Port Blair
-
పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా..
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడంలో బిజీగా ఉంది. ఉత్తరాదిలో ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లను మార్చిన కేంద్రం.. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక, నుంచి పోర్టు బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా పిలవాలని సూచించింది.ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…— Amit Shah (@AmitShah) September 13, 2024 Central Government renames Port Blair in Andaman and Nicobar Islands to "Sri Vijaya Puram" pic.twitter.com/pw18yukCOl— All India Radio News (@airnewsalerts) September 13, 2024 ఇది కూడా చదవండి: కోల్కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. -
విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన విమానం ఒకటి విశాఖ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దిగినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల ప్రయాణానికి సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఢిల్లీ-పోర్టుబ్లెయిర్ ఎయిర్ఇండియా విమానం మొత్తం 270 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గత రాత్రి స్థానికంగా ఓ హోటల్లో వాళ్లకు వసతి ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల్లో మెడికల్ కౌన్సిలింగ్కు వెళ్లాల్సిన వాళ్లు సైతం అందులో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిణామంపై సాక్షి టీవీతో ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. ‘‘నిన్న ఉదయం 05:30 నిమిషాలకి ఢిల్లీ నుంచి ఏయిర్ ఇండియా బయలు దేరింది. ఆ తరువాత రెండు సార్లు అండమన్ లో పైలెట్ ఫ్లైట్ ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. పైలెట్ కి తగిన నైపుణ్యం లేక పోవడం తో లాండ్ చెయ్యలేక పోయారు. అండమాన్ రన్ వే చిన్న గా ఉంటుంది.. నైపుణ్యం కలిగిన పైలెట్ లేక పోవడం తో సేఫ్ ల్యాండ్ చెయ్యలేక పోయారు. మా లగేజ్ కి సరైన భద్రత కూడా కల్పించలేక పోయారు. ఎయిర్ ఇండియా పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారామె. -
అండమాన్కు చలో చలో
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి పోర్టు బ్లెయిర్కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్ షిప్ నడిచేది. క్రమంగా డిమాండ్ పెరగడంతో నెలకోసారి పరుగులు తీసింది. విశాఖ పోర్టు నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులు, ముఖ్యంగా వలసదారులు ఈ నౌక ద్వారానే అండమాన్ చేరుకునేవారు. ఫుల్ డిమాండ్తో నడుస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందడం... లాక్డౌన్ కారణంగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. తాజాగా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఫుల్ స్వింగ్లో షిప్ ప్రయాణం మొదలుపెట్టింది. శనివారం సాయంత్రం బయలుదేరి.. 450 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం పోర్టుబ్లెయిర్లో పాసింజర్ కార్గో షిప్ క్యాంప్బెల్ బే బయలుదేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది ఇందులో ఉండటం విశేషం. అండమాన్ నికోబార్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరినట్లు షిప్ ఏజెంట్స్ చెబుతున్నారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ట్రాఫిక్ మేనేజర్ రత్నకుమార్ పూర్తి చేశారు. 5న ఫుల్ప్యాక్తో ప్రయాణం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఖరారైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం క్యాంప్బెల్ బే షిప్ విశాఖ నుంచి బయలుదేరనుంది. 8వ తేదీ ఉదయానికి క్యాంప్బెల్ బే.. తిరిగి పోర్టు బ్లెయిర్కు చేరుకోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత నడుస్తుండటంతో టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడు పోయాయి. మొత్తం 500 మంది సామర్థ్యం ఉండగా బుకింగ్స్ ప్రారంభించిన రెండ్రోజుల్లోనే మొత్తం టికెట్స్ విక్రయించేశారు. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను అనుసరించి క్యాంప్బెల్షిప్ని నడుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏవీ భానోజీరావు, గరుడ పట్టాభి రామయ్య అండ్ కో ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్ నేపథ్యంలో మరో షిప్ రెడీ..! క్యాంప్బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ తొలి ప్రయాణంలోనే 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఇంకా కావాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండటంతో మరో షిప్ని కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్కు ఎంవీ స్వరాజ్ద్వీప్ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్ నడిపారు. రెండేళ్ల క్రితం ఇది మరమ్మతులకు గురికావడంతో డాక్యార్డులో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు పూర్తయిందనీ.. త్వరలోనే ఎంవీ హర్షవర్ధన్ షిప్ని విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్కు రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణం చాలా చౌక అండమాన్కు చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్ అనీ.. పర్యాటకుల్ని నాన్ ఐలాండర్గా షిప్ టికెట్స్ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్కు జనరల్ టికెట్ కేవలం రూ.1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్ టికెట్ రూ.3,375 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి అండమాన్కు విమానంలో వెళ్లాలంటే రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. ఎంత లగేజ్ తీసుకెళ్లినా.. ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయడం లేదు. మొత్తం నాలుగు విభాగాలుగా టికెట్స్ విక్రయాలు జరుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. మంచి ప్రారంభం దక్కింది కోవిడ్ తర్వాత అండమాన్కు పాసింజర్ షిప్ ప్రయాణం మొదలు కావడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ప్రారంభం నుంచే ప్రయాణికులు ఆసక్తి చూపించడం శుభపరిణామం. ఈ నెల 3న వస్తున్న షిప్కు బెర్తు, ఇతర సౌకర్యాలు పోర్టు పరంగా పూర్తి చేశాం. ప్రతి ప్రయాణికుడు కనీసం 10–15 పెద్ద సైజు బ్యాగ్లు, లగేజీతో ప్రయాణిస్తుంటారు. ఇందుకనుగుణంగా పోర్టులోకి ఆర్టీసీ బస్సులను కూడా ఆ సమయంలో అనుమతిస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, విశాఖ పోర్టు చైర్మన్ (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
ఆ విమానంలో ఎవరూ బతికే చాన్స్ లేదు!
చెన్నై: బంగాళాఖాతంలో అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎవరూ బతికే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో తెలిపింది. 29మంది ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఈ విమానం గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం ఇదే తొలిసారి. గత నెల 22న అదృశ్యమైన ఈ విమానం జాడ గురించి ఇప్పటికీ చిన్నపాటి ఆధారంకానీ, ఆచూకీ కానీ తెలియలేదు. ఈ విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి రామ్ రావు భామ్రే సమాధానమిస్తూ.. విమానంలో ప్రయాణిస్తున్న వారెవరూ బతికే అవకాశం లేదని తెలిపారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సభ్యుడు ఎం తంబిదురై అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఏఎన్-32 విమానం ఆచూకీ దొరికేవరకు గాలింపు చర్యలను మానుకోవద్దని, అది దుర్ఘటనకు గురైన ప్రదేశాన్ని గుర్తించాలని తంబిదురై కేంద్రాన్ని కోరారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు వైమానిక దళానికి చెందిన వివిధ యుద్ధవిమానాలతోపాటు హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ విమానం ఆచూకీని కనిపెట్టేందుకు ఇప్పటికే పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్లోని పోర్ట్బ్లెయిర్కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతం గగనతలంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఇందులో ఉన్న 29 మంది బతికి బయటపడే అవకాశాలు లేవనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా కేంద్రం కూడా ఇదేవిషయాన్ని వెల్లడించింది. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి. -
ఇంకా గాలింపే!
కానరాని ఆచూకీ గడుస్తున్న రోజులు పరిశోధక నౌకలతో గాలింపు ముమ్మరం చెన్నై: అదృశ్యమైన ఏయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ కానరావడం లేదు. రోజులు గడుస్తున్నాయేగానీ, చిన్నపాటి ఆధారం లభించకపోవడంతో గాలింపులో ఉన్న బృందాలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్లోని పోర్ట్బ్లెయిర్కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది అందులో ఉన్న 29 మంది ఆచూకీ పై ఆశల్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విమానం గల్లంతై మూడు వారాలు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి. జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ పరిశోధక నౌకలు రంగలోకి దిగడంతో ఏదేని ఆచూకీ లభిస్తుందన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ఈ నౌకలు పరిశోధనలు చేపట్టి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి చిన్న ఆధారం కూడా కన్పించనట్టు సంకేతాలు వచ్చాయి. సాగర్ నిధి, రత్నాకర్ నౌకల్లో ఉన్న అన్ని టెక్నాలజీలను ఉపయోగించి తీవ్రంగా పరిశోధనలు రేయింబవళ్లు సాగుతున్నా, ఆ విమానం ఆచూకీ మాత్రం కాన రాలేదు. సముద్రంలో గల్లంతై ఉండొచ్చని భావిస్తున్న ప్రదేశంలో 20 నాటికల్ మైళ్ల దూరం సాగర్ నిధి, మిగిలిన నాటికన్ మైళ్ల దూరంలో సముద్ర రత్నాకర్ తీవ్రంగా పరిశోధనలతో దూసుకు వెళ్తున్నా, చిన్నపాటి ఆధారం అన్వేషణలో కానరాక పోవడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ అందులో ఉన్న 29 మంది కుటుంబాల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
ఇంకా దొరకని విమానం ఆచూకీ
-
ఇంకా దొరకని విమానం ఆచూకీ
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
-
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
-
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
విశాఖపట్నం: అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానంలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. ఫిట్టర్లు ప్రసాద్ బాబు, నాగేంద్రరావు, చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, మహారాణా, చిట్టిబాబు, ఛార్జ్మన్ సాంబమూర్తి గల్లంతయ్యారు. బాధిత కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. గంటలు గడుస్తున్నా విమానం ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు విమానం ఆచూకీ తెలియరాలేదు. ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మురం చేశారు. బంగాళాఖాతంలో భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. -
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. విమానం జాఢ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కోరింది. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. -
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
చెన్నె: తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం గగనతలంలో అదృశ్యమైంది. ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. విమానం అదృశ్యమై ఇప్పటికి ఆరు గంటలు దాటడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు జరుపుతున్నాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
పోర్ట్బ్లయిర్ విమానం రద్దు
విశాఖపట్నం: విశాఖ నుంచి అండమాన్ రాజధాని పోర్ట్బ్లయిర్ వెళ్లాల్సిన విమానం గురువారం రద్దయింది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైజాగ్ చేరుకునే ఈ విమానం షెడ్యూల్ ప్రకారం వెంటనే తిరిగి బయలుదేరుతుంది. సాంకేతిక కారణాలతోనే గురువారం రద్దు చేశామని, యథావిధిగా రేపు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులను అధికారులు స్థానిక హోటల్కు తరలించి, బస కల్పించారు. -
విశాఖ నుంచి పోర్ట్బ్లెయిర్కు విమాన సర్వీసు ప్రారంభం
విశాఖపట్టణం: విశాఖ విమానాశ్రయం నుంచి పోర్టుబ్లెయిర్కి ఎయిరిండియా విమానాన్ని గురువారం ఉదయం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు ప్రారంభించారు. తొలి ప్రయాణికుడు రాజేష్కి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే పోర్టుబ్లెయిర్కి రోజూ సర్వీసులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. పోర్టుబ్లెయిర్కి ఒక ప్రయాణికుడే ఇక్కడి నుంచి బయలుదేరగా మధ్యాహ్నం 2.45కి గంటలకు తిరుగు ప్రయాణంలో 27 మంది ఇక్కడికి వచ్చారు. ఎయిరిండియా విశాఖ విమానాశ్రయం నుంచి పోర్టుబ్లెయిర్కి వారానికి రెండు రోజులు (సోమ, గురువారాలు) సర్వీసులు నడుస్తాయి. ఉదయం ఢిల్లీలో 7 గంటలకు బయలుదేరి విశాఖకు 9.15 గంటలకు చేరుతుంది. ఇక్కడ 9.55గంటలకు బయలుదేరి ఢిల్లీ మీదుగా పోర్టు బ్లెయిర్కి 12.10 గంటలకు వెళ్తుంది. అక్కడ 12.50 గంటలకు బయలుదేరి విశాఖకు మధ్యాహ్నం 3.05కి చేరుతుంది. ఇక్కడ 3.50కి బయలేదేరి ఢిల్లీకి సాయంత్రం 6.50 గంటలకు చేరుతుంది. -
అండమాన్ సమీపంలో పడవ బోల్తా:21 మంది మృతి
పోర్ట్ బ్లెయిర్: సముద్రంలో ప్రయాణికులతో వెళుతున్న బోటు బోల్తాపడటంతో 21 మంది మృత్యువాత పడిన ఘటన ఆదివారం అండమాన్ సమీపంలో చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో పర్యాటకులతో పయనిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరగగా, 13 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. పడవలో మొత్తం45 మంది వరకూ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులను వెలికితీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విహారయాత్రకు బయల్దేరిన వీరంతా తమిళనాడు రాష్ట్రంలోని కంచీపురంకు చెందిన వారిగా గుర్తించారు.