
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో గత 25 ఏళ్ల నుంచి అనేక భూ ఆక్రమణలు జరిగాయి. ఈ క్రమంలో.. భూముల అక్రమాలను వెలికితీసి వాటిపై ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిచే విచారణ చేయించాలని వాటాల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజు కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు మైసూరులో ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్గా రోహిణిని పునర్నియమించాలన్నారు.
రాష్ట్రంలో అటవీ భూములు, చెరువులు, ఇలా అనేక భూములను పలుకుబడి ఉన్న వారు కబ్జాలు చేసుకున్నారని, మైసూరులోనే ఇదే జరిగిందని, ఈ అక్రమాలన్నీ బయటకు రావాలంటే రోహిణితో దర్యాప్తు చేయించాలని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఆమెను బదిలీ చేయించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment