనివారం) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని, రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 26వ తేదీ ఉదయానికి ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుందని వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా ఉండనుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. - సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము -
మంచివాళ్లే... కానీ మీద ఉమ్మేస్తారు!
అండమాన్ ప్రజలు అబద్ధం చెప్పరు, మోసం చేయరు. మన వస్తువులను ఎక్కడైనా మర్చిపోయినా కూడా వాటిని తీసుకోరు, తమది కాని వస్తువు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ స్థానికులు అంటే బ్రిటిష్ కాలంలో అండమాన్ జైలు నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగుల కుటుంబాలే. అలా స్థిరపడిన వారిలో బెంగాలీలు, తమిళులు, తెలుగు వాళ్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటారు. పాన్ దో జార్వాన్ అనే ఆటవిక తెగల వాళ్లు వర్షం వస్తే బయటకు రారు. పర్యాటకుల కారణంగా వీళ్లకు పాన్ అలవాటైంది. వెళ్లిన వారందరినీ ‘పాన్ దో’ అని అడుగుతారు. హిందీలో వీళ్లకు వచ్చిన పదం ఇదొక్కటే. వీళ్లను ఫొటో తీస్తే ఒప్పుకోరు. వాహనంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఫొటో తీసినా సరే అంతవేగంతోనూ పరుగెత్తుకు వచ్చేసి వాహనం ఎదురుగా నిలబడతారు. ఫొటో తీసిన వాళ్ల ముఖాన కోపంగా ఉమ్మేస్తారు. గోనె దుస్తులు సెల్యూలార్ జైల్ దగ్గరకు వెళ్తే మనకు తెలియ కుండానే భావోద్వేగాలకు లోనవుతాం. జాతీయోద్యమంలో పాల్గొన్న మన జాతీయ నాయకులను బంధించిన జైలు గదుల్లో తిరుగుతుంటే ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదలుతాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులు జైల్లో గోనెసంచులతో కుట్టిన దుస్తులను ధరించారని తెలిసినప్పుడు మనసు పిండేసినట్లవుతుంది. లేజర్ షో బ్యాక్గ్రౌండ్ ఆడియోలో జైలు అధికారి సావర్కర్ సెల్కు రావడం, గద్దించి ప్రశ్నించడం, సావర్కర్ వంటి వీరులు సమాధానం చెప్పడం ఉంటుంది. ఇక్కడి పోర్ట్ హాల్లో జాతీయపోరాట యోధులను ఉరితీసేవాళ్లు. విచారణ కాలంలో కూడా ఇక్కడే జైల్లో ఉంచేవారు. చూడాల్సిందే అండమాన్ తీరంలో ముత్యాలు వలిచిన చిప్పలు, పగడపు అవశేషాలు, శంఖువులు ఉంటాయి. వాటిని చూడాల్సిందే తప్ప మనం తెచ్చుకోవడానికి అనుమతించరు. ముత్యాలు, పగడాలు తక్కువ ధరలో వస్తాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పన్నులు ఉండవు. చాలా వస్తువులు చవగ్గా దొరుకుతాయి, ముఖ్యంగా లిక్కర్ సగం ధరకే వస్తుంది. -
డిజిటల్ అండమాన్
న్యూఢిల్లీ: భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండమాన్ నికోబార్ దీవులు మరింత కీలకంగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. చెన్నై నుంచి పోర్ట్బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు 2,312 కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్తో అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సెకండ్కి 2200 జీబీపీఎస్ సామర్థ్యం గల ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్ట యిందని ప్రధాని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ద్వీపసమూహంలో ట్రాన్స్షిప్మెంట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యా యన్నారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే శాశ్వత వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని ప్రధాని అన్నారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్న అస్సాం, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు
-
హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు
సాక్షి, చెన్నై: చెన్నై-పోర్ట్ బ్లెయిర్ మధ్య సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సి)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. పోర్ట్ బ్లెయిర్తో పాటు మరో 7 ద్వీపాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ అందించేలా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్ని ఆవిష్కరించారు. ఓఎఫ్సీతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని మోదీ తెలిపారు. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు, పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీపం వరకు ఈ సేవ ప్రారంభమైందన్నారు. అంతులేని అవకాశాలతో నిండిన ఈ ఆవిష్కారంపై అండమాన్ అండ్ నికోబార్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అండమాన్ వాసులకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, వేగవంతమైన, నమ్మదగిన మొబైల్, ల్యాండ్లైన్ టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా డిజిటల్ ఇండియా ఫలాలు అందుతాయన్నారు. టూరిజం, బ్యాంకింగ్, షాపింగ్, టెలి మెడిసిన్, టెలీ విద్యలాంటి వసతులు సులువుగా అందుతాయన్నారు. అలాగే అనుకున్న సమయానికి 2300 కిలోమీటర్ల దూరం సముద్రం లోపల కేబుల్ వేయడం ప్రశంసనీయమన్నారు. ప్రధానంగా టూరిజం మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. అక్కడి వారికి నేడు చాలా ప్రత్యేకమైన రోజు అని స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం లభిస్తుందంటూ సోమవారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్లో 2018 డిసెంబర్ 30న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. Inauguration of the submarine Optical Fibre Cable in Andaman and Nicobar Islands ensures: High-speed broadband connectivity. Fast and reliable mobile and landline telecom services. Big boost to the local economy. Delivery of e-governance, telemedicine and tele-education. — Narendra Modi (@narendramodi) August 10, 2020 -
అండమాన్లో ఆర్తనాదాలు
కాశీబుగ్గ: అండమాన్ నికోబర్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామాలకు వెళ్లలేక కుటుంబాలకు దూరమై ఆకలి కేకలు పెడుతున్నారు. అక్కడ తమ అగచాట్లను వాట్సాప్ ద్వారా వీడియో, చిత్రాలు పంపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత తొందరగా తెలుగు వాళ్లను రప్పించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అండమాన్ నికోబర్ దీవుల్లోనూ కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్లే అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిపివేశారు. దాంతో అభర్డెన్ బజార్, జంగ్లీఘట్, డైరీఫారం, బృక్షబాద్, డిగిలిపూర్, కమ్మలబ్యాగ్, వండూరు, మాయబందర్, బాతుబస్తీ, గేరాచలంలో రెండు వేల మంది మత్స్యకారులతోపాటు పర్యాటకులు కరోనా లాక్డౌన్లో చిక్కుకున్నారు. (ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్) అండమాన్ నికోబర్ దీవిలో చిక్కుకున్న మత్స్యకారులు జిల్లాలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం మండలాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేక వేట సాగక తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఫిషింగ్ జెట్టీల బోట్లపై పడుకుని కాలం గడుపుతున్నారు. రెండు నెలలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండమాన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఆకలి బాధలతో అలమటిస్తున్నామని కంటతడి పెడుతున్నారు. ఈ నెల 25 నుంచి రవాణా సౌకర్యం పునరుద్ధరించడంతో అండమాన్ నుంచి వైజాగ్కు ఓడ లేదా విమానంలో తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అండమాన్లో ఒక్క కరోనా వైరస్ రోగి లేరని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. (ఎన్ 95 మాస్క్ల పేరుతో భారీ మోసం) ఓడలపై తలదాచుకుంటున్న మత్స్యకారులు -
తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం) పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
జూన్ 5న నైరుతి రుతుపవనాల రాక
సాక్షి, న్యూఢిల్లీ: కేరళకు నైరుతి రుతపవనాలు ఈ ఏడాది నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. జూన్ 5న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 20 వ తేదీలలో ఉత్తర ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రాగల 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలో) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కిలోమీటర్ల) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
16 నాటికి అండమాన్కు రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సాధారణం కన్నా సుమారు ఆరు రోజుల ముందే, మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను చేరుకుంటాయని బుధవారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను మే 20వ తేదీ వరకు చేరుకుంటాయి. ఆ తరువాత కేరళ చేరుకునేందుకు వాటికి 10, 11 రోజులు పడుతుంది. అప్పుడే వర్షాకాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. కేరళకు రుతుపవనాలు చేరుకునే కచ్చితమైన సమయాన్ని వారం రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించే అవకాశముంది. (తెల్లరంగు దుస్తులు ధరించండి) మే 15 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై, ఆ మర్నాడు సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలో ప్రవేశించనున్నాయంది. ఈ సంవత్సరం నుంచి రుతుపవనాల ప్రారంభం, ముగింపునకు సంబంధించిన వివరాలను 1960–2019 డేటా ఆధారంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 1901–1940 మధ్య డేటా ఆధారంగా ఆ వివరాలను ప్రకటించేవారు. -
వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 16న తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం ఒక బులిటెన్ను విడుదల చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 16 నాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐయమ్డీ ట్వీట్లను కోట్ చేస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీని గురించి హెచ్చరించింది. దీనితో పాటు మే 15, 16 తేదీలలో అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పం నుంచి ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐయమ్డీ తెలిపింది. అండమాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా జాతీయ విపత్తు సంస్థ హెచ్చరించింది. మే 15న 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడొచ్చని, మే 16న ఈ ప్రాంతంలోనే 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐయమ్డీ పేర్కొంది. #CYCLONE ALERT Formation of a Low Pressure area over southeast #BayOfBengal and adjoining south #AndamanSea and its likely intensification into a #CyclonicStorm by 16th May, evening. Source :: @IMDWeather — NDMA India (@ndmaindia) May 13, 2020 -
16న అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ నెల 16న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. గతేడాది ఇదే నెల 18న అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంటే ఈసారి రెండ్రోజులు ముందుగానే అండమాన్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు జూన్ 8న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కేరళకు, తెలంగాణ, ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణశాఖ ఒకట్రెండు రోజుల్లో బులెటిన్ విడుదల చేసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. 13న అల్పపీడనం...: ఇదిలావుంటే తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తుకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి: వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం) -
అక్కడ కరోనా బాధితులంతా కోలుకున్నారు
అండమాన్ నికోబర్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఈ మహమ్మరి కారణంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో సైతం కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను పొడిగించినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం కరోనా సోకిన వారంతా కోలుకున్నారు. మొత్తం 11 మందికి కోవిడ్ సోకగా ఇప్పడు వారంతా కోలుకున్నారని అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘి ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కరోనా కట్టడికి అక్కడి అధికారులు తీసుకున్న చర్యలను అంతా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైద్య సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 11 out of 11 positive cases recovered: Chetan Sanghi, Chief Secretary, Andaman and Nicobar Islands#COVID19 pic.twitter.com/XJccIpllKT — ANI (@ANI) April 16, 2020 -
అండమాన్లో టూరిజం బంద్..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలుతుండటంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమై వైరస్ నిరోధానికి పలు చర్యలు చేపడుతున్నాయి. కరోనాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించగా పలు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ విద్యా, వాణిజ్య సంస్థలు, థియేటర్లు, మాల్స్ను మూసివేయాలని నిర్ణయించాయి. ఇక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అండమాన్ నికోబార్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 17 నుంచి 26 వరకూ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ పదిరోజులు అండమాన్ దీవులను సందర్శించే ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని పర్యాటకులను కోరింది. చదవండి : నితిన్ పెళ్లి వాయిదా -
అండమాన్లో 'కసాయి కూతురు'
కర్ణాటక, కృష్ణరాజపురం: ప్రేమకు అడ్డుచెప్పిందనే కారణంగా తల్లిని హత్య చేసి ప్రియునితో పారిపోయిన ఘటనలో నిందితురాలు అమృతను బుధవారం కేఆర్ పురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అండమాన్ దీవుల్లో దొరకడం గమనార్హం. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి నిర్మలతో పాటు తమ్ముడు హరీశ్పై కత్తితో పొడిచిన అమృత అదేరోజు ప్రియుడు శ్రీధర్రావుతో పరారైంది. ఈ ఘటనలో తల్లి నిర్మల మృతి చెందగా తమ్ముడు హరీశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా విచారణ చేపట్టి అమృత ప్రియునితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్కు పారిపోయినట్లు గుర్తించారు. వారి సెల్ఫోన్ల లొకేషన్ల ఆధారంగా గుర్తించారు. బుధవారం పోర్ట్బ్లెయిర్ చేరుకున్న పోలీసులు బృందం ఇద్దరిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. -
అండమాన్లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
జకార్త: భారీ భూకంపం ఇండోనేషియాను మరోసారి వణికించింది. సముద్ర తీరంలోని మొలక్కో ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.2గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఇండోనేషియా భూకంప తాకిడి భారత్లోని అండమాన్ నికోబార్ దీవులనూ తాకింది. గురువారం అర్థరాత్రి నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. -
‘అండమాన్లో అమ్మాయిలు..’
‘అండమాన్లో అమ్మాయిలు..’ ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా..కానే కాదు. నగరానికి చెందిన8 మంది తెలుగమ్మాయిలు గతనెల చివరి వారంలో అండమాన్ దీవుల్లో విహారయాత్రకు ఎవరి సహాయం లేకుండా వెళ్లొచ్చారు. కేవలం అమ్మాయిలు మాత్రమే ఎవరికి వారు సోలోగా ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా విహరించి అక్కడి అందాలను ఆస్వాదించారు. వీరిలో లాయర్లు, ఆర్కిటెక్చర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. మామూలుగా టీనేజ్ అమ్మాయిలు, విద్యార్థినులు కుటుంబ సభ్యులు లేదా కళాశాలల సిబ్బంది తోడ్పాటుతోనే టూర్స్ వెళ్తుంటారు. ‘కానీ మేం మాత్రం అందుకు మినహాయింపు’ అంటూ వివరించారు వై.తేజశ్రీరెడ్డి. ఎనిమిది మంది గ్రూపులో ఒకరైన తేజశ్రీరెడ్డి తమ అండమాన్ టూర్ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ప్రకృతి చాలా అందమైనది...ఉరుకుల పరుగుల జీవితంలో చాలా వరకూ ప్రకృతి అందాలను చూసే ఓపిక..తీరిక లేకుండా పోయింది. విదేశాల్లో ప్రజలు సంవత్సరంలో 3 నెలలు విహారయాత్రలకు కేటాయిస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అండమాన్ దీవులు మనకు చాలా దగ్గరలోని అందమైన ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. ఇండియాకు దక్షిణ దిశగా చివరిభాగంలో ఉంటుంది. బంగాళాఖాతం సముద్రంలో ఇండియాకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ అతిపెద్ద కోస్తా తీరం కలిగి ఉంది. విమానంలో అయితే పోర్ట్బ్లెయిర్కు వెళ్లాలి. సముద్రమార్గంగా చెన్నై, కోల్కతా నుంచి వెళ్లొచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ బీచ్ల నిలయం అండమాన్–నికోబార్ దీవులు. అండమాన్ అంటే ఓ పెద్ద జైలు అంటారు. జైలుతో పాటు ప్రకృతి అందాలతో కూడిన చోటు కూడా. చాలా తక్కువ ఖర్చులో విమానంలో వెళ్లి అక్కడి అందాలను చూసి రావొచ్చు. పోర్ట్బ్లెయిర్ టుహేవ్లాక్ ఐల్యాండ్కు.. మేమంతా నగరవాసులమే. నాతోపాటు మా ఫ్రెండ్స్ తరుణిరెడ్డి, అఖిల, పూజిత, రవళి, సాహిత్య, అనీష, రిథి అందరం కలిసి సరదాగా టూరిస్ట్ ప్లేస్కు వెళ్లాలని అండమాన్ను ఎంచుకున్నాం. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో బయలుదేరాం. అయితే మేము వెళ్ళిన రోజు మా బ్యాచ్లో రవళి బర్త్డే. ఫ్లయిట్లో కెప్టెన్ నుంచి విషెష్ చెప్పించాలని అనుకున్నాం. మా విమానం కెప్టెన్ను అడిగితే కుదరలేదు. అయితే అందులోని స్టాఫ్ గుర్తించి ప్లేట్లో బ్రెడ్తో కేక్ను తయారుచేసి బర్త్డే సెలబ్రేట్ చేశారు. చాలా సరదాగా విమానంలో బర్త్డే జరిగింది. మాకు బాగా గుర్తుండిపోయే సంఘటన. అలా పోర్ట్బ్లెయిర్లో దిగి అక్కడి నుంచి హేవ్లాక్ ఐలాండ్కు పడవలో వెళ్లాం. స్కూబా డైవ్... ఎలిఫెంట్ బీచ్ మా టూర్లో మరిచిపోలేని అనుభూతి స్కూబా డైవ్. బ్యాచ్మేట్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. స్కూబాలో సముద్రపు చేపలు, జంతువులు చాలా మధురానుభూతిని అందించాయి. అక్కడి నుంచి పడవలో ఎలిఫెంట్ బీచ్, రాధానగర్ బీచ్లను చూశాం. రాధానగర్ బీచ్ చాలా అందమైనది. మనం చూసే బీచ్లకు చాలా భిన్నంగా అండమాన్ బీచ్లు ఉంటాయి. అక్కడే పారాసైక్లింగ్, బనానా రైడ్, జెట్స్కై, స్టార్క్స్ ఆటలు ఆడాం. అందమైన బీచ్లు.. హావ్లాక్, రాధానగర్ బీచ్లు చాలా సుందరంగా.. క్లీన్గా ఉన్నాయి. వాటిని చూస్తే అద్భుతం అన్పించింది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. అలలు కూడా పెద్దగా ఉండవు. అక్కడ తినే ఫుడ్ కూడా బీచ్లోకి అనుమతించరు. దగ్గరలో కొన్ని దుకాణాలు ఉంటాయి. అక్కడే ఏమైనా తిని బీచ్లోకి వెళ్లాలి. మేము హావ్లాక్లో నైట్ సింఫనీ అనే రెస్టారెంట్లో డిన్నర్ చేశాం. మా బ్యాచ్ సీఫుడ్, వెరైటీ ఐటమ్స్ బాగా లాగించారు. ఐస్లాండ్ రిసార్ట్లో రాత్రికి బసచేశాం. కయాకింగ్ ఓ అనుభూతి రాత్రి సముద్రంలో కయాకింగ్ ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రాత్రి ఇద్దరు ఉండే చిన్నపాటి పడవలో సముద్రంలో మనమే తెప్పల ద్వారా నడుపుకుంటూ వెళ్లాలి. కొద్దిదూరం వెళ్ళాక చిన్నపాటి పడవలను వరుసగా పేర్చి పడుకోవచ్చు. అక్కడ నీటిని తడిమితే సముద్రంలోని ఫంగస్ జీవులు వెళుతురు అందిస్తాయి. ఆకాశంలో స్టార్స్, సముద్రంలో స్టార్స్ మద్యలో మనం. చాలా మధురానుభూతి కలిగించే ప్రదేశం. అక్కడే ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ 20 నిమిషాలు ఉన్నాం. ఇక చివరిరోజు కాలాపతర్ బీచ్కు వెళ్లాం. అక్కడ సమ్థింగ్ డిఫరెంట్ అనే రెస్టారెంట్ ఉంది. నిజంగానే సమ్థింగ్ ఢిఫరెంట్గా పుడ్ ఉంది. బాగా ఎంజాయ్ చేశాం. అక్కడి నుంచి పడవలో పోర్ట్బ్లెయిర్కు వెళ్లాం. అండమాన్ జైలును చూసే సమయం లేకుండా పోయింది. అదొక్కడే మా విహారయాత్రలో వెలితి. కానీ మళ్లీ అండమాన్కు మరోసారి వెళ్లాలని మా గ్యాంగ్ తీర్మానించింది...అంటూ తమ టూర్ విశేషాలను ఉత్సాహంగా వివరించారు లా గ్రాడ్యుయేట్ అయిన తేజశ్రీరెడ్డి. -
అండమాన్ నికోబార్లో భూకంపం
పోర్ట్ బ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్ కచ్ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచావుకు 6 కిలోమీటర్ల వాయువ్య దిశలో సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు భూకంపం సంభవించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. -
అండమాన్లో భూకంపం
పోర్ట్ బ్లేయర్ : అండన్మాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా మంగళవారం.. నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 4.1గా నమోదయ్యింది. రెండు రోజుల్లో వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
అండమాన్లోకి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలలోకి శనివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత వాతావరణశాఖ ఈనెల 18, 19 తేదీల్లో ఈ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం సరిగ్గా అనుకున్న సమయానికి అండమాన్, నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లోకి రావడంతో మిగిలిన ప్రాంతాల్లోకి కూడా వాతావరణ శాఖ చెప్పినట్లుగానే వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్తంత ఆలస్యంగానే రానున్నాయి. ఆరో తేదీన కేరళలో ప్రవేశిస్తాయని, దీనికి నాలుగు రోజులు అటుఇటు తేదీల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత 11వ తేదీన తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించినా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు తెలంగాణలో వడగాడ్పులు కొనసాగే అవకాశముంది. రాగల మూడు రోజులు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శనివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్నగర్లో 44, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండలలో 42, భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
అక్కడ ఒక్కరూ ఓటెయ్యలేదు!
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల సంఘం మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే, అండమాన్ నికోబార్లో కూడా అతి పురాతన ఆదిమ తెగ అయిన షొంపెన్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, వాళ్లలో ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదట. మంగోలాయిడ్ తెగకు చెందిన వీరు నాగరికులతో కలవడానికి బిడియపడతారు. అడవుల్లోంచి బయటకు రావడానికే ఇష్టపడరు. అడవుల్లో దొరికేవే తిని బతుకుతుంటారు. బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరిని తప్ప ఇతరులెవరినీ వారు దగ్గరకి రానివ్వరు. అధికారులు అతి కష్టం మీద వీరికి ఓటరు కార్డులు జారీ చేశారు. వీరిలో 107 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వీరిలో ఇద్దరంటే ఇద్దరు (75 ఏళ్ల పురుషుడు, 32 ఏళ్ల మహిళ) మాత్రమే వచ్చి ఓటేశారు. ఈసారి మరింత ఎక్కువ మందిని రప్పించడం కోసం అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహించారు. దానికి దాదాపు 35 మంది షొంపెన్లు ఓటరు కార్డులతో సహా హాజరయ్యారు. దాంతో అధికారులకు ఉత్సాహం కలిగింది. వారి కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. ‘శిబిరాలకు వచ్చిన వాళ్లను చూసి సంతోషించాం. షొంపెన్ భాష తెలిసిన ఒక నికోబార్ జాతీయుడి సహాయంతో వాళ్లకు ఎన్నికల గురించి ఓటు’ గురించి అవగాహన కల్పించాం. వాళ్ల కోసం వారు నివసించే గుడిసెల్లాంటి పోలింగ్ కేంద్రాలనే ఏర్పాటు చేశాం. కొత్తగా ఉంటే రావడానికి భయపడతారని ఈ పని చేశాం. అయినా కూడా ఒక్కరూ ఓటు వేయడానికి రాలేదు’ అన్నారు కాంప్బెల్ బే అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ సింగ్ మీనా. కాగా, ఇక్కడి ఓంగే, గ్రేట్ అండమాన్ తెగవాళ్లు కొన్నేళ్లుగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈసారి 51 మంది ఓంగేలు, 26 మంది గ్రేట్ అండమానీస్ ఓటు వేశారు. -
అండమాన్లో భూకంపం
పోర్టుబ్లేయర్ : అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపంలో బుధవారం ఉదయం 1.51 గంటలో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అండమాన్ ద్వీపంలో 10 కిలోమీటర్ల లోతున ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదయ్యింది. దీంతోపాటు చెన్నై, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. బంగాళఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని అధికారులు వెల్లడించారు. Earthquake of Magnitude:4.5, Occurred on:13-02-2019, 01:51:30 IST, Lat:13.9 N & Long: 91.4 E, Depth: 10 Km, Region:Andaman Islands Region pic.twitter.com/6zwWyfE7DC — India Met. Dept. (@Indiametdept) February 12, 2019 అయితే ఈ నెల 10న ఇండియా-మయన్మార్ సరిహద్దులో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూడా భూకంపం సంభంవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.2గా నమోదయ్యింది. -
అండమాన్ దీవుల పేర్లు మార్పు
పోర్టుబ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నికోబార్ దీవుల్లోని మూడు దీవులకు కొత్త పేర్లను పెట్లారు. ద రోస్ ఐలాండ్ దీవికి ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్గా, ద నెయిల్ ఐలాండ్కి షాహీద్ ద్వీప్, హావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ద్వీప్గా పేర్లను ప్రకటించారు. అండమాన్ దీవులకు నేతాజీ శుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరువేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా 75 రూపాయల నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటిస్తూ.. చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి, నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
కంట్లో నుంచి రక్త కన్నీరు
పోర్ట్బ్లెయిర్ : సాధారణంగా మనషులు ఏడిస్తే కంట్లో నుంచి కన్నీళ్లు రావటం సహజం కానీ అండమాన్ నికోబార్ దీవికి చెందిన 22 ఏళ్ల యువకుడికి మాత్రం ఏడిస్తే రక్త కన్నీళ్లు వస్తాయి. మామూలుగా కంటినుంచి రక్తం కారే పరిస్థితిని ‘హీమోలాక్రియా’ అంటారు. ఈ వ్యాధి ఉన్న వారు ఏడ్చినపుడు రక్తం కారటం జరుగుతుంటుంది. కానీ ఆ యువకుడిలో హీమోలాక్రియా లక్షణాలు కనిపించకపోవటం విశేషం. తరుచుగా ఇలా కంటినుంచి రక్తం కారుతుండటంతో అతడు ‘అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ వైద్యులను సంప్రదించాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్ జేమ్స్ అతనిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు, ఆరోగ్య సమస్యలు లేవని గుర్తించాడు. 30శాతం మందికి ఇలా కారణం తెలియకుండా కంటినుంచి రక్తం కారుతుందని ఆయన తెలిపాడు. కంటిలో సమస్యలు, తలకు గాయాలు, ముక్కునుంచి రక్తం కారటం, రక్త సంబంధమైన వ్యాధులు వంటి సందర్భాలలో కంటినుంచి రక్తం కారే అవకాశం ఉందని ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది. కారణం ఏదైనది బయటకు తెలియనప్పటికి అంతర్గతంగా ఉన్న సమస్యల వల్లే ఇలా అవుతుందని ప్రచురించింది. -
ఇక ఇప్పుడు దీవుల వంతు
న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో పలు చారిత్రక నగరాలు పేర్లు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్కు ఆధ్యుడిగా నిలిచారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే యోగి యూపీలోని ఫైజాబాద్ పేరును అయోధ్యగా, అలహబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ మూడు దీవుల పేర్లను మార్చేందుకు సిద్ధమైంది బీజేపీ ప్రభుత్వం. రోస్ ఐల్యాండ్, నేయిల్ ఐల్యాండ్, హ్యావ్లాక్ ఐలాండ్ పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐల్యాండ్, షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ ఐల్యాండ్లుగా మార్చనున్నట్లు తెలిసింది. పోర్ట్ బ్లెయర్ పర్యటన సందర్భంగా ఈ నెల 30న మోదీ ఈ కొత్త పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీలన్ని పూర్తయ్యాయన్నారు అధికారులు. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 30 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే ఈ మూడు అండమాన్, నికోబార్ దీవుల పేర్లను మార్చేందుకు నిర్ణయించింది. అయితే అండమాన్ దీవుల్లోకెల్లా పెద్దది.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హ్యావ్లక్ దీవి పేరును మార్చలనే డిమాండ్ 2017 నుంచే ఉంది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా డిసెంబర్ 30 (1943) అండమాన్ దీవులకు చేరుకున్న నేతాజీ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్కు షాహీద్గానూ, నికోబార్కు స్వరాజ్గానూ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. -
సెంటినలీస్లతో మమేకమైన మధుబాల!
గాలి, నీరు, చెట్టు, పుట్ట ఇవే వారికి జీవితం, ఆరాధ్యం. అంతకు మించిన కాంక్రీటు జంగిల్కి సంబంధించిన భవబంధాలేవీ వారు కోరుకోరు. వారే అండమాన్లోని సెంటినలీస్ తెగకు చెందిన ఆదివాసీలు. దాదాపు 60,000 సంవత్సరాలుగా ఆ తెగ అక్కడ మనుగడ సాగిస్తోంది. తమదైన ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తోన్న వారిని దూరం నుంచి చూడటమే తప్ప వారి దగ్గరకు వెళ్ళడం అసాధ్యం. 2004 తరువాత ప్రభుత్వం కూడా ఆదివాసీలున్న ప్రాంతానికి ఇతరులు వెళ్ళడాన్ని నిషేధించింది. వారి కళ్లుగప్పి వారి దరిదాపుల్లోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ బతికిబట్టకట్టలేదు. ఇటీవలే జాన్ అలెన్ చౌ అనే క్రిస్టియన్ అమెరికన్ మిషనరీ యువకుడు వారి సామ్రాజ్యంలోకి చొరబడి వారి బాణాల దెబ్బలకు చనిపోయిన సంగతి తెలిసిందే. సెంటినలీస్ను దగ్గరి నుంచి కూడా చూడటానికి జంకుతున్న వేళ, వారితో స్నేహ కరచాలనాన్ని అందుకొని మమేకమైన ఏకైక సామాజిక శాస్త్ర పరిశోధకురాలు మధుమాల ఛటోపాధ్యాయ. అరుదైన ఆదివాసీ తెగ సెంటినలీస్ని 1999లో తొలిసారిగా కలిసిన మధుమాల ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. జాన్ అల్లెన్ చౌ మరణరహస్యాన్ని కూడా ఆమె ఛేదించే ప్రయత్నం చేశారు. ముందు హెచ్చరికలు.. తరువాతే దాడి.. దశాబ్దాలుగా బాహ్యప్రపంచాన్ని వెలివేస్తూ అండమాన్ అటవీ ప్రాంతంలో తమదైన చిన్ని ప్రపంచంలో నివసిస్తున్న సెంటినలీస్ చాలా బలంగా ఉంటారు. ఒక్క మధ్య వయస్కుడు బలీయమైన ఐదుగురు యువకులను సైతం అవలీలగా మట్టికరిపించగలడు. నిజానికి సెంటినలీస్ తమంతట తామే దాడికి దిగరని తెలిపారు. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకెళితేనే వారు దాడికి దిగుతారంటారు మధుమాల. పరిశోధనలో భాగంగా నెలల తరబడి సెంటినలీస్తో గడిపిన మధుమాల ఒకరోజు అక్కడి నుంచి బయటి ప్రపంచానికి ప్రయాణమయ్యారు. కాసేపట్లో వర్షం కురుస్తుందని, వెళ్ళొద్దని వాళ్ళు వారించారు. అప్పటిదాకా కాసిన మండుటెండ మాయమై వర్షం రావడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. వాళ్ళెంతగా ప్రకృతిలో లీనమై ఉంటారనడానికి మధుమాల చెప్పిన ఉదాహరణ ఇది. సెంటినలీస్ అంతిమసంస్కారాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. మృతుల పోలిక ఉన్న చెక్కబొమ్మను చేసి, దాని పక్కనే వారికిష్టమైన ఆహారాన్ని, నీటిని పెడతారు. 1999లో సెంటినలీస్ని కలిసినప్పుడు మధుమాలను ‘‘మిలాలే, మిలాలే’’ అని పిలిచేవారు. మిలాలే అంటే వారి భాషలో మిత్రులని అర్థం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతరత్రా సందర్భాల్లో సెంటినలీస్కు అలవాటైన కొందరినే ప్రభుత్వం అక్కడికి పంపిస్తుంది. -
స్త్రీలోక సంచారం
భారతదేశంలోని యువ నగర మహిళ చుట్టూ తిరిగే ఓ కొత్త కామెడీ డ్రామా సిరీస్ను త్వరలోనే ప్రసారం చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అనే టైటిల్తో వస్తున్న ఆ కొత్త ఒరిజినల్ సిరీస్ తొలి సీజన్లో 10 ఎపిసోడ్లు ఉంటాయి. నలుగురు స్నేహితురాళ్ల వర్క్లైఫ్, కెరీర్లో ఎదగాలన్న ఆశ, ఆశయం, ఆందోళన వీటన్నిటితో కామెడీగా, రొమాంటిక్గా అల్లిన ఈ కథను వెబ్ సిరీస్గా ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ నిర్మించబోతోంది. డైరెక్షన్ అనూ మీనన్. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ను చూడొచ్చు. అండమాన్లోని ఉత్తర సెంటినెల్ దీవిలో నివసించే ఆదివాసీలు అత్యంత ప్రమాదకరమైనవారని; తమను కలిసేందుకు, తమను కలుపుకునేందుకు ప్రయత్నించేవారెవరైనా ప్రాణాలు వదిలేసుకోవలసిందేనని.. గత నెలలో ఒక అమెరికన్ని వారు చంపిన ఘటనతో మరోసారి రుజువైంది. భారత ప్రభుత్వం కూడా ఏళ్లుగా వారినలా ఏకాంతంగా వదిలేసింది. వారి నివాస ప్రాంతానికి వెళ్లవద్దని ఆంక్షలు విధించింది. అయితే సెంటినెల్ తెగవారు మరీ అంత భయంకరమైనవారా! కానే కాదనీ, మధుమలా ఛటోపాధ్యాయ అనే మహిళ వారిలో కలిసిపోయి, వారి పిల్లాపాపల్తో కూడా గడిపిందని తాజాగా కొన్ని వార్తాకథనాలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా మధుమాల ఓ సెంటినెల్ పిల్లవాడిని ఎత్తుకుని ఉన్న ఫొటో కూడా ఒకటి బయటికి వచ్చింది. మధుమాల ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సీనియర్ పరిశోధన అధికారి.సెంటినెల్స్ను కలిసిన తొలి మహిళా ఆంత్రోపాలజిస్ట్గా ఆమె 1991 జనవరి 4న ఓ పెద్ద రికార్డునే సాధించారు కానీ, అది మరుగున పడిపోయింది. మానవజీవన అధ్యయనవేత్త, పరిశోధకురాలు అయిన మధుమాల.. ఆ దుస్సాహస ఘటనను తన వృత్తితో భాగం మాత్రమే అనుకున్నారు తప్ప, దానికి ప్రత్యేకతను ఇవ్వలేదు. -
తెల్లని కిరీటం ధరించిన వృద్ధుడే.. ఆ తెగ నాయకుడేమో!?
ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వృద్ధులు దీవికి మరోవైపు ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు ఉన్నట్లుగా కూడా గమనించాను. వాళ్లు గాల్లోకి చేతులు లేపారంటే హాని చేయరని అర్థం- హత్యకు ముందు అలెన్ డైరీలో నోటు చేసుకున్న వివరాలు అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే సెంటినలీస్ తెగ ప్రజల చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికా టూరిస్టు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే దాదాపు పన్నెండేళ్ల తర్వాత సెంటినలీస్ల గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో తమకు ఎదురైన అనుభవాల ఆధారంగా అతడి మృతదేహం లభించే అవకాశమే లేదని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలెన్ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ఆధారంగా అతడి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చే సాధ్యాఅసాధ్యాలను అండమాన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. (‘వాళ్లు మమ్మల్ని స్వాగతించారు... అంత క్రూరులేం కాదు’ ) అలెన్ డైరీ, అతడికి పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ చెప్పిన వివరాల ఆధారంగా.. అలెన్ నవంబరు 15న సెంటినల్ దీవిలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత సెంటినలీస్ల నాయకుడిని కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెల్లని కిరీటం ధరించిన ఓ వృద్ధుడిని ఆ తెగ నాయకుడిగా అలెన్ భావించాడు. అతడిని చూడగానే ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో మరికొంత మంది సెంటినలీస్లు (వారిలో ఆడవాళ్లు కూడా ఉన్నారు)పరిగెత్తుకు వచ్చారు. అలెన్ వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆ గుంపులో ఉన్న ఓ పదేళ్ల కుర్రాడు అతడిపై బాణం విసిరాడు. అయితే అది అలెన్ చేతిలో ఉన్న బైబిల్కు గుచ్చుకోవడంతో తొలుత ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులు అతడిపై బాణాలతో విరుచుకుపడటంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. (అతడి శవం దొరికే అవకాశమే లేదా?!) గాల్లోకి చేతులు లేపారంటే.. ‘ఒక్కో గుడిసెలో సుమారు 10 మంది నివసిస్తారు. నా అంచనా ప్రకారం వీరి జనాభా 250 వరకు ఉండొచ్చు. నేను గమనించిన దాన్ని బట్టి అక్కడ ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వృద్ధులు దీవికి మరోవైపు ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు ఉన్నట్లుగా కూడా గమనించాను. సెంటినలీస్ గాల్లోకి చేతులు లేపారంటే మనకి హాని చేయరని అర్థం. విల్లంబులు సిద్ధం చేస్తున్నారంటే మాత్రం వేటాడం కోసం సిద్ధమైపోయారనేదానికి సంకేతం. ఎవరు చెప్పినా వాళ్ల ప్రయత్నాన్ని విరమించుకోరని అర్థం. వాళ్లు గట్టిగా అరుస్తారు. ఆ శబ్దాల్లో ఎక్కువగా బీ, పీ, ఎల్, ఎస్ అక్షరాలతో మొదలయ్యే అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్న బాణాల ఆధారంగా.. వాటిని లోహంతో తయారు చేశారని గుర్తించా. ముఖ్యంగా పడవల తయారీలో ఉపయోగించే లోహాలు అవి. అంటే దీవిలో ఉన్న పాత పడవల నుంచి కొన్ని భాగాలు వేరు చేసి బాణాలు తయారుచేసుకున్నారేమో’ అని సెంటినలీస్లను ప్రత్యక్షంగా కలిసే ముందు అలెన్ తన డైరీలో రాసుకొచ్చాడు. కాగా అలెన్ డైరీలో లభించిన వివరాలు, గతంలో అక్కడికి వెళ్లి వచ్చిన వారి అనుభవాల ఆధారంగా అతడి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చేందుకు అండమాన్ పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది గిరిజన శాస్త్రవేత్తలు, గిరిజన సంక్షేమ అధికారులు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు విరమించుకుంటేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. సెంటినలీస్ల ప్రశాంతకు భంగం కలిగించి, వారి జీవితాల్లో జోక్యం చేసుకోకపోవడమే అందరికీ శ్రేయస్కరమని గిరిజన హక్కుల నేతలు సూచిస్తున్నారు. -
‘వాళ్లు మమ్మల్ని స్వాగతించారు... అంత క్రూరులేం కాదు’
అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. తమదైన ప్రపంచంలో గడుపుతారు.. దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుంటారు... పడవలు తయారు చేసుకుంటారు... చేపలు పడతారు... తమ ఉనికికి ప్రమాదమని తెలిస్తే ఎవరినైనా చంపేందుకైనా వెనకాడరు.. అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ ప్రజల గురించి అధ్యయనం చేసిన పరిశోధకులు చెప్పిన వివరాలు. జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ ఇటీవల సెంటినల్ దీవిలో దారుణ హత్యకు గురి కావడంతో సెంటినలీస్ల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేటి వరకు అంతరించిపోని అరుదైన తెగగా గుర్తింపు పొందిన సెంటినలీస్లు అలెన్ కంటే ముందు అంటే 2006లో తమ ప్రాంతంలో అడుగుపెట్టిన ఇద్దరు జాలర్లను దారుణంగా హతమార్చి పూడ్చిపెట్టారు. అయితే అంతకుముందు మాత్రం ఈ తెగ ప్రజలు ఎవరినీ చంపిన దాఖలాలు లేవు. కానీ బయటి ప్రపంచానికి చెందిన వ్యక్తులు తరచుగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో తమ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని భావించినందు వల్లే సెంటినలీస్లు క్రూరంగా ప్రవర్తిసున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారిగా సెంటినలీస్లను రెండుసార్లు దగ్గరగా చూసి ప్రాణాలతో బయటపడ్డ... అండమాన్ నికోబార్ గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్ ఎస్ఏ అవరాది 1991లో తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘ఇలాంటి అనుభవాలను పంచుకోవడం అంతగా ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఆరోజు జనవరి 3, 1991. 13 మంది బృందంతో కలిసి సెంటినల్ దీవికి బయల్దేరా. మాలో చాలా మందిని ఒక రకమైన భయం ఆవహించింది. తిరిగి ప్రాణాలతో వస్తామనే నమ్మకం లేదు. కానీ ఎలాగైనా సెంటినలీస్ తెగ గురించి తెలుసుకోవాలనే పట్టుదల. అందులోనూ అధికారులుగా అది మా బాధ్యత. రాజధాని పోర్టు బ్లేయర్ నుంచి సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాం. మరుసటి రోజుకు ఉత్తర సెంటినల్ దీవికి చేరుకున్నాం. గమ్యం సమీపిస్తున్న కొద్దీ భయం, ఉత్సుకత అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బహుశా ఒకేసారి ఇలా రెండు భావాలు కలగడం మాలో చాలా మందికి అదే మొదటిసారి. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో మదర్ షిప్ నుంచి ఓ చిన్న పడవలోకి నేను మారాను. మిగతా వాళ్లు మాత్రం అందులోనే ఉన్నారు. మెల్లగా ఉత్తర సెంటినల్ దీవిలో అడుపెట్టా. అప్పుడే అడవి నుంచి సెంటినలీస్లు బయటికి వస్తున్నారు. అంతా కలిపి 27 మంది ఉన్నారు. వారిని చూడగానే నా పైప్రాణాలు పైనే పోయాయి. పర్యటనకు బయల్దేరే ముందు వారి గురించి రాసిన పుస్తకాలను చదివిన అనుభవం నాకు ఉంది. ఎవరినైనా బయటి వ్యక్తిని చూస్తేనే చాలు మరో మాట లేకుండా వెంటనే బాణాలతో వేటాడేస్తారని తెలుసు. కానీ వారి నుంచి నాకు వింత అనుభవం ఎదురైంది. వారి చేతిలో బాణాలు ఉన్నాయి. అయినా నాకు హాని చేయలేదు. దీంతో నాకు కొంచెం దైర్యం వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న కొబ్బరి బోండాలను అందులో ఓ వ్యక్తికి ఇచ్చాను. అతడు నవ్వుతూ వాటిని తీసుకున్నాడు. మిగతావారు కూడా అతడిని అనుసరించారు. ఈ చర్యతో వారు మమ్మల్ని స్వాగతించినట్టుగా భావించాము’ అని అవరాది చెప్పుకొచ్చారు. అందరూ అనుకుంటున్నట్లుగా వాళ్లు మరీ అంత క్రూరులు కాదు అని నమ్మేందుకు ఇటువంటి సంఘటనలు అనేకం అవరాది ఉన్నాయని పేర్కొన్నారు. (అతడి శవం దొరికే అవకాశమే లేదా?!) అలెన్ మృతదేహాన్ని వెలికితీసే విషయమై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించగా.. ‘ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. సెంటినలీస్ తెగ ప్రజలు వాళ్ల బతుకు వాళ్లు బతకాలనుకుంటున్నారు. దయచేసి వారిని ప్రశాంతంగా బతకనిస్తే మంచిదని’ బదులిచ్చారు. కాగా బ్రిటిష్ మిలటరీ 1880లో సెంటినలీస్పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్బ్లెయిర్కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు. 1967లో టి.ఎన్.పండిట్ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు. మళ్లీ 1974లో నేషనల్ జియోగ్రఫిక్ చానల్ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్ సెంటినలీస్ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది. బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు. ఇక.. 1991లో టి.ఎన్.పండిట్ మరోసారి గిరిజన సంక్షేమ శాఖ అధికారి అవరాదితో కలిసి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సెంటినలీస్లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది. అయితే అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం వెళ్లి సెంటినలీస్ల చేతిలో హత్యకు గురికావడంతో వీళ్లకు సంబంధించి మరోసారి చర్చ జరుగుతోంది. -
అతడి శవం దొరికే అవకాశమే లేదా?!
అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ ప్రజల చేతికి చిక్కిన ఎవరైనా సరే శవంగా మారిన తర్వాత కూడా సొంత వాళ్లను చేరే అవకాశం లేదని ఆ ప్రాంతాన్ని సందర్శించి బయటపడ్డ సాహస యాత్రికులు చెబుతున్నారు. సెంటినలీస్ల చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్టు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి మృతదేహం ఎక్కడుందో తెలిసినా వెలికితీసే అవకాశం లేదని సెంటినెలీస్ల గురించి పూర్తిగా అధ్యయనం చేసినవారు హెచ్చరిస్తున్నారు. గతంలో ఆ ప్రదేశానికి వెళ్లిన జాలర్లు మృత్యువాత పడ్డారని, వారి శవాలను తీసుకువచ్చేందుకు బయల్దేరిన అధికారులకు కూడా చేదు అనుభవాలు ఎదురైన విషయాన్ని గుర్తు చేశారు. ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా సరే అలెన్ అవశేషాలు ఇక దొరకవనే కఠిన వాస్తవాన్ని అతడి కుటుంబ సభ్యులు అంగీకరించక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కల్లోలం చెలరేగే అవకాశం ఉంది ‘నాకు తెలిసి ఇది అంత మంచి ఆలోచన కాదు. అలెన్ మృతదేహాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో సెంటినెలీస్ తెగ ప్రజల్లో మరోమారు అలజడి రేగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. అధికారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న వాళ్లను మరోసారి ఇబ్బంది పెడితే అధికారులతో పాటు ఆ తెగ ప్రజలను ప్రమాదంలో పడేసినట్లే అవుతుంది’ గిరిజన హక్కుల నేత,‘ అండమాన్ అండ్ నికోబర్ ఐలాండ్స్’ రచయిత పంకజ్ సెఖ్సారియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ అనూప్ కపూర్ మాట్లాడుతూ.. సెంటినెలీస్ ప్రజలు తమ లాంటి ఆహార్యం(ఒంటిపై దుస్తులు లేకుండా) కలిగి ఉన్న వ్యక్తులకు హాని చేయరని అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. కాబట్టి వాళ్లలో ఒకరిలా కలిసిపోతే అలెన్ మృతదేహాన్ని బయటికి తీసుకురావడం అంత కష్టమేమీ కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. నిర్ణీత గడువంటూ ఏమీ లేదు.. ‘మేము సెంటినలీస్ల భద్రత గురించి కూడా ఆలోచించాలి. గతంలో ఇలాంటి చర్యల వల్ల వాళ్లు అనారోగ్యం పాలయ్యారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. అలెన్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్ణీత గడువునైతే విధించలేదు’ అని అండమాన్ పోలీస్ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. -
‘ఆ తెగ ప్రజలు ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు’
పోర్ట్ బ్లేయర్ : మొత్తం జనాభ 500 మించి ఉండరు.. అది కూడా జనావాసాలకు దూరంగా ఎక్కడో అజ్ఞాతంగా ఉంటారు. వారిని దగ్గరగా చూడడం అంటే చావును ప్రత్యక్షంగా చూడటమే.. వారే అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న సెంటినెలీస్ తెగ ప్రజలు. ఇన్ని రోజులు బయట ప్రంపంచానికి పెద్దగా తెలియని వీరి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ ప్రజల చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురి కావడంతో వీరి గురించి వెలుగులోకి వచ్చింది. బయటి వారి ఉనికినే ఇష్టపడని ఈ ప్రజలను కలవాలనుకోవడం.. జీవితం మీద ఆశలు వదులుకోవడం లాంటిదే అంటున్నారు కమాండెంట్ ప్రవీణ్ గౌర్. 2006లో ఓ రెస్య్కూ ఆపరేషన్లో భాగంగా సెంటినెలీస్ ప్రజలను దగ్గరగా చూసిన ప్రవీణ్ తన అనుభావాల గురించి ఎన్డీటీవీతో ముచ్చటించారు. సెంటినెలీస్ తెగ ప్రజల చేతిలో హత్యకు గురైన అమెరికన్ టూరిస్ట్ జాన్ అలెన్ చౌ (ఫైల్ ఫోటో) ఆ వివరాలు.. 2006లో పోర్టు బ్లేయర్ సమీపంలోని గ్రామానికి చెందిన ఇద్దరు జాలరులు సముద్రంలో చేపలు పట్టడానికి మోటారు బోటులో వెళ్లారు. తిరిగి రాలేదు. గల్లంతయిన వీరిని వెదికే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. దాంతో నేను మరికొంత మంది సిబ్బందితో కలిసి ఒక చాపర్లో సెంటినెల్ ద్వీపానికి వెళ్లాము. ఒక చోట మాకు పడవ కనిపించింది. దాని దగ్గరకు వెళ్లడం కోసం ప్రయత్నించాము. అంతే ఒక్కసారిగా బాణాలు మా చాపర్ వైపు దూసుకురాసాగాయి. వారు దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ బాణాలు విసిరారు. వారంతా దాదాపు 50 మంది దాకా ఉంటారు. వారి ఒంటి మీద ఎర్ర వస్త్రం లాంటిదేదో ఉంది. అక్కడ ఒక్క స్త్రీ కూడా మాకు కనిపించలేదు. బోటు దగ్గరకు చేరాలంటే.. ముందు అక్కడ ఉన్న వారిని పంపించేయ్యాలి. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. దాంతో నేను మా ప్లాన్ - ఏని అమలు చేశాను. ప్లాన్ - ఏలో భాగంగా మా చాపర్ని కొద్ది ఎత్తులోనే పోనిచ్చాను. దాంతో వారు మమ్మల్ని అందుకోవడానికి మా చాపర్ని వెంబడిస్తూ వచ్చారు. అలా వారిని దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ తీసుకెళ్లాము. ఆ తర్వాత ప్లాన్ - బీని అమలు చేశాను. దానిలో భాగంగా మా చాపర్ని వెనక్కి.. బోటు ఉన్న ప్రదేశానికి తిప్పాను. ఈ అనుకోని పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి వారికి కాస్తా సమయం పడుతుంది. వారు అక్కడి నుంచి వచ్చేలోపు మృత దేహాలను తీసుకెళ్లాలని భావించాము. బోటు దగ్గరకు వచ్చి అక్కడ గుంతలాగా ఉన్న ప్రదేశంలో తవ్వడం ప్రారంభించాము. ఒక జాలరి మృతదేహం బయటపడింది. అతన్ని బోటులోనే ఉన్న తాడుతో ఉరి వేసి చంపారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం వెతుకుతుండగా వారు తిరిగి అక్కడికి వస్తున్నట్లు అనిపించింది. దాంతో మొదట వెలికి తీసిన మృత దేహాన్ని చాపర్లో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యాము. మరొక్క సెకన్ అక్కడే ఉంటే మేం కూడా శవాలుగా మారే వాళ్లం. చావుని అంత దగ్గరగా చూశాం. ఆ తరువాత మరోసారి ఇంకో మృతదేహం కోసం తిరిగి అక్కడికి వెళ్లాం. మొదటి సారి అమలు చేసిన ప్లాన్లనే ఈ సారి కూడా అమలు చేయాలని భావించాము. ప్లాన్ - ఏ లో భాగంగా వారిని కొంత దూరం తీసుకెళ్లడానికి ప్రయత్నించిన మాకు ఈ సారి గట్టి షాకే తగిలిందే. మొదటిసారిలానే అందరూ మా వెనకే వస్తారని భావించిన మాకు వారి తెలివి తేటలు చూసి ఆశ్చర్యం వేసింది. మొదటి సారిలా కాకుండా ఈ సారి కొందరు బోటు దగ్గరే ఉండగా.. మరి కొందరు మా చాపర్ వెంట పడ్డారు. మా దగ్గర మిషన్ గన్లు ఉన్నాయి కానీ వాటిని వాడాటానికి లేదు. ఈ లోపు వారు మా చాపర్ మీద దాడి చేయడం ప్రారంభించారు. నాతో పాటు వచ్చిన సిబ్బందిని క్షేమంగా తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. దాంతో మృతదేహాన్ని తీసుకురావాలనే ప్లాన్ని ఉపసంహరించుకుని తిరుగు ప్రయాణమయ్యాం. ఈ సంఘటనను బట్టి నాకొక విషయం బాగా అర్థమయ్యింది. సెంటనెలీస్ ప్రజలు ఒకసారి చేసిన తప్పునే మళ్లీ చేయరని తెలిసింది అంటూ తనకు ఎదురైన అనుభావాలను చెప్పుకొచ్చారు ప్రవీణ్ గౌర్. 2006లో భారత ప్రభుత్వం ప్రవీణ్ను తత్రక్షక్ మెడల్తో సత్కరించింది. -
బైబిల్ కాపాడినా..
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో అమెరికా పర్యాటకుడు జాన్ అలెన్ చౌ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు తాజాగా వెలుగుచూశాయి. కోపోద్రిక్తులైన సెంటినల్ తెగ ప్రజలు వేసిన బాణం అతని చేతిలోని బైబిలుకు తగలడంతో తొలుత ప్రాణాలతో బయటపడ్డాడు. అలెన్కు పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ పోలీసులకు అందజేసిన డైరీలో ఈ వివరాలున్నాయి. అలెన్ క్రైస్తవ మతాన్ని విపరీతంగా విశ్వసించేవాడని, క్రీస్తు బోధనల్ని సెంటినల్ ప్రజలకు పరిచయం చేయడానికే వెళ్లినట్లు తేలింది. హత్యకు ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం..ఆ రోజు సాయంత్రం ఇద్దరు సెంటినల్ తెగ ప్రజలకు కానుకలు ఇవ్వబోయాడు. వారు కోపంతో వేసిన బాణం అతని చేతిలోని బైబిల్కు తగిలింది. -
అమెరికన్ టూరిస్ట్ హత్య : కీలకంగా మారిన పుస్తకం
పోర్ట్ బ్లేయర్ : అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ ప్రజల చేతిలో జాన్ అలెన్ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాన్ మృతదేహం కోసం అండమాన్, నికోబార్ పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో జాన్ మృతదేహాన్ని గుర్తించడం కోసం ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అటవీ శాఖ, విద్యావేత్తలు, రాష్ట్ర గిరిజన సంక్షేమ విభాగాల నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు నార్త్ అండమాన్, నికోబార్ దీవుల డీజీపీ దీపేంద్ర పఠాక్ తెలిపారు. ఈ సందర్భంగా జాన్ రాసిన 13 పేజీల జర్నల్ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పఠాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక సెంటినెలీస్ మనుషులు జాన్ని బాణాలు, విల్లుల వంటి సంప్రదాయ ఆయుధాలతోనే చంపి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. జాన్ అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెల్ తెగ ప్రజలను కలిసి, వారిని క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఇండియా వచ్చాడు. ఈ క్రమంలో వారిని కలుసుకునేందుకు ప్రతి రోజు ఆ దీవి దగ్గరకు వెళ్లేవాడు. ఇందుకు గాను జాన్ అలెగ్జాండర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో జాన్ తన అనుభావాల గురించి రాసి పెట్టుకునేవాడు. దీనిలో తనను ఇక్కడకు వెళ్లడానికి అనుమతిచ్చిన తల్లికి, దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఆ దీవి వద్దకు క్షేమంగా చేరినట్లు.. వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు రాసుకొచ్చాడు. తాను మరణించే ముందు రోజు వరకూ కూడా జాన్ తన అనుభవాలను రాసి పెట్టుకున్నాడు. జాన్ మరణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన అలెగ్జాండర్, ఈ జర్నల్ని కూడా పోలీసులకు అందచేశాడు. జాన్ మరణించినట్లు తొలుత గుర్తించిన వ్యక్తి అలెగ్జాండర్. నవంబర్ 17న కొందరు వ్యక్తులు ఒక మనిషిని సముద్రం ఒడ్డున పూడ్చిపెట్టడం చూసిన అలెగ్జాండర్ మృతదేహానికి ఉన్న బట్టలను బట్టి చనిపోయిన వ్యక్తిని జాన్గా గుర్తించాడు. అనంతరం ఈ విషయం గురించి అమెరికాలో ఉన్న జాన్ స్నేహితుడు బాబి పార్క్స్కు తెలియజేశాడు. బాబి ఈ విషయాన్ని జాన్ తల్లికి చెప్పగా ఆమె అమెరికా కాన్సులేట్కి తెలియజేసింది. అమెరికా కాన్సులేట్ అధికారులు ఈ విషయం గురించి భారత అధికారులకు తెలియజేయడంతో నవంబర్ 19న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జాన్ని నిషేధిత ప్రాంతంలోకి తీసుకెళ్లినందుకు గాను జాన్తో ఒప్పందం కుదుర్చుకున్న అలెగ్జాండర్తో పాటు మరో ఆరుగురు చేపలు పట్టే వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారందరి మీద హత్యా నేరం నమోదు చేశారు. -
అండమాన్లో హత్యకు గురైన టూరిస్ట్ చివరి మెసేజ్
న్యూఢిల్లీ : క్రైస్తవ మత ప్రచారం కోసం అండమాన్ నికోబార్లోని నార్త్ సెంటినల్ దీవికి వెల్లిన జాన్ అలెన్ అనే ఓ అమెరికా జాతీయుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే జాన్ అండమాన్, నికోబార్ దీవులకు వెళ్లడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరి హృదయాలను కలచి వేస్తోంది. ‘మీ అందరికీ నేను పిచ్చివాడిలా కనిపించొచ్చు. కానీ అండమాన్లోని సెంటినెలీస్ తెగకు చెందినవారికి జీసస్ గురించి బోధించడానికి ఇదే సరైన సమయం. దేవుడా.. నాకు చనిపోవాలని లేదు’ అంటూ జాన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాతే జాన్ అండమాన్ దీవులకు వెళ్లారు. గతంలో జాన్ ఐదుసార్లు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించారు. జాన్ క్రైస్తవ మతబోధకుడు కావడంతో ఆ ఆదివాసీ తెగవారికి కూడా బోధనలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ తెగ వారు బయటివారితో సంబంధాలను ఏమాత్రం ఇష్టపడరు. అందుకే జాన్పై బాణాలు వేసి చంపేశారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని క్షమిస్తున్నాం: జాన్ కుటుంబం జాన్ అలెన్ మృతి గురించి తెలిసిన అతని కుటుంబ సభ్యులు జాన్ ఇన్స్టాగ్రామ్లో ఓ మెసేజ్ని పోస్ట్ చేశారు. జాన్ అలెన్ ‘మరణించాడని మాకు తెలిసింది. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటనెలీస్ తెగ ప్రజలు అతన్ని చంపారని చెపుతున్నారు. జాన్ మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఈ విషాదం గురించి మేం మాటల్లో చెప్పలేం. తను మా ప్రియమైన కుమారుడు, సోదరుడు, స్నేహితుడు. తనో క్రైస్తవ మత ప్రచారకుడు, సాకర్ కోచ్, పర్వాతారోహకుడు కూడా. అతను దేవున్ని ప్రేమిస్తాడు.. అవసరమున్న వారికి సాయం చేయడంలో ముందుంటాడు. అతను సెంటినెలీస్ ప్రజలను కూడా అలానే ప్రేమించాడు. జాన్ మరణానికి కారణమైన వారిని మేము క్షమిస్తున్నామని తెలిపారు. అంతేకాక ‘జాన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి సాయం చేసిన అతని మిత్రులను అరెస్ట్ చేసినట్లు మాకు తెలిసింది. వారిని కూడా వదిలిపెట్టాల్సిందిగా నా మనవి. తన ఇష్టప్రకారమే అక్కడికి వెళ్లాడు. అతని చర్యలకు వేరేవాళ్లని శిక్షించడం సరికాదు. కుటుంబ సభ్యులుగా మీరు మా మనవిని మన్నిస్తారని ఆశిస్తున్నామం’టూ పోస్ట్ చేశారు. View this post on Instagram John Allen Chau A post shared by John Chau (@johnachau) on Nov 21, 2018 at 11:36am PST -
ఇప్పటివరకు ఆ దీవిలో అడుగుపెట్టిన వాళ్లు లేరు!
డబ్బులు వాడని.. దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుని బతికే సెంటినలీస్లను సంప్రదించేందుకు సాధారణ మానవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. దండోపాయం మినహా సామ, దాన ఉపాయాలు అన్నీ వాడారు. అయినా ఇప్పటివరకూ వాళ్లు ఈ ట్రిక్కులకు లొంగింది లేదు! దూరం నుంచి గమనించిన దాని ప్రకారం.. వీరికి పడవలు తయారు చేయడం వచ్చు. లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చేపలు పడతారు. ‘మా బతుకు మాది.. ఇందులో మీలాంటి వారి జోక్యం అవసరం లేదు’ అన్న వారి వైఖరి ఎంత బలమైందంటే.. 2004లో వచ్చిన సునామీతో సర్వం కోల్పోయినా.. భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహారాన్ని కూడా ముట్టుకోలేదు. అప్పట్లో దారి తప్పి ఆ దీవిలోకి అడుగు పెట్టిన ఇద్దరు జాలర్లను చంపేశారు. ఆ తరువాత భారత ప్రభుత్వం వీరి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అప్పుడప్పుడూ కోస్ట్గార్డ్కు చెందిన పడవలు నార్త్ సెంటినెల్ ద్వీపం వద్ద కాసేపు లంగరేసి నిలబడతాయి..అంతే! అటువైపుగా వెళ్తే తరిమికొట్టారు.. బ్రిటిష్ మిలటరీ 1880లో సెంటినలీస్పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్బ్లెయిర్కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు. ► 1967లో టి.ఎన్.పండిట్ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు. ► 1974లో నేషనల్ జియోగ్రఫిక్ చానల్ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్ సెంటినలీస్ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది. బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు. ► 1991లో టి.ఎన్.పండిట్ మరోసారి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు. ► ఆ తరువాత సెంటినలీస్లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది. అండమాన్లో అమెరికన్ను బాణాలేసి చంపేశారు న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్లోని నార్త్ సెంటినల్ దీవిలో అమెరికా పర్యాటకుడు హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివసించే సెంటినల్ ఆదిమ తెగకు చెందిన ప్రజలే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు బుధవారం వెల్లడించారు. నవంబర్ 17న జరిగిన ఈ ఘోరంలో మృతుడిని 27 ఏళ్ల జాన్ అలెన్ చౌగా గుర్తించారు. ఈ ఘటనలో హత్య కేసు నమోదుచేసిన పోలీసులు...అలెన్ను ఆ దీవికి తీసుకెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్ని అరెస్ట్ చేశారు. తమ దీవిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అలెన్ను సెంటినల్ ప్రజలు బాణాలతో హత్య చేసి ఉంటారని, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు, అలెన్ కనిపించడం లేదని మాత్రమే అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. గోప్యత కారణాల రీత్యా ఇంతకు మించి వెల్లడించలేమని తెలిపింది. అలెన్ ఇంతకు ముందు అండమాన్లో ఐదు సార్లు పర్యటించినట్లు పోర్ట్బ్లెయిర్కు చెందిన ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని సెంటినల్ తెగ ప్రజలను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపేవాడని వెల్లడించింది. చిదియాటాపు ప్రాంతంలో మత్స్యకారుల పడవను అద్దెకు తీసుకున్న అలెన్ నవంబర్ 16న నార్త్ సెంటినల్ దీవి సమీపానికి చేరుకున్నట్లు తెలిపింది. మత ప్రచారానికే వెళ్లాడా? మతబోధకుడిగా పనిచేస్తున్న అలెన్.. తన మతం గురించి సెంటినలీస్కు వివరించేందుకు ఆ దీవి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడని, వాళ్లు బాణాలతో దాడులు చేయడంతో అతడు మరణించాడని అండమాన్ షీఖా అనే పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ‘నార్త్ సెంటినల్ దీవికి కొంతమంది జాలర్ల సాయంతో వెళ్లిన అలెన్ బీచ్లో నడుస్తుండగానే సెంటినలీస్ తెగ ప్రజలు బాణాలతో దాడులు చేశారు. అయితే అలెన్ వీటిని లెక్క జేయకుండా అలాగే ముందుకు వెళ్లసాగాడు. ఆ తరువాత సెంటినలీస్లు అలెన్ను చుట్టుముట్టి లాక్కెళ్లారు’’ అని ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది. సెంటినలీస్లను చూసి భయపడ్డ జాలర్లు అక్కడి నుంచి పారిపోయారని.. మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే అలెన్ శరీరం తీరంలో పడి ఉందని వివరించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే నార్త్ సెంటినల్ దీవిలో విదేశీయులు పర్యటించేందుకు కేంద్రం ఇటీవలే అనుమతి ఇచ్చింది. -
అండమాన్లో అమెరికన్ టూరిస్ట్ హత్య
న్యూఢిల్లీ : అండమాన్, నికోబర్ దీవుల్లో ఓ అమెరికన్ టూరిస్టును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బాధిత టూరిస్ట్ను జాన్ అలెన్గా గుర్తించారు. జాన్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. బాధితుడు గతంలో ఐదు సార్లు అండమాన్కు వచ్చారని, క్రైస్తవ బోధనలను ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని తపన పడేవాడని స్ధానిక మీడియా పేర్కొంది. జాన్ అలెన్ చిదియతపు ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో ఈనెల 16న ఉత్తర సెంటినెల్ ద్వీపానికి చేరుకున్నారు. ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసించే తెగ బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడదని చెబుతున్నారు. కాగా ఈ తెగలో కేవలం 50 మంది జనాభా ఉన్నట్టు సమాచారం. -
స్వచ్ఛమైన మనసు
తాగుబోతు తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడు.. తల్లి సంపాదన ఏ మూలకూ చాలలేదు.. సునామీ సర్వస్వమూ కోల్పోయేలా చేసింది...బతుకుబాటలో ఊరు విడిచింది...ఊరుకాని ఊరిలో ఇబ్బందులు ఎదుర్కొంది.. ఆకలి దప్పులతో అలమటించింది..చివరకు జీవితంలో నిలదొక్కుకుంది..వందలాది అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారింది. సినిమాను తలపించే ఈ సంఘటలన్నీ యాస్మిని జీవితంలో చోటుచేసుకున్నవే.అందుకే ఈరోజు కథనం ఆమె గురించే..సాక్షి, స్టూడెంట్ ఎడిషన్. దేశానికి తూర్పున, బంగాళాఖాతం మధ్యలో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులు. వీటి రాజధాని పోర్ట్బ్లెయిర్లో నివసించే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే యాస్మిని. 2003 వరకూ ఆమె జీవితం మామూలుగానే సాగిపోయింది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఓ ప్రభుత్వ స్కూల్లో తక్కువ వేతనానికి పనిచేసే తల్లి కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలూ పడేది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు 2004లో వచ్చిన సునామీలో యాస్మిని కుటుంబం సర్వస్వమూ కోల్పోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో రోజుల తరబడి రోడ్ల మీదే గడిపారు. అప్పుడు యామిని పదోతరగతి చదువుతోంది. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం.. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లికి సాయంగా కష్టపడాలని నిర్ణయించుకుంది యాస్మిని. వెంటనే చిన్నపాటి జీతానికి పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది.సునామీలో ధ్వంసమైన ఇంటికి మరమ్మతులు చేయించింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, తమ్ముళ్లను బాగా చదివించాలని నిర్ణయించుకొని మంచి ఉద్యోగం, సంపాదన కోసం ముంబైకి చేరింది. అయితే,అక్కడ అంత సులభంగా ఉద్యోగం దొరకలేదు. అష్టకష్టాలూ పడి ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.6,500కు కాంట్రాక్టు పద్ధతిలో చిన్న ఉద్యోగం సంపాదించింది. వచ్చే ఆదాయంలోనే ఇంటి ఖర్చులకు పంపేది. ఒక్కోసారి తినడానికీ డబ్బులు సరిపోక పస్తులు ఉండేది. ఆ సమయంలోనే తిండి లేని తనలాంటి వాళ్లను, అనాథలను ఎంతోమందిని చూసింది. ఆలయాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధుల్లో అనేకమంది నిరాశ్రయులు దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు ఎండబెట్టుకుంటున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో తనలాంటి వారి కడుపు నింపేందుకు నడుం బిగించింది. అనాథల ఆకలి తీరుస్తూ.. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. మొదట తన పుట్టినరోజును, పండగలను అనాథల సమక్షంలో జరుపుకోవడం ప్రారంభించింది. దీనికోసం మురికివాడలు, రైల్వే స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేది. అక్కడిపిల్లలకు, వృద్ధులకు కావల్సిన తినుబండారాలు, దుస్తులు తీసుకెళ్లి పంచేది. కొందరిని అనాథాశ్రమాల్లో చేర్పించింది. ఇదే సమయంలో ఆమెకు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతోపాటుఅదనంగా కమీషనూ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో కనిపించిన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు చెన్నైకి వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంవృద్ధి చెందడంతో మంచి ఇంటితోపాటు కారు కొనుగోలు చేశారు. ఈ కార్లోనే రోజూ అనాథలు, నిరాశ్రయులకు కావల్సిన ఆహార పదార్థాలు, బట్టలు, చెప్పులు, చాక్లెట్లు, మందులు కొని పంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజూ నగరంలో కనీసం 30 కి.మీ ప్రయాణిస్తూ వీటిని అందజేస్తున్నారు. అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. యాస్మిన్ అంటే అరబిక్లో మల్లెపువ్వు అని అర్థం. ఇంగ్లిష్లోని జాస్మిన్ పదానికి ఇదే మూలం. మల్లెపువ్వు తెల్లదనం స్వచ్ఛతకు ప్రతీక. అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారిన యాస్మిన్ మనసు కూడా స్వచ్ఛమైనదే. -
అండమాన్లో బయటపడ్డ.. అరుదైన చీమలు
సాక్షి, న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో చీమ జాతికి చెందిన అత్యంత అరుదైన రెండు రకాల చీమలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అండమాన్ ద్వీప సముదాయంలోని హావ్లాక్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (బెంగళూరు), జపాన్కు చెందిన ఒకినోవా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ జీవులకు ప్రముఖ శాస్త్రవేత్తలైన కేఎస్, కృష్ణన్, జార్వాల పేర్లు వచ్చేలా.. టెట్రానియం క్రిష్ణాని, టెట్రానియం జార్వా అని నామకరణం చేశారు. అండమాన్ దీవుల్లోని మొక్కలు, అక్కడ పెరిగే ఆకుకూరల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చీమ జాతులకు చెందిన జీవులను గుర్తించారు. ఇవే కాకుండా ఇప్పటివరకే 50 రకాల చీమల జాతులను ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం సభ్యుడు గౌరవ్ అగ్వేకర్ చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రకాల చీమ జాతుల సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీమ జాతుల్లో చాలావాటి గురించిన సమాచారం అందుబాటులో లేదన్నారు. వీటి గురించి సమాచారం నిక్షిప్తం చేస్తే భవిష్యత్లో పర్యావరణ, పరిణామ మార్పులకు సంబంధించిన పలు అంశాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. -
మెరుపు వేగంతో అండమాన్కు..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మొన్నటి వరకూ అండమాన్ ఎవరైనా వెళ్తున్నారంటే అబ్బో... అండమానే...అని ఆశ్చర్యంగా ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రెండుంపావు గంటల్లోనే అండమాన్ చేరుకోవచ్చు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా రెండేళ్లుగా పోర్టుబ్లెయిర్(అండమాన్)కు విమాన సర్వీసులు వారానికి రెండు మార్లు అందిస్తోంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు చేరుస్తోంది. ఈ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో ఆ సంస్థ ఇంకో రెండు సర్వీసులు పెంచే నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మీదుగా కనెక్టివిటీ పెంచింది. మొత్తం ఢిల్లీ ప్రయాణికులే నెలకు 30 వేల మంది వరకూ ఉన్నారు. ఢిల్లీ, పోర్టుబ్లెయిర్లకు విమాన సర్వీసులు పెంచుతూ చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీ–విశాఖ–పోర్టుబ్లెయిర్–ఢిల్లీకి ఇలా... ఢిల్లీ –విశాఖ–పోర్టుబ్లెయిర్ –ఢిల్లీకి సోమ, గురు, శనివారాల్లో సర్వీసులు అందించడానికి ప్రణాళిక చేసింది. ఆ రకంగా ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి విశాఖకు 7.40కి చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.15కి బయలుదేరి 10.10కి పోర్టుబ్లెయిర్ చేరుతుంది. పోర్టుబ్లెయిర్లో 10.50కి బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 2.35కి వెళ్తుంది. ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి... ఎయిరిండియా విమాన సంస్థ ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి మంగళ, బుధ, శుక్ర,ఆదివారాల్లో సర్వీసులు అందించనుంది. ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి పోర్టుబ్లెయిర్కు 9.15కు చేరుతుంది. అక్కడి నుంచి 9.55కి బయలుదేరి విశాఖకు 11.55కి వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.30కి బయలుదేరి 2.35కి ఢిల్లీ చేరుతుంది. వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది... అండమాన్కు కోస్తాంధ్ర జిల్లాలనుంచి ప్రయాణికులు, వ్యాపారులు, టూరిస్టులు విపరీతంగా పెరిగారు. శ్రీకా కుళం నుంచి అధికంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి నేవీ అధికారులు,ఉద్యోగులూ రక్షణ రంగ అవసరాల కోసం తరచూ వెళ్లొస్తున్నారు. ప్రయాణాలకు వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది.దీంతో ఎయిరిండియా విమాన సంస్థ వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ప్రతి రోజూ సర్వీసులు ఇచ్చే ప్రతిపాదన జరుగుతోంది. – డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు విమాన ప్రయాణం బాగుంది అండమాన్ నుంచి విమాన ప్రయాణం చాలా బాగుంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు వస్తున్నాం. ఓడలో కంటే విమాన ప్రయాణం హాయిగా ఉంది. గతంలో వ్యయ ప్రయాశపడేవాళ్లం. సులభప్రయాణం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. – మాధవరావు, అండమాన్ ప్రయాణికుడు, శ్రీకాకుళం అవస్థలు తప్పాయి గతంలో షిప్పై అండమాన్ వెళ్లేవాళ్లం. ఇపుడు విమాన సదుపాయంతో అవస్థలు తొలగాయి. సులువుగా ప్రయాణిస్తున్నాం. తాజాగా కొత్త సర్వీసులు వస్తే మరింత సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు. – సంగీత,అండమాన్ ప్రయాణికురాలు, కవిటి -
అక్కడ పర్యటించకండి
బీజింగ్ : భారత్తో సరిహద్దు వివాదానికి ఆజ్యం పోసేలా మళ్లీ డోక్లాంకు పది కిలోమీటర్ల దగ్గర్లో రహదారి నిర్మిస్తున్న చైనా.. తాజాగా భారత్లో పర్యటించే తమ దేశస్తులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. ప్రతి ఏడాది భారత్లో గణనీయంగా చైనీయులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ డోక్లాం వద్ద రహదారి నిర్మిస్తున్న నేపథ్యంలోనూ, అంతర్జాతీయ మారుతున్న సమీకరణలను దృష్టిలో పెట్టుకుని భారత్లోని కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలకు వెళ్లవద్దంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్లోని అండమాన్, నికోబార్దీవుల్లో చైనీయులు పర్యటించడం ప్రమాదరమంటూ.. చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్లో పర్యటిస్తున్న చైనీయులు తగిన అనుమతి పత్రాలతోనే పర్యటించాలని సూచించింది. అంతేకాక మిలటరీ వాహనాలు, సరిహద్దు బద్రతా బలగాలు, ఇతర రక్షణ, పోలీసుల వ్యవస్థలను ఫోటొలు, వీడియోలు తీయవద్దంటూ తెలిపింది. అంతేకాక భారత్-నేపాల్ పరిహద్దులోనూ పర్యటించడం మానుకోవాలని సూచనలు చేసింది. జూలై 7న డోక్లామ్ వివాదం మొదలైన తరువాత చైనా తొలిసారి తమ పర్యాటకులకు హెచ్చరికలు చేసింది. తరువాత మళ్లీ తాజాగా చైనా ప్రభుత్వం హెచ్చరించింది. భారత్ను చూసేందుకు చైనా నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వారికి వీసా ఇబ్బందులు తలెత్తకుండా భారత ప్రభుత్వం.. ఈ-వీసా సదుపాయాన్ని గతంలో అందించించడం గమనార్హం. -
మయన్మార్లో విమానం గల్లంతు
సముద్రంలో శకలాలు గుర్తించినట్లు ప్రకటించిన సైన్యం యాంగాన్: సుమారు 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన ఓ విమానం బుధవారం గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై–8ఎఫ్–200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో విమానానికి సంబంధాలు తెగిపోయినప్పటి నుంచి నేవీ ఓడలు, ఎయిర్క్రాఫ్ట్లు గాలింపు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరు వైద్య పరీక్షలకు, మరికొందరు పాఠశాలలకు బయల్దేరినట్లు భావిస్తున్నారు. దావేయ్ పట్టణానికి 218 కి.మీ దూరంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మిలిటరీ అన్వేషణ కొనసాగిస్తోందని చెప్పారు. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానం మయన్మార్ దక్షిణ తీరంలో ఉండగా సంబంధాలు తెగిపోయాయని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై స్పష్టత రాలేదు. సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్లో ప్రస్తుతం వర్షాకాలం. అయితే విమానం గల్లంతైనపుడు వాతావరణం బాగానే ఉంది. -
అండమాన్కు తొలకరి
-
అండమాన్కు తొలకరి
► మూడ్రోజుల ముందుగానే రుతుపవనాలు ► జూన్ 1న లేదా అంతకన్నా ముందే కేరళను తాకే అవకాశం ► అదేనెల 5వ తేదీకల్లా తెలంగాణలోకి.. సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ను తాకాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసినదాని కన్నా మూడ్రోజుల ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా అండమాన్కు మే 20–21 తేదీల్లో రుతుపవనాలు వస్తుంటాయి. గతేడాది మే 18న తాకాయి. ఈసారి మే 17న రావొచ్చని ఐఎండీ అంచనా వేసినా 14నే రావడం గమనార్హం. రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన రోజు నుంచి సీజన్ ప్రారంభమైనట్లు భావిస్తారు. అండమాన్కు ముందుగా వచ్చినంత మాత్రాన కేరళకు కూడా అలాగే వస్తాయని చెప్పలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ముందుగానే..? సాధారణంగా రాష్ట్రంలోకి జూన్ 10న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కేరళకు ఒకవేళ ముందస్తుగానే వస్తే.. జూన్ నాలుగైదు తేదీల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని, వారం అయ్యాక సరిగ్గా అంచనా వేయొచ్చని పేర్కొంటున్నారు. తాజాగా రుతుపవనాలు తాకడంతో వాయువ్య దిశ నుంచి అండమాన్ వైపు గాలులు వీస్తాయి. దీని ప్రభావం వల్ల మన రాష్ట్రంలోకి వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. అలాగే అక్కడక్కడ జల్లులు కురిసే కూడా అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత అంతగా లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు కురిసిన అకాల వర్షాలు ఉష్ణోగ్రతల ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పడ్డాయి. ఇక నుంచి కురిసే వర్షాలను రుతుపవనాల కారణంగా కురిసే ముందస్తు వర్షాలుగా పరిగణిస్తారు. ఈసారి ఆశాజనకమే.. గతేడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నా కీలకమైన జూలై, ఆగస్టులో పెద్దగా వర్షాలు కురవలేదు. జూన్, సెప్టెంబర్ నెలల్లో భారీగా కురిశాయి. సెప్టెంబర్లో కురిసిన వర్షాలే గత రబీని నిలబెట్టింది. ఈసారి గతేడాది కంటే కాస్తంత తక్కువగానే వర్షాలు కురవొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నా.. రైతుకు ఆశాజనకంగానే ఉంటాయన్న అంచనా ఉంది. మండిన రామగుండం.. 45 డిగ్రీలు రాష్ట్రంలో ఆదివారం ఎండలు మండిపోయాయి. రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండల్లో 44.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నిజామాబాద్లో 44, మెదక్, హన్మకొండల్లో 43, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్లలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేటలో 40 డిగ్రీలు నమోదైంది. -
150 ఏళ్లకు ఎగసిన లావా
పణజీ: దాదాపు 150 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న ‘బ్యారెన్ ఐలాండ్’అగ్నిపర్వతం తాజాగా తిరిగి లావాను వెదజల్లుతోందని పరిశోధకులు శుక్రవారం చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న అగ్ని పర్వతం ఇదొక్కటే. అండమాన్ నికోబార్ దీవుల్లో, రాజధాని పోర్ట్ బ్లెయిర్కు 140 కి.మీ దూరంలో ఉంటుంది. 1991 నుంచే అప్పుడప్పుడు ఈ అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వచ్చేవి. గోవాలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ ఐఓ)లో పనిచేసే పరిశోధకుల బృందం ఈ ఏడాది జనవరి 23న అండమాన్ తీరంలోని సముద్ర మట్టిని సేకరించేందుకు అగ్ని పర్వతం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో బూడిద వెలువడుతుండటం చూసి పరిశోధకులు పర్వతానికి దూరంగా వచ్చి గమనించారు. అగ్నిపర్వతం విడతల వారీగా లావాను వెదజల్లుతోందనీ, ప్రతిసారీ 5 నుంచి 10 నిమిషాల పాటు లావాను బయటకు చిమ్ముతోందని పరిశోధకులు గుర్తించారు. జనవరి 26న ఇదే సంస్థకు చెందిన మరో బృందం అక్కడకు వెళ్లినప్పుడు కూడా బూడిద వెలువడింది. పగటి సమయంలో కేవలం బూడిద మాత్రమే కనపడగా, చీకటి పడ్డాక చూస్తే ఎర్రటి లావా కూడా వస్తున్నట్లు స్పష్టమైంది. అగ్ని పర్వత బిలం వద్ద పొగ మేఘాలు కమ్ముకున్నాయి. -
మరో ముప్పు
► తరుముకొస్తున్న అల్పపీడనం ► అండమాన్ వద్ద అల్పపీడన ద్రోణి సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాన్ విలయం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోక ముందే మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి తమిళనాడువైపు కదులుతున్నట్లు చెన్నై వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు సహజంగా అక్టోబర్ 20వ తేదీన ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు సాగుతున్నా నవంబరులో తగినంతగా వర్షాలు పడలేదు. ఈశాన్య రుతుపవనాలు ఆరంభమైన తొలిరోజుల్లో బంగాళాఖాతంలో గియాండి తుపాన్ ఏర్పడింది. ఈ తుపాన్ వల్ల తమిళనాడులో వర్షాలు పడలేదు. ఆ తరువాత నడా తుపాన్ కారైక్కాల్ సమీపంలో తీరం దాటినపుడు కడలూరు, నాగపట్టినం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, ఈనెల 10వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తుపాన్ 12వ తేదీన చెన్న నగరాన్ని నేరుగా తాకింది. చెన్నైలో 119 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్ తీరం దాటేపుడు గంటకు 130–140 కీలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని, శివార్లను దారుణంగా కుదిపేసింది. సగటున డిసెంబరులో 191 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం రెండు వారాల్లో 329 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మళ్లీ ముప్పు: ఇదిలా ఉండగా, రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాల కాలం మరో 15 రోజుల్లో ముగుస్తున్న దశలో భారీ వర్షాలు పడతాయని అంచనా. ప్రస్తుతం బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో ఒక అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేణా బలపడి ఈశాన్యం నుంచి వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంచనా ప్రకారం అల్పపీడన ద్రోణి రాష్ట్ర తీరాన్ని తాకిన పక్షంలో భారీ వర్షాలు కుదిపేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అండమాన్లో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు!
అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్లాక్, నీల్ ద్వీపాల్లో భారీ వర్షాలు, తుపానులో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయన్నారు. పర్యాటకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ట్వీట్లో పేర్కొన్నారు. తుపాను తీవ్రత తగ్గగానే రక్షణ చర్యలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే బృందాలు పోర్ట్ బ్లెయిర్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వార్దా తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ద్వీపంలో ఉన్నవారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు నౌకాదళం నాలుగు నౌకలను అక్కడకు పంపింది గానీ, వాతావరణం బాగోకపోవడంతో అవి లంగరు వేయలేకపోయాయి. ఐదు మీటర్ల ఎత్తులో కెరటాలు వస్తుండటంతో ప్రయాణికులను నౌకల్లోకి చేర్చడం అసాధ్యంగాను, ప్రమాదకరంగాను మారింది. నౌకలు పోర్టు వెలుపల వేచి చూస్తున్నాయని, వాటిలో తగినంత ఆహారం, తాగునీరు, మందులు, వైద్యసిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. పోర్ట్బ్లెయిర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం అంతా తుపాను పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలు, బలమైన గాలులతో పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీన్ని ఎల్1 విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో నీల్, హేవ్లాక్ ద్వీపాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. పలు నౌకలు, హెలికాప్టర్లలో ఇక్కడకు చేరుకుంటారు. కానీ సోమవారం నుంచి అసలు నౌకలు గానీ, హెలికాప్టర్లు గానీ ఇక్కడకు రాలేకపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం పది గ్రామాలకు నిత్యావసరాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. పలు చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోర్ట్బ్లెయిర్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొబైల్ సిగ్నళ్లు, ఇంటర్నెట్ కూడా చాలాచోట్ల నిలిచిపోయాయి. -
విశాఖ చేరుకున్న హర్షవర్దన్ నౌక
విశాఖపట్నం : ప్రయాణికులతో అండమాన్కు వెళ్తూ.. సాంకేతిక లోపం తలెత్తడంతో నడి సముద్రంలో నిలిచిన హర్షవర్దన్ నౌక గురువారం తిరిగి విశాఖకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు దాదాపు 600 మంది ప్రయాణికులతో విశాఖ పోర్టు నుంచి అండమాన్కు బయలుదేరింది. అయితే బయలుదేరిన రెండు మూడు గంటలకే... నౌకలోని జనరేటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నౌక నడి సముద్రంలో నిలిచిపోయింది. బుధవారం విశాఖ నుంచి ఇంజినీర్లు వెళ్లి.. జనరేటర్లకు మరమ్మతులు చేశారు. అనంతరం తిరిగి విశాఖకు తీసుకువచ్చారు. దాదాపు 38 గంటల పాటు ప్రయాణికులు సముద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు పోర్టు ట్రస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ చేరుకున్న హర్షవర్దన్ నౌక
-
మరికాసేపట్లో అండమాన్కు 'హర్షవర్దన్'
విశాఖపట్నం : అండమాన్ వెళ్తున్న హర్షవర్దన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తి నడి సముద్రంలో నిలిచిపోవడంపై విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి. కృష్ణబాబు బుధవారం విశాఖపట్నంలో స్పందించారు. మధ్యాహ్నాం 2.00 గంటల తర్వాత ఈ నౌక అండమాన్ బయలుదేరే అవకాశం ఉందని తెలిపారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు సాంకేతిక నిపుణులను పంపుతున్నట్లు చెప్పారు. అలాగే నౌకలో ప్రయాణిస్తున్న 560 మందికి ఆహారాన్ని పంపుతున్నట్లు కృష్ణాబాబు వెల్లడించారు. హర్షవర్దన్ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు పోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారులను సంప్రదించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. -
నడిసముద్రంలో ఆగిపోయిన నౌక
-
నడి సంద్రంలో నిలిచిన నౌక: ప్రయాణికుల ఆందోళన
విశాఖపట్నం: అండమాన్ వెళ్తున్న 'హర్షవర్దన్' నౌకలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో నడి సంద్రంలో నౌక నిలిచిపోయింది. దీంతో నౌక సిబ్బంది వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో సాంకేతిక సిబ్బంది బృందాన్ని హర్షవర్దన్ నౌక వద్దకు పంపి లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు విశాఖ ఫోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం విశాఖలో వెల్లడించారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు సిబ్బంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. అయితే రాత్రి సమయంలో నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు అయింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అలాగే సునామీ వచ్చే సూచనలు కూడా లేవని తెలిపింది. ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. -
హమ్మయ్యా...నౌక బయలుదేరింది
ప్రయాణికులకు మూడు రోజులు నరకం చూపించిన ఎం.వి.స్వరాజ్దీప్ నౌక ఎట్టకేలకు శనివారం ఉదయం పదిగంటలకు విశాఖ పోర్టు నుంచి అండమాన్కు బయలుదేరింది. ఈనెల 18నే బయలుదేరాల్సిన ఈ నౌక తుపాను కారణంగా మూడు రోజులుగా విశాఖ పోర్టులోనే నిలిచిపోయింది. నౌక సిబ్బంది సహా 1200 మంది మూడు రోజులుగా ఓడలోనే ఉండిపోయారు. డబ్బులు అయిపోయి.. ఆహారం అందక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుపాను విశాఖ తీరం దాటడంతో వాతావరణం నౌక ప్రయాణానికి అనుకూలంగా మారింది. -
2, 3 రోజుల్లోనే అండమాన్కు ‘నైరుతి’
- నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: వాతావరణం శరవేగంగా మారిపోతోంది. అనూహ్య పరిణామాలతో నైరుతి రుతుపవనాల రాకకు మార్గం సుగమమవుతోంది. శనివారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని పది రోజులు ముందుగానే తాకవచ్చన్న విషయం స్పష్టమైంది. తాజాగా రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకడానికి అనుకూల పరిస్థితులున్నాయని భారత వాతావరణ విభాగం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. వాస్తవానికి మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్ను తాకుతాయి. ఆ తర్వాత పది రోజులకు అంటే జూన్ ఒకటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన నాలుగైదు రోజుల ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయి. ఆతర్వాత వారం రోజుల్లోనే ఇవి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారనుంది. రెండ్రోజుల్లో(16 నాటికి) మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని ఐఎండీ పేర్కొంది. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు మరింత బలాన్ని సంతరించుకుంటాయని రిటైర్డు వాతావరణ అధికారి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. తెలంగాణాలో వర్షాలు.. వడగాడ్పులు.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు విచిత్రమైన పరిస్థితి ఏర్పడనుంది. ఒకవైపు వడగాడ్పులు, మరోవైపు అల్పపీడనంతో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక తీరప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని వల్ల శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ రెండు రోజులు తీవ్రమైన వడగాడ్పులు కూడా వీస్తాయని హెచ్చరించింది. మధ్యాహ్నం వరకు వడగాడ్పులు, సాయంత్రాలు ఉరుములతో వర్షాలుంటాయని తెలిపింది. ఇక శుక్రవారం రామగుండంలో అత్యధికంగా 45.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 44.3, నిజామాబాద్లో 43.7 డిగ్రీలు రికార్డయింది. రాజధాని నగరం హైదరాబాద్లోనూ భానుడు ప్రతాపం చూపించాడు. కొద్దిరోజులపాటు చిరుజల్లులు, చల్లని గాలులతో ఉపశమనం పొందిన నగరవాసులకు మళ్లీ ఎండదెబ్బ తప్పడం లేదు. శుక్రవారం గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 28.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో సిటీజనులు విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో వానలు.. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణిల ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లోనూ పగటి పూట ఉష్ణోగ్రతలు ఒకింత అధికంగా నమోదైనా వడగాడ్పులు వీచే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోకెల్లా రామగుండంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయానికి) తునిలో 22.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. హార్సిలీహిల్స్ సమీపంలోని ఆరోగ్యవరంలో మినహా రాయలసీమలోని మిగి లిన ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.2 ఆదిలాబాద్ 44.3 నిజామాబాద్ 43.7 మెదక్ 42.4 ఖమ్మం 42.0 భద్రాచలం 41.6 హైదరాబాద్ 41.2 మహబూబ్నగర్ 40.5 అనంతపురం 42.7 కడప 41.2 తిరుపతి 41.2 విజయవాడ 41.0 -
ఆదిమ ఏకాంతం ఎన్నాళ్లు?
విశ్లేషణ అండమాన్లోని జరావా తెగ ప్రజల నిర్బంధ ఏకాంత వాసాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ వారికి తమ మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? లేదా? ఇటీవల అండమాన్ జరావా తెగకు వార్తా పత్రికల్లో కాస్త చోటు లభ్యమవుతున్నట్లు కనిపిస్తోంది. జరావా యేతర పురుషుడితో సంపర్కం ద్వారా ఈ తెగ మహిళ ఒక పాపను ప్రసవించింది. అయితే ఆ పాప హత్యకు గురైంది. ఈ హత్యను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలా? లేక, జరావా తెగ అంతరించి పోకుండా కాపాడాలన్న తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ హత్యోదంతాన్ని పట్టించుకోకుండా ఉండిపోవాలా? శిక్షించడం ద్వారా ఒక జరావాను కోల్పోయినట్లయితే అది వారి సంఖ్యను తగ్గించే అవకాశముంది. ఒక్క మనిషి తగ్గిపోయినా సరే వారి సంఖ్య తగ్గిపోతుంది. దాదాపు 50 వేల సంవత్సరాలుగా జరా వాలు అండమాన్ ప్రాంతంలో వేటతో ఆహా రాన్ని సేకరించుకునేవారుగా మనుగడ సాధిస్తు న్నారు. క్షీణిస్తున్న వారి సంఖ్య రీత్యా అండమాన్ లోని ఓంజె తెగలాగా వీరినీ రక్షిత జాబితాలోకి చేర్చారు. వారి విశిష్ట, ప్రత్యేక లక్షణాల కారణం గా ఏ ఇతర గుంపులో కలిసినా సరే వీరికి హాని కలిగే అవకాశముంది. అందుకే, ‘బయటి వ్యక్తుల కనీస జోక్యం’తో ‘తమదైన భవిష్యత్తును ఎంచుకోవడానికి’ జరావాలను అనుమతించి నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ పేర్కొంది. జరావాలను వారి ఆవాస ప్రాంతాల్లోనే ఉంచుతూ వాటి సరిహద్దుల్లో గార్డులను నియమించడం ద్వారా వారిని బయటి వ్యక్తుల కు దూరంగా ఉంచడం అనేది ప్రభుత్వం అనుసరించే విధానపు ముఖ్య లక్షణంగా ఉంటోంది. ఒక దశలో సుప్రీంకోర్టు సైతం జరావాలు నివసించే ప్రాంతం గుండా వెళ్లే రోడ్ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది. గిర్ జంతు సంరక్షక కేంద్రంలోని సింహాలను చూస్తున్న విధంగా బయటి వ్యక్తులు జరావా లను చూడటానికి సఫారీకి వెళుతున్నారు. వారెక్కడ ఉంటున్నారో అక్కడే అలాగే ఉండేవిధంగా, జరావాలకు ప్రభుత్వం కలిగిస్తున్న రక్షణ నిష్క్రియాత్మకంగానే ఉంది. 1990ల ప్రాంతంలో జరావాలు అడవుల నుంచి బయటకు వచ్చి, తమ తెగ కానివారితో, బయటివారితో సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించారు. దేశంలోని ఇతర తెగలను ప్రధాన స్రవంతిలో కలిపేందుకోసం సక్రియాత్మకమైన, నిర్ణయాత్మకమైన మద్దతు నిచ్చేవారు. వీరికి కోటాలు ఉండేవి. బడ్జెట్లు ఉండేవి. అన్ని ప్రజాప్రాతినిధ్య సంస్థల్లో ప్రాతినిధ్యం కూడా ఉండే ది. మరొకవైపున, జరావాలను నిర్బంధ ఒంటరితనంలో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. అధికారిక విధానం ప్రకారం జరావాలను సంరక్షిస్తున్నారు. వారి రక్తసంబంధాన్ని, సంస్కృతిని భద్రపర్చడానికి మానవ విజ్ఞాన శాస్త్ర రీత్యా తగు కారణాలు ఉండవచ్చు.. కానీ వారికి మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? వారు ఏం ఎంపిక చేసుకునేది ఏది? మనకేమీ తేలీదు. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని, ఎంపికను మనం అసలు కనుగొనలేదు. అలాంటి అవకాశం వారికి ఉంటే, పార్సీలుగా ప్రధాన స్రవంతిలో ఉంటూనే తమ విశిష్ట లక్షణాలను అలాగే నిలిపి ఉంచుకునేవారా? ఇతరులతో పోలిస్తే తాము విశిష్టత కలిగి ఉన్నామనే విషయం పట్ల వారు జాగరూకతతో ఉంటున్నారని, కొత్తగా పుట్టిన బిడ్డను ఒక జరావా తెగ వ్యక్తి చంపివేసిన ఘటన సూచిస్తోంది. రహస్య సంబంధం వారిని మశూచి బారిన పడవేస్తున్నందున, వారిని బహిర్గతం చేసినట్లయితే తెగమొత్తానికే నష్టం కలుగుతుందని మనం గ్రహిస్తున్నాం. తక్కిన ప్రపంచం నుంచి పూర్తిగా దూరం పెట్టినందుకే వారిపట్ల ఆసక్తి ఏర్పడుతోందా? వారు మన ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదని చాలా తక్కువగానే వారికి తెలుసనేది స్పష్టం. మనలో ప్రతి ఒక్కరికీ దఖలుపడిన హక్కుల గురించి కూడా వారికి తెలిసింది చాలా తక్కువే. విచిత్రం ఏమిటంటే, వారిని రంగంలో ఉంచేందుకోవడమే? మనం సమయాన్ని, శక్తిని, వనరులనూ వెచ్చిస్తున్నాం. ఇది ఊరగాయల సీసాలో ముక్కల్లాగే తలపిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే వారి తరపున మనం నిర్ణయాలు తీసుకోవడమే అన్యాయం, అసమంజసం. మన గణతంత్ర రాజ్యంలో వారు భాగంగా లేరనిపించేలా ఇది ఉంటోంది. జరావాలను ఉన్నట్లుండి ప్రపంచం ముందుకు తీసుకురావటం వల్ల సొంత ప్రయోజనాలున్న బయటివారు వారికి పూర్తిగా హాని కలిగించేలా చేస్తుంది. సొంత ప్రయోజనాలు అంటే జరావాలు ఆధారపడి ఉన్న అడవులు లేదా వారి ఓట్లు వంటివి. వీటిలో రెండోదానికి అంత ప్రాముఖ్యత ఉండక పోవచ్చు. ఎందుకంటే జరావాల మొత్తం సంఖ్య 300 లేక 400 మాత్రమే. అయితే తక్కిన భారత్తో పోలిస్తే తమ పరిస్థితి గురించి అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేసే స్థాయిలో వారికి విద్య గరిపే విషయంలో కూడా ఎలాంటి గట్టి ప్రయత్నం జరిగి ఉండలేదు. వారి సమ్మతితో పనిలేకుండా మనం నిర్ణయిస్తున్నాం కాబట్టి నేను నైతిక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. కానీ అత్యంత చిన్న స్థాయి లోని వారి పరిమాణం రీత్యా వారు ఇప్పటికే మనల్ని ఉనికిపరంగా భయపెడుతున్న సామా జిక బృందంగా ఉంటున్నారు. ఏరకంగా చూసిన ప్పటికీ వారి భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది. అయినప్పటికీ ప్రస్తుత విధానం ప్రకారం వారు తమదైన చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండాల్సిందే. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
మరో ఐదు దీవులను తెరుస్తాం: జవదేకర్
న్యూఢిల్లీ: ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు అండమాన్ నికోబార్లో మరో ఐదు దీవులను తెరవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం పేర్కొన్నారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ 500 ద్వీపాల సమూహం కలిగి ఉందని, ఇందులో ఎక్కువశాతం జనావాసాలు కానివి, నిషేధిత ప్రాంతాలని చెప్పారు. తాను ఇటీవల అండమాన్ నికోబార్ను సందర్శించినపుడు ఈ ఐదు దీవులపై అక్కడి స్థానికులతో మాట్లాడానన్నారు. అక్కడ 94 శాతం అటవీ ప్రాంతంగా ఉందని, మిగిలినది తీరప్రాంత నియంత్రణ మండలం (కోస్టల్ రెగ్యులేషన్ జోన్-సీఆర్జెడ్)గా ఉందన్నారు. అటవీ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ఐదు దీవులను అభివృద్ధి చేస్తామని, ఐదుగురు మంత్రులతో కూడిన బృందం పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రకాశ్ జవదేకర్ వివరించారు. -
అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం
పోర్ట్బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పోర్ట్బ్లెయిర్కి 241 కిలోమీటర్ల దూరంలోని బ్యాంబూ ప్లాట్ సమీపంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. -
గత వందేళ్ల రికార్డ్ బ్రేక్
-
చెన్నైలో వందేళ్ల రికార్డు బ్రేక్
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలతో చెన్నై నగరం వందేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1918లో చెన్నైలో 108.8 సెంటీమీటర్ల వర్షం కురవగా, సోమవారంనాటికి చెన్నైలో వర్షపాతం 118 సెంటీ మీటర్లుగా నమోదై వందేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. చెన్నైలో 30 ఏళ్ల క్రితం అంటే 1985లో నవంబర్లో 97 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ తరువాత ఈ ఏడాదే అత్యధిక వర్షాలు కురిశాయి. తల్లడిల్లుతున్న తమిళనాడు నెల రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు తల్లడిల్లిపోతున్నాయి. వరుస అల్పపీడనాల కారణంగా గత నెల రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పట్లో తేరుకోలేని నష్టాన్ని భరిస్తున్న తమిళులపై ప్రకృతి ప్రకోపం ఇంకా చల్లారలేదు. తాజాగా మరోసారి వరుణుడు తమిళనాడుపై విరుచుకుపడ్డాడు. బంగాళాఖాతం శ్రీలంక, అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన రెండు అల్పపీడన ద్రోణుల ప్రభావంతో సోమవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై నగరం చెరువే అయింది. చెన్నై నగరంలో గత వందేళ్లలో ఎన్నడూ కురవనంతగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో నగరం చెరువులా మారింది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో వరద ముంపుతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. (చెన్నై వర్షాల ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి) కడలూరులోని పదివేల ఇళ్లు నీటమునగగా ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పునరావాస కేంద్రాలను తెరిచారు. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని చెన్నై వాతావరణ శాఖ డెరైక్టర్ రమణన్ తెలిపారు. సముద్రతీర జిల్లాలతోపాటు పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య 230 చేరుకోగా సోమ, మంగళవారాల్లో మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అర్ధ సంవత్సర పరీక్షలు వాయిదావేసింది. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ తమిళనాడులో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు మంగళవారం రంగంలోకి దిగాయి. పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, చెన్నై, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నాయి. గారిసన్ ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన ఆర్మీ బృందాలు తాంబరం, ఊరపాక్కం ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించాయి. మరోపక్క చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు ప్రవేశించడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. అదేవిధంగా పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. -
పొంచి ఉన్న మరో ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: వానలు, వరదలతో విలవిల్లాడుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తాలకు పిడుగులాంటి వార్త ఇది. మూడువారాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మరో ముప్పు ముంచుకొచ్చేలా ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. గురువారం నాటికి అల్పపీడనంగా బలపడబోతోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని అల్పపీడనద్రోణి ఉపరితల ఆవర్తనంతో కలసి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమపై ఈశా న్య రుతుపవనాలు బలంగా ఉన్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. వాయుగుండంగా మారనుందా? అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా బలపడకపోయినా అల్పపీడనం ప్రభావంతోనైనా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీని ప్రభావం ఉత్తర కోస్తాకంటే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అధికంగా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 28 నుంచి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకుంటూనే ఉన్నాయి. కొద్దిరోజుల నుంచి అల్పపీడనం లేకపోయినా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడైతే భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడచిన 24 గంటల్లో పాలసముద్రంలో 7 సెం.మీలు, చిత్తూరు, పలమనేరు, వెంకటగిరికోటల్లో 5, పాకాల, గోరంట్లల్లో 4, శాంతిపురం, ధర్మవరం, పుంగనూరు, కుప్పం, చెన్నేకొత్తపల్లి, మదనపల్లె, సింహాద్రిపురం, బత్తల పల్లె, నగరి, వెంకటగిరిల్లో 3, పెనుకొండ, తిరుమల, తనకల్, లేపాక్షి, ఆరోగ్యవరం, తాడిమర్రిల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
అండమాన్ నికోబార్ దీవుల్లో 8 భూకంపాలు
అండమాన్ నికోబార్ దీవులను 8 భూకంపాలు వణికించాయి. వీటిలో రెండు భారీ భూకంపాలు కూడా ఉన్నాయి. ఆదివారం రాత్రి సమయంలో ఇవి వచ్చాయి. భారీ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5కు పైగా నమోదైంది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదు. మరోవైపు.. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లో కూడా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో మరో భూకంపం భూమికి పది కిలోమీటర్ల లోతున సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపాలన్నీ భూమికి 35-60 కిలోమీటర్ల లోతున నమోదయ్యాయి. గతంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పలుమార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంతో పాటు ఇండోనేషియాలో కూడా భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. -
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబాద్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదు అయింది. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులకు 80 కిలోమీటర్ల దూరంలోని మోహిన్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. -
ప్రకృతి ప్రేమికుల సామ్రాజ్యం
సాక్షి: అందమైన సముద్రతీరాలు, పగడపు దీవులు, ఆకుపచ్చని అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం, వింతైన జలచరాలతో.. ప్రకృతి తన సోయగాలను ఆరబోసినట్లు ఉండే ప్రదేశం అండమాన్ దీవులు. బిజీ బిజీ నగర జీవితంతో అలసిపోయి.. ప్రశాంత వాతావరణంలో కొద్ది రోజులు ఆనందంగా గడపాలనుకునే వారికి చక్కని ప్రదేశం అండమాన్ - నికోబార్ దీవులు. వందల సంఖ్యలో పక్షి జాతులు, సుమారు రెండు వేలకు పైగా జాతుల మొక్కలతో అండమాన్ అలరారుతోంది. అలాంటి పగడపు దీవుల అందాలపై స్పెషల్ ఫోకస్... పగడపు దీవులు అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో భాతర భూభాగానికి తూర్పదిక్కులో 800 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 8,249 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇవి మొత్తం 572 దీవులు. వీటిలో చాలా వరకు ప్రపంచపటంలో కనపడవు. వీటిల్లో 36 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అండమాన్ దీవుల్లోకి మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు. నికోబార్ దీవుల్లో సందర్శకులకు అనుమతి నిషేధం. చరిత్ర పదిహేడవ శతాబ్దంలో మరాఠీయులు ఈ దీవులను ఆక్రమించారు. తరువాత బ్రిటిష్ ఇండియాలో భాగమయ్యాయి. రెండవ ప్రపంచయుద్ధకాలంలో నేతాజీ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ సహాయంతో ఈ దీవులను వశపరుచుకుంది. నేతాజీ మరణంతో తిరిగి బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్లాయి. 1947లో స్వతంత్య్ర భారతదేశంలో భాగమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం హయంలో అనేక మంది భారతస్వాతంత్ర సమరయోధులను పోర్ట్బ్లెయిర్లో ఉన్న సెట్యులార్ జైలులో బంధించేవారు. ఈ జైలును కాలాపానీ అని కూడా పిలుస్తారు. ఆకట్టుకుంటున్న సెల్యూలార్ జైలు ఒకప్పుడు బ్రిటిష్ వారి రాక్షసత్వానికి నిదర్శనంగా, ఖైదీల పాలిట మృత్యువాకిలిగా ఉండే అండమాన్ జైలు నేడు జాతీయ స్మారక చిహ్నంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. రోజూ సుమారు 1000 మంది ఈ జైలును సందర్శిస్తుంటారు. ఇక్కడ బ్రిటిష్ వారు మొదట స్థావరం ఏర్పరుచుకున్న రాస్ఐలాండ్, అక్కడి మ్యూజియం చూడదగ్గవి. ఆదాయవనరులు: ఇక్కడ వరి, సుపారి, కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. దాదాపు దీవులన్ని దట్టమైన అడవులతో దీవులతో నిండి ఉండటంతో కలప కూడా ప్రధాన ఆదాయవనరుగా ఉంది. చేపల వేట ఎంతో మందికి ఉపాధి మార్గంగా మారింది. ఎలా వెళ్లాలి? అండమాన్-నికోబార్ దీవులకు వెళ్లాలంటే ముందుగా రాజధాని పోర్ట్బ్లెయిర్ చేరుకోవాలి. కోల్కతా, చెన్నైల నుంచి రోజూ పోర్ట్బ్లెయిర్కు విమాన సర్వీసులు ఉన్నాయి. చెన్నై నుంచి పోర్ట్బ్లెయిర్కు విమానంలో రెండు గంటల ప్రయాణం. విశాఖపట్నం, చెన్నై, కోల్కతాల నుంచి ఓడలో రెండున్నర నుంచి మూడురోజుల ప్రయాణంతో పోర్ట్బ్లెయిర్ చేరుకోవచ్చు. అండమాన్ అందాలు అండమాన్ను సందర్శించే వాళ్లకు అక్కడి టూరిజం డిపార్ట్మెంట్ వాటర్ డైవింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, ఆక్వా సైక్లింగ్, సెయిలింగ్...ఇలా అనేక జలక్రీడలను నిర్వహిస్తోంది. ఆ దీవులకు వెళ్లిన వారు తప్పకుండా చూడాల్సిన బీచ్లు.. రాధానగర్ బీచ్, హర్మిరందర్ బే బీచ్, కర్మటాంగ్ బీచ్. ఇక్కడి ఫిషరీస్ మ్యూజియం రకరకాల చేపలను మన కళ్లముందు ఉంచుతుంది. ప్రపంచంలోని విశేషమైన సీతాకోక చిలుకలను ఇక్కడి హారెట్ నేషనల్ పార్క్లో చూడవచ్చు. ట్రైబల్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, మహాత్మాగాంధీ జాతీయ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అండమాన్ దీవుల్లోని హావ్ లాక్ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి బీచ్లు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి జలక్రీడలను ఇక్కడ ఆనందిచవచ్చు. ఇక్కడి రూట్ ల్యాండ్ ఐలాండ్ ప్రకృతి సోయగాలకు నిలయం. సముద్ర తీర అడవులు, పగడపు దీవులు వంటి సహజ సౌందర్యాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అండమాన్లోని నీల్ ద్వీపం పొడవైన సముద్ర బీచ్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే స్నార్కెలింగ్, సి వాకింగ్, వంటి జలక్రీడలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయి. బారాతంగ్ ద్వీపంలో బారాతంగ్ అగ్నిపర్వతం ఉంది. టూరిస్ట్ గైడ్లతో ఈ దీవికి వెళ్లటం మంచిది. ఇక్కడ అనేక సున్నపు రాతి గుహలు, మాన్ గ్రోవ్ ప్రదేశాలు ఉంటాయి. జార్వా తెగకు చెందిన ఆదిమజాతి ప్రజలు ఇక్కడ నివసిస్తారు. వీరితో వ్యవహరించటం చాలా కష్టం. ఇతర ప్రజలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అండమాన్ ప్రభుత్వం ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో 15 రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఎకో ఫ్రెండ్లీ టూరిజాన్ని ప్రోత్సహిచేందుకుగానూ, సంగీత, నృత్య, వాయిద్య రంగాల్లోని ప్రముఖ కళాకారులతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాటర్స్పోర్ట్స్, పరుగుపందేలు, మ్యాజిక్ షోలు, పప్పెట్ షోలు, స్కూబా డైవింగ్ లాంటి ఎన్నో క్రీడలు నిర్వహిస్తారు. -
అండమాన్, చైనాల్లో భూకంపం
కౌలాలంపూర్/బీజింగ్: బంగాళాఖాతంలోని అండమాన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం 11:20 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. మలేషియా పట్ణం పెర్లిస్ కు 782 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాగా సునామి హెచ్చరికలేవీ జారీ కాలేదని తెలిసింది. మరోవైపు చైనా వాయువ్య రాష్ట్రం జింగ్ జియాన్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదయిన ఈ భూకంపం కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఇప్పటివరకు నలుగురు చనిపోయారని, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. శిధిలాల తొలిగింపు ప్రక్రియపూర్తయ్యేసరికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
వైద్యం కోసం వస్తూ విమానంలోనే..
చెన్నై: అండమాన్ నికోబార్ దీవుల నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు (46) విమానంలోనే ప్రాణాలు విడిచాడు. రాబర్ట్ అనే వ్యక్తి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి బయలుదేరాడు. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ విమానంలోనే విగతజీవిగా మారిపోయాడు. విమానం చెన్నై విమానాశ్రయంలో దిగగానే, అతడు అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంసభ్యులు, తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు విమానాశ్రయంలోని వైద్యబృందాన్ని సంప్రదించారు. అయితే అతను అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మీనంబాకం పోలీసులు దాన్ని పోస్ట్ మార్టానికి తరలిచారు. అయితే రాబర్ట్ మరణానికి గల కారణాలను పోస్ట్మార్టం నివేదిక తర్వాత మాత్రమే చెప్పగలమని వారంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. -
అండమాన్లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2 గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని వాతావరణ శాఖ పేర్కొంది. -
మొండికేసిన అండమాన్ నౌక
సాక్షి, విశాఖపట్నం: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖ నుంచి అండమాన్ వెళ్లే నౌక సాంకేతిక సమస్యలతో శుక్రవారం మొండికేసింది. ఇంజన్లో సమస్య తలెత్తడంతో ఉదయం 11.30 గంటలకు వెళ్లాల్సిన నౌక సాయంత్రం 6గంటలకు బయలుదేరింది. దీంతో 2వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విశాఖ పోర్టు నుంచి అండమాన్లోని పోర్టు బ్లెయిర్ వరకూ ప్రతి నెలా నౌకను షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నడుపుతున్నారు. 1100 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణానికి రూ.2,500 నుంచి రూ.9వేల వరకూ కేటగిరిల వారీగా టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. యాభై ఆరు గంటల పాటు ప్రయాణించాల్సి ఉండటంతో ప్రయాణీకులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు. చెన్నై, కోల్కత్తా పోర్టుల తర్వాత అండమాన్కు విశాఖ నుంచే నౌకాయానం అందుబాటులో ఉంది. చెన్నై, కోల్కత్తా నుంచి కంటే విశాఖ నుంచి వెళితే నాలుగు గంటలు ముందుగానే పోర్ట్బ్లెయిర్ చేరుకోవచ్చు. అయితే అండమాన్ నౌక ఆలస్యమవ్వడం కొత్తకాదు. గతంలోనూ అనేక సార్లు ఇదే విధంగా ఇబ్బందులు పెట్టింది. ఒక్కొసారి రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. -
న్యూగినియాలో మరోసారి భూకంపం
సిడ్నీ: పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. కాగా ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. మే 1వ తేదీన కూడా న్యూగినియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. -
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు
అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్బ్లెయిర్కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఇది వచ్చినట్లు తెలిపారు. అయితే, దీనివల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించినట్లు మాత్రం సమాచారం లేదు. ఇక పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొకోపో నగరానికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా ఏమీ లేవు. -
మనవారే గానీ.. మనకు దూరం
మానవ ప్రపంచానికి దూరంగా ఎక్కడో వున్న ఆ ఆందమైన బీచ్లు, నీలి నీలి...మేఘాల్లా కనిపించే సముద్రపు అలలు, సమీపంలోనే ఉన్న దట్టమైన ఆ ఆడవులను ఆకాశ మార్గాన చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా అక్కడికెళ్లి తనవితీరా సేదతీరి రావాలని కోరిక కలగడం సహజం. కానీ అక్కడకెళ్లేందుకు సాహసిస్తే మాత్రం ప్రమాదం. ఏ పొదల మాటునుంచో దూసుకొచ్చే విషపూరిత బాణాలు గుచ్చుకొని ప్రాణాలు తీస్తాయి. ఆ బాణాలను ప్రయోగించేదీ మనవాళ్లే. మానవులే... కాకపోతే ఆది మానవులు. ప్రపంచంలోనే అతి పురాతన తెగగా, రాతియుగం నాటి మానవులుగా గుర్తింపుపొందిన వారు 60 వేల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు. వారు నివసిస్తున్న దీవి ప్రపంచపుటంచుల్లో ఎక్కడో లేదు. భారతదేశంలోనే ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే చోటున్న అండమాన్ నికోబార్ దీవుల్లో భాగంగా ఉన్న ఉత్తర సెంటినెల్ దీవి అది. వారిని నాగరిక సమాజానికి దగ్గరగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఆ ప్రాంతంలో విస్తారంగా దొరికే చేపల కోసం ఆశపడి వెళ్లి భారత మత్స్యకారులు బలైన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దీవికి మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఎవరూ వెళ్లరాదని భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మనం ఆ ఆదిమానవుల వద్దకు వెళితే మనకు కలిగే హాని కన్నా వారికి కలిగే హానే ఎక్కువని ఆది మానవ తెగల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ సంస్థ హెచ్చరిస్తోంది. మానవ నాగరికతకు దూరంగా నివసిస్తున్న ప్రపంచంలో ఆదిమ తెగల్లోకెల్లా పురాతన తెగకు చెందిన వారు సెంటినెల్ దీవి వాసులేనని ఆ సంస్థ పేర్కొంది. ఆ తెగవారు ప్రస్తుతం వందల్లో ఉన్నారా, వేలల్లో ఉన్నారా అన్న విషయాన్ని నిర్ధారించి చెప్పలేకపోతున్నామని, 2004లో వచ్చిన సునామీలో చాలా మంది మరణించారని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్టీఫెన్ కారీ తెలిపారు. -
అహ్మదాబాద్ నుంచి అండమాన్కు
మోదీ భార్య వార్త ప్రసారం చేసినందుకు దూరదర్శన్ అధికారిపై వేటు! న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్కు సంబంధించిన వార్తను ప్రసారం చేసిన అహ్మదాబాద్లోని దూరదర్శన్ గుజరాత్ చానల్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఏడాదిలో రిటైర్ కాబోతున్న ఆయనను ఏకంగా అండమాన్కు బదిలీ చేశారు. ప్రధాని భార్యగా తనకు అందిస్తున్న సదుపాయాలు ఏమిటో తెలపాలని జశోద దాఖలు చేసిన సమాచారహక్కు దరఖాస్తుపై రెండు నిమిషాల్లోపు వార్త గత నెల 1న ‘డీడీ గిర్నార్’లో ప్రసారమైంది. ఆ రోజు చానల్ కోసం గుజరాత్ వార్తలు సేకరించిన అసిస్టెంట్ డెరైక్టర్ వీఎం వనోల్(58)ను జనవరి రెండో వారంలో అండమాన్లోని పోర్ట్ బ్లెయిట్ స్టేషన్కు బదిలీ చేశారు. దీన్ని వనోల్ ధ్రువీకరించారు. అయితే బదిలీకి దారితీసిన వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. మందలింపు..! ఈ వార్త ప్రసారమైన మరుసటి రోజు ఢిల్లీలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు డీడీ గిర్నార్ అధికారులతో మాట్లాడి వివరణ ఇవ్వాలన్నారు. జనవరి 1 నాటి వార్తలు సమకూర్చిన వనోల్తోపాటు జాయింట్ డెరైక్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్ డెరైక్టర్లను మందలించినట్లు సమాచారం. అయితే ఢిల్లీ అధికారులు సాధారణ సమీక్షలో భాగంగానే గిర్నార్ అధికారులతో మాట్లాడారని, ఏదో ప్రత్యేక అంశంపై కాదని సమాచార, ప్రసార శాఖ ఉన్నతాధికారులు అధికారులు చెబుతున్నారు. వనోల్ బదిలీ సంపాదక, పాలనాపరమైన నిర్ణయమని, దీనికి మరే ఉదంతంతోనూ సంబంధం లేదని చెప్పారు. దీనిపై డీడీ గిర్నార్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు(జనవరి 1) గుజరాత్ వార్తల సేకరణ బాధ్యత వనోల్ చేపట్టారు. జశోదాబెన్ వార్తను అన్ని ప్రైవేట్ టీవీ చానళ్లు ప్రధానంగా ప్రసారం చేయడంతో దానిపై ఆయన చిన్నవార్త ఇవ్వాలని నిర్ణయించారు’ అని తెలిపారు. కాగా, జశోద ఆర్టీఐ దరఖాస్తు వార్తను డీడీ గిర్నార్ గత డిసెంబర్లోనూ ప్రసారం చేసినా ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. -
సునామీ మృతులకు స్మృత్యంజలి
తమిళనాడు వ్యాప్తంగా నివాళులర్పించిన ప్రజలు సముద్రుడికి పూజలు సాక్షి, చెన్నై: చెన్నై తీరాన్ని అతలాకుతలం చేసి సుమారు 7 వేల మందిని పొట్టనపెట్టుకున్న సునామీ ఘటన జరిగి పదేళ్లు కావడంతో తమిళనాడువ్యాప్తంగా ఆ మృతులకు శుక్రవారం నివాళులర్పించారు. హిందూ మహాసముద్రంలో సంభవించిన పెను భూకంపం కారణంగా ఇండోనేసియాలోని సుమిత్రా దీవుల్లో ప్రారంభమై, అండమాన్ మీదుగా 2004లో చెన్నై తీరాన్ని తాకిన జలప్రళయం ఎన్నో జీవితాలను కబళించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా చెన్నై, నాగపట్నం తదితర ప్రాంతాల్లో బాధిత కుటుంబాల , మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రఖ్యాత మెరీనా బీచ్లో మహిళలు సముద్రునికి క్షీరాభిషేకం చేశారు. ఇకపై ఉగ్రరూపం దాల్చవద్దని మొక్కుకున్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం సాగర తీరం వద్ద సామూహికంగా మౌనం పాటించారు. పుదుచ్చేరీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రంగస్వామి, స్పీకర్ వి.సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు సునామీ మృతులకు నివాళులర్పించారు. ఇతర ఆసియా దేశాల్లోనూ సునామీ మృతులకు నివాళిగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఐరాస సహాయ నిధికి భారత్ సాయం సునామీ సహా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన సహాయ నిధికి రూ.6.35 కోట్ల సాయాన్ని భారత్ శుక్రవారం ప్రకటించింది. థాయ్ల్యాండ్లోని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ మేరకు ప్రకటన చేశారు. -
అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం
అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. పోర్ట్బ్లెయిర్కు 94 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. -
అండమాన్ సముద్రంలో అల్పపీడనం
రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: అండమాన్ సముద్రంలో సోమవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. దీంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాకు ఆనుకుని మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జల్లులుగానీ, మోస్తరు వర్షంగానీ కురిసే అవకాశం ఉంది. అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం బలపడ్డాక ఈ నెల 13, 14 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. గడచిన 24 గంటల్లో కాకినాడ, పెద్దాపురం, గుండపాలెంలలో 3 సెం.మీ, ఒంగోలు, బాపట్ల, రెంటచింతలలో ఒక సెం.మీ. చొప్పున వర్షం పడింది. సముద్ర తీరంలో ఇద్దరు గల్లంతు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని పెంటకోట తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన వంగలపూడి అనిల్ కుమార్ (20), బారుగుల రామకృష్ణ(16) గల్లంతయ్యారు. ఐదుగురు స్నానానికి దిగగా అలల ఉధృతికి సముద్రంలోనికి ఇద్దరు కొట్టుకుపోయారు. బి.మురళి, బి.శ్రీకాంత్, నరేంద్ర అనే వారిని రక్షించారు. -
దీవులను కొందామా?
ఇల్లు, కారు.. కొనమన్నంత సులువుగా... ఏకంగా దీవినే కొనమంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే! ఇల్లు, కారు ఇతర వస్తువులు కొన్నట్లుగానే డబ్బులుంటే ఏకంగా దీవులనే కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొన్నాళ్ల వరకు వాటిని లీజుకు తీసుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే ఆయా దీవులలోని నచ్చిన విల్లాను ఎంపిక చేసుకొని, సొంతం చేసుకోవచ్చు. తక్కువ కాలానికి అద్దెకు దొరికే విల్లా సదుపాయాలు కూడా దీవులలో ఎన్నో ఉన్నాయి. అలాంటి దీవుల కథాకమామీషు... - వ్యాపారవేత్త విజయ్మాల్యాకు అనేక చిన్నా పెద్దా దీవులు సొంతంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా యూరప్ దీవులలోనూ, మాల్దీవులలోనూ మాల్యా రిసార్ట్స్ నడుపుతున్నారు. - ఖతార్ రాజు షేక్ అహ్మద్ ఖలీప్ అలీకి సొంతంగా రెండు దీవులున్నాయి. హాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వర్జిన్ దీవుల సముదాయంలోని నెకర్ ఐలాండ్ను సొంతం చేసుకున్నాడు. మనకు అండమాన్, నికోబార్ దీవులు తెలుసు. మాల్దీవులు, కరేబియన్ దీవుల గురించి వినే వున్నాం. చుట్టూ నీళ్లు, మధ్యలో అందమైన ప్రకృతికి నెలవుగా తీరుగా ఉండే భూమి.. తీరాన ఇసుకతిన్నెలు, బారులు తీరినట్టుగా ఉండే పామ్ చెట్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి దీవులు పెట్టింది పేరు. అలాంటి చోటకు కొత్త దంపతులైతే హనీమూన్కి వెళతారు. ఇంకొందరు విశ్రాంతి కోసం వెళతారు. మరికొందరు దీవుల చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశోధించడానికి వెళతారు. ఎవరెందుకు వెళ్లినా దీవులు ఎప్పుడూ కనువిందు చేస్తూ వెనక్కి తిరిగి వెళ్లనివ్వకుండా ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి చోట కొన్ని రోజులపాటు ఆనందానుభూతులను సొంతం చేసుకొని, వదిలి రావాలంటే మనసొప్పదు. అలాగని మనది కాని చోట ఎన్నాళ్లని ఉంటాంలే అని సర్దుబాటూ అవసరం లేదు. మీకు నచ్చిన దీవిని కొనేసుకుంటే ఎన్నాళ్లైనా అక్కడే ఉండిపోవచ్చు. అవసరం లేదనుకుంటే అద్దెలకు ఇచ్చుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు కొనసాగించవచ్చు. కొన్నవాటిని తిరిగి అమ్మకానికి పెట్టవచ్చు. ఏదైనా ఒక దీవిని కొనాలనే ఆలోచన మీకుంటే చాలు ప్రపంచ స్థిరాస్తుల విపణిలో అందమైన దీవులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సంపన్న వర్గాలు విలాసవంతమైన జీవనం కోసం దీవులను కొనుగోలు చేస్తుంటారు. ఆహ్లాదం కోసం కొనుగోళ్లు... అనేకమంది శ్రీమంతులు ఇప్పుడు దీవుల మీద దృష్టిసారిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మనసుకు నచ్చినట్టుగా గడపడం కోసం విలాసవంతులు దీవులను ఎంచుకుంటున్నారు. కొందరు తమ స్థోమతను బట్టి కొన్నేళ్లపాటు అద్దెకు తీసుకుంటే, దీవులు నచ్చితే ఎంత మొత్తమైనా పెట్టుబడిగా పెట్టి కొనుగోలు చేసి, పూర్తిగా తమ సొంతం చేసుకునేవారు కొందరుంటారు. అమెరికాలోని సంగీత దిగ్గజాలు ఫెయిత్ హిల్, టిమ్ మెక్గ్రోకి ఇలాగే బహమాస్లోని ఎక్స్మాస్ దీవిని కొనుగోలు చేశారు. దీంట్లో వీరు ఇటీవలే 15,000 చదరపు అడుగులలో అధునాతనమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆకర్షణీయమైన పెట్టుబడి... చిన్న చిన్న దీవులు పెద్ద ఆదాయానికి మార్గాలవుతున్నాయి. ఆకర్షణీయమైన పెట్టుబడిగా పలువురిని ఆకర్షిస్తున్నాయి. ద్వీపాలను కొనుగోలు చేసేవారిలో నూటికి 98 శాతం వ్యాపార దృక్కోణంలోనే చూస్తారు. ఇతర ఆస్తులపై పెట్టుబడి పెట్టినట్టుగానే దీవుల మీదా పెట్టుబడి పెడతారు. తమ సొంతం చేసుకున్న దీవులలో అద్భుతమైన వేసవి విడుదులు, హోటళ్లు నిర్మించి, వాటిని విహారయాత్రకు వచ్చేవారికి అద్దెలకు ఇస్తారు. ఇది లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ప్రముఖ వ్యాపారవేత్తలు ఏయే దీవులు టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉన్నాయో శోధిస్తారు. ఉత్తమం అనదగ్గ వాటిని వేలం పాటల ద్వారా తమ సొంతం చేసుకునే వేటలో ఉంటారు. అయితే మరికొంత మంది దీంట్లో కూడా వైవిధ్యాన్ని చూపుతున్నారు. లండన్కి చెందిన ప్రపంచప్రసిద్ధ వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ పీటర్ బియార్డ్ మాత్రం తన పెంపుడు చిరుత పిల్లల కోసం కిందటేడాది కోటికి పైగా డాలర్లు వెచ్చించి మరీ యూరప్లో ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. ఇండో కెనడియన్ బిలియనీర్ అయిన బాబ్ ధిల్లన్ కైతే ఏకంగా 2,300 ఎకరాలు గల మాసివ్ దీవి ఉంది. మధ్య అమెరికాలో ఉన్న ఈ దీవి పగడపు దిబ్బలలో ప్రపంచంలోనే విస్తీర్ణంలో రెండవదిగా పేరుగాంచింది. అభివృద్ధి వైపు పరిశీలన... కొన్ని దీవులు 2 నుంచి 12 ఎకరాలలోనే ఉంటాయి. వీటిని అతి చిన్న ద్వీపాలుగా పిలుస్తారు. 12 - 24 ఎకరాలలో ఉండేవి మధ్యస్థం. వీటిని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. 24 నుంచి 37 ఎకరాల వరకు ఉండేవి పెద్ద దీవులు. 37 నుంచి 50కి ఎకరాలకు పైగా ఉన్న దీవులలో పెద్ద భవనాలు, విల్లాలకు అనుకూలంగా ఇక్కడి భూమి ఉంటుంది. ఇలాంటి చోట అద్దెలకు, లీజులకు భవనాలు ఉంటాయి. వీటితో పాటు దీవి స్థలాకృతి, ఓడలకు వేసే లంగరుకు అనుకూలత, చుట్టుపక్కల పేరెన్నికగన్న బీచ్లు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. నాట్ ఫర్ సేల్... మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. బంగాళఖాతంలో తళతళ మెరిసేటి దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే పగడపు దిబ్బలు ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగంలో తూర్పున 700 కి.మీ పొడవునా వ్యాపించి ఉన్న ఈ దీవులు నీలిరంగులో స్వచ్ఛంగా కనిపించే నీటితో, ఇసుక తిన్నెలతో కనువిందుచేస్తాయి. ఇవి మన కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి వీటి కొనుగోళ్లకు, అమ్మకాలకు అనుమతించరు. అయితే వీటిలో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. ప్రైవేట్ దీవులు సముద్రపు నీటిలో భూభాగానికి దూరంగా ఉంటాయి. ఇవి వ్యక్తి లేదా సంస్థల చేతుల్లో ఉంటాయి. కొన్ని దీవులు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. గడచిన రెండేళ్లలో దీవుల కొనుగోళ్లు అమ్మకాలలో వృద్ధి రేటు రెట్టింపు అవుతూ వస్తోంది. వీటిని కొనుగోళ్లకు పెట్టినప్పుడు సొంతం చేసుకునేవీలుంటుంది. దీవుల అమ్మకాలు, కొనుగోళ్లలో ‘ప్రైవేట్ ఐల్యాండ్ ఆన్లైన్ డాట్ కామ్’ పేరెన్నిక గన్నది. ఈ వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. - కూర్పు: ఎన్.ఆర్. -
ముంచుకొస్తున్న ముప్పు!
మరో 12 గంటల్లో పెను తుపానుగా మారనున్న హుదూద్ విశాఖపట్నం/న్యూఢిల్లీ : పెనువేగంతో వస్తున్న హుదూద్ తుపానుతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. బంగాళాఖాతంలో అండమాన్లోని పోర్ట్బ్లెయిర్ వద్ద ఏర్పడిన హుదూద్ తుపాను క్రమంగా తీవ్రరూపు దాల్చి విశాఖపట్నంవైపు దూసుకువస్తోంది. మరో 12 గంటల్లో పెను తుపానుగా మారనుంది. బుధవారం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాను ఏమాత్రం దిశ మార్చుకోకుండా స్థిరంగా కదులుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయ దిశగా 675 కి.మీ. దూరంలో, ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ పెను తుపాను ఆదివారం మధ్యాహ్నానికి విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. హుదూద్ ప్రభావంతో ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు 60-70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది సముద్ర తీరం సమీపానికి వస్తున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పెను గాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (6.5 సెంటీమీటర్ల నుంచి 12.4 సెం.మీ.), అతి భారీ వర్షాలు (12.5 సెం.మీ. నుంచి 24.4 సెం.మీ.) కురుస్తాయని తెలిపింది. ఒడిశాలోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 24.5 సెం.మీ.కంటే ఎక్కువగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదివారానికి గాలుల తీవ్రత విపరీతంగా పెరుగుతుందని తెలిపింది. ఆదివారం 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీవ్రత ఒక్కసారిగా పెరిగి గంటకు 180 కి.మీ. వేగంతో పెనుగాలులు విరుచుకుపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు 2 మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చు. ఈ తుపానుకు కచ్చా ఇళ్లు కూడా దెబ్బ తినే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు, సమాచార వ్యవస్థ దెబ్బ తినే అవకాశముందని తెలిపింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశముందని చెప్పింది. గాలి దుమారం, వరదల ప్రమాదం ఉందని హెచ్చరించింది. హుదూద్ పరిధి 600 కి.మీ. వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఆ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుదూద్ ముప్పును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. తీరప్రాంతంలోని మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 11 మండలాల పరిధిలోని 50 గ్రామాలకు ముప్పు ఉందని గుర్తించారు. శుక్రవారం ఈ గ్రామాలకు చెందిన 76 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించాలని నిర్ణయించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరూ 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను సహాయక చర్యలపై చర్చించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కూడా విశాఖలో అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. డిస్కంలు కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాయి. మరోపక్క.. ముందస్తు, సహాయక చర్యలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ సేథ్ గురువారం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) 5 వేల మందితో కూడిన ఐదు బెటాలియన్లను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్లలోని ఈ ఐదు ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లలోని 51 బృందాలను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నంలకు రెండేసి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఒక్కో బృందాన్ని పంపారు. ఒడిశాకు 9 బృందాలను పంపనున్నారు. ఒడిశాలోని గంజం జిల్లాలో మూడు, ఖుర్దాలో రెండు, గజపతి, కటక్, పూరి, బాలేశ్వర్ జిల్లాల్లో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది. పాట్నా, కోల్కతా, చెన్నైల నుంచి నాలుగేసి చొప్పున బెటాలియన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు బయల్దేరాయి. తుపాను సమయంలో వరదల నుంచి బాధితులని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 54 మంది గజ ఈతగాళ్లను, 162 పడవలను అత్యాధునిక పరికరాలతో పంపనున్నారు. మిలటరీకి చెందిన 4 బెటాలియన్లు కూడా రాష్ట్రానికి రానున్నాయి. నేవీ కూడా 30 బోట్లను, సిబ్బందిని సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు 14 శాటిలైట్ ఫోన్లను సమకూర్చింది. కాగా, తుపాను నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల వినియోగదారుల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూంలలో నిరంతరం అందుబాటులో ఉండే మానిటరింగ్ సెల్లు ఏర్పాటు చేశారు. -
దూసుకొస్తున్న హుదూద్
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు పొంచి ఉన్న పెను తుపాను ముప్పు 12న విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరాన్ని తాకే అవకాశం విశాఖపట్నం/హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపైకి హుదూద్ పెను తుపాను దూసుకొస్తోంది. అతి తీవ్రమైన ఈ తుపాను ఈ నెల 12న ఏపీ, ఒడిశాల తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా రూపం దాల్చి పెను తుపానుగా మారుతోంది. ఇది బుధవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్, లాంగ్ ద్వీపాలను దాటింది. అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలవైపు వస్తోంది. ఏపీ, ఒడిశాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశాలోని గంజాం, పూరి, ఖుద్రా జిల్లాలపై 11వ తేదీ నుంచి దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో.. హుదూద్ తుపాను ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి తూర్పు, ఆగ్నేయ దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా, 36 గంటల్లో పెను తుపానుగా మారనుంది. 12వ తేదీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ మధ్య తీరం దాటనుంది. ఇది తీరం దాటే సమయంలో తీవ్రమైన వర్షాలు, గంటకు 155 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ చెప్పారు. అయితే, కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో ఇంకా అంచనాకు రాలేకపోతున్నారు. అయితే, విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య 200 కిలోమీటర్లలో ఎక్కడైనా తీరాన్ని తాకవచ్చని ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం శాస్త్రవేత్త ఎం.మహాపాత్ర చెప్పారు. కాగా, తుపాను ముప్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులూ రెండు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పైలీన్ తర్వాత మళ్లీ తీవ్ర తుపాను గత ఏడాది సంభవించిన పైలీన్ తుపాను తర్వాత హుదూద్ అంత్యంత తీవ్రమైన రెండో తుపానుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పైలీన్ తుపాను వచ్చిన సమయంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచాయి. హుదూద్ ఇంత తీవ్రమైన తుపాను కాకపోయినప్పటికీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు, పెను గాలులతో తీవ్రంగా ప్రభావాన్ని చూపే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ‘హుదూద్’.. ఒమన్ పక్షి రెండు రోజుల క్రితం అండమాన్ సమీపంలో ఏర్పడిన ఈ తుపానుకు హుదూద్గా నామకరణం చేశారు. హుదూద్ ఒమన్ దేశానికి చెందిన ఓ పక్షి. దాని పేరుతోనే ఈ తుపానును పిలుస్తున్నారు. -
అండమాన్లో తీవ్ర వాయుగుండం
ఉత్తర అండమాన్లోని లాంగ్ఐలండ్ సమీపంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. లాంగ్ ఐలండ్కు ఆగ్నేయదిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో తుఫానుగా మరే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం అండమాన్ నికోబార్ దీవుల్లోని లాంగ్ ఐలండ్ సమీపంలోనే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రాగల మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటుతున్నందున ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. -
అండమాన్ నికోబార్లో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.6 గా నమోదైంది. నికోబార్ దీవుల్లోని మోహిన్కు 216 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. -
కాంగ్రెస్ జీరో కావాలి
రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సాక్షి, బళ్లారి : లోక్సభ ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, అండమాన్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్కు జీరో ఫలితాలు వచ్చాయని, కర్ణాటకలో ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను జీరో చేయాలని ఓటర్లకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి డీవీ సదానందగౌడ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం బళ్లారికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి సాగనంపేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రైల్వే బడ్జెట్ మొత్తం కర్ణాటకకు కేటాయించినా ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో సంతోషం ఉండదని చమత్కరించారు. గత బడ్జెట్లో కన్నా ఎక్కువ నిధులు కేటాయించినా, కర్ణాటకకు తక్కువ నిధులు కేటాయించానని పేర్కొనడం సరైన చర్య కాదన్నారు. రైల్వేలలో అత్యాచారాలు, దోపిడీలు అరికట్టేందుకు ప్రత్యేకంగా నాలుగు వేల మంది మహిళా పోలీసులను నియమించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంత్కుమార్, ప్రతిపక్షనేత జగదీష్ శెట్టర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీ శ్రీరాములు బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అండమాన్
అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్కర్ స్కేల్పై 5.5గా నమోదు అయ్యింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా సునామీ హెచ్చరికలు లేవని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్.. కాలపాని
కాలాపానీ.. అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో భయంకరమైన జైలు. నగరంలోనూ కాలాపానీ ఉంది. సికింద్రాబాద్లోని తిరుమలగిరి చౌరస్తానుంచి సుమారు వందగజాల దూరంలో ఉందీ జైలు ప్రాంగణం. గాలికి రెపరెపలాడే జాతీయ పతాకంతో అటుగా వెళ్లేవారికి ప్రభుత్వ భవనంలా మాత్రమే కనిపించే ఈ జైలు గురించి.. జనానికి అంతగా తెలియదు. అండమాన్లోని కాలాపానీని చూడాలనుకునేవారు ఈ భవనాన్ని సందర్శిస్తే చాలు.. సుమారు 150 సంవత్సరాల క్రితం1858లో ఆనాటి బ్రిటిష్ అధికారులు ఈ సెల్యూలార్ జైలును నిర్మించారు. తప్పుచేసిన బ్రిటిష్ సైనికుల్ని శిక్షించేందుకు సుమారు 20 వేల 344 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ జైలుని నిర్మించారు. ఇదే నమూనాలో, ఈ జైలు కన్నా చిన్న సైజులో కాలాపానీ నిర్మాణం జరగడం విశేషం. ఈ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకంపై రాసి వున్నాయి. గోతిక్ నిర్మాణ శైలిలో వున్న ఈ జైలు పైనుంచి చూస్తే శిలువ ఆకారంలో కన్పిస్తుంది. ప్రత్యేక కిటికీ... జైలు గది లోపల గోడకు గట్టి ఇనుప తాళ్లతో ఖైదీని కట్టి వుంచేలా ఏర్పాటు చేశారు. జైలుగదికి మూడు రకాల ఇనుప తలుపులున్నాయి. గదిలోనుంచి బయటికి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. ఈ కిటికీకి ఓ ప్రత్యేకత వుంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఏముందో అంత మాత్రమే కనపడుతుంది. తిరిగి అదే కిటికీ బయట నుంచి లోపలికి మనం చూస్తే ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. సెల్యులార్ జైలు నిర్మాణశైలి ఆనాటి బ్రిటిష్ సైన్యాధికాల కాఠిన్యానికి అద్దం పడుతుంది. మూడో అంతస్తులో ఉరి.. మూడో అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుప కప్పీల ఏర్పాటు ఉంది. శిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం కోసం చిన్న ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ల చిత్రపటాలు ఉన్నాయి. ఉరితీసే సమయంలో ఇనుప కప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతిక కారణం వల్లనైనా ఉరి గురి తప్పినా వ్యక్తి మరణించేలా సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేయడం ఇక్కడ మరో ఆసక్తికర విషయం. సుమారు పదిహేను దశాబ్దాల చరిత్ర పైబడిన ఈ బ్రిటిష్ నిర్మాణం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. జైలు శిఖ రాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. నూరేళ్ల సందర్భంగా... 2006 మార్చి 10న అండమాన్ నికోబార్దీవుల్లోని కాలాపానీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యం వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. ఐతే తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం అధికారుల ముందస్తు అనుమతితో సందర్శించే వీలుంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గొప్ప చారిత్రక వారసత్వ ప్రాధాన్యత గల ఈ సెల్యులార్ జైలుపై రాష్ట్ర పర్యాటక శాఖ తగిన చొరవ చూపి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. - మల్లాది కృష్ణానంద్ -
నౌకాభారం
- విశాఖ-అండమాన్ నౌక టికెట్ ధరల పెంపు - కూలీలు, సామాన్య ప్రయాణికులపై భారం సాక్షి, విశాఖపట్నం: అండమాన్ నౌక టికెట్ ధరలు మళ్లీ పెరిగాయి. డీలక్స్ నుంచి ఫస్ట్క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్, బంక్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పెంచారు. జలమార్గం ద్వారా అండమాన్కు వెళ్లాలనుకునే వారికి విశాఖ నుంచి నడిచే ఈ నౌకే ఏకైక ఆధారం. దీన్ని సాకుగా తీసుకుని అండమాన్ ప్రభుత్వం ఏటేటా ధరలు పెంచుకుంటూ పోతోంది, గతేడాది ఒక్కో విభాగానికి రూ.500 చొప్పున పెంచగా, ఈసారి గరిష్టంగా రూ.400 చొప్పున పెంచింది. మరోపక్క రాష్ట్రం నుంచి నడిపే ఈ నౌకలో అసలే మాత్రం కనీస సౌకర్యాలతోపాటు భద్రత ఉండడం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా సామాన్య, పర్యాటక ప్రయాణికులపై అదే పనిగా భారం మోపుతుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకోసారి నడిపే ఈ నౌకకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. విశాఖ నుంచి నికోబార్, నాన్కౌరీ, స్వరాజ్దీప్ అనే మూడు నౌకలను అండమాన్ ప్రభుత్వం నడుపుతుంది. ఒక్కో నౌకలో డీలక్స్, ఫస్ట్క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్ క్యాబిన్, బంక్ నాలుగు రకాల టికెట్లుంటాయి. ఒక్కోదానికి ఒక్కో రేటు. ప్రస్తుతం స్వరాజ్దీప్ నౌకలో డీలక్స్ క్యాబిన్ టికెట్ ధర రూ.8,420 కాగా రేటు పెంచిన తర్వాత రూ. 8,814కు చేరింది. ఫస్ట్క్లాస్ క్యాబిన్ ధర రూ.6,970 నుంచి రూ,7319, సెకండ్ క్లాస్ రూ.5,540 నుంచి రూ.5,817, కూలీలు అధికంగా ప్రయాణించే బంక్ ధర రూ.2150 నుంచి రూ.2,268 వరకు పెరిగింది. అండమాన్కు వెళ్లే నౌకలో అతి తక్కువ ధరైన బంక్ విభాగానికి కూలీల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. బంక్ విభాగం ధర పెంచవద్దని అదేపనిగా ప్రయాణికులు ఆందోళన చేస్తున్నా అండమాన్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. అండమాన్లో ఏళ్లతరబడి స్థిరపడిన వాళ్లకు అక్కడి ప్రభుత్వం పౌరసత్వం ఉంది. వీళ్లల్లో తెలుగువాళ్లు చాలామందే ఉన్నారు. వీరితోపాటు అండమాన్ పౌరులు కూడా వివిధ పనుల పై విశాఖకు వస్తుంటారు. వీళ్లకు నౌక టికెట్లో సగానికిపైగా రాయితీ అమలవుతోంది. పెరిగిన ధరల ప్రకారం ప్రస్తుతం వీరికి డీలక్స్ టికెట్ రూ.4, 568, ఫస్ట్క్లాస్ క్యాబిన్ టిక్కెట్ రూ.3, 740 నుంచి రూ.4127, సెకండ్ క్లాస్ రూ.2,810 నుంచి రూ.3098, బంక్ రూ.750 నుంచి రూ.830కి పెరిగింది. -
గిరిజనుల మనసులో ఏముంది!
అండమాన్-నికోబార్ దీవుల్లోని ఆదిమ ప్రజలైన జరావా గిరిజనులు దశాబ్దం కిందట వచ్చిన సునామీ ముప్పును ముందే గుర్తించారు. వారిలో ఏ ఒక్కరూ సునామీ బారిన పడలేదు. వారంతా ఎత్తై ప్రాంతాలకు ముందుగానే వెళ్లిపోవడం ‘నాసా’ శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరచింది. అయితే, జరావా గిరిజనులను పరిహసిస్తున్న ‘ఆధునిక సునామీ’ని కళ్లకు కడుతూ పంకజ్ షెఖ్సరియా తన తొలి ఇంగ్లిష్ నవల ‘ద లాస్ట్ వేవ్- ఏన్ ఐలాండ్ నావెల్’లో స్పృశించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయనతో ‘సిటీప్లస్’ ఇంటర్వ్యూ.. జరావా గిరిజనుల గురించి ఎందుకు తెలుసుకోవాలి? జరావా గిరిజనులు ఏకాంత జీవితాన్ని కోరుకుంటారు. నగ్నంగా, స్వేచ్ఛగా జీవిస్తారు. అండమాన్ దీవులన్నింటినీ కలుపుతూ నిర్మించిన గ్రేట్ అండమాన్ ట్రంక్రోడ్ వారి పాలిట శాపమైంది. ‘సభ్య’సమాజపు యాత్రికులు ఈ రోడ్డుపై పర్యటనలు చేస్తూ గిరిజనుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. ఈ దీవుల్లో రోడ్డు అవసరం లేదని, పడవల ద్వారా ఏ ప్రాంతమైనా చేరుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సైతం అపహాస్యమవుతోంది. జరావాల జీవితాలు.. పర్యావరణం, ప్రకృతిపై ఈ పర్యటనలు ఒక రకంగా దాడే. మన ప్రవర్తన గిరిజనులపాలిటి సాంస్కృతిక సునామీగా పరిణమిస్తోంది! వ్యాసాల నుంచి నవలకు మారడానికి కారణం? రచన, సమాజంతో వ్యక్తి జరిపే సంభాషణ. నాన్ ఫిక్షన్ ఒక టూల్. ఫిక్షన్ మరొక టూల్. పాతికేళ్లుగా వివిధ ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాస్తున్నాను. ‘ట్రబుల్డ్ ఐలాండ్స్’, ‘ద స్టేట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ నార్త్-ఈస్ట్ ఇండియా’, ‘ద జరావా ట్రైబల్ రిజర్వ్ డోసియర్’ వంటి వ్యాస సంకలనాలు వచ్చాయి. ఫిక్షన్ ద్వారా మనుషుల ఉద్వేగాలను ఎఫెక్టివ్గా చెప్పవచ్చు. ‘ద లాస్ట్ వేవ్’ ద్వారా జరావా గిరిజనుల జీవితాలను మైదానప్రాంత పాఠకులకు చేర్చే ప్రయత్నం చేశాను. నవలలో పాత్రల గురించి చెప్పండి? మొత్తం పాత్రలు పదిలోపే. ప్రధానపాత్రలు నాలుగు. హరీష్ అనే జర్నలిస్ట్, సీమ అనే స్థానిక యువతి, మొసళ్ల పరిశోధకుడు డేవిడ్, స్థానిక వృద్ధ గైడ్ అంకుల్ పామె. వీరి ద్వారా పడవలో- రోడ్డుపై - అడవిలో - నడక మార్గంలో అండమాన్ జీవన సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని చూపే ప్రయత్నం చేశాను. ఒక తెలుగు సినిమా పాటలో ‘పిట్ట మనసులో ఏముందీ’ అనే చరణం ఉంది. వేధించడం ద్వారా కాదు, ప్రేమించడం ద్వారా గిరిజనుడి మనసులో ఏముందో నాగరికులు తెలుసుకోవాలని ‘ద లాస్ట్ వేవ్’ సూచిస్తుంది! మీ గురించి చెప్పండి? నాన్న ఉద్యోగరీత్యా రాజస్థాన్ నుంచి పుణే వచ్చారు. మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. కొన్నేళ్లుగా హైద్రాబాద్లో ఉంటున్నాను. తెలుగమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కుమారుడు కబీర్కు ఐదేళ్లు. నెదర్లాండ్స్ యూనివర్సిటీలో ‘సమాజంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం’ గురించి పరిశోధన చేస్తున్నాను. స్థానిక-జాతీయ-అంతర్జాతీయ స్థాయిల్లో పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ (kalpavriksh.org)సభ్యుడిగా ఇరవయ్యేళ్లుగా అండమాన్-నికోబార్లను సందర్శిస్తున్నాను. . . : : పున్నా కృష్ణమూర్తి పంకజ్ షఖ్సరియా ‘ద లాస్ట్ వేవ్’ నవలా రచయిత -
అండమాన్లో నైరుతి రాగం
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకాయని తెలిపింది. ఇవి మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలకు విస్తరించవచ్చని తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకొంటాయని, అయితే ఈసారి నాలుగు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయని విశాఖలోని వాతావరణనిఫుణులు వెల్లడించారు. మరోపక్క. చత్తీస్ఘడ్ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం తె లిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, ఉరుమలతో కూడి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. ఇదిలాఉండగా, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే సూచనలు ఉండటంతో వ్యవసాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిడుగుపాటుకు ఇద్దరి మృతి మెంటాడ / మడకశిర, న్యూస్లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడి సోమవారం ఇద్దరు మృతి చెదారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న ఎజ్జిపరపు సింహాచలం (40) అనే మహిళపై పిడుగు పడగా, ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం గొల్లహట్టి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మాలింగప్ప పిడుగుపాటుకు మరణించాడు. అతను గొర్రెలను కాాస్తుండగా వర్షం పడటంతో ఓ చింత చెట్టు కిందకు వచ్చాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అతడితో పాటు రెండు మేకలు మృతి చెందాయి. విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్.కోట, వేపాడ, పార్వతీపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్.కోట మండలంలో పలుచోట్ల ఈదురుగాలలకు చెట్లు విరిగిపడ్డాయి. -
భారత రక్షణ వ్యవస్థలో డొల్లతనం
-
అడవిమల్లె... ‘అవా!’
పామ్ చెట్లతో ముడిపడ్డ జీవనం వారిది. పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరే నైజం వారిది. జంతువులను కూడా బిడ్డల్లా సాకగలిగే హృదయం వారిది. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలోనే కలిసిపోతున్న అచ్చమైన అడవి మల్లెలు ‘అవా’గిరిజన తెగ ప్రజలు. భూమిపై అంతరించిపోతున్న గిరిజన జాతుల్లో ప్రథమస్థానంలో ఉంది ‘అవా!’ భూమిపై ఇతర వ్యక్తులతో ఎలాంటి పరిచయాలనూ పెట్టుకోకుండా ఉన్న జాతి కూడా ‘అవా’ ఒక్కటే! 1800ల కాలంలో ఆంగ్లేయులను పోలినట్టుగా ఉండే ‘అవా’ తెగ ఆహార్యం అండమాన్లోని ‘జరావా’ జాతి వారి జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. వివాహాలకు పరిమితి లేదు... ఈ తెగలో అందరికీ అందరితో బంధుత్వం ఉంటుంది. చిన్న చిన్న సమూహాలుగా ఉండే పెద్ద కుటుంబం వీరిది. ‘టుపి’ భాషలో మాట్లాడుకుంటారు. ఎంత దూరమైనా సమూహమంతా కలిసే వెళతారు. ‘అవా’ పురుషులు, స్త్రీలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ లింగ వివక్ష లేదు. ‘అవా’ పురుషులు పెద్ద జంతువులను వేటాడితే.. స్త్రీలు చిన్నజంతువులను వేటాడతారు. అలాగే ఫలాలను సేకరించడం, పిల్లల పెంపకాలను ఈ తెగ స్త్రీ బాధ్యతగా తీసుకుంటుంది. ఆహారపదార్థాలను సేకరించడంలో సహాయపడే జంతువులను ‘అవా’ జాతి అమితంగా ప్రేమిస్తుంది. ముఖ్యంగా కోతులను జీవితంలో భాగం చేసుకుంటుంది ‘అవా’ మహిళ. ఎంతలా అంటే ఒక రొమ్మున తన బిడ్డకు పాలు ఇస్తూనే, మరో రొమ్మున కోతి పిల్లకు పాలుపడుతుంది. నలువైపులా చురుగ్గా శోధించే గద్దలనూ దగ్గరకు తీస్తుంది. వీటి సంజ్ఞల ఆధారంగా పొంచి ఉండే ప్రమాదాలను తెలుసుకుంటుంది. ఈ తెగ లో వయసులో పెద్ద అయిన మహిళ నాయకురాలిగా ఉండి, సలహాలు ఇస్తుం టుంది. వివాహాలను కుదర్చడం, ప్రసవ సమయంలో శిశువులను కాపాడటం ఈ నాయకురాలి విధి. ‘అవా’ జీవనవిధానం అంతా ద్రావిడ పద్ధతిలో ఉండటం విశేషం. అయితే తెగ నుంచి వేరయిన వారితో వీరు తిరిగి బంధుత్వాన్ని కొనసాగించలేరు. ఎందుకంటే అలా దూరమైన వారు తమ తెగ వారే అనే నమ్మకం లేకపోవడం వల్ల. ఆ విధంగానే ఈ తెగ అతి పెద్ద సమూహం నుంచి అతి చిన్న సమూహంగా మారి ఉంటుందని పరిశోధకుల అంచనా! పామ్ చెట్లతో అనుబంధం... దుస్తుల గురించి వారికి తెలియదు. పామ్ చెట్ల తీగలను, ఆకులను అల్లి అడ్డవస్త్రంగా ధరిస్తారు. పామ్ చెట్ల నుంచి తీసిన నారను తాడులా పేని, దానికి చిన్నచిన్న గవ్వలు గుచ్చి మెడలో ధరిస్తారు. పామ్ చెట్ల ఆకులతో బుట్టలు అల్లుతారు. పామ్ చెట్ల కొమ్మల నుంచి తీసిన నారతో గట్టి తాళ్లను పేనుతారు. పామ్ చెట్ల ఆకులతోనే త్రిభుజాకారంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు. అడవిలో అత్యంత లాఘవంగా జంతువులను ఎలా వేటాడాలో, ఆహారాన్ని ఎలా సేకరించుకోవచ్చో ఈ తెగకు తెలుసు. కానీ, ఆధునిక మనుషుల అన్యాయాలను ఎదుర్కో వడం తెలియదు. దీనివల్లే ఆధునిక ప్రపంచం నుంచి మరింత దూరంగా వెళ్లిపోతోంది ఈ తెగ. వీరి సమస్యను చూస్తుంటే తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డలు తిరిగి ఆ తల్లి గర్భంలోకే వెళుతున్నట్టుగా ఉంటుంది. సంక్షేమం తూర్పు, ఈశాన్య బ్రెజిల్లో భాగమైన అమెజాన్ అడవిలో ఉంది ‘అవా!’ తెగ. ప్రస్తుతం వారి సంఖ్య 350. మరో 100 మంది ఈ తెగతో వేరై ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేకుండా జీవిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలుసుకుంది. ‘అవా’ తెగను 1973లో మొదటిసారి బ్రెజిల్ ప్రభుత్వం గుర్తించింది. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలకన్నా యురోపియన్ ఆక్రమణదారుల హింసాత్మక దాడులతో ‘అవా’ తెగ చిన్నాభిన్నమైపోయింది. ఈ పరిస్థితిని గమనించి ‘అవా’ తెగవారి సంక్షేమం కోస అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించింది. ‘అవా’తెగ జీవించడానికి అనువుగా గ్రామాలను ఏర్పాటుచేసింది. అయితే ఈ తెగవారు ప్రభుత్వ సహాయం తీసుకోవడం లేదు. తమ పూర్వపు సంస్కృతినే కాపాడుకుంటూ వస్తున్నారు. -
అండమాన్ జంతువులకు ఆప్తురాలు...
‘‘ఏయ్ సొనాలీ! ఇటు రా! ఏయ్ చిక్కీ! బుద్ధిగా కూర్చో’’ అంటూ అచ్చం మనుషుల్ని పిలిచినట్టే, బెదిరించినట్టే ఆమె మాట్లాడుతుంటే... ఆశ్చర్యపోతాం. అండమాన్లో ఉండే మనుషులకు ఆమె అందరిలో ఒకరు కావచ్చు కాని అక్కడి వన్యప్రాణులకు మాత్రం ఆమె ఒకే ఒక్కరు. ‘‘పదిహేనేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. వీటితో నాకు పెనవేసుకుపోయిన అనుబంధం ఎలాంటిదంటే... వీటి అడుగుల చప్పుడు వినని రోజు నాకు నిద్రకూడా పట్టదు’’ అంటారు అనురాధారావ్. ఈ మధ్యవయస్కురాలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు అక్కడ ఉంటున్నారో తెలిసిన స్థానికులు చాలా తక్కువ. అయితే అండమాన్ దీవులకు వెళ్లే పర్యాటకులు తప్పకుండా చూసి తీరే రోజ్ ఐలాండ్లో గైడ్గా ఆమె గురించి తెలిసినవారు చాలా ఎక్కువ. ఉద్యోగరీత్యా పర్యాటకులకు గైడ్ అయిన ఆమె స్వచ్ఛందంగా అక్కడి వన్యప్రాణుల ఆలనాపాలనా చూస్తున్నారు. లేడిపిల్లలు, దీవికి సంబంధించిన చారిత్రక విశేషాలు చెబుతూనే జింకలు, బుల్బుల్పిట్టలు, కుందేళ్లు, నెమళ్లు... ఇలా అక్కడ సంచరించే సకల జీవులతోనూ ఆమె హిందీలో సంభాషిస్తారు. విచిత్రమేమిటంటే... జాతులకు అతీతంగా ఆ వన్యప్రాణులు కూడా ఆమె పిలుపులకు అద్భుతంగా స్పందిస్తాయి. అంతే ఆపేక్షగా ఆమె చెప్పే ఆదేశాల్ని తు.చ తప్పకుండా పాటిస్తాయి. ‘‘మనుషులతో మాట్లాడినట్టే వీటితో మాట్లాడగలను. ఇక్కడికి వచ్చిన పర్యాటకులను అటు వెళ్లకండి... ఇటు వెళ్లకండి అని చెప్పినా వినరేమో గాని ఇవి చక్కగా వింటాయి’’ అంటూ తన ఆప్తుల గురించి వివరిస్తారామె. అవసరం లేకపోయినా తన బాధ్యత కాకపోయినా... ఆ వన్యప్రాణుల జీవనవిధానాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని మనకు తెలియజేస్తారామె. పర్యాటకులు ఏవి పడితే అవి వాటి మీదకు విసరకుండా, వారు ఇవ్వాలనుకున్నవాటిలో బ్రెడ్స్ కొన్నింటికి, పప్పులు వంటివి మరికొన్నింటికి ఇలా విభజించి అవి భుజించేలా చేస్తారామె. కుందేలు పిల్లలనైతే చంటిపిల్లలను దాచుకున్న తల్లిలాగ తన దుస్తుల్లోనే పెట్టుకుని తనతో పాటే తిప్పుతుంటారు. రోజ్ఐలాండ్కు వెళ్లిన పర్యాటకులకు ఆమె ఓ ప్రాణం ఉన్న కదిలే జ్ఞాపకంగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఆమె చెప్పే దీవి విశేషాలు కాదు... ఆమె చూపే వన్యప్రాణి ప్రియత్వం. - ఎస్.సత్యబాబు -
'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా
అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కొకుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు చెప్పారు. పడవ దుర్ఘటన పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో మంగళవారం ఆ విషయాన్ని పోస్ట్ చేసింది. అండమాన్ నికోబార్ దీవులోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఆదివారం 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తిరగబడింది. ఆ ఘటనలో 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఒక వ్యక్తి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. మృతులలో తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. జయలలిత ఇప్పటికే మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కన్నీటి ‘కడలి’
గణతంత్ర దినోత్సవం రోజు విహారయాత్రకు బయలుదేరిన తమిళవాసులను కడలి మింగేసింది. అండమాన్ దీవుల్లో పడవ బోల్తా పడిన సంఘటనలో 31 మంది మృత్యువాత పడగా, వారిలో 19 మంది తమిళులే కావడంతో రాష్ర్టం శోకసంద్రంలో మునిగిపోయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:అధిక లోడ్తో వెళుతున్న పడవ బోల్తాపడి 31 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన గణతంత్ర దినోత్సవం రోజు అండమాన్ దీవుల్లో చోటుచేసుకుంది. ఇందులో తమిళనాడువాసులు 19 మంది ఉన్నారు. కాంచీపురం కూరం గ్రామానికి చెందిన కే సెల్వరాజ్ పూజాట్రావెల్స్ పేరుతో విదేశీ యాత్రలు నిర్వహిస్తుంటారు. ఈనెల 26వ తేదీ రిపబ్లిక్ డే కావడంతో చెన్నై, కంచికి చెందిన 32 మందితో అండమాన్ టూర్ వేశారు. వీరిలో 16 మంది పురుషులు, 13 మంది స్త్రీలు, ముగ్గురు బాలికలు ఉన్నారు. విమానంలో వీరందరూ అండమాన్కు చేరిన అనంతరం సముద్ర విహారానికి 25 మంది సామర్థ్యం కలిగిన పడవలోకి మహారాష్ట్రకు చెందిన వారు కూడా కలిసి 46 మంది ఎక్కారు. ఆదివా రం సాయంత్రం వీరంతా నడిసముద్రంలో ప్రయాణిస్తుండగా ఎగిసిపడిన అలలతో కుదుపులకు లోనైన పడవ ఒరిగిపోయింది. దీంతో పడవలోని 31 మంది నీటమునిగి ప్రాణాలు కోల్పోయూరు. వీరిలో 19 మంది తమిళనాడు చెందినవారు ఉన్నారు. ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. స్వల్పంగా గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి పంపించేశారు. తీవ్రంగా గాయపడిన వారు పోర్టుబ్లెయిర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా చేనేత కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. టూర్ నిర్వాహకుడు సెల్వరాజ్ ప్రాణాపాయ స్థితిలో పోర్టుబ్లెయిర్లో చికిత్స పొందుతున్నాడు. ఇతని కుమారుడు, కోడలు మృతి చెందగా, వీరి కుమార్తె పూజ(6) గౌనుకు పడవలోని ఒక ఇనుప క మ్మీ తగులుకోవడంతో అదృష్టవశాత్తు బయటపడింది. విషాద యాత్ర.. రాష్ట్రానికి చెందిన 19 మందిని కడలి పొట్టనపెట్టుకుందన్న సమాచారంతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. విహార యాత్ర విషాదయాత్రగా మారిపోవడంతో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పసికూన, కొడుకు, కోడలు కడలిలో కలిసిపోగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు, తృటిలో చావు తప్పించుకున్న పర్యాటకులు బరువెక్కిన గుండెతో విషాదాన్ని మోసుకొచ్చారు. ముద్దుల మనవరాలు పూజ పేరున పూజా ట్రావెల్స్ విదేశీయాత్రలు నిర్వహించే కే సెల్వరాజ్కంచి సమీపంలోని కవిరై వీధి, మిన్ నగర్, కుమార్ వీధి, పీఎస్కే నగర్, ఎన్నైకార్ వీధి, చెన్నై నగరానికి చెందిన 32 మందితో అండమాన్ యాత్ర వేశారు. తన వారినందరినీ అండమాన్కు తీసుకెళ్లాడు. కొడుకు మణికంఠన్, కోడలు ఉషా ఆర్తనాదాలు చేస్తూ సముద్రంలో కలిసిపోయారు. తన కళ్లెదుటే మునిగిపోతున్న తల్లిదండ్రులను చూసి ఆరేళ్ల పూజ అమ్మా, నాన్నా అంటూ రోదిస్తూ సముద్రంలోకి దొర్లుతున్న సమయంలో పడవలోని ఇనుపకొక్కీకి చిన్నారి గౌను చిక్కుకుని ప్రాణాలు దక్కించుకుంది. వారందరి పెద్దదిక్కైన సెల్వరాజ్ కూడా ప్రాణాపాయ స్థితిలో పోర్టుబ్లెయిర్ ఆస్పత్రిలో చేరిపోగా చిన్నారి ఒంటిరిగా మిగిలిపోయింది. పడవ మునిగిపోతున్న సమయంలో మూడు ముక్కలై ంది. అందులోని ఒక ప్లాస్టిక్ ముక్కను పట్టుకుని పదిమంది కొంత సేపు వేలాడామని, ఆ తరువాత గజ ఈతగాళ్లు వచ్చి రక్షించారని కంచిలో హోటల్ నడుపుతున్న గురునాథన్ చెప్పాడు. అయితే తమలోని సురేష్ అనే వ్యక్తి గల్లంతైనట్లు తెలిపాడు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేసే చెన్నైకి చెందిన రాజేంద్రన్, భార్య వల్లి తృటిలో తప్పించుకున్నారు. పడవ బోల్తా పడగానే ఇద్దరూ ఓవైపు పట్టుకుని ఊగులాడుతూ 45 నిమిషాలపాటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అదే సమయంలో మునిగిపోతున్న ఇద్దరు తోటి మహిళా పర్యాటకులను రక్షించారు. చెన్నై చేరుకున్న మృతదేహాలు అండమాన్ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికోసం పది శవపేటికలతో అధికారులు సోమవారం ఉదయం బయలుదే రి వెళ్లారు. సోమవారం సాయంత్రానికి మృతదేహాలను చెన్నైకు తీసుకొచ్చేశారు. కంచి కలెక్టర్ భాస్కర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జయలలిత, టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాస్ తదితరులు సంతాపం ప్రకటించారు. లైఫ్ జాకెట్ లేకుండానేసాధారణ నదుల్లో, చెరువుల్లో నిర్వహించే బోటు షికారులో తీసుకునే కనీస జాగ్రత్తలు కూడా సముద్రయానంలో తీసుకోలేదని ప్రాణాలతో బయటపడిన బాధితుడు చెప్పాడు. తాము ఎక్కేటపుడు పడవలో 25 మంది మాత్రమే ఉన్నారని, క్రమేణా సంఖ్య పెరిగారని తెలిపాడు. పడవ బయలుదేరేటపుడే ఒకవైపు ఒరిగినట్లుగా సాగిందని, నడిసముద్రంలో అలలతీవ్రత పెరగడంతో ప్రయాణికుల బరువును తట్టుకోలేని పడవ బోల్తాపడిందని తెలిపాడు. ప్రయాణ సమయంలో ఎవరికీ లైఫ్జాకెట్లు ఇవ్వలేదని, వాటిని ఇచ్చి ఉంటే ఇంత భారీ ప్రాణనష్జం జరిగి వుండేది కాదని అతను వాపోయాడు. జయ తక్షణ సహాయ చర్యలు ప్రమాదం జరిగిన సంగతి తెలియగానే ముఖ్యమంత్రి జయలలిత తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఖర్చులతో బాధితులను తీసుకువచ్చేందుకు రాష్ట్రప్రభుత్వాధికారి శ్రీధర్ సోమవారం అండమాన్ బయలుదేరి వెళ్లారు. మృతుల కుటుంబాలకు సీఎం లక్ష రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు ప్రకటించారు.ండమాన్ దీవిలో చోటుచేసుకున్న పడవ ప్రమాదం తమిళనాడుకు చెందిన 19 మంది ప్రాణాలను కబళించివే యగా చెన్నై, కాంచీపురంలోని వారి కుటుంబీకులు కన్నీటికడలిలో మునిగిపోయారు. కాంచీపురం కూరంగ్రామానికి చెందిన కే సెల్వరాజ్ పూజాట్రావెల్స్ పేరుతో విదేశీ విహార యాత్రలు నిర్వహిస్తుంటాడు. ఈనెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా చె న్నై, కంచికి చెందిన 32 మందితో అండమాన్ టూర్ వేశాడు. వీరిలో 16 మంది పురుషులు, 13 మంది స్త్రీలు, ముగ్గురు బాలికాశిశువులు ఉన్నారు. విమానంలో వీరందరినీ అండమాన్కు చేరిన అనంతరం సముద్ర విహారానికి 25 మంది ప్రయాణికులు సామర్ద్యం కలిగిన పడవలోకి మహారాష్ట్రకు చెందిన వారు కూడా కలిసి 46 మంది ఎక్కారు. ఈనెల 26 వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో వీరంతా నడిసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు అలలతో కుదుపులకు లోనైన పడవ ఒక్కసారిగా ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో పడవలోని 31 మంది నీటమునిగి ప్రాణాలు కోల్పోగా వీరిలో చెన్నై, కంచికి చెందిన 19 మంది ఉన్నారు. పద్మిని (54), కరుణాకరన్ (61), వనజ (49), దొరై జయకుమార్ (61), అనసూయ (57), పెరుమాళ్ (68), మేనాళ్ (62), అంజలం (58), మణికంఠన్ (35), ఉషా (30), సురేష్ (33), దర్శిని (7), శాంతాబాయి (55), శాంతీబాయి (55), గణపతి (63), సుశీల (51), దురైరాజ్ (45), అనురాధా (52), పీ సెల్వరాజ్ (64)లు మృతిచెందారు. సుమారు ముగ్గురు సముద్రంలో గల్లంతైనట్లు సమాచారం. స్వల్పంగా గాయపడిన వారికి ప్రాధమిక చికిత్స చేసి పంపివేశారు. తీవ్రంగా గాయపడిన వారు పోర్టుబ్లెయిర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా చేనేత (సాలె) కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. టూర్ నిర్వాహకుడు సెల్వరాజ్ ప్రాణాపాయ స్థితిలో పోర్టుబ్లెయిర్లో చికిత్స పొందుతున్నాడు. ఇతని కుమారుడు, కోడలు చనిపోగా వీరి కుమార్తె ఆరేళ్ల పూజ గౌనుకు పడవలోని ఒక ఇనుప క మ్మీ తగులుకోవడంతో నీటిలో మునిగిపోకుండా అదృష్టవశాత్తు బయటపడింది. తల్లిదండ్రులు కళ్లెదుటే నీటిలో మునిగిపోతుండగా చూసిన ఈ చిన్నారి కాపాడండీ అంటూ దయనీయంగా కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
అండమాన్లో పడవ మునక
-
నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాదాలు: రోశయ్య
చెన్నయ్: అండమాన్ దీవుల్లో బోటు ప్రమాదంలో 21 మంది మరణించిన సంఘటనపై తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి టూరిస్ట్ ఆపరేటర్, బోట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. కొందరు ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రోశయ్య సంతాపం తెలియజేశారు. అండమాన్ బోటు ప్రమాదంలో 21 మంది చనిపోగా, మరొకరి జాడ తెలియరాలేదు. 28 మంది ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన భద్రత చర్యలు తీసుకుంటారని రోశయ్య చెప్పారు. ఆదివారం పోర్ట్ బ్లెయిర్ సమీపంలో టూరిస్టులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. పడవ సామర్థ్యానికి మించి 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందినవారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయిల నష్టపరిహారం ప్రకటించారు. -
అండమాన్లో పడవ మునక
21 మంది పర్యాటకులు మృతి... ఇద్దరు గల్లంతు పోర్ట్బ్లెయిర్: అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ ఆదివారం ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది. రోస్ దీవి నుంచి ఉత్తర అఖాతం వైపు ప్రయాణిస్తుండగా సాయంత్రం సుమారు 4 గంటలకు జరిగిన ఈ దుస్సంఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పడవలో మొత్తం 45 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, 23 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడగలిగాయని, ఇద్దరు గల్లంతయ్యారని దక్షిణ అండమాన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.జోహార్ చెప్పారు. కోస్ట్గార్డ్ బృందాలు, స్థానిక సహాయక బృందాలు మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా తమిళనాడులోని కాంచీపురం జిల్లా, ముంబైలకు చెందిన పర్యాటకులేనని అధికారులు చెప్పారు. జరిగిన ప్రమాదం, సహాయక చర్యల వివరాలు... ‘అక్వామెరైన్’ అనే ఈ పడవలో 25 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుండగా, మితిమీరిన సంఖ్యలో ప్రయాణికులను ఓవర్లోడ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. హా కొందరు ప్రయాణికులు పడవ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హా మృతుల కుటుంబాలకు అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. జరిగిన సంఘటనపై ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో మాట్లాడి, సహాయక కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన కేంద్ర సంస్థలను ఆదేశించారు. సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడిన వారిని పోర్ట్బ్లెయిర్లోని జీబీ పంత్ ఆస్పత్రిలో చేర్చారు. -
అండమాన్ సమీపంలో పడవ బోల్తా:21 మంది మృతి
పోర్ట్ బ్లెయిర్: సముద్రంలో ప్రయాణికులతో వెళుతున్న బోటు బోల్తాపడటంతో 21 మంది మృత్యువాత పడిన ఘటన ఆదివారం అండమాన్ సమీపంలో చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో పర్యాటకులతో పయనిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరగగా, 13 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. పడవలో మొత్తం45 మంది వరకూ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులను వెలికితీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విహారయాత్రకు బయల్దేరిన వీరంతా తమిళనాడు రాష్ట్రంలోని కంచీపురంకు చెందిన వారిగా గుర్తించారు. -
అమాయక లోకం జరావా...
ఓ వైపు పచ్చని ప్రకృతి, మరోవైపు నీలిసంద్రపు సోయగాలు. ఈ అందాలను కనులకు విందుచేసే అండమాన్ ద్వీపంలో ఉన్న అడవిబిడ్డలు వీరు. పేరు ‘జరావా.’ అంటే ‘ఇతర ప్రజలు’ అని అర్థం. పోతపోసిన నల్లని విగ్రహాలుగా కనిపించే ఈ అటవికులు దిగంబరులుగా సంచరిస్తూ ఉంటారు. వీరి సంఖ్య ఆడ-మగ, పిల్లా, పెద్దా కలిపి 300 లోపు ఉండచ్చని అంచనా! అంతరించిపోతున్న తెగల్లో ‘జరావా’ ఒకటి. వేటయే జీవనం రాతియుగపు నాటి మనుషుల గురించి చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదివి ఉంటారు. కొండకోనల్లో నివసించే ఆదివాసీల ఆహార్యాన్ని కొంతవరకు సినిమాల్లో చూసి ఉంటారు. అలాంటి పోలికలతోనే కనిపిస్తుంది ‘జరావా’ తెగ. పదునైన బాణాలతో అడవి పందులను, సముద్రంలో తాబేళ్లు, చేపలను వేటాడుతారు. పగడపు దిబ్బల్లో సముద్ర పీతలను ఏరుకుంటారు. చెట్లవేళ్లను, ఫలాలను సేకరిస్తారు. ఇవే వీరి ప్రధాన ఆహారం. బాణం కంటే వేగమైన కదలికలతో హానిని గుర్తించి, మెరుపువేగంతో మాయమవుతారు. ‘జరావా’ మహిళ ఎరుపు దారపు పోగుల చిన్న అల్లికను మాత్రమే నడుముకు చుట్టుకుంటుంది. తలపై వెంట్రుకలను పెరగనివ్వదు. ఆకాశాన్నంటినట్టుగా ఉండే వృక్షాల చిటారు కొమ్మల్లో దాగున్న తేనె తుట్టెను ఒడుపుగా తీసి, వీపునకు కట్టుకున్న కొయ్యడొప్పలో వేసుకుంటుంది. తేనెను సేకరించిన ప్రతీసారి మహిళలంతా తప్పక సముద్రతీరాలలో స్నానం చేస్తారు. 150 ఔషధ మొక్కలు గురించి, 350 రకాల జంతువులు, వాటి కదలికల గురించి జరావాలకు అత్యంత క్షుణ్ణంగా తెలుసు. పుట్టినప్పుడే పెళ్లి నిర్ణయం తీరప్రాంతంలో చేపలను పట్టడానికి చిన్న చిన్న తెప్పల్లాంటి పడవలను ఉపయోగించే వీరి వద్ద ఎల్లప్పుడూ విల్లంబులు, బాణాలు వెంటే ఉంటాయి. మొదట్లో రాతి గుహల్లోనే జీవించే వీరు ఆ తర్వాతి కాలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని సమూహాలుగా జీవిస్తున్నారు. వీరిది చిన్న కుటుంబం. ఒక్కో ఇంటికి భార్య, భర్త, ఆరేడు మంది పిల్లలు ఉంటారు. తమ తెగలో అబ్బాయి లేదా అమ్మాయి పుట్టినప్పుడే పెద్దయిన తర్వాత ఫలానా వారితో కలిసి ఉండాలనే నియమం పెడతారు. అబ్బాయి లేదా అమ్మాయి 16,17 ఏళ్లు వచ్చాకే కుటుంబజీవనం సాగించాలి. జ్ఞానం, వయసు, అనుభవాన్ని బట్టి వేట, ఇతర పనులను విభజించి, అప్పజెబుతారు. సైగలు, అరుపులు, ఇతర శబ్దాల ద్వారా వీరు ఎక్కువగా తమ భావాలను ఎదుటివారికి తెలియజేస్తుంటారు. వీరి భాషపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వీరి మాటల్లో కొన్ని హిందీపదాలు దొర్లుతున్నాయి. ఈత, పరుగు, విసరడం.. వంటి వాటిల్లో వీరు బహునేర్పరులు. ఆనందం పంచుకునేవేళ అందరూ చేరి నృత్యం చేస్తారు. తెలియని అమాయకత్వం ‘విదేశీయులు’గా ఈ తెగను పరిగణించడాన్ని బట్టి చూస్తే ఆఫ్రికా, ఇతర ఐలాండ్ ప్రాంతాల నుంచి వేల ఏళ్లక్రితం వలస వచ్చి ఉంటారనేది ఒక పరిశోధన. మొదటిసారి 1990లో జరావాలు పొరుగు గ్రామాల మధ్య చేపల వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు నెరిపినట్టు, 1998లో విల్లంబులు లేకుండా దగ్గరలోని పట్టణాన్ని సందర్శించినట్టు నివేదికలు చెబుతున్నాయి. 10కి, వెయ్యి రూపాయల నోటుకు తేడా తెలియని వీరు అండమాన్లో సునామీ వచ్చినప్పుడు ముందే కనిపెట్టి తప్పించుకున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. సునామీలో కొన్నివేల మంది అండమాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ‘జరావా’ తెగలో ఒక్కరైనా మరణించినట్టు నమోదు కాలేదు. దీనిని బట్టి జరావాలకు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టి, జాగ్రత్తపడే నేర్పు ఉందని అర్థమైంది. మనుగడ ప్రశ్నార్థకం పర్యాటక ప్రదేశం కావడంతో అన్నిచోట్ల నుంచి టూరిస్టులు అండమాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు. పర్యాటకుల ప్రవర్తన వల్ల అంతుచిక్కని వ్యాధు లు ఈ తెగను చుట్టుముట్టడంతో వీరి సంఖ్య వేలల్లో నుంచి వందలకు పడిపోయింది. ‘జరావా’ మహిళ అక్కడే స్థిరపడిన వ్యక్తుల చేత, బస్ డ్రైవర్ల చేత లైంగిక దాడులకు లోనయ్యేది. ఈ సమస్యలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ‘జరావాల’ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జరావా ఇక్కడ... రాతియుగపు ప్రతీకలుగా కనిపించే ఈ మట్టిమనుషులుండే చోటుకు వెళ్లాలంటే.... అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేయర్కు చేరుకోవాలి. ఇందుకు చెన్నై, కలకత్తా నుంచి విమానంలో, విశాఖ నుంచి నౌకలో ప్రయాణం చేయాలి. పోర్ట్ బ్లేయర్ నుంచి 52 కిలోమీటర్లు రోడ్డుమార్గాన ప్రయాణిస్తే బారాటంగ్కు చేరుకుంటారు. ఇక్కడ నుంచి 48 కి.మీ దూరంలో దట్టమైన అటవీప్రాంతం ఉంటుంది. ట్రంక్రోడ్కి 100-200 మీటర్ల దూరంలోనే ‘జరావా’ తెగ ఉంటుంది. ఫొటో తీస్తే కేసు... ట్రంక్రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా పచ్చదనాన్ని తిలకిస్తూ దారిలో ‘జరావా’ లను చూస్తూ వెళ్లవచ్చు. అయితే ‘జరావా’ల ఆహార్యాన్ని చూసి నవ్వకూడదు. ఎగతాళి చేయకూడదు. ఫొటోలు తీయకూడదు. పాటలు పాడకూడదు. ఆహారం విసరకూడదు... వీటిలో ఏ పొరపాటు చేసినా పోలీసులు కేసు ఫైల్ చేస్తారు. -
విహారం: థాయ్లాండ్ వెళితే ఫిఫిని మిస్ కాకండి!
థాయ్లాండ్... పర్యాటక స్వర్గాల్లో ఒకటైతే, ‘ఫి ఫి ఐలాండ్స్’ అందులో మరో అద్భుతం. ఈ పేరు ఎంత విచిత్రంగా ఉందో, ఆ ప్రదేశం అంత అద్భుతంగా ఉంటుంది. టూర్ వెళ్లేదే రిలాక్స్ కోసమే అయితే, ఇక్కడ ఆ పని తప్ప మీరేమీ చేయలేరు. మీ బాడీ ఆ ప్రాంతానికలా కనెక్ట్ అవుతుందంతే! ఫి ఫి ఐలాండ్స్... ఆరు ద్వీపాల కలయిక. వాటిల్లో ఇవి రెండూ పెద్దద్వీపాలు. మిగతా నాలుగు కేవలం బీచ్లకు ప్రత్యేకం. థాయ్లాండ్ దేశంలో దక్షిణం వైపు ఉంటాయి ఫిఫి దీవులు. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండటం వల్ల ఈ దీవులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రిలాక్సేషన్కు పేరు గాంచిన ఈ దీవులు థాయ్లాండ్లోనే కాదు ప్రపంచంలోనే అందమైన దీవుల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందమైన బీచ్లు... బీచ్లో తిరుగాడే రంగురంగుల చేపలను చూస్తూ బీచ్ ఒడ్డున లాంజర్ చెక్క కుర్చీల్లో కూల్డ్రింక్ తాగుతూ అలా సేదదీరుతుంటే ఇలాంటి రోజు కోసమే మనం ఇన్నాళ్లు బతికున్నామా అన్న ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా బీచ్లు ఇష్టపడేవారికి ఇది ఒక గొప్ప అట్రాక్షన్. బీచ్లను స్వచ్ఛంగా ఉంచటం అంత ఈజీ కాదు. కానీ, ఇక్కడ అలాంటి అరుదైన అనుభూతి దక్కుతుంది. వాటిలో లోపల తిరుగాడే అనేక రకాల, రంగుల చేపలు కనువిందు చేస్తూ ఆ నీటిలోంచి పైకి కనిపిస్తుంటాయి. యాచ్ ట్రిప్... ఈ దీవుల్లో మరో మంచి అనుభూతి యాచ్ ట్రిప్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ పొడవాటి పడవలు ఎక్కకుండా తిరిగి వెళ్లరు. వీటిలో ఓ రోజంతా ఆ ఆరు దీవులను చుట్టిరావడం ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇవి ఖరీదు కూడా కాదు. వీటిని కొన్ని కంపెనీలు, హోటళ్లు, స్థానికులు నడుపుతారు. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్లు ఎంచుకోవచ్చు. ఇక ఆ దీవుల గురించి తెలుసుకోవాలంటే అక్కడే దొరికే గైడ్లను కూడా వెంటబెట్టుకుని వెళ్లొచ్చు. అక్కడకు వెళితే టాటూ ఒంటి మీద పడాల్సిందే ఫి ఫి ఐలాండ్స్ చాలా చిన్న ప్రాంతమే కానీ ఒక నగరానికి ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి. ఇక్కడ టూర్ను చాలా తక్కువ ఖర్చుతోనూ పూర్తి చేయొచ్చు. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టొచ్చు. ఇక్కడ టాటూ సంస్కృతి బాగా ఎక్కువ. ఏటీఎం సెంటర్లు కనిపించినంత ఎక్కువగా టాటూ సెంటర్లు కనిపిస్తాయి. మీకు ఏ టాటూ కావాలన్నా, ఏ పద్ధతిలో కావాలన్నా నిమిషాల్లో వేసి పంపించేస్తారు. ఒంటి మీద టాటూ పడితే మీరు ఫి ఫి పోయివచ్చినట్టన్నమాట. ప్రా నంగ్ టు ఫి ఫి క్రాబి టౌన్ పరిధిలోకి ఈ ద్వీపాలు వస్తాయి. వాటితో పాటు ప్రా నంగ్ బీచ్. పక్కనే ఒక పెద్ద కొండ, దాని మీద వేలాడే ఉద్యానవనాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి. తెల్లటి ఇసుకతో బీచ్ మనోహరంగా ఉంటుంది. కాస్త రద్దీగా ఉన్నా విశాలమైన బీచ్ కావడం వల్ల మీకు ఏ ఇబ్బందీ ఉండదు. జలకాలాడటం వచ్చి ఇసుకలో కాసేపు సేదదీరడం మళ్లీ జలకాలాటకు పోవడం. ఇక్కడ అదే పని. మీ ఓపిక, మీ టైం. క్రాబి టౌన్లో సుమారు పది బీచ్లు ఉంటే అన్నీ నిమిషాల ప్రయాణం దూరంలోనే ఉంటాయి. కాబట్టి మీరు అన్ని తీరాలనూ కవర్ చేసి ఆనందించొచ్చు. రెండే కాలాలు.. లోకానికి మూడు కాలాలుంటే ఈ దీవుల్లో రెండే కాలాలుంటాయి. ఎండాకాలం, వానాకాలం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎండాకాలం. మే నుంచి డిసెంబరు వరకు వానాకాలం. వాన పడనపుడు వెళ్తేనే మంచిది. ఉన్నది ఎక్కువగా బీచ్లే కాబట్టి పగలు సముద్రందగ్గర, రాత్రి హోటల్లో ఉండొచ్చు. ఇక్కడ ఎండాకాలం అంటే మహా వేడిగా ఏం ఉండదు. ఏకాలమైనా 22-32 డిగ్రీల మధ్య మాత్రమే ఇక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఏ కాలం వెళ్లినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఈ వేడి మన భారతీయులకు అయితే సుపరిచితమే. ఇక్కడ థాయ్ భట్ కరెన్సీ. మనవి రెండు రూపాయిలు వాళ్ల ఒక థాయ్భట్తో సమానం. కాబట్టి ఇండియన్లకు థాయ్టూర్ అంత కాస్ట్లీ కాదు. థాయ్లాండ్లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పుకెట్ నగరం. ఆ దేశ ఏరోప్లేన్ బ్రాండ్ కూడా ఇదే. లక్కీ ఏంటంటే... ఫి ఫి ఐలాండ్స్ ఈ పుకెట్ నుంచి కేవలం యాభై కిలోమీటర్లే. పుకెట్ దర్శనం కూడా ఫి ఫి ఐలాండ్స్ సందర్శనంతో పాటే అయిపోతుంది. పుకెట్ కూడా పెద్ద పర్యాటక ప్రదేశమే. అక్కడ అనేక ప్రకృతి దృశ్యాలుంటాయి. థాయ్ సంప్రదాయ దర్శనీయ స్థలాలుంటాయి. అందుబాటులోనే ఉంది ఫి ఫి ఐలాండ్స్ అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశం. ఇక్కడకు చేరుకోవడం చాలా సులువు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు అయినా ఫ్లైట్లో వెళ్లొచ్చు. లేదా నేరుగా ఫుకెట్ ఎయిర్పోర్ట్లో దిగొచ్చు. హైదరాబాదు నుంచి ఫుకెట్కు నేరుగా వెళ్లాలంటే రూ.14 వేల నుంచి ఫ్లైట్ టికెట్ మొదలవుతుంది. అక్కడి నుంచి బస్సు, కారు, బోటు ఇలా ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తక్కువ ఖర్చులో వెళ్లిరాగల విదేశీ టూర్ ఇది. రవాణా అవసరమే రాదు బహుశా మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా ఆటోలు, ట్యాక్సీలు అవసరం అవుతుంటాయి. కానీ ఇక్కడ వాటి అవసరమే రాదు. ఏ బీచ్ నుంచి ఏ బీచ్కు అయినా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. చిన్న దీవులు కనుక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా పెద్దగా ఉండవు. ఎక్కడ చూసినా తోక పడవలే కనిపిస్తాయి. వీటిని అందరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా గంటల్లెక్కన, రోజు లెక్కన అద్దెకు కూడా తీసుకోవచ్చు. -
తీరం గజగజ
రేపల్లె, న్యూస్లైన్ :‘హెలెన్’ తుపాను ఛాయలు ఇంకా కనుమరుగుకాకముందే మరో ముప్పు ముంచుకువస్తుండడంతో జిల్లాలోని తీర మండలాలు వణికిపోతున్నాయి. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుం డంగా బలపడి తుపానుగా మారింది. ‘లెహెర్’గా నామకరణం చేసిన ఈ తుపాను గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద తీరం దాటనుందని అధికారులు వెల్లడించడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొద్ది రోజుల కిందట పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పంటలు దాదాపు దెబ్బతిన్నాయి. తాజాగా లెహెర్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే మిగిలివున్న కొద్ది పాటి పంటలు కూడా దక్కవని రైతులు దిగులు చెందుతున్నారు. మరో వైపు తీరంలో ‘అలజడి’ నెలకొంది. హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం వరకు నిజాంపట్నం హార్బర్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగాయి. సముద్రుడు కాస్తంత శాంతించటంతో ఆదివారం మత్స్యకారులు బోట్లు, పడవలతో తిరిగి సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఇంతలో ‘లెెహ ర్’ రూపంలో మరో తుపాను ముంచుకువస్తోందని తెలియడంతో తీరంలో అలజడి ప్రారంభమైంది. ఇప్పటికే నిజాంపట్నం ఓడరేవులో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి ఒడ్డుకు రావాలని అధికారులు సెల్ఫోన్ సమాచారం పంపారు.తల్లడిల్లుతున్న రైతులు .. ‘లెహెర్’ పెను తుపానుగా మారి తీరప్రాంతంపై విరుచుకుపడుతుందని వాతవరణ శాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే అధిక వర్షాలు, హెలెన్ తుపాను తాకిడికి తల్లడిల్లిన రైతులు మరో ముప్పు ముంచుకొస్తుండటంతో మరింత దిగాలు పడిపోతున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని రేపల్లె, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల్లో సుమారు లక్ష ఎకరాలలో వరి సాగు చేశారు.పై-లీన్,హెలెన్ తుపానుల ప్రభావంతో ఇప్పటికే 55 శాతం పంట దెబ్బతిన్నది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరాకు సుమారు రూ. 20 వేల వరకు కౌలు చెల్లించి వరిసాగు చేశారు. తుపానుల తాకిడికి దెబ్బతిన్న కౌలు రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టు కుంటున్నారు. కౌలు కాకుండా ఇప్పటికే ఎకరాకు సుమారు రూ. 25వేల వరకు ఖర్చు చేసిన రైతులు పంట నేలకొరిగి నీటిలో నానుతుండటంతో కంట తడిపెడుతున్నారు. కంకిమీద, పొట్టమీద ఉన్న వరిపంట నీటిలో నానడం వల్ల పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. పడిన వరి పంటను కట్టలుగా కట్టేందుకు సుమారు రూ. 7వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం లెహర్ రూపంలో వస్తున్న మరో ముప్పును తలచుకుని కుమిలిపోతున్నారు. మత్స్యకారులకు గడ్డుకాలం.. వరుస విపత్తులతో మత్స్యకారులు కుంగిపోతున్నారు. పై-లీన్,హెలెన్ తుపానుల కారణంగా కొద్ది రోజులుగా సముద్ర వేటకు అంతరాయం కలుగుతూనే ఉంది. ఒకసారి బోటులో వేటకు బయలు దేరితే సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. అందులో ఎక్కువ భాగం డీజిల్కే ఖర్చు అవుతుంది. వేటకు వెళ్లడం, తిరిగి వెంటనే తిరుగుముఖం పట్టడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. సముద్ర జలాలు కలుషితం కావటంతో తీరంలో ఎక్కువ దూరం వెళితేకాని మత్స్య సంపద దొరకని పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు వరుస విపత్తులతో మరింత దెబ్బతినే పరిస్థితి నెలకొంది. -
‘లెహర్’తోవిమానాల రద్దు!
సాక్షి, చెన్నై: లెహర్ దెబ్బతో చెన్నై నుంచి అండమాన్కు బయలు దేరాల్సిన విమానాలు, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వీరికి నగరంలోని పలు హోటళ్లలో వసతి కల్పించారు. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు పట్టణాలు జలమయమయ్యాయి. అండమాన్ సమీపంలో బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి తుపానుగా మారడంతో లెహర్ అని పేరు పెట్టారు. ఈ ప్రభావంతో రాష్ర్టంలోని సుముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి చెన్నై శివారులు, కాంచీపురం, కడలూరు, నాగపట్నం, విల్లుపురం, తూత్తుకుడిల్లో భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో ఉదయం 8 గంటల తర్వాత భానుడు ప్రతాపం చూపించాడు. లెహర్ ప్రభావంతో అండమాన్లో తీవ్ర వర్షం పడుతోంది. ఈ ద్రోణి ఆంధ్రా వైపుగా పయనిస్తుండటంతో రాష్ట్రం ఆ గండం నుంచి బయట పడ్డట్టేనని వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే, చెన్నై - కడలూరు, నాగపట్నం తీరాల్లో వర్షాలు పడుతాయని ప్రకటించింది. అలల తాకిడి క్రమంగా తగ్గుతుండటంతో జాలర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. విమానాల రద్దు: లెహర్ ప్రభావంతో చెన్నై అండమాన్ మధ్య విమాన సేవలు రద్దు అయ్యాయి. ఉదయం ఐదు గంటలకు 120 మంది ప్రయాణికులతో అండమాన్కు బయలుదేరడానికి విమానం సిద్ధం అయింది. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు విమాన సేవలకు అనుకూలంగా లేదన్న సమాచారంతో ఆ విమానం 9 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. దీంతో విమానంలోనే ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఎంతకూ విమానం బయలుదేరక పోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చివరకు వాతావరణం అనుకూలించని దృష్ట్యా, ఆ విమాన సేవను రద్దు చేస్తున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఉదయం ఏడు గంటలకు బయలు దేరాల్సిన ఎయిర్ వేస్, తొమ్మిది గంటలకు బయలు దేరాల్సిన బోయింగ్, పది గంటలకు బయలు దేరాల్సిన ప్రైవే టు విమాన సేవలు రద్దు అయ్యాయి. సుమారు 536 మంది ప్రయాణికులు అండమాన్కు వెళ్లాల్సి ఉండటంతో, వారంద రికీ నగరంలోని పలు హోటళ్లల్లో బస సౌకర్యం కల్పించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత విమాన సేవలు అండమాన్కు పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అండమాన్ నుంచి ఇక్కడికి రావాల్సిన సుమారు ఐదు విమానాల సేవలు రద్దు అయ్యాయి. తమ వాళ్లకు ఆహ్వానం పలికేందుకు మీనంబాక్కంకు వచ్చిన బంధువులు, ఆప్తులు గంటల తరబడి పడిగాపులు కాసి, చివరకు సేవల రద్దుతో వెను దిరగాల్సి వచ్చింది. -
‘లెహర్’ గండం
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ట్రం మీద అంతంత మాత్రంగానే ఉన్నా, తుపానుల రూపంలో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. తాజాగా, అండమాన్ సమీపంలో కేంద్రీకృతమైన లెహర్ తుపాను ఆంధ్ర వైపుగా పయనించి తీరం దాటనున్నది. తీరం దాటే సమయంలో ఏర్పడే తీవ్రత రాష్ట్రం మీద ఉండబోదు. అయితే, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత: లెహర్ ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి విల్లుపురం, కడలూరు, నాగపట్నం, తంజావూరు, నీలగిరి, కన్యాకుమారి జిల్లాల్ని వర్షం ముంచెత్తింది. కడలూరులోని నెల్లి కుప్పుం, మాదవ నగర్, తాలం కులం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. విల్లుపురం జిల్లా ఊలందూరు పేట, తిరువన్నై, మైలంలో కుండపోత వర్షానికి రోడ్లు నదుల్ని తలపించాయి. తంజావూరు జిల్లా కుంబకోణం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కల్లనై, పెన్నారుల్లో నీటి ఉధృతి పెరగడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయూయి. నీలగిరి జిల్లాలో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఊటీ -మెట్టుపాళయం మార్గంలోని వంతెన కొట్టుకుపోవడంతో కోతగిరి మీదుగా రాకపోకలను మళ్లించారు. ఊటీ రైలు మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో మూడు రోజులపాటుగా రైళ్లను రద్దు చేశారు. కన్యాకుమారిలో గోదై నది, పేచ్చి పారై, తిరువట్టారు పరిసర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కాయి. గోదై నది పరవళ్లు తొక్కుతుండగా, తిరుప్పరపు జలపాతం పొంగి పొర్లుతోంది. శనివారం అర్ధరాత్రి కాంచీపురం, చెన్నై శివారుల్లో మోస్తారుగా వర్షం కురిసింది. ప్రమాద హెచ్చరిక: ఆదివారం అర్ధరాత్రికి అండమాన్ సమీపంలోని ఫోర్ట్ బ్లేయర్ దీవుల్ని లెహర్ దాటనున్నది. గంటకు 110 కి.మీ వేగంతో వాయువ్య దిశలో ఇది పయనిస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో సముద్ర తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున, కడలిలోకి వెళ్లొదని సూచిస్తున్నారు. చెన్నై ఎన్నూరు, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి, పంబన్, పుదుచ్చేరి హార్బర్లలో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. -
నైరుతి అరేబియా సముద్రంలో వాయుగుండం
నైరుతి అరేబియా మహాసముద్రంలో వాయుగుండం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడుతుంది. దాంతో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం క్రమంగా మన రాష్ట్రం వైపునకు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలా అయితే రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. -
పై-లీన్ గండం గడిచింది
= తీరం దాటిన తుపాను = ఊపిరి పీల్చుకున్న జిల్లావాసులు = సురక్షితంగా ఒడ్డుకు చేరిన 70 మంది మత్స్యకారులు మచిలీపట్నం, న్యూస్లైన్ : పై-లీన్ తుపాను తీరాన్ని దాటడంతో జిల్లా వాసులతోపాటు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల తొమ్మిదిన బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల వద్ద ఏర్పడిన ఈ తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చేసిన సూచనలతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోయారు. తుపాను ప్రభావంతో ఈ నెల తొమ్మిదిన జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఇద్దరు బాలికలు, ఒక మహిళ వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందారు. తుపాను ఒరిస్సా వైపు మళ్లటంతో భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతింటాయని రైతులు భయపడ్డారు. పై-లీన్ తీవ్రతకు జిల్లాలో ఒకటి, రెండు రోజులు మినహా పంటలకు నష్టం కలిగేలా వర్షాలు పడకపోవటం, తుపాను తీరం దాటినా జిల్లాపై ఎలాంటి ప్రభావమూ చూపకపోవడంతో గండం గడిచిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన చినగొల్లపాలెం, ఏటిమొండి పల్లెపాలెం మత్స్యకారులు 70 మంది శనివారం ఉదయం క్షేమంగా గ్రామానికి చేరుకున్నారు. 40 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం తుపాను ప్రభావంతో శనివారం మంగినపూడిబీచ్లో సముద్రం 40 అడుగులు ముందుకు వచ్చింది. ఏడు అడుగుల కన్నా పై ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. తీవ్రత పెరగటంతో బందరు పోర్టులో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను పరిస్థితులను పరిశీలించేందుకు గాను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి అధికారులతో కలిసి మంగినపూడి బీచ్ను సందర్శించారు. ముందుజాగ్రత్త చర్యలపై మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, జెడ్పీ ఇన్చార్జ్ సీఈవో సీహెచ్ కళావతి, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులతో సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ప్రత్యేకాధికారులతో పాటు గ్రామస్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో 200కు పైగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.