నీట్‌–పీజీ ‘ఈడబ్ల్యూఎస్‌ కోటా’ కేసులను సత్వరం తేల్చండి | Centre files affidavit in Supreme Court for NEET-PG counselling | Sakshi
Sakshi News home page

నీట్‌–పీజీ ‘ఈడబ్ల్యూఎస్‌ కోటా’ కేసులను సత్వరం తేల్చండి

Jan 4 2022 6:25 AM | Updated on Jan 4 2022 6:25 AM

Centre files affidavit in Supreme Court for NEET-PG counselling - Sakshi

న్యూఢిల్లీ: నీట్‌–పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటాకు సంబంధించి దాఖలైన కేసులను అత్యవసరమైనవిగా భావించి మంగళవారం విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బొపన్నల ధర్మాసనం ఎదుట సోమవారం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ కేంద్ర తరఫున ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ కేసును మంగళవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలని సీజేఐకి  విజ్ఞప్తి చేస్తాను’అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ఈ కేసును కొంత అత్యవసరమైనదిగా భావించి మంగళవారమే విచారణ చేపట్టాలని, లేకుంటే బుధవారమైనా విచారించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement