IRCTC Launches Online Bus Booking Services| Bus Booking Guide Process - Sakshi
Sakshi News home page

ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌ న్యూస్‌

Published Sat, Feb 6 2021 4:42 PM | Last Updated on Sat, Feb 6 2021 7:04 PM

 IRCTC launches its online bus booking services - Sakshi

రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ)  ఆన్‌లైన్ బస్‌ బుకింగ్ సేవలను ప్రారంభించింది

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు రైల్వే టికెట్ల బుకింగ్‌, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన సంస్థ తాజాగా మరో  వెసులుబాటును ప్రయాణీకులకు  కల్పించింది. 22 రాష్ట్రాలు,  3 కేంద్ర పాలిత   ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను జనవరి 29న దేశ వ్యాప్తంగా లాంచ్‌ చేసినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఆన్‌లైన్ బస్‌ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ రూపొందించింది. https://bus.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా బస్ బుక్‌ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

టికెట్‌ బుకింగ్‌ ఎలా?

  • ఇప్పటికే ఐఆర్‌సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు https://bus.co.in వద్ద నేరుగా బస్‌ టికెట్లు బుక్ చేయొచ్చు. 
  • లేదంటే కొత్త  లాగిన్‌, పాస్‌ వర్డ్‌ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.  బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో  యూజర్‌ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ సబ్‌మిట్‌ చేయాలి.
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు. ఇలా ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికులకు టికెట్లు బుక్ చేయొచ్చు. 
  • వివిధ రకాల బస్సుల వివరాలతోపాటు, అందుబాటులో ఉన్న రూట్లు,  సౌకర్యాలు, సమీక్షలు, రేటింగ్‌ తదితరాలు అందుబాటులో ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవచ్చు.
  • కస్టమర్లు తమ పిక్-అప్, డ్రాప్ పాయింట్లు , టైం కూడా ఎంచుకోవచ్చు. సరసమైన ధరలో బస్‌ టికెట్లను పొందడంతో పాటు, ఇ-వాలెట్ డిస్కౌంట్లు కూడా లభ్యం.
  • 1800110139 వద్ద బుకింగ్‌కుసంబంధించిన సమస్యలు సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు.
  • వోల్వో బస్సు, ఏసీ, నాన్ ఏసీ బస్సుల టికెట్లు బుక్ చేయొచ్చు. 
  • ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.20+జీఎస్‌టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.10+జీఎస్‌టీ ఛార్జీ వసూలు చేస్తుంది.పేమెంట్‌  సేవల సంస్థల ఛార్జీల భారం వినియోగాదారులదే.
  • ప్రతి ప్రయాణీకుడికి 10 కిలోల వరకు ఒక బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్‌బ్యాగ్ లేదా 5 కిలోల బ్రీఫ్‌కేస్ లాంటివాటికి అనుమతి. ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రి, మందులు, మద్యం, అక్రమ రవాణా వస్తువులు లేదా చట్టం ప్రకారం నిషేధించబడిన వస్తువులను తీసుకెళ్లకూడదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement