నివసించే చోటే నమోదు చేసుకోండి | EC Asks Bihar Voters To Prove Self And Parents Citizenship, More Details Inside | Sakshi
Sakshi News home page

నివసించే చోటే నమోదు చేసుకోండి

Jul 2 2025 8:40 AM | Updated on Jul 2 2025 10:39 AM

EC Asks Bihar Voters To Prove Self

    స్వస్థలాల్లో ఓటు నమోదుపై ఈసీ విముఖత 

న్యూఢిల్లీ: స్వస్థలాల్లో కంటే పౌరులు ప్రస్తు­తం నివసిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఓటరుగా పేరు నమోదుచేసుకుంటే మంచి­దని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ మంగళవారం వ్యాఖ్యానించా­రు. త్వరలో బిహార్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి అధికారులు ఓటర్ల జాబితాను తనిఖీ చేసి సవరించనున్న నేపథ్యంలో సీఈసీ ఓటర్‌ నమోదు అంశంపై మాట్లాడటం గమనార్హం. మంగళవారం ఢిల్లీ­లో బూత్‌ లెవ్‌ ఆఫీసర్‌(బీఎల్‌ఓ)లనుద్దేశిస్తూ జ్ఞానేశ్‌ మాట్లాడారు.

 ‘‘వాస్తవానికి ప్రజాప్రా­తినిధ్య చట్టం ప్రకారమైతే ఏ శాసనసభ నియో­జకవర్గంలో అయితే ఓటరు నివసిస్తా­డో అక్కడే అతనికి ఓటు హక్కు వినియోగించు­కునే హక్కు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఢిల్లీలో నివసిస్తున్నారు. సొంతిల్లు బిహా­ర్‌­లోని పటా్నలో ఉంది. అయినాసరే మీరు ఢిల్లీలోనే ఓటర్‌గా పేరును నమోదుచేసుకోవాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నా­రు. ‘‘కొందరు గతంలో ఉన్న ప్రాంతంలో సంపాదించిన ఓటరు కార్డును అలాగే అట్టిపెట్టుకుని, కొత్త ప్రాంతంలో మరో ఓటర్‌ కార్డు­ను సాధిస్తున్నారు. పోలింగ్‌ వేళ పాత ప్రాంతంలో ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇది నేరం’’అని సమావేశంలో పాల్గొ­న్న కొందరు అధికారులు గుర్తుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement