
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలుతుండటంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమై వైరస్ నిరోధానికి పలు చర్యలు చేపడుతున్నాయి. కరోనాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించగా పలు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ విద్యా, వాణిజ్య సంస్థలు, థియేటర్లు, మాల్స్ను మూసివేయాలని నిర్ణయించాయి. ఇక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అండమాన్ నికోబార్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 17 నుంచి 26 వరకూ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ పదిరోజులు అండమాన్ దీవులను సందర్శించే ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని పర్యాటకులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment