
ఈ వారంలోనే కూలో వినియోగదారులు పది లక్షల వరకు పెరిగారు. ఒకప్పుడు 20 లక్షల మంది యూజర్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది.
న్యూఢిల్లీ: ట్విట్టర్ సంస్థతో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్ తరహా యాప్ ‘కూ’ వాడాలంటూ పిలుపునిస్తున్నారు. తమ పోస్టులను అందులోనే షేర్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు భారీగా కూ వైపు మళ్లిపోతున్నారు. ఈ వారంలోనే కూలో వినియోగదారులు పది లక్షల వరకు పెరిగారు. ఒకప్పుడు 20 లక్షల మంది యూజర్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది.
చదవండి:
‘కూ’ యాప్ సురక్షితమేనా? సంచలన విషయాలు
‘కూ’ అకౌంట్ను ఇలా ఓపెన్ చేయండి..