target
-
యెమెన్పై మరోమారు అమెరికా దాడి
వాషింగ్టన్ డీసీ: అమెరికా(America) మరోమారు యెమెన్ పై దాడి చేసింది. ఈ దాడిని హౌతీ మీడియా ధృవీకరించింది. దీనికిముందు కూడా అమెరికా యెమెన్పై దాడికి పాల్పడింది. ఆ దాడిలో 54 మంది మృతి చెందారు. తాజాగా సోమవారం యెమెన్పై అమెరికా మరోమారు దాడికి దిగింది. ఈ దాడిలో ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.#BREAKING Huthi media report new US strikes in Yemen pic.twitter.com/gpccecuehV— AFP News Agency (@AFP) March 17, 2025యెమెన్ రాజధాని సనా(Yemen's capital Sanaa)లో రాత్రిపూట అమెరికా జరిపిన దాడుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 53 మంది మృతిచెందారు. హౌతీలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకు సంఘీభావం ప్రకటిస్తూ అంతర్జాతీయ నౌకలపై దాడి చేసే తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. యెమెన్ రాజధాని సనా, ఇతర ప్రాంతాలలో అమెరికా జరిపిన అనేక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యెమెన్లోని అనేక లక్ష్యాలపై అమెరికా రాత్రిపూట వైమానిక దాడులు నిర్వహించింది. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై హౌతీలు దాడులను ఆపాలని ట్రంప్(Trump) కోరారు. లేనిపక్షంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వారు దాడులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.ఇరాన్ మద్దతుగల మిలీషియాలు అంతర్జాతీయ షిప్పింగ్పై దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. హౌతీ యోధులు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు నౌకలను ముంచేశారు. గత 18 నెలల్లో హౌతీలు అమెరికా నావికాదళంపై 174 సార్లు ప్రత్యక్షంగా దాడి చేశారని, గైడెడ్ ప్రెసిషన్ యాంటీ-షిప్ ఆయుధాలను ఉపయోగించి, 145 సార్లు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్కౌంటర్ -
'సాక్షి' పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
-
మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం
ఎనర్జీ సొల్యూషన్స్ బిజినెస్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించాలని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ ఆశిస్తోంది. ఇందుకు డేటా సెంటర్ల వృద్ధి, తదితర అంశాలు దోహదపడతాయని భావిస్తోంది. కంపెనీ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్డర్ బుక్ విలువ రూ.2,400 కోట్లకు చేరింది. ప్రధానంగా 400కేవీ, 765 కేవీ విభాగాలలో శుద్ధ ఇంధన విద్యుత్ ప్రసారంలో కంపెనీ నాయకత్వ స్థాయిని ఇది వెల్లడిస్తున్నట్లు గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలలో భారత్ వేగవంత మార్పులకు లోనవుతున్నట్లు తెలియజేసింది. ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం వార్షికంగా 30 శాతం చొప్పున వృద్ధి చెందనున్నట్లు అంచనా వేసింది. సస్టెయినబుల్ ఎనర్జీ సొల్యూషన్స్పై జాతీయస్థాయిలో దృష్టి పెట్టినట్లు పేర్కొంది. యాక్సిస్ ఫైనాన్స్లో వాటాల విక్రయంపై యాక్సిస్ కసరత్తుబిలియన్ డాలర్ల వేల్యుయేషన్పై దృష్టిన్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే యాక్సిస్ ఫైనాన్స్లో మెజారిటీ వాటాలను విక్రయించాలని యాక్సిస్ బ్యాంక్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అడ్వైజరుతో కూడా బ్యాంకు కలిసి పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, వాటాల విక్రయంపై నిర్ణయమేదీ తీసుకోలేదని పేర్కొన్నాయి. ఒకవేళ ముందుకెళ్లే పక్షంలో, యాక్సిస్ ఫైనాన్స్కి యాక్సిస్ బ్యాంక్ 900 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల వరకు వేల్యుయేషన్ అడిగే అవకాశం ఉందని వివరించాయి. యాక్సిస్ ఫైనాన్స్ వృద్ధికి బ్యాంకు గణనీయంగా నిధులు సమకూర్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ జనవరిలో ఒక నివేదికలో తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్స్కి రూ.300 కోట్లు అందించినట్లు వివరించింది. యాక్సిస్ ఫైనాన్స్ ప్రధానంగా కార్పొరేట్, రియల్ ఎస్టేట్ రంగాలకు రుణాల సర్వీసులు అందిస్తోంది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నిధుల సమీకరణన్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ తాజాగా ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్–కన్వర్టబుల్ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లకు 5 శాతం కూపన్ రేటుతో 36 నెలల కాలపరిమితి ఉంటుంది. -
క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ 2025 ద్వారా రూ.6,000 కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన మీడియా పార్ట్నర్ జియో స్టార్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూ.1,500 కోట్లు, ఐపీఎల్ నుంచి రూ.4,500 కోట్లు సంపాదించాలని యోచిస్తోంది.ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాధాన్యతకంపెనీ నిర్ణయించుకున్న టార్గెట్ చేరుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ ఇప్పటికే వివరణాత్మక ప్రకటన రేటు కార్డులను విడుదల చేసింది. ఐపీఎల్ ప్రకటన రేట్ల కోసం త్వరలో చర్చలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. జియో స్టార్ యాడ్ సేల్స్ టీమ్ ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్వెంటరీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రకటనదారులతో ఒప్పందాలను పొందేందుకు పని చేస్తున్నట్లు పేర్కొంది.ఆఫర్ చేస్తున్న ధరలు ఇలా..ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు, ఐపీఎల్ 2025 మార్చి 23 నుంచి మే 25 వరకు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్షిప్ కోసం రూ.55 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్షిప్ కోసం రూ.44 కోట్లు, పార్ట్నర్ స్పాన్సర్ల నుంచి రూ.28 కోట్లు కోరుతోంది. భారత్ మ్యాచ్లకు టీవీ స్పాట్ రేట్ 10 సెకన్లకు రూ.28 లక్షలుగా నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్ల నుంచి రూ.55 కోట్లు, పవర్ బై స్పాన్సర్ల నుంచి రూ.45 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రూ.25 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలుయాడ్ మార్కెట్లో ప్రస్తుతం కొంత మందగమనం ఉన్నప్పటికీ, తన ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంపై జియో స్టార్ ఆశాజనకంగా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్స్ వంటి రంగాలు వృద్ధి అవకాశాలను చూపిస్తున్నాయి. దాంతో ఆయా కంపెనీలు యాడ్ల కోసం ఖర్చు చేస్తాయని జియో స్టార్ భావిస్తుంది. అయితే భారీగా టీవీ ప్రకటనలకు దోహదం చేసే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ విభాగంలో చేసే ఖర్చులపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18ల విలీనం వల్ల జియో స్టార్ యాడ్ మార్కెట్ పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
వర్రా రవీందర్ కేసులో నిందితుల లిస్ట్ ని పెంచేస్తున్న పోలీసులు
-
భారత్లో భారీ వృద్ధి లక్ష్యం
చైనాకు చెందిన స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ రియల్మీ(Realme) వినూత్న ఉత్పత్తుల డిజైన్, విస్తృత శ్రేణి, రిటైల్ విస్తరణతో 2025లో భారతీయ స్మార్ట్ఫోన్ రంగంలో 18 శాతం వాటా(market share)ను అందుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ఉత్పత్తుల మెరుగైన పనితీరు, అత్యుత్తమ డిజైన్, మధ్య నుంచి అధిక–శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని వెల్లడించింది.కంపెనీకి భారత్ అతిపెద్ద విపణిగా ఉంది. 2024లో దేశీయ స్మార్ట్ఫోన్ విపణిలో రియల్మీ 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. వచ్చే ఏడాది మార్కెట్ వాటాలో 50 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్మీ వైస్ ప్రెసిడెంట్, సీఎంవో చేస్ షూ వెల్లడించారు. 2025 ప్రారంభంలో విడుదల కానున్న రియల్మీ 14 ప్రో డిజైన్(Design)ను ఆవిష్కరించిన సందర్భంగా చేస్ మీడియాతో మాట్లాడారు.ఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?ఆఫ్లైన్ కోసం ప్రత్యేకంగా..భారత్లో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంది. కానీ చాలా మంచి ఫలితాలతో 2024 ముగించాం అని చేస్ వివరించారు. ‘ధర సున్నిత అంశమైన భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచడానికి ప్రధాన ఈ–కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025లో ఫ్లిప్కార్ట్లో నంబర్ వన్గా, అమెజాన్ వేదికగా మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువ కస్టమర్లను ఆకట్టుకునేలా మరిన్ని కలర్ ఆప్షన్స్తో భారత్ కోసం ప్రత్యేక డిజైన్స్ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆఫ్లైన్ నెట్వర్క్, సర్వీస్ సెంటర్లను విస్తరిస్తాం. మార్కెట్ వాటాను పెంచడానికి ఆఫ్లైన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడళ్లను తీసుకొస్తాం’ అని వివరించారు. -
వైపస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్.. కుట్ర వెనుక ముఖ్య నేత..
-
అన్నపై ద్వేషం?.. జగన్ ను ఎదుర్కోవడానికి శత్రువుల చేతికి షర్మిల ఆయుధాలు ఇచ్చినట్టేనా?
-
బాబు కుట్ర బాణం.. సొంత అన్న టార్గెట్ గా షర్మిల అడుగులు
-
జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈసారి పుల్వామాలో ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కార్మికునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రీతమ్ సింగ్ను ఆర్మీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్బాల్లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో టన్నెల్ నిర్మిస్తున్న కంపెనీకి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు మృతిచెందారు.మరణించిన కార్మికులలో కశ్మీరీలతోపాటు కశ్మీరేతరులు ఉన్నారు. కశ్మీర్లో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఇక్కడి ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్లకు చెందిన కార్మికులు కశ్మీర్లోని యాపిల్ తోటలు, పలు నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనులు చేస్తున్నారు. 2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కశ్మీర్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత -
టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్ను కోల్పోవడం హమాస్కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు. -
Bangladesh: హిందూ టీచర్ల బలవంతపు రాజీనామాలు
ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి, హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి పలు నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపిన వివరాల ప్రకారం ఆగష్టు 29న కొందరు విద్యార్థులు బరిషల్లోని బకర్గంజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు.ఆగస్ట్ 18న అజింపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డైలీ స్టార్ వార్తాపత్రికతో బారువా మాట్లాడుతూ 'ఆగస్టు 18కి ముందు వారు ఎప్పుడూ నా రాజీనామాను అడగలేదు. ఆ రోజు ఉదయం వారు నా కార్యాలయంలోకి చొరబడి నన్ను అవమానించారు’ అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది.కబీ నజ్రుల్ యూనివర్శిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ స్టడీస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ షంజయ్ కుమార్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను డిపార్ట్మెంట్ హెడ్ పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. -
కూటమి ప్రభుత్వ కక్ష.. బలవంతంగా రాజీనామా..
-
Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో వరుస ఉగ్రదాడులు
పాకిస్తాన్లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. వాయువ్య పాకిస్తాన్లోని పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్టేషన్ ఇన్ఛార్జ్తో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని లక్కీ మార్వాట్ జిల్లాలోగల బర్గాయ్ పోలీస్ స్టేషన్పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు.మీడియాకు పాక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాయువ్య పాకిస్థాన్లో జరిగిన మరో దాడిలో, ఉగ్రవాదులు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మద్ది ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
2024 లోక్సభ ఎన్నికల్లో ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శల దాడులను చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని పక్కనపెట్టి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం యోగిని టార్గెట్ చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ సీనియర్ నేతలందరి పాస్పోర్ట్లను జప్తు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.. ‘వాళ్లంతా పారిపోతారు. రాహుల్ గాంధీ గానీ, భారత కూటమిలోని సభ్యులు గానీ ఎన్నడూ పారిపోరు. దేశానికి అండగా నిలుస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. దేశం కోసం ఏ బీజేపీ నేత అయినా బలిదానం చేశారా? వీళ్లంతా వ్యాపారస్తులు, భయపడతారు. ఆ వ్యాపార వలయంలో చిక్కుకుపోయానని యోగి గ్రహించాలి’ అని నానా పటోలే అన్నారు.అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశంలో సీఎం యోగిపై పలు వ్యాఖ్యానాలు చేశారు. యోగి ఢిల్లీకి వచ్చి తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. అయితే ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు. యూపీలో పరిస్థితి గందరగోళంగా ఉన్నందున సీఎం యోగి అక్కడే ఉండాలని అన్నారు. యూపీలో పరిస్థితి కనిపించిన దానికి భిన్నంగా ఉందన్నారు.ఉత్తరప్రదేశ్లో పదేళ్లుగా అధికారంలో ఉంటూ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాపంగానూ ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం యోగి పేరు ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది. 2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్లో తన ఖాతాను తెరిచింది. -
టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. మార్చి 10న కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. 2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్ను విచారించింది. కాగా కునాల్ ఘోష్ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. -
20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్..
చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇండియాతోపాటు ఇతర దేశాలకు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దొంగలించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. చైనా ప్రభుత్వం మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు కథనాలు వెలువడ్డాయి. సాఫ్ట్వేర్ లోపాలతో.. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్కు చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని ఈ దాడులు చేసినట్లు తెలిసింది. గతవారం గిట్హబ్లో లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవని సమాచారం. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది. 20 దేశాలు టార్గెట్.. ఇతర దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేలా సైబర్ దాడులకు పూనుకునేలా చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. భారత్, యూకే, తైవాన్, మలేషియాతోపాటు మొత్తం 20 దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో ఉంది. అయితే ఈ పత్రాల లీక్కు ఎవరు బాధ్యులో కనుగొనేందుకు చైనా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? ఏం చేశారంటే.. హ్యాకర్ల నుంచి లీకైన పత్రాల ద్వారా తెలిసిన సమాచరం ప్రకారం కథానాల్లో వెలువడిన వివరాలు ఇలా ఉన్నాయి.. భారత్ నుంచి 100 గిగాబైట్ల(జీబీ) ఇమిగ్రేషన్ డేటాను సేకరించారు. హ్యాకర్లు వివిధ దేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను దొంగలించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల(టీబీ) కాల్ లాగ్స్ సమాచారాన్ని సేకరించారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు. -
‘ఆదిత్య ఎల్-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?
చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య-ఎల్-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్-రే) కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్ మాస్ ఎజెక్షన్)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్ఫియర్, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట -
బ్యాంకు చిన్నదే.. కానీ టార్గెట్ పెద్దది!
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో విలీనవుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1 లక్ష కోట్ల డిపాజిట్లతో సంవత్సరాన్ని ముగించాలని భావిస్తోంది. జైపూర్ కేంద్రంగా ఉన్న ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 2027 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా 2027 మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల డిపాజిట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే రిటైల్ రుణాలు కొనసాగిస్తూనే భవిష్యత్తులో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 2023 సెప్టెంబర్ నాటికి రూ. 75,000 కోట్లకు పైగా డిపాజిట్లను కలిగి ఉంది. ఇక ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వద్ద రూ. 10,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము 28-30 శాతం స్థిరమైన వృద్ధితో ఎదిగామని, ఇదే వృద్ధితో కొనసాగితే 2027 నాటికి డిపాజిట్లను రూ. 2 లక్షల కోట్లకు పెంచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల డిపాజిట్లను సాధించడం ఏ బ్యాంకుకు అయినా వేగవంతమైన వృద్ధిరేటు అవుతుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా తాము ఆస్తి విభాగంలో ఇతర బ్యాంకుల కంటే ప్రధానంగా ఎన్బీఎఫ్సీలతో పోటీ పడుతున్నామని, కానీ డిపాజిట్ల విషయానికి వస్తే తాము అన్ని బ్యాంకులతో పోటీ పడతామని వివరించారు. -
10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!
కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది. ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి. -
నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్తో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనిలో చాలా మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. లెక్కకు మించిన యూదులు బందీలుగా మారారు. హమాస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్ను శ్మశానవాటికగా మార్చివేసింది. అలాగే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడింది. ఈ యుద్ధం నేపధ్యంలో నుక్భా ఫైటర్స్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ వీరు ఎవరు? హమాస్తో వారికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ ఒక పెద్ద విభాగం. దీనిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేసిన గ్రూపు పేరు ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్. నుక్భా ఈ బ్రిగేడ్కు చెందిన అత్యంత క్రూరమైన పోరాట యోధులు. వారిలో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఎదురుగా ఏది అడ్డుపడినా, ధ్వంసం చేసుకుంటూ, ముందుకు వెళ్లడమే వారి లక్ష్యం. నుక్భా ఫైటర్స్ చాలా ప్రమాదకరమైనవారు. వారు పిల్లలను, వృద్ధులను కూడా విడిచిపెట్టరు. నుక్భా ఫైటర్స్ ఇజ్రాయెల్కు నిరంతరం సవాల్గా నిలుస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వారితో పోరాడుతూనే ఉంది. వారిని వెతికి పట్టుకుని మరీ మట్టుపెడుతూ వస్తోంది. నుక్భా ఫైటర్లు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నిష్ణాతులు. వారు గెరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తుంటారు. హమాస్ తన సైన్యాన్ని ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. వీరి శిక్షణ సమయంలో బలంగా ఉండే కొంతమంది యువకులను గుర్తిస్తారు. వారిని నుక్భా ఫైటర్స్గా తీర్చిదిద్దుతారు. ఇది కూడా చదవండి: ఆదివాసీల ‘జలియన్వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సవాన్లో ఏం జరిగింది? -
హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... రోమాలు నిక్కబొడిచే వీడియో!
ఎటువంటి కర్మకు అటువంటి ఫలితమే వస్తుందని అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక వీడియో దీనికి రుజువుగా మారింది. వీడియోలోని దృశ్యం ప్రకారం.. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్తో నాగుపాముకు గురిపెట్టి కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మరుసటి క్షణంలో కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. వీడియో ప్రారంభంలో ఒక కింగ్ కోబ్రా(నాగు పాము) మట్టి రహదారిపై ఉండటాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఒక కారు ఆ కోబ్రా ముందు ఆగి ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న వ్యక్తి తన రివాల్వర్ని తీసి, కోబ్రాపై కాల్పులు జరుపుతాడు. ఆ వ్యక్తి పలుమార్లు నాగుపాముపై కాల్పులు జరుపుతాడు. అయితే ప్రతిసారీ గురి తప్పుతుంది. ఆ నాగుపాము కోపంతో తన పడగ విప్పి, ఆ వ్యక్తిపై దాడికి ఉపక్రమిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడం వీడియోలో వినిపిస్తుంది. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్లో @Instantregretss అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లెక్కకు మించిన వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది కూడా చదవండి: చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా? Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu — Klip Entertainment (@klip_ent) December 16, 2022 -
గాజాపై భూతల యుద్ధం!
జెరూసలేం/వాషింగ్టన్: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన. గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు సన్నద్ధం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గ్రౌండ్ ఆపరేషన్ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్ సైనికులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది. యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. సిరియా ఎయిర్పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్తోపాటు అలెప్పీలోని ఎయిర్పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్ విమానాన్ని ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. బందీలను విడుదల చేస్తేనే.. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్ను నలిపేస్తాం: నెతన్యాహూ పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్లో శనివారం హమాస్ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు. అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సమావేశమయ్యారు. హమాస్పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్–టైమ్ కేబినెట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు. అండగా ఉంటాం: బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్కు ఉందన్నారు. బ్లింకెన్ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్కాస్ట్ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
ఆస్కార్ టార్గెట్ గా తెరకెక్కుతున్న సినిమాలు
-
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్అ జామ్, అమ్జద్ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
భారీ లక్ష్యంతో దిశగా ఐఆర్ఈడీఏ - 2025 నాటికి..
న్యూఢిల్లీ: భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,350 కోట్ల ఆదాయన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అలాగే, 2025 మార్చి నాటికి రూ.5,220 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర నూతన, పునరుత్పాదక శాఖ (ఎంఎన్ఆర్ఈ)తో ఇందుకు సంబంధించి పనితీరు ఆధారిత అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం నిర్ధేశించిన మేర ఆదాయ లక్ష్యాలను ఐఆర్ఈడీఏ చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్, రుణాల్లో ఎన్పీఏ రేషియో, అస్సెట్ టర్నోవర్ రేషియో తదితర పనితీరు ఆధారిత లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,482 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ఐఆర్ఈడీఏ ప్రకటించింది. ‘‘జూన్ త్రైమాసికంలో రుణాల పంపిణీలో 272 శాతం వృద్ధి నమోదు చేశాం. పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి నమోదైంది’’అని ఐఆర్ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. నికర నిర్ధరక రుణాలు (ఎన్పీఏలు) 2.92 శాతం నుంచి 1.61 శాతానికి తగ్గినట్టు చెప్పారు. -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
మణిపూర్ మండుతూ ఉంటే పార్లమెంట్లో జోకులా?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని మరోసారి టార్గెట్ చేశారు. గురువారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి బదులిస్తూ ప్రధాని మోదీ నవ్వడం, జోకులు వేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని ప్రవర్తన సరైంది కాదన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ మణిపూర్ హింసను తక్షణం ఆపాలనుకుంటే, అందుకు అవసరమైన చాలా మార్గాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. భారత ఆర్మీ అక్కడి పరిస్థితులను రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకొస్తుందని చెప్పారు. ‘అక్కడ మహిళలు, చిన్నారులు చనిపోతున్నారు. మహిళలు వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. భారత ప్రధాని మోదీ మాత్రం నిండు పార్లమెంట్లో రెండు గంటలపాటు నవ్వుతూ, నవి్వస్తూ, నినాదాలతో గడిపారు. నాలుగు నెలలుగా మణిపూర్ మంటల్లో ఉన్న విషయం ఆయన మర్చిపోయినట్లున్నారు. మణిపూర్ మండుతూనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, మంటలను ఆపడం ప్రధానికి ఇష్టం లేదు’అని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ విషయం రాహుల్ గాం«దీకి, కాంగ్రెస్కు, ప్రతిపక్షానికి సంబంధించింది కాదు, ఇది భారత్కు, మన దేశానికి సంబంధించిన విషయం. ఒక రాష్ట్రం నాశనమైంది. అదిప్పుడు ఉనికిలో లేదు. విభజించు, పాలించు, తగులబెట్టు..తరహా బీజేపీ రాజకీయాల వల్లే ఇలా అయింది’అని రాహుల్ మండిపడ్డారు. ‘నేను అటల్ బిహారీ వాజ్పేయి, దేవెగౌడ వంటి ప్రధానుల్ని చూశాను. మోదీ వంటి ఇంత దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదు’అన్నారు. ‘మణిపూర్లో భారత మాత హత్యకు గురైంది’అని నేను చేసిన వ్యాఖ్య సాధారణమైంది కాదు. నా 19 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి మాట వాడటం ఇదే మొదటిసారి’అని అన్నారు. మణిపూర్లోని మొయితీలుండే ప్రాంతానికి వెళ్లినప్పుడు.. వాళ్లు మమ్మల్నెంతో ప్రేమగా చూశారు. అక్కడే ఉండిపొమ్మన్నారు. అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్క కుకీ వర్గం వ్యక్తి కూడా లేరు. కుకీలుండే ఏరియాకు వెళ్లినప్పుడూ మాకు ఇదే అనుభవం ఎదురైంది. అక్కడ ఒక్కడి భద్రతా సిబ్బందిలో ఒక్క మొయితీ కూడా లేరు. ఇలాంటి పరిస్థితి మణిపూర్లో మునుపెన్నడూ లేదని కేంద్ర భద్రతా సిబ్బంది ఒకరు నాతో అన్నారు’అని రాహుల్ చెప్పారు. ‘అందుకే మణిపూర్లో భరతమాత హత్యకు గురైందన్నాను. అది తమాషాకు కాదు. వాస్తవమే చెప్పాను’అని రాహుల్ తెలిపారు. ‘పార్లమెంట్లో నా ప్రసంగంలోని భరతమాత అనే మాట దోషంగా భావించి రికార్డుల నుంచి తొలగించి వేశారు. అందులో తప్పేముంది? ఇలా భరతమాత మాటను తొలగించడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి’అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
తప్పుడు లక్ష్యంతోనే ఆ నివేదిక: అదానీ గ్రూప్ ఫైర్
న్యూఢిల్లీ: కార్పొరేట్ సుపరిపాలన, సమాచార వెల్లడిలో విశ్వసనీయ విధానాలు అవలంబిస్తున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ గ్రూప్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన ఐదు నెలల తదుపరి వార్షిక నివేదికలో ఇంకా పలు అంశాలపై స్పందించింది. అదానీ గ్రూప్ కంపెనీలలో అక్రమాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరి 24న హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒక దశలో గ్రూప్ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. అయితే హిండెన్బర్గ్ నివేదిక తప్పుడు లక్ష్యాలతో నిరాధార ఆరోపణలకు తెరతీసిందని అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇది దేశంపై జరిగిన దాడిగా గౌతమ్ అదానీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున నివేదిక వెలువడినట్లు తెలియజేశారు. గ్రూప్పై తప్పుడు ఆరోపణలు చేసి షేర్ల ధరలను పడగొట్టడం ద్వారా హిండెన్బర్గ్ లాభాలు ఆర్జించినట్లు వెల్లడించారు. సుపరిపాలన, సమాచార వెల్లడిలో గ్రూప్ పటిష్ట విధానాలు అనుసరిస్తున్నట్లు వివరించారు. అన్ని రకాల నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. -
భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 5,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాలని చూస్తోంది. ఈ బాటలో రూ. 50,000 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ బిజినెస్, ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ ద్వారా లక్ష్యాలను సాధించాలని ఆశిస్తోంది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీ ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలను భారీ వృద్ధి బాట పట్టించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ చీఫ్ రామ్దేవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రుచీ సోయాను 2019 సెప్టెంబర్లో దివాలా పరిష్కారంలో భాగంగా పతంజలి గ్రూప్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ను సైతం భారీ స్థాయిలో పెంచేందుకు వీలుగా ఐదేళ్ల విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేసినట్లు రామ్దేవ్ వెల్లడించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ, ఫుడ్ బిజినెస్లో భారీ కంపెనీగా ఆవిర్భవించాలని లక్షిస్తున్నట్లు తెలియజేశారు. గతేడాది ఓకే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కంపెనీ రూ. 886 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 806 కోట్ల నికర లాభం నమోదైంది. ఇబిటా రూ. 1,577 కోట్లుకాగా.. మొత్తం ఆదాయం రూ. 24,284 కోట్ల నుంచి రూ. 31,821 కోట్లకు జంప్ చేసింది. దీనిలో వంట నూనెల విభాగం నుంచి రూ. 25,253 కోట్లు లభించింది. వీటి ద్వారా 2021–22లో రూ. 22,469 కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఇక ఫుడ్, ఎఫ్ఎంసీజీ బిజినెస్ టర్నోవర్ దాదాపు నాలుగు రెట్లు ఎగసి రూ. 6,218 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది కేవలం ఈ విభాగపు ఆదాయం రూ. 1,683 కోట్లకే పరిమితమైంది. కాగా.. తాజా లక్ష్యాలను చేరుకునేందుకు పలు కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు రామ్దేవ్ తెలియజేశారు. గేదె నెయ్యి, ప్రీమియం విభాగంలో బిస్కట్లు, కుకీస్, డ్రై ఫ్య్రూట్స్, మసాలా దినుసులతోపాటు పౌష్టికాహార ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇప్పటికే పలు రాష్ట్రాలలో 39,000 మందికిపైగా రైతుల ద్వారా 63,816 హెక్టార్లకుపైగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ రుచీ గోల్డ్, మహాకోష్, సన్రిచ్, న్యూట్రెలా, రుచీ సన్లైట్ తదితర బ్రాండ్లను కలిగి ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 81 శాతం వాటా ఉంది. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు 1 శాతం క్షీణించి రూ. 1,014 వద్ద ముగిసింది. -
ఉద్యోగాల పేరుతో మోసం..!
-
నిలువునా ముంచిన ముఠా టార్గెట్ ఇక్కడ యువతే..!
-
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2038 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్ జీరో ఎమిషన్స్కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్), గెయిల్, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. తాము అంతర్గతంగా నెట్–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్ వివరించారు. ఆయిల్ ఉత్పత్తి అప్.. 2022–23లో ఓఎన్జీసీ 19.584 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: ఆర్క్యాప్ నష్టాలు తగ్గాయ్ -
ఈటలను మళ్లీ టార్గెట్ చేసిన కేసీఆర్.. హుజూరాబాద్లో ఏం జరుగుతోంది?
ఈటల రాజేందర్. ఒకప్పుడు గులాబీ పార్టీలో సంచలనం. బాస్ మీదే తిరుగుబాటు చేసిన ఈటల కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సవాల్ చేసి హుజూరాబాద్లో కమలం గుర్తు మీద గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా తుత్తునియలు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి గులాబీ బాస్కు టార్గెట్ అయ్యారు. అసలు హుజూరాబాద్లో ఏం జరుగుతోంది? తెలంగాణ ఉద్యమంలో తొలినుంచీ కేసీఆర్ వెంట ఉన్న ఈటల రాజేందర్.. అనేక రాజకీయ పరిణామాల తర్వాత కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. కాషాయ కండువా కప్పుకుని ఉప ఎన్నికలలో తన సీటును కాపాడుకున్నారు. హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి గులాబీ బాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ఉప ఎన్నికలోనే దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. బీజేపీలో కూడా అంతర్గత కలహాలతో ఈటల ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఈటల తిరిగి బీఆర్ఎస్ బాట పడతారా అన్న చర్చకు దారితీసింది. ఈటల మాత్రం కాషాయ పార్టీలోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో తనకు దక్కాల్సిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడంలేదనే ఓ భావన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం బాగుండదనుకున్నారో... ఏమో మొత్తానికి ఈటల బీఆర్ఎస్ కవ్వింపులకైతే పడిపోలేదు. పైగా బీజేపీ నెక్స్ట్ రాష్ట్రాధ్యక్షుల లిస్ట్లో ఈటల పేరు కూడా వినిపిస్తుండటంతో.. మరోసారి గులాబీ బాస్ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంపైనా.. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్పైనా ఫోకస్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టడంతో పాటు.. దళితబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ అక్కడి జనం మనసుని.. ముఖ్యంగా దళితుల ఓట్లనీ తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసింది. ఎన్నికల్లో విజయం రాజేందర్నే వరించింది. కొంతకాలం పాటు అటువైపు పెద్దగా దృష్టి పెట్టని గులాబీ బాస్ ఇప్పుడీ నియోజకవర్గంపై మళ్లీ ప్రధానంగా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి కారెక్కిన కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు.. ఉప ఎన్నికలో ఈటలపై పోటచేసి ఓటమిపాలైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పదవిచ్చారు. హైదరాబాద్లో అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని.. దానికి ముందు హుజూరాబాద్కి అంబేడ్కర్ ముని మనవడైన ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ ను ప్రత్యేక చాపర్ లో పంపించారు. హుజూరాబాద్లో అమలవుతున్న దళితబంధు పథకాన్ని.. లబ్దిదారులు ఆయనకు వివరించేలా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. ఈటల పైనా.. ఆయన నియోజకవర్గంపైనా గులాబీ బాస్ ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతున్నారనిపిస్తోంది. ఈటల రాజేందర్పైన ఎప్పుడూ విరుచుకుపడే కౌషిక్ రెడ్డి.. తన నియోజకవర్గానికి సంబంధం లేకున్నా తన చిరకాల ప్రత్యర్థిలా ఈటలను భావించే మంత్రి గంగుల కమలాకర్ కే ఈ బాధ్యతలను అప్పజెప్పడం వెనుకా గులాబీబాస్ ఆలోచనలు ఏంటన్నది ఇప్పుడో పెద్ద చర్చ. మరి ఇంతగా ఫోకస్ అవుతూ.. ఓ ముఖ్యమంత్రి చూపునే తనవైపు తిప్పుకునేలా చేయడం ఒకవైపు ఈటెలకున్న స్టామినాను చెబుతుంటే... ఇంకోవైపు ఇంతగా ఫోకస్ అవుతూ తానే లక్ష్యంగా జరుగుతున్న ఒత్తిడిని ఈటెల ఏవిధంగా ఎదుర్కొంటారోనన్న ఆసక్తీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
టయోటో భారీ ప్రణాళికలు: రానున్న కాలంలో 10 కొత్త ఈవీ మోడళ్లు
సాక్షి, ముంబై:ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థ టయోటా భారీ ప్రణాళికలే వేస్తోంది. 2026 నాటికి 10 కొత్త ఈబీ మోడళ్లను విడుదల చేయనుంది. అలాగే 2030 నాటికి 3.5 మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు టయోటా మోటార్ కొత్త ప్రెసిడెంట్ సీఈవో కోజీ సాటో తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ హిరోకి నకాజిమా మాట్లాడుతూ, 2026 నాటికి కంపెనీ 10 కొత్త ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను లాంచ్ చేయనుందనీ, తద్వారా ఏటా దాదాపు 1.5 మిలియన్ వాహనాలను విక్రయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. టయోటా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-వాహన పరిశ్రమలో ఆకట్టుకోలేకపోయింది.ముఖ్యంగా టెస్లా ,చైనా బీవైడీతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో వెనుకబడి ఉంది. టెస్లా, బీవైడీ వేగంగా విస్తరిస్తున్న ఈ-మార్కెట్లో దూసుకు పోతుండటంతో టయోటా కొత్త మేనేజ్మెంట్ ఈ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయాలనే టాస్క్లో పడిందని నిక్కీ ఆసియా నివేదించింది. దీనికితోడు గత సంవత్సరం కంపెనీ తొలి భారీ-ఉత్పత్తి బ్యాటరీ-ఆధారిత మోడల్, bz4X రీకాల్ కావడం భారీగా దెబ్బతీసింది. ఎస్ అండ్పీ గ్లోబల్ మొబిలిటీ డేటా ప్రకారం, టయోటా 2022లో 21,650 బ్యాటరీతో నడిచే వాహనాలను విక్రయించింది.ఇది కేవలం 0.3 శాతం వాటాను మాత్రమే. అత్యధికంగా అమ్ముడైన టెస్లా 1.27 మిలియన్ యూనిట్లను, బీవైడీ 810,600 వాహనాలను సేల్ చేసింది. -
భారత్లో లంబోర్గీని రికార్డ్ సేల్స్; వచ్చే ఏడాదికి భారీ టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. అంతేకాదు 2023 సంవత్సరానికి గాను భారీ టార్గెట్ పెట్టకున్నట్టు కంపెనీ కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. 2023లో మూడు అంకెల మార్కును ఎలా సాధించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔట్డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్ మీడియా సంచలనం సృష్టిస్తోంది. కంపెనీ ఏర్పాటైన రెండేళ్లలోనే అన్ని మెట్రో నగరాల్లో 3,200 పైచిలుకు స్క్రీన్లతో విస్తరించింది. యాపిల్, ఆడి, మలబార్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రకటనలను డిజిటల్ తెరలపై టీ–హబ్, డీఎల్ఎఫ్, లోధా, హైహోమ్, అరబిందో, ఇనార్బిట్ తదితర వందలాది గృహ సముదాయాలు, కమర్షియల్ ప్రాజెక్టులు, మాల్స్లో ప్రదర్శిస్తోంది. భారత్లో ఔట్డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచామని బెల్ ప్లస్ మీడియా కో–ఫౌండర్లు గాయత్రి రెడ్డి చప్పిడి, దేవ్ అభిలాష్ రెడ్డి కొత్తపు తెలిపారు. ఏడాదిలో 20,000 స్క్రీన్లు, 20 నగరాలకు చేరుకోవాలన్నది లక్ష్యమన్నారు. తొలిసారిగా..: రెండు డిస్ప్లేలతో దేశంలో తొలిసారిగా స్క్రీన్లను ఏర్పాటు చేశామని గాయత్రి వివరించారు. ‘అత్యాధునిక సాఫ్ట్వేర్తో వినూత్న అనుభూతి, అతి తక్కువ ఖర్చు, సౌకర్యంతోపాటు ప్రకటనలను కస్టమైజ్ చేసుకునే వీలుండడం వల్లే సక్సెస్ అయ్యాం. స్క్రీన్కు ఉండే సెన్సార్తో ఎంత మంది వీక్షించారో తెలుసుకోవచ్చు. పైన ఉండే డిస్ప్లేలో బ్రాండ్ల ప్రకటనలు, కింది డిస్ప్లేలో సంబంధిత సొసైటీ నోటీసులు, అసోసియేషన్ సందేశాలు, కార్యక్రమాలు ప్రదర్శిస్తాం. సొసైటీలకు సేవలు ఉచితం. పైగా వారికి అద్దె చెల్లిస్తాం. క్లయింట్కు బెల్ ప్లస్ అప్లికేషన్ ఇస్తాం. ప్రకటనల కంటెంట్ను వారే ఎంచుకోవచ్చు’ అని తెలిపారు. -
రౌడీషీటర్తో బీజేపీ నేతల రక్తదాన కార్యక్రమం...పేలిన మాటల తుటాలు
కర్ణాట బీజీపీ నాయకులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పేరు మోసిన నేరస్తుడు సునీల్ దర్శనమిచ్చాడు. అతను బెంగుళూరులో అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్ కిల్లర్గా పరిగణించే సునీల్. ప్రస్తుతం అతను నేర కార్యకలపాలకు దూరంగా ఉంటున్నానని, సమాజ సేవ చేస్తున్నాని చెబుతుండటం విశేషం. ఆ నేరస్తుడు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, చిక్పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడహర్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కనిపించాడు. దీంతో అతను బీజేపీలోకి చేరతాడంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కర్ణాట బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందిస్తూ... ఈ మిషయమై పార్టీ నేతలను వివరణ కోరతానని అన్నారు. అంతేగాక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నేతలను ఆదేశించామని, అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారిని, నేర నేపథ్యం ఉన్న వారిని పార్టీలోకి తీసుకోమని, ఇలాంటి వాటిని పార్టీ ఎప్పటికీ సహించదని నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శులు ఎక్కుపెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా..పోలీసుల దాడిలో దొరకని రౌడిషీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చారు. గతంలో బెట్టింగ్లకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీ పార్టీలో చేరి, మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య కూడా బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీ శివకుమార్ ఒకప్పుడూ గ్యాంగ్స్టర్ కొత్వాల్ రామచంద్రకు అభిమాన శిష్యుడంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడూ కొత్వాల్ అభిమాన శిష్యుడు తీహార్ జైలు నుంచి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదోన్నతి పొందాడని, ప్రస్తుతం అతను పార్టీ అద్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజులను మరిచిపోయారా అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. అండర్ వరల్డ్లో పెరిగిన శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హత్య నిందితులు వినయ్ కులకర్ణి, గూండాయిజంలో పేరుగాంచిన మహ్మద్ నలపాడ్లు కర్ణాటక కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారంటూ మొత్తం లిస్ట్ పేర్కొంది బీజేపీ. కాగా, ఇరు పార్టీ మాటల తుటాల దాడి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ...పాత రౌడీషీటర్ల సంఖ్యను తేల్చి చెప్పమని గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీంతో క్రైం బ్రాంచ్ కమిషనర్ ఎన్డీ శరణప్ప ఈ విషయమై వివరణ ఇచ్చారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. అలాగే రౌడీ షీటర్ సునీల్పై ఎలాంటి పాత పెండింగ్ కేసులు లేవని స్పష్టం చేశారు. అంతేగాదు అతను విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేకపోవడంంతోనే ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రౌడీషీటర్ సునీల్ని అదుపులోకి తీసుకులేదని తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం) -
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా.. మోదీ పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో చర్చ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఉండనుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి నుంచే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని.. అధికార టీఆర్ఎస్పై దూకుడుగా పోరాడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారని వివరిస్తున్నాయి. శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ తొలుత బేగంపేటలో స్వాగత సభలో, తర్వాత రామగుండం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందులో బేగంపేట కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా ముందస్తుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టవచ్చని అంటున్నాయి. ‘డబుల్ ఇంజన్’ పిలుపుతో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పే అవకాశ ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు, కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నాయి. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కష్టపడాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని పిలుపు ఇవ్వనున్నారని వివరిస్తున్నాయి. ఇంతకుముందు భిన్నంగా.. ఈ ఏడాది మే నెలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్నాతకోత్సవానికి వచ్చిన మోదీ.. బేగంపేట ఎయిర్పోర్టులో స్వాగత సభలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ అవినీతి, నియంత, అప్రజాస్వామిక పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూఢ నమ్మకాలతో వ్యవహరిస్తోందనీ ఆరోపించారు. ఆ తర్వాత హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి వచ్చిన మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభలో మాట్లాడారు. కానీ టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్లపై విమర్శలేవీ చేయకుండా.. కేవలం బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. శనివారం మాత్రం ఇందుకు భిన్నంగా తనదైన శైలిలో మోదీ రాజకీయ ప్రసంగం చేయవచ్చని అంటున్నారు. ఇక రామగుండం సభలో కేంద్ర పథకాలు, అభివృద్ధిని వివరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని చెప్తున్నారు. భారీగా కార్యకర్తలను రప్పించేలా.. శనివారం బేగంపేట సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించనుంది. ఈ ఏడాది మేలో ఓవైపు ఎండ తీవ్రతతోపాటు ప్రధాని అనుకున్న సమయం కంటే ముందే రావడంతో కార్యకర్తలు సభాస్థలికి చేరుకోవడం ఆలస్యమైంది. ఈసారి ముందుగానే అంటే మధ్యాహ్నం 12 గంటలలోపే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎయిర్పోర్టుకు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లపై శుక్రవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, నేతలు చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.రామచంద్రరావు, ఎస్.ప్రకాశ్రెడ్డి తదితరులు సమావేశమై సమీక్షించారు. బేగంపేటలో మోదీకి స్వాగతం, వీడ్కోలు, రామగుండంలో స్వాగతం, వీడ్కోలు సందర్భంగా మోదీని కలుసుకునేలా పార్టీలోని వివిధ స్థాయిల నాయకులతో లైనప్లను ఏర్పాటు చేశారు. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
పొలిటికల్ కారిడార్ : తెలంగాణ లో కాషాయ పార్టీ నెక్స్ట్ టార్గెట్ పై చర్చ
-
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
సమస్యలు ఉన్నా.. తగ్గేదేలే మన టార్గెట్ 1,000కోట్లు!
కోల్కతా: ఇమేజింగ్ ఉత్పత్తుల కంపెనీ నికాన్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్ల టర్నోవర్ సాధిస్తానన్న అంచనాతో ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ వివరాలను నికాన్ ఇండియా ఎండీ సజ్జన్ కుమార్ వెల్లడించారు. సరఫరా పరంగా సమస్యలు ఉన్నా, తయారీ వ్యయాలు పెరిగి మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. పండుగల విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ధరలను పెంచలేదని చెప్పారు. వార్షిక అమ్మకాల్లో 30–35 శాతం మేర ఓనమ్ నుంచి దీపావళి మధ్య నమోదవుతాయన్నారు. కరోనా ముందస్తు అమ్మకాలను ఈ ఏడాది అధిగమిస్తామని చెప్పారు. కెమెరా మార్కెట్ వార్షిక పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, నిపుణులే తమ ఉత్పత్తుల విక్రయాలకు మద్దతుదారులుగా చెప్పారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఉపయోగించే ఆరంభ స్థాయి నుంచి మధ్య స్థాయి కెమెరాల విక్రయాల్లో 45 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపారు. విలువ పరంగా చూస్తే ఈ విభాగం వాటా ఇమేజింగ్ మార్కెట్లో 25 శాతం ఉంటుందన్నారు. ఈ విభాగంలో తమకు మార్కెట్ను శాసించే ‘నికాన్ జెడ్ 30’ కెమెరా ఉన్నట్టు ప్రకటించారు. నిపుణులు వినియోగించే కెమెరాల విక్రయాల్లోనూ 20 శాతం వృద్ధి ఉందని సజ్జన్ కుమార్ తెలిపారు. చదవండి: ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్ -
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
భవిష్యత్ ఎన్నికలపై ఫోకస్.. టార్గెట్ క్లీన్ స్వీప్..!!
-
ఊపందుకున్న రబీ.. సాగు లక్ష్యం 60 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: అకాల వర్షాలు, భారీ వరదలతో మొదలైన రబీ సీజన్ క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం సాగు లక్ష్యంలో ఇప్పటికి మూడో వంతు పూర్తయింది. రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతినడంతో ఇక్కడ రెండోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా.. 2018–19లో 53.04 లక్షలు, 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో సాగైంది. చదవండి: నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు గతేడాది రెండో పంటకు నీరివ్వడం, వాతావరణం కలిసి రావడంతో 62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీ చరిత్రలో ఇదే రికార్డు. ప్రస్తుతం రబీలో 60 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 124.45 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదల ప్రభావంతో ఇప్పటివరకు 21.82 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండో పంటకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడం, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గనుండగా అపరాలు, చిరు ధాన్యాల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరి లక్ష్యం 21.50 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా.. 2019–20లో 19.38 లక్షల ఎకరాలు, 2020–21లో 23.49 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 21.50 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 3.33 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 4.67లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదలవల్ల నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. పెరగనున్న అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.2 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2.05 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 1.13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 87వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల సాగు లక్ష్యం ఈ ఏడాది 24.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 14.32 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అలాగే, ఇప్పటివరకు 8.22 లక్షల ఎకరాల్లో కందులు, 4.77 లక్షల ఎకరాల్లో మినుములు, 60వేల ఎకరాల్లో పెసలు సాగయ్యాయి. నూనె గింజల సాగు లక్ష్యం 3.67 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.17లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగ 95 వేల ఎకరాల్లో సాగైంది. పొగాకు సాగు లక్ష్యం 1.77 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 72 వేల ఎకరాల్లో సాగైంది. మిరప సాగు లక్ష్యం 75 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 37 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. రాయలసీమలో రికార్డు వర్షపాతం సీజన్ ఆరంభంలోనే ఈసారి భారీ వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో 24.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 294 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 365.9 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో 235.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, 431.2 మి.మీ.ల వర్షపాతం (82.9 శాతం అధికం) కురిసింది. కోస్తాంధ్రలో 381.2 మి.మీ.ల వర్షపాతానికి 416.2 మి.మీ.ల వర్షపాతం (9.2 శాతం అధికం) కురవగా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో 271.7 మి.మీ.ల వర్షపాతానికి 259.4 మి.మీ.ల వర్షపాతం (–4.5 శాతం తక్కువ) కురిసింది. మళ్లీ నారు పోశాం 20 ఎకరాల్లో నెల్లూరు జీలకర్ర సన్నాలు రకం వరి నారుమడి వరదలకు కొట్టుకుపోయింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతో మళ్లీ నారుమళ్లు పోసుకున్నా. నాట్లు వేయాలి ఇక. – పి.విశ్వనాథ్, నెల్లూరు జిల్లా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు అకాల వర్షాలు, వరదలతో రబీ సీజన్ మొదలైంది. నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పోసుకుంటున్నారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి అపరాలు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
Paytm: 50 కోట్ల మంది టార్గెట్
న్యూఢిల్లీ: సాంకేతికత ఆధారిత ఆర్థిక సేవల ద్వారా 50 కోట్ల మంది భారతీయులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టు పేటీఎం గ్రూప్ సీఎఫ్వో, ప్రెసిడెంట్ మధుర్ డియోరా తెలిపారు. ‘పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) కోసం ఇటీవల పలు బ్యాంకులతో భాగస్వామ్యం ప్రకటించాం. హెచ్డీఎఫ్సీతోపాటు ఇతర బ్యాంకులతో చేతులు కలిపాం. ఇది పెద్ద ఫార్మాట్ రిటైలర్ మార్కెట్లో విస్తరణకు దోహదం చేస్తోంది. పోటీ సంస్థల కస్టమర్లూ మా ప్లాట్ఫాంకు మళ్లుతున్నారు. చెల్లింపు ఉత్పత్తులతో మధ్యస్థాయి మార్కెట్, స్టార్టప్ రంగాన్ని ఆక ర్శించడంలో అవకాశాలను చూస్తున్నాం. డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు నిక్షిప్తం చేయాల్సిన అవసరం లేకుండా పేటీఎం టోకెన్ గేట్వే కోసం మింత్రా, ఓయో, డామినోస్ తదితర సంస్థలు పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి’ అన్నారు. -
Realme: ఫెస్టివల్ సీజన్.. టార్గెట్ బిగ్సేల్స్!
న్యూఢిల్లీ: పండగ సీజన్గా పేర్కొనే సెప్టెంబరు–అక్టోబర్లో 60 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్ల విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. ట్యాబ్లెట్ పీసీల్లో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు వివరించారు. ల్యాప్టాప్స్ తయారీ కోసం మూడు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో వీటి తయారీ ప్రారంభం అవుతుందన్నారు. ట్యాబ్లెట్ పీసీలు సైతం దేశీయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. 2020లో భారత్లో 1.9 కోట్ల యూనిట్ల రియల్మీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. చిప్సెట్ల ఎఫెక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా చిప్సెట్ కొరత నెలకొన్నా... దాని ప్రభావం ఈ పండుగల సీజన్లో తమ కంపెనీపై ఉండబోదని రియల్మీ స్పష్టం చేసింది. భారత్లో తమ కంపెనీ ఈ ఏడాది 2.4–2.7 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదికి సైతం సరిపడ చిప్సెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. భారత మార్కెట్ విషయంలో చిప్సెట్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. రియల్మీ ప్యాడ్.. రూ.13,999 ధరలో రియల్మీ ప్యాడ్ను కంపెనీ గురువారం భారత్లో విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్, 10.4 అంగుళాల స్క్రీన్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. 3/4 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే రియల్మీ 8ఎస్ 5జీ, రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లను సైతం ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ.13,999 నుంచి మొదలవుతున్నాయి. చదవండి: వన్ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్..! -
రేవంత్ ను కాంగ్రెస్ ముఖ్యనేతలు టార్గెట్ చేశారా..?
-
పెగాసస్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓ ప్రకారం పెగాసెస్ను 45 దేశాలు ఉపయోగిస్తున్నప్పుడు భారతదేశం మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో సహా భారతదేశంలో 300 మందిఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందన్న ది వైర్ కథనం మోదీ సర్కార్ను ఇరుకునపెట్టింది. దీంతో కేంద్ర మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు. కాగా ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ , అతని ఇద్దరు సహాయకులు ఉన్నారని ది వైర్ నివేదించింది. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా ఉన్నారని తెలిపింది. దీనిపై పార్లమెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజే తీవ్ర దుమారం రేపింది. -
Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో గత 25 ఏళ్ల నుంచి అనేక భూ ఆక్రమణలు జరిగాయి. ఈ క్రమంలో.. భూముల అక్రమాలను వెలికితీసి వాటిపై ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిచే విచారణ చేయించాలని వాటాల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజు కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు మైసూరులో ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్గా రోహిణిని పునర్నియమించాలన్నారు. రాష్ట్రంలో అటవీ భూములు, చెరువులు, ఇలా అనేక భూములను పలుకుబడి ఉన్న వారు కబ్జాలు చేసుకున్నారని, మైసూరులోనే ఇదే జరిగిందని, ఈ అక్రమాలన్నీ బయటకు రావాలంటే రోహిణితో దర్యాప్తు చేయించాలని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఆమెను బదిలీ చేయించారని ఆరోపించారు. చదవండి: ఐఏఎస్ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్! -
అలీబాబాకు ట్రంప్ సెగ
వాషింగ్టన్ : చైనాపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా కంపెనీలకు వరుస షాక్ లిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టిక్టాక్ నిషేధానికి రంగం సిద్ధం చేసుకున్న అనంతరం తాజాగా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాను కూడా టార్గెట్ చేశారు. అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. (టిక్టాక్ బ్యాన్ : ట్రంప్ ఊరట) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా గురించి సరైన సమాచారాన్నిఅందించకుండా దాచిపెట్టిందన్న ఆగ్రహం ఒకవైపు, మరోవైపు రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో చైనా కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలీబాబాపై నిషేధాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం దృష్టిలో చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు ఉన్నాయా అని ప్రశ్నించినపుడు ట్రంప్ ఈ సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో ఇతర కంపెనీల నిషేధం విషయాన్నికూడా పరిశీలిస్తున్నామన్నారు. కాగా టిక్టాక్ నిషేధం అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ట్రంప్..అమెరికాలో టిక్టాక్ వ్యాపారాన్ని ఏదేని అమెరికా కంపెనీకి విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని బైట్డాన్స్కు తేల్చి చెప్పారు. ఈ మేరకు విధించిన 45 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
విజయ్ని కావాలనే టార్గెట్ చేశారా !
పెరంబూరు : ఇళయదళపతి విజయ్ ఇప్పుడు చాలా మందికి టార్గెట్ అయ్యారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. సినీ రంగంలో విజయ్కు, అజిత్కు మధ్య పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిజ జీవితంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండడంతో కేవలం వృత్తిపరమైన పోటీనే కాబట్టి సమస్య లేదు. ఈమధ్య అన్నాడీఎంకే పార్టీ విజయ్ను టార్గెట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్ నటించిన తలైవా, కత్తి చిత్రాల విడుదల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన సర్కార్, ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ రోజు వరకూ అన్నాడీఎంకే ఆయనను టార్గెట్ చేసిందనే టాక్ ఉంది .(హీరో విజయ్ ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు) మెర్సెల్ చిత్రం విడుదల సమయంలోనూ బీజేపీ నాయకులు ఆ సినిమాను టార్గెట్ చేస్తూ.. చిత్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. తాజాగా ఆదాయపన్నుశాఖ దాడి.. బిగిల్ చిత్ర వ్యవహారంలో ఫిబ్రవరి 5,6 తేదీల్లో విజయ్కు చెందిన స్థానిక సాలిగ్రామం, పనైయూర్లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఆయన ఇళ్లలో కొన్ని డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత విజయ్కు సమన్లు పంపడం, ఆయన నేరుగా చెన్నైలోని ఆదాయపన్నుశాఖాధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటిది గురువారం మరోసారి విజయ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతా సక్రమమే ఈ సందర్భంగా నటుడు విజయ్ తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్ర సహ నిర్మాత లలిత్కుమార్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కాగా విజయ్ బిగిల్ చిత్రంలో నటించినందుకు గాను రూ.50 కోట్ల పారితోషికాన్ని, తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్రానికి రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తేలింది. ఈ రెండు చిత్రాల పారితోషికానికి నటుడు విజయ్ సక్రమంగా పన్ను చెల్లించినట్లు ఆదాయశాఖ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన్ని మిస్టర్ క్లీన్గా చేశారు. ఈ ఐటీ దాడుల వ్యవహారంలో విజయ్ ప్రవర్తించిన తీరు ఆయన పరిణితిని తెలియజేసింది. ఈ దాడుల గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. (విషం ఇచ్చి చంపేయమంటున్నారు! ) కాగా ఐటీ అధికారులు విజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడంతో సినీ నటి, కాంగ్రెస్స్ పార్టీ జాతీయ ప్రచార కర్త ఖష్భూ స్పందించారు. 'ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్కు క్లీన్చిట్ ఇచ్చారు కాబట్టి ఇక ఈ వ్యవహారానికి విశ్రాంతి ఇచ్చేద్దామా? ' అని ట్విటర్లో పేర్కొన్నారు. విజయ్ తన పనిని తాను కామ్గా చేసుకుపోతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనన్న చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో తాను నటించనున్న కొత్త చిత్రం గురించి వెల్లడించనున్నారు. -
టీమిండియా టార్గెట్ 173 పరుగులు..
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో పాక్ జట్టు టీమిండియాకు 173 పరుగులను విజయలక్ష్యంగా నిర్ధేశించింది. భారత బౌలర్ల దాటికి పాక్ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. ఆది నుంచే టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును ఒక ఆట ఆడుకున్నారు. దీంతో పాక్ జట్టులో ముగ్గురు బ్యాట్సమెన్ తప్ప మిగతావారెవరూ రెండెంకల స్కోరు నమోదు చేయలేకపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారనేది అర్థమవుతుంది. పాక్ బ్యాట్సమెన్లలో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్సమెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా , రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైస్వాల్లు ఒక్కో వికెట్ తీశారు.(పాక్ పనిపడుతున్న టీమిండియా బౌలర్లు) -
బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం
సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సైజ్ శాఖ సానుకూలంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు కఠినంగా ఉన్నారు. దీంతో ఇరుశాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మూసి ఉన్న బెల్టుషాపులను పునఃప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్వాహకులకు అనధికారికంగా సూచించిగా ఒక రోజు దుకాణాలు తెరిచారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బెల్టుషాపులకు తాళాలు పడ్డాయి. ఇలా బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్, పోలీసు శాఖలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు 95 ఉన్నాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని మద్యం దుకాణాలను మినహాయించి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష మద్యం విక్రయిస్తే బెల్టు షాపులకు తరలించిన మద్యం ద్వారా అదనంగా రూ.రెండు లక్షల గిరాకీ పెరుగుతుంది. బెల్టుషాపుల ద్వారానే అత్యధికంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అనధికార సూచనలు! ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడానికి ఐఎంఎల్ డిపోల నుంచి వ్యాపారులు మద్యం కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగాలంటే బెల్టుషాపులు ప్రధానం అని భావించిన ఎక్సైజ్ అధికారులు లైసెన్స్డ్ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగించడానికి అనధికార అనుమతి ఇచ్చారు. ‘దిశ’ ఘటన మద్యం మత్తులో జరిగిందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాలను మూయించే అధికారం లేకపోవడంతో పోలీసులు బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బెల్టుషాపులను మూయించడానికి ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు పదిహేను రోజుల నుంచి బెల్టుషాపులను పోలీసుల ఆదేశాలతో నిర్వాహకులు మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉండటంతో మద్యం అమ్మకాలు అనుకున్నంత సాగడం లేదని వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు వివరించారు. తాము పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు బుధవారం బెల్టుషాపులను తెరిచారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం నుంచి మళ్లీ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉంచడంతో ఐఎంఎల్ డిపోల నుంచి ఎక్కువ మొత్తం మద్యం కొనుగోలు చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. అటు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్ నిర్ణయించడం, ఇటు బెల్టుషాపులు మూసి ఉండటంతో ఎక్సైజ్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మద్యం అమ్మకాల విషయంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం చర్చనీయాంశం అయింది. మాకు టార్గెట్ ఉంది మద్యం దుకాణాల ద్వారా నిర్ణీత లక్ష్యం మేరకు మద్యం అమ్మాలని టార్గెట్ నిర్ణయించారు. లైసెన్స్డ్ వ్యాపారులు ఐఎంఎల్ డిపోల నుంచి టార్గెట్ ప్రకారం మద్యం కొను గోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో మద్యం అమ్మకాలు తగ్గడం మాకు కొంత ఇబ్బందే. – శేఖర్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మోర్తాడ్ -
ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ కొత్త లీడర్పైనే అమెరికా దృష్టి సారించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడో..’అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త టార్గెట్ పేరుని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఉగ్రసంస్థ చీఫ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీని గత నెలలో అమెరికా కమాండోలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్థానంలోకి వచ్చిన అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషీనే అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘అమెరికా అల్ బాగ్దాదీని అంతం చేసింది. అతని తర్వాతి వ్యక్తి (నంబర్–2)ని కూడా మట్టుబెట్టింది. ఇప్పుడు మిగిలిన నంబర్–3పైనే మా దృష్టంతా.. అతనికి చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు కాబట్టి..’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
కరీంనగర్లో టార్గెట్ గులాబీ!
సాక్షి , కరీంనగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన కరీంనగర్లో అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా కరీంనగర్ లోక్సభ సీటును గెలుచుకున్న కమలనాథులు ఇక్కడ లీడర్లు, క్యాడర్తో బలమైన శక్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బ కొట్టాలనే ఏకైక ఎజెండాతో అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంథని మినహా 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా, మండల పరిషత్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో గ్రామస్థాయి వరకు పటిష్టంగా ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన బలంతో ఉన్న బీజేపీ తొలుత రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో శక్తిని చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. 2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యం అని చెబుతున్న కాషాయ నేతలు అందుకోసం గ్రామస్థాయి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ బండి సంజయ్కుమార్ ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నర్గా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి బీజేపీలో చేరిన కరీంనగర్ మాజీ ఎంపీ సీహెచ్.విద్యాసాగర్రావును కూడా త్వరలో సీన్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ‘సాగర్జీ’ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతుందనే ప్రచారం కూడా ఓ వర్గం ప్రారంభించింది. మూడంచెల వ్యూహంతో టీఆర్ఎస్పై దాడి.. పార్టీని బలోపేతం చేసుకుంటూనే, టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రణాళికాబద్ధంగా పలచన చేయడం కోసం మూడంచెల వ్యూహాన్ని కరీంనగర్ నుంచే అమలు చేయాలని కమలనాథులు నిర్ణయించుకున్నారు. అందులో మొదటిది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇతర పార్టీల్లో పేరున్న నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులను బీజేపీలో చేర్చుకోవడం. రెండోది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేస్తూ అవినీతి, అక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయడం, మూడోది బూత్స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం. త్రివిధ మార్గాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో మొదటి వ్యూహంగా ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాక అసంతృప్తితో ఉన్న పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్, అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాషాయ తీర్థం పుచ్చుకోగా, మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య కూడా ఆపార్టీలో చేరారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్కు చెందిన కరీంనగర్ మాజీ మేయర్ డి.శంకర్, కన్న కృష్ణ, పి.భూమయ్య, సాయికృష్ణతోపాటు పలువురు నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మరికొందరు మాజీ కార్పొరేటర్లను, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మరికొందరు ముఖ్య నాయకులను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే టార్గెట్గా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపీ సంజయ్ మంత్రులు, శాసనసభ్యులను టార్గెట్ చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2009లో వెలుగు చూసిన గ్రానైట్ సీనరేజి అంశాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులకు గ్రానైట్ వ్యాపారంతో సంబంధం ఉందని, వందల కోట్ల సీనరేజీని ప్రభుత్వానికి ఎగ్గొట్టారని విమర్శిస్తూ పలు వేదికలపై మాట్లాడుతున్నారు. ఈ మేరకు విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. గురువారం సిరిసిల్లలో నలుగురు మంత్రులకు ఈ అవినీతి, అక్రమాలతో సంబంధం ఉందని మీడియా సమక్షంలో ఆరోపించారు. అయితే ఇది పాత సమస్య కావడంతో టీఆర్ఎస్ నేతలు కూడా దీటుగానే ప్రతివిమర్శలు చేస్తున్నారు. సంజయ్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు ప్రారంభించారు. స్వయంగా మంత్రి గంగుల కమలాకర్ సైతం సంజయ్ను విమర్శించడం గమనార్హం. గ్రానైట్ సమస్యతోపాటు స్మార్ట్సిటీ టెండర్ల అంశాన్ని సంజయ్ ఇప్పటికే లేవనెత్తగా, ఇతర ప్రాజెక్టుల్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల జోక్యం, కాంట్రాక్టర్లతో సంబంధాలు అనే కోణంలో జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే పెద్ద సమస్య పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ హవా ప్రధాన పాత్ర పోషించగా, సంజయ్పై ఉన్న సానుభూతి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పనిచేసింది. కొన్నేళ్లుగా పార్టీలో నెలకొన్న స్తబ్దతతో ఉమ్మడి జిల్లాలో 2004 వరకు ఉన్న కేడర్ కూడా చెల్లాచెదురైంది. మండలస్థాయిల్లో సరైన నాయకత్వం లేదు. నియోజకవర్గాలస్థాయి నాయకులుగా చలామణి అవుతున్న నాయకులకు ప్రజలతో సంబంధాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో వలస నాయకులపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన గుజ్జుల రామకృష్ణారెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ దక్కలేదు. టీఆర్ఎస్ నుంచి టికెట్టు రాక బీజేపీ నుంచి పోటీ చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభకు పెద్ద పరాభవం ఎదురైంది. దీనికి కారణం బీజేపీకి క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడమే. ఇప్పుడు పార్టీలో చేరుతున్న నాయకులు టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా భావించి వస్తున్నవారే తప్ప బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే విధానం తెలిసిన వారు కాదు. ఈ పరిస్థితుల్లో తొలుత కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు ఇతర మునిసిపాలిటీల్లో పేరున్న నాయకులను పార్టీలో చేర్చుకుని తద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ వ్యూహం విజయవంతమైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా అమలు చేయాలనేది వ్యూహం. -
టార్గెట్ 2020
-
పిల్లలను చేర్చితేనే జీతాలు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు హద్ధు అనేది లేకుండా పోతోంది. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగా అడ్మిషన్లు చేపట్టడం సాధారణమే అయినా ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అవలంభిస్తున్న తీరుతో బోధన, బోధనేతర సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ పాఠశాలలకు, జూన్ మొదటి వారం వరకూ జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే గత విద్యాసంవత్సరం ముగిసి, సెలవులు మొదలైన ఏప్రిల్ 24 నుంచి ఉపాధ్యాయులతో పాటు అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా అడ్మిషన్ల పేరుతో ఇంటింటికీ పంపడం ప్రారంభించారు. బోధన, బోధనేతర సిబ్బందికి వారి స్థాయి, హోదాను బట్టి టార్గెట్లు విధించి, అడ్మిషన్ తెస్తేనే వేతనం, లేకపోతే చివాట్లు పెట్టే పద్ధతి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో బీఈడీ, డీఎడ్, ఎంఈడీ, ఎమ్మెస్సీ విద్యార్హతలు కలిగిన విద్యావంతులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను సాధించలేక, విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలను చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఎంతటి పని భారాన్నైనా తట్టుకుని వెళుతుండగా, ఏడాదిలో 10 నెలలు సజావుగా సాగుతున్న పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో వారికి గడ్డు కాలం ఎదురవుతోంది. మే నెలలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం అడ్మిషన్లు చేసిన వారికే జూన్ నెలలో వేతనం ఇస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్యాంపస్లు కలిగి ఉన్న శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్నారై అకడమీ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అడ్మిషన్ల వేటలో సమిధలుగా మారుతున్నారు. మండు టెండల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు తమ విద్యాసంస్థల ప్రగతి గురించి వివరించి, కరపత్రాలు, బ్రోచర్లు ఇచ్చి వస్తున్నారు. అడ్మిషన్ కోసం వెళ్లిన సమయంలో అడ్మిషన్ ఖరారు చేసేందుకు కొంత మొత్తం ఫీజును వసూలు చేసేందుకు తల్లిదండ్రుల కాళ్లా, వేళ్లా పడి ప్రాధేయపడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల వంటి పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఈ విధంగా అడ్మిషన్ల డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ తిరుగుతూ భద్రత లేని ఉద్యోగం చేస్తున్నారు. ఎండల కారణంగా సాయంత్రం 7.00 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి అడ్మిషన్లు కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇటీవల గుంటూరు నుంచి చౌడవరం గ్రామానికి అడ్మిషన్ల కోసం వెళ్లిన ఓ ఉపాధ్యాయిని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై, ఆస్పత్రి పాలైంది. అడ్మిషన్ పేరుతో తెస్తున్న అధిక ఒత్తిడి భరించలేక నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు పక్షవాతానికి గురై మంచం పట్టారు. ఆయా క్యాంపస్లలో ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఏజీఎం, డీజీఎంల వరకూ ఎవరి స్థాయిలో వారు అడ్మిషన్ల కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తుండటంతో సిబ్బంది ఉద్యోగం మానేస్తున్నారు. అడ్మిషన్ తెస్తేనే జీతం చెల్లిస్తామని, లేకుంటే లేదని బెదిరిస్తున్న సంఘటనలపై బయటకు చెప్పుకోలేక ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో తీవ్ర కలత చెందుతున్న మధ్య తరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరే దారి లేక, ఒక్కో సారి తల్లిదండ్రులు పెడుతున్న చివాట్లను భరిస్తున్నారు. ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదు అడ్మిషన్లు చేస్తేనే జీతం, సెలవులు ఇస్తామని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి. ప్రస్తుతం మే నెల వేతనం చెల్లించే పరిస్థితులు లేవని కార్పొరేట్ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు మా దృష్టికి తెచ్చారు. తీవ్రమైన పని ఒత్తిడితో భద్రత లేని ఉద్యోగాలను చేస్తుండగా, మరో వైపు అడ్మిషన్ల కోసం టార్గెట్లు విధించి వేధిస్తున్నారు. పీఆర్వోల చేత చేయించాల్సిన అడ్మిషన్లను బోధన, బోధనేతర సిబ్బందితో చేయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై గతంలో ధర్నాలు, ఆందోళనలు చేసి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.– వానపల్లి సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ -
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం!
సాక్షి, తిరువూరు : తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం సమీపంలోని ఒక నివాసంలో చోరీ జరిగింది. అటవీశాఖలో పనిచేస్తున్న పెరికె మోహినీ విజయలక్ష్మి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చా రు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో తమ నివాసంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. మూడు రోజులుగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల నగదు, 300 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విలువైన దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం చోరీకి గురయ్యాయి. క్లూస్ టీం దర్యాప్తు మచిలీపట్నం క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ ప్రాథమిక సమాచారం సేకరించిన అనంతరం తిరువూరు సర్కిల్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా అగంతకులు చోరీలకు పాల్పడుతున్నందున ముందస్తు బందోబస్తు కల్పించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, గుర్తుతెలియని వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసుస్టేషనుకు సమాచారం అందించాలని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
‘ఆ లక్ష్యం నెరవేరాలంటే రూ లక్ష కోట్లు అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముద్ర రుణాల లక్ష్యం రూ 3 లక్షల కోట్లకు చేరువ కావాలంటే కేవలం ఒక నెల వ్యవధిలో బ్యాంకులు రూ లక్ష కోట్ల మేర ఈ తరహా రుణాలను జారీ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 22వరకూ బ్యాంకులు రూ 2 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇప్పటివరకూ 3.89 కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 2018-19 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాంతానికి రూ 3 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు ముద్ర రుణాల పంపిణీలో లక్ష్యాలను అధిగమించాయి. 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన ముద్రా రుణ పథకం కింద వ్యవసాయేతర చిన్న పరిశ్రమలకు గరిష్టంగా రూ పది లక్షల వరకూ రుణాలను అందచేస్తారు. ముద్ర పథకం కింద ఇప్పటివరకూ రూ 7.23 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని 2019-20 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
గంటాను భీములి నుంచి తప్పించేందుకు బాబు స్కెచ్
-
29 ప్రాంతాలు టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. మొత్తం 29 ప్రాంతాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందనే సమాచారం నిఘా సంస్థలకు అందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనే సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. టార్గెట్ జాబితాను విడుదల చేసిన అధికారులు ప్రజలకు, రాజకీయ నాయకులకు పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలతో పాటు, రిటైర్డ్ ఆర్మీ, పోలీసు అధికారుల నివాసాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి...(అభినందన్ విడుదలపై మరో మలుపు) టార్గెటెడ్ ప్రాంతాలు: 1. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 2. సేనా భవన్, 3. ఇస్రాయిల్ ఎంసీ 4. యూకే, యూఎస్ఏ ఎంబసీ 5. ఇండియా గేట్ 6. ప్రధాన న్యాయమూర్తి నివాసం 7. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియా 8. రాష్ట్రపతి భవన్ 9. ఢిల్లీ రైల్వే స్టేషన్, 10. ఢిల్లీ యూనివర్సిటీ 11. ఎయిమ్స్ 12. అక్షర్ధామ్ టెంపుల్ 13. రెడ్ ఫోర్ట్ పరిసరాలు 14. పార్లమెంట్ 15. విదేశాంగ శాఖ కార్యాలయం 16. ఐఐటీఎఫ్ 17. మెయిన్ బజార్(పహర్ గంజ్) 18. మాల్స్, సినిమా హాల్స్ 19. విదేశాలకు చెందిన ఎంబసీ అధికారులు పర్యటించే ప్రదేశాలు 20. దిల్లీ హాట్, ఐఎన్ఏ మార్కెట్ 21. పలికా బజార్ 22. చాందినీ చౌక్ 23. సరోజని నగర్ మార్కెట్ 24. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు 25. లక్ష్మీనారాయణ్ టెంపుల్ 26. లోటస్ టెంపుల్ 27. మెట్రో రైల్ నెట్వర్క్ 28. కుతుబ్ మినార్ 29. రెడ్ ఫోర్ట్ -
ఐసిస్ హిట్ లిస్ట్లో పోలీస్స్టేషన్..?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) రాజధానిలోని పోలీసుస్టేషన్ను టార్గెట్ చేస్తోందా..? ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. 2016లో సిటీలో చిక్కిన దీని అనుబంధ సంస్థ జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్) ఉగ్రవాదులు ఠాణాలను టార్గెట్ చేసినట్లు అప్పట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. దీనికి కొనసాగింపుగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వా్కడ్ (ఏటీఎస్) టీమ్ పట్టుకున్న ఐసిస్ ఉగ్రవాదులు ఒబేద్ మీర్జా, ఖాసిం స్టింబర్వాలా విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏటీఎస్ అధికారులు నోరు మెదపట్లేదు. రాష్ట్ర పోలీసు వర్గాలు సైతం ధ్రువీకరించకుండా గోప్యంగా ఉంచుతున్నాయి. జేకేబీహెచ్ విఫలం కావడంతో... నగరానికి సంబంధించి షఫీ ఆర్మర్ 2016లో రెండు మాడ్యుల్స్ను తయారు చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర చేశారు. ఈ రెండు ముఠాలను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఆ ఏడాది జూన్లో చిక్కిన జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్) మాడ్యుల్లో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఇబ్రహీం నేతృత్వంలో పని చేసిన ఈ గ్యాంగ్లో రిజ్వాన్ ఒకడు. అప్పట్లో హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేయాలని సూచించిన షఫీ ఆర్మర్ వాటిలో పోలీసుస్టేషన్లు సైతం ఉండాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే 10 ఠాణాల వద్ద రెక్కీ నిర్వహించిన రిజ్వాన్ ‘మాల్ తయ్యార్ హై’ (సరుకు సిద్ధంగా ఉంది) అంటూ షఫీ ఆర్మర్కు ఆన్లైన్ సందేశం కూడా పంపాడు. ఈ పథకం అమలు కావడానికి కొన్ని రోజుల ముందే మాడ్యుల్ మొత్తాన్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో షఫీ ఆర్మర్ టార్గెట్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే అతను గుజరాత్కు చెందిన ఒబేద్, ఖాసింల హిట్ లిస్ట్లో రాజధానిలోని ఠాణాను చేర్చినట్లు తెలుస్తోంది. సూరత్కు చెందిన ఖాసిం అంకలేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో ల్యాబొరేటరీ సూపర్వైజర్గా పని చేస్తుండగా... ఒబేద్ వృత్తిరీత్యా లాయర్ కాగా ఇతడికి అంకలేశ్వర్లోని వేసు ప్రాంతంలో దావత్ అనే రెస్టారెంట్ సైతం ఉంది. ఆయుధాలతో పాటు విషప్రయోగం... ఒబేద్, ఖాసింలకు టార్గెట్లు అప్పగించిన షఫీ ఆర్మర్ రోటీన్కు భిన్నమైన విధానంలో హిట్ చేయాల్సిందిగా సూచించాడు. రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి సంగ్రహించిన ఆయుధాలతో పాటు విషప్రయోగంతోనూ బీభత్సం సృష్టించాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వీరు ‘బీ–18’ అనే విషపదార్థం వినియోగంపై అధ్యయనం చేశారు. దీనిని ప్రయోగించడం ద్వారా టార్గెట్ గుండె ఆగి చనిపోతాడని, కొన్ని గంటలకే శరీరం నుంచి దీని ఆనవాళ్లు తొలగిపోవడంతో పోస్టుమార్టం పరీక్షల్లోనూ మరణానికి కారణం తెలియదని దీనిని ఎంచుకున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. గత వారం అంకెలేశ్వర్ న్యాయస్థానంలో వీరిద్దరి పైనా అభియోగపత్రాలు దాఖలు చేసింది. వీరు హైదరాబాద్లోని ఠాణాను టార్గెట్ చేసినట్లు పేర్కొంటున్న ఏటీఎస్ అధికారులు అది ఏ పోలీసుస్టేషన్ అనేది స్పష్టం చేయట్లేదు. దీనిపై రాష్ట్ర పోలీసు వర్గాలు మాత్రం తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపాయి. 2016లో చిక్కిన జేకేబీహెచ్ మాడ్యుల్లో వీరు పరోక్షంగా పాత్రధారులై ఉండవచ్చని, అప్పటి ‘టార్గెట్ ఠాణా’నే కొనసాగిందని అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారం ఉంటే గుజరాత్ పోలీసుల ద్వారా విషయం తెలుసుకునే నిఘా వర్గాలు హెచ్చరిస్తారని చెబుతున్నారు. ‘ఆ నలుగురి’కీ స్ఫూర్తి వీరే... గుజరాత్ ఏటీఎస్ అధికారులు గతేడాది అక్టోబర్ 25న అక్కడి అంకెలేశ్వర్ ప్రాంతంలో ఒబేద్, ఖాసింలను పట్టుకున్నారు. సిరియా కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతూ సోషల్మీడియా ద్వారా రిక్రూట్మెంట్స్ చేపడుతున్న షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు పని చేస్తున్న వీరికి సిటీకి చెందిన నలుగురు యువకులతోనూ లింకులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరంలోని దక్షిణ మండలానికి చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేని, మాజ్ హసన్ ఫారూఖ్లు కాశ్మీర్ మీదుగా సిరియా వెళ్లాలనే ప్రయత్నాల్లో 2016లో నాగ్పూర్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దీనికి రెండేళ్ల ముందు 2014లో బాసిత్తో పాటు మాజ్ హసన్, అబ్రార్, నోమన్ కోల్కతా మీదుగా బంగ్లాదేశ్ చేరుకుని అట్నుంచి సిరియా వెళ్లడానికి ప్రయత్నించగా, వీరిని కోల్కతాలో గుర్తించిన నిఘా వర్గాలు వెనక్కు తీసుకువచ్చాయి. ఈ నలుగురినీ సరిహద్దులు దాటేందుకు ప్రోద్భలం ఇచ్చింది ఒబేద్, ఖాసిం అని తేలింది. ఆన్లైన్ ద్వారా షఫీ ఆర్మర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వీరిద్దరూ సిటీకి చెందిన నలుగురినీ రిక్రూట్ చేసి సరిహద్దులు దాటించేందుకు యత్నించారు. 2014లో వీరిని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుజరాత్ ద్వయం వాంటెడ్గా మారలేదు. -
హోండా విస్తరణ వ్యూహాలు : బైక్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో టూ వీలర్ దిగ్గజానికి షాకిచ్చేలా దూసుకుపోతోంది. వచ్చే ఏడాది నాటికి డబుల్ డిజిట్ గ్రోత్ సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ .800 కోట్ల పెట్టుబడులతోపాటు వరుసగా మూడేళ్ల పాటు రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ మనోరు కటో మంగళవారం తెలిపారు. త్వరలోనే ఒక కొత్త ప్రొడక్ట్ను ప్రారంభిస్తామన్నారు. దీంతో తమ ఉనికిని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతామన్నారు. అలాగే ఈ ఏడాదిలో 18 ఇతర ఉత్పత్తులను అప్గ్రేడ్ చేస్తామని ఆయన ప్రకటించారు. 2018-19 నాటికి, గత ఆర్థిక సంవత్సరంలో 5,700 అవుట్లెట్ల నుంచి 6వేల టచ్ పాయింట్స్ను పెంచుతామని తద్వారా విక్రయాల నెట్వర్క్ను విస్తరించాలని యోచిస్తోంది. అయితే 2020 నాటికి టూవీలర్ ఇండస్ట్రీ బీఎస్-6 ఎమిషన్ నిబంధనలకు అప్గ్రేడ్తో ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బైక్లపై భారీగా ధర తగ్గింపు మరోవైపు ఫ్లాగ్షిప్ సూపర్బైక్ మోడళ్లపై ధరలను భారీగా తగ్గించింది. సీబీఆర్1000ఆర్ఆర్ ఫైర్బ్లేడ్ మోడల్స్పై రూ. 2.5లక్షల వరకు ధరను తగ్గించినట్లు హోండా తెలిపింది. దిగుమతి చేసుకునే పూర్తిగా నిర్మితమైన యూనిట్ల(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్)పై సుంకాన్ని 25శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకే బైక్లపై ధరలను తగ్గించినట్టు చెప్పింది. సవరించిన ధరల ప్రకారం.. హోండా సీబీఆర్1000ఆర్ఆర్ మోడల్ ధర రూ. 16.79లక్షల(ఎక్స్షోరూం దిల్లీ) నుంచి రూ. 14.78లక్షలకు (ఎక్స్షోరూం దిల్లీ) పడిపోయింది. ఇక సీబీఆర్1000ఆర్ఆర్ ఎస్పీ మోడల్ ధర రూ. 21.22లక్షల(ఎక్స్షోరూం దిల్లీ) నుంచి రూ. 18.68లక్షలకు(ఎక్స్షోరూం దిల్లీ) తగ్గింది. ఈ న్యూ జెనరేషన్ ఫైర్బ్లేడ్ మోడళ్లను హోండా గతేడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బీఎండబ్ల్యూ, డుకాటి, సుజుకీ, హర్లీ డేవిడ్సన్, యమహా కూడా తాము దిగుమతి చేసుకుంటున్న సీబీయూ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి 2018 ఆర్థిక సంవత్సరంలో, హోండా అమ్మకాలు 22శాతం పెరుగుదల నమోదు చేసింది. 6.12 మిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతేకాదు 7.59 మిలియన్ యూనిట్ల విక్రయాలతో 2016-17 లో ప్రధాన ప్రత్యర్థి హీరో మోటోను అధిగమించింది. దేశంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీదారుగా ఉన్న సంస్థ దేశంలో 50శాతం స్కూటర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని మనేసర్లో, రాజస్థాన్లోని తపుకారాలో, కర్ణాటకలోని నరస్పురా, గుజరాత్లోని విఠలాపూర్లలో ప్రస్తుతం నాలుగు కర్మాగారాలలో 6.4 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. -
ఐపీఎల్.. బెట్టింగ్ ఫుల్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో బెట్టింగ్రాయుళ్లు పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ల కోసం జిల్లాలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 7 నుంచి మే 27 వరకు ఫైనల్ మ్యాచ్తో సహా 60 మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ 11వ ఎడిషన్ 51 రోజుల పాటు జరగనుంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు సమాయాత్తం అవుతున్నారు. జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతాయి. నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. దీనికోసం బుకీలు అపార్ట్మెంట్లు, లాడ్జీలు వేదికగా చేసుకుని పెద్దెత్తున బెట్టింగ్లు నిర్వహిస్తారు. ఐపీఎల్ పేరుతో జిల్లాలో రూ.వందల కోట్లకు పైగానే చేతులు మారే అవకాశం ఉంది. క్రికెట్ బుకీలు ప్రధానంగా యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. యువత టార్గెట్గా.. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, గణపవరం, ఉండి, ఏలూరు, నరసాపురం కేంద్రాలుగా చేసుకుని బెట్టింగ్లు జరుగుతాయి. అక్కడ బుకీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సబ్బుకీలు బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. భీమవరం, తణుకు నుంచి నేరుగా ముంబైతో సంబంధాలు ఏర్పాటుచేసుకుని పెద్దెత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్కు, ప్రతి ఓవర్కు ఇంతని బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. విలాస జీవితానికి అలవాటుపడిన యువతను టార్గెట్ చేసుకుని క్రికెట్ బుకీలు పెద్దెత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తమను ఎవరూ ఏం చేయలేరని, ఇప్పటికే అధికారులను ‘మేనేజ్’ చేసుకున్నామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. సాంకేతిక దన్నుతో.. గతంకన్నా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు రావడంతో బెట్టింగ్ రాయుళ్లకు సులభతరమైంది. గతంలో టీవీలు, సెల్ఫోన్లు, లాప్టాప్లు ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. తాజాగా జియో నెట్వర్క్, హాట్స్టార్ అనే యాప్, ఐపీఎల్ కోసం ప్రత్యేక యాప్లు రావడంతో క్రికెట్ బెట్టింగ్ మరింత సులభతరమైంది. అంతేగాక ఆన్లైన్ అకౌంట్ల ద్వారా బెట్టింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హాట్ స్టార్ యాప్ ద్వారా లైవ్ క్రికెట్ అతి తక్కువ రూపాయలతో అందిస్తుండటంతో దీనిని వినియోగించుకుని కూడా బెట్టింగ్లు జోరుగా సాగే అవకాశం ఉంది. మెట్టలో జోరుగా.. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం, మండలంలోని పుట్లగట్లగూడెం, లక్కవరం, జంగరెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, కామవరపుకోట, బయ్యనగూడెం, రామానుజపురం, యర్నగూడెం తదతర ప్రాంతాలు కేంద్రంగా పెద్దెత్తున క్రికెట్ బెట్టింగ్లు జరుగుతుంటాయి. జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి మండల, గ్రామీణ ప్రాంతాల బుకీలు సంబంధాలు ఏర్పాటు చేసుకుని బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు.. ఇదిలా ఉంటే కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు పొలాల్లో, అతిథి గృహాలను కేంద్రంగా చేసుకుని బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ పేరుతో యువత లక్షలాది రూపాయలు కోల్పోయి, ఆయా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఛిన్నాభిన్నం అవుతున్న దాఖలాలు ఉన్నాయి. గతంలో క్రికెట్ బెట్టింగ్లో లక్షలాది రూపాయలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. అయినా పట్టించుకున్న వారే లేరు. -
టార్గెట్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షిప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని టార్గెట్ చేసి మరోమారు పోలీసులు కక్షసాధింపు చర్యలకు తెరతీశారు. కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న ప్రతి సందర్భంలోనూ బెట్టింగ్ కేసుల్లో విచారణ అంటూ హడావుడిచేసి రాజకీయంగా ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తాజాగా బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డికి పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళ్లడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అది కూడా గతేడాది మార్చిలో నమోదైన ఓ కేసులో విచారణకు ఇప్పుడు పిలవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం 7.45 గంటకు నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసుల బృందం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటికి వెళ్లారు. ఉదయం 7.30గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఉదయం 7.45 గంటలకు నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్.సుధాకర్, ఇన్స్పెక్టర్ల బృందం చిల్డ్రన్స్పార్కు రాంజీవీధి సాయి సౌజన్య హోమ్స్ అపార్ట్మెంట్లోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండోనగర పోలీసుస్టేషన్లో నమోదైన 54/2017కేసులో 7.30 గంటలకు బాలాజీనగర్ పోలీసుస్టేషన్లో విచారణకు హాజరుకావాలని 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు. దీనిపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.30గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొని 7.45 గంటలకు నోటీసు జారీచేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫోన్ చేసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఓ పథకం ప్రకారమే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిని తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇంతలో నగర డీఎస్పీ ఆదేశాల మేరకు నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. గంటసేపు మల్లగుల్లాలు పడిన పోలీసు అధికారులు గురువారం ఉదయం 9 గంటలకు విచారణ కోసం బాలాజీనగర్ పోలీసుస్టేషన్కు రావాలని రెండో నోటీసును జారీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేసు ఇదేనట గతేడాది మార్చి 22వ తేదీన నెల్లూరు తూర్పు రైల్వేక్వార్టర్స్లో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు అప్పటి రెండోనగర ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడిచేశారు. దాడిలో బెట్టింగ్ నిర్వాహకులైన జెండావీధికి చెందిన షేక్ రషీద్, రాజీవ్గృహకల్పకు చెందిన ఎ.శ్రీనివాసులతో పాటు పంటర్లు రవి, శివ, శ్రీకాంత్, ప్రభు, మనోజ్, వెంకి, రామారావు, జనార్దన్, సతీష్, గణేష్, అక్రమ్, అంకిత్, జ్ఞానయ్యపై 3అండ్4 ఏపీ గేమింగ్ యాక్ట్ కింద(ఎఫ్ఆర్నెం.54/17)కేసు నమోదు చేశారు. దాడి సమయంలో శ్రీనివాసులు దొరకడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి పలువుర్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఏడాది అనంతరం సదరు కేసులో మీ ప్రమేయం ఉందంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి నోటీసులు జారీచేయడం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసు నిర్వహించిన సీఐ బదిలీపై వెళ్లిపోయారు. అప్పుడు ఎస్పీగా విశాల్గున్నీ ఉన్నారు. ఏడాది తర్వాత కేసులో ప్రమేయం ఉందని పేర్కొనడం వెనుక పోలీసులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఓ పథకం ప్రకారం ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే ఆమరణదీక్షకు కోటంరెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో గురువారం ఎమ్మెల్యేను విచారించడానికి వీలుగా పోలీసులు నోటీసులు జారీచేశారు. కక్షసాధింపు చర్యలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే తన అనుచరులతో బుధవారం సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక, ప్రస్తుతం రాజ్యసభ నామినేషన్ల సమయంలో కేసుల్లో విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొన్న ఎమ్మెల్యే గురువారం విచారణకు హాజరయ్యేది లేదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అం దులో భాగంగా తన కార్యాలయంలో కార్యకర్తలతో ఉండనున్నట్లు తెలిసింది. పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తే కార్యాలయం నుంచే ఆమరణదీక్షకు పూనుకోనున్నట్లు తెలిసింది. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు క్రైం అడిషనల్ డీసీపీ బి.అశోక్కుమార్ తెలిపారు. కొత్తగూడెం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కేతిరి రాము అలియాస్ కేదారి పార్థు.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనలకు పాల్పడుతున్నాడని ఆయన తెలిపారు. నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. రాము ములకలపల్లి పరిసర గ్రామాల్లో చిక్కు వెంట్రుకలను అమ్ముకోవడం, కొనడం చేసేవాడు. 2007లో నిందితుడి తండ్రి మరణించడంతో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డాడు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో తన స్నేహితులతో కలిసి తొలిగిసారిగా విజయవాడ కృష్ణలంక, ఖమ్మం, ఇల్లందు, మహబుబ్నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ తీగను దొంగిలించాడు. 2008లో జైలుకు.. రాము తన స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ విజయవాడ, ఖమ్మం పోలీసుకుల చిక్కి 2008లో తొలిసారి జైలుకు వెళ్లాడు. విజయవాడ, మహబుబ్నగర్ జిల్లా పోలీసులు పలుమార్లు జైలుకు పంపారు. నిందితుడు రాము తిరిగి 2013 నుంచి 2017 వరకు చిక్కు వెంట్రుకల వ్యాపారం చేసి.. ఆ తర్వాత క్రమంగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2017 డిసెంబర్ నుంచి భూపాలపల్లి జిల్లా ములుగు పోలీస్స్టేషన్ పరిధిలో రెండు చోరీలు, వరంగల్ మామునూరు పీఎస్ పరిధిలో రెండు, పర్వతగిరిలో 2, కాజిపేట, స్టేషన్ఘన్పూర్ పరిధిలో 2 చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన సొమ్మును విక్రయించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు సిద్ధమయ్యాడు. కాగా బులియన్ మార్కెట్లో రాము అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కైం ఏసీపీ బాబురావుకు వచ్చిన సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డెవిడ్రాజ్ తన సిబ్బందితో వెళ్లి రామును అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన 512 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సీపీ అభినందనలు.. నిందితుడిని సకాలంలో గుర్తించి సొమ్మును రికవరీ చేసిన పోలీసులను సీపీ జి.సుధీర్బాబు అభినందించారు. అడిషనల్ డీసీపీ అశోక్కుమార్, ఏసీపీ బాబురావు, ఇన్స్పెక్టర్ డెవిడ్రాజ్, ఎస్సై బీవీ.సుబ్రహ్మణ్యేశ్వర్రావు, ఏఎస్సై వీరస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు శివకుమార్, సుధీర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, వంశీని సీపీ అభినందించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్
హనుమాన్జంక్షన్ రూరల్(గన్నవరం):ఇంజినీరింగ్ విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లో సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు, ఎస్సై వి.సతీష్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. నూజివీడు మండలం రాట్నాలగూడెంకు చెందిన జి.మనోజ్కుమార్, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నక్కా చిన్న వెంకటేశ్వరరావు కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల కిందట అనుమానాస్పదంగా సంచరిస్తున్న మనోజ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఆయన వద్ద ఆరు గంజాయి ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు. తదుపరి విచారణలో నక్కా చిన్న వెంకటేశ్వరరావు నుంచి నిషేధిత గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడించటంతో అతనిని కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు. వీరిద్దరి నుంచి ఒక కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రధానంగా హనుమాన్జంక్షన్, గన్నవరం, నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐదు గ్రాముల గంజాయి కలిగిన ఒక్కో ప్యాకెట్ను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు చెప్పారు. యువత అధికంగా గంజాయికి అలవాటు పడుతున్నారని, సిగిరెట్లలో గంజాయి నింపుకుని సేవిస్తున్నారన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని, గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేసుతో సంబంధం ఉన్న హనుమాన్జంక్షన్కు చెందిన కొందరు పెద్ద మనుషుల కుమారులను పోలీసులు తప్పించారని వస్తున్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా, సీఐ దీన్ని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కేసు విచారణ పూర్తి కాలేదని, ఇంకా లోతైన విచారణ సాగుతుందని తెలిపారు. -
మాటలు కలిపి..మత్తు మందు ఇచ్చి ...
వృద్ధులే టార్గెట్ పట్టుబడ్డ నిందితుడు రూ.ఆరు లక్షల సొత్తు స్వాధీనం అమలాపురం టౌన్ : బంగారు నగలు కాజేసేందుకు అతడి టార్గెట్ ఎప్పుడూ వృద్ధురాళ్లపైనే ఉంటుంది. బస్ స్టేషన్లలో, ఆటో స్టాండ్ల్లో 70 ఏళ్లు వయసు దాటి ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధులు ధరించే బంగారు నగలపై అతడి కన్ను పడుతుంది. ముందు మాటలు కలపి...తర్వాత బంధుత్వాలు చెప్పి...ఆపై మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్లు ఇచ్చి మత్తులోకి వెళ్లాక వారి ఒంటిపై బంగారు నగలు కాజేసి అదృశ్యమయ్యే కిలాడీ అతడు. అమలాపురం డివిజన్లో ఈ తరహాలో గత ఆరేళ్ల నుంచి అనేక నేరాలు చేస్తూ ఎందరో వృద్ధరాళ్ల నుంచి బంగారు నగలు కాజేసిన అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన కంఠంశెట్టి శ్రీనును అమలాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అతను చేసిన నేరాల చిట్టాను చెప్పించటమే కాకుండా రూ.ఆరు లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ అరెస్ట్ చేసిన నిందితుడు శ్రీనును ప్రవేశపెట్టి అతను నుంచి స్వాధీనం చేసుకున్న 203.5 గ్రాములు బంగారు నగలు, 67 గ్రాముల వెండి వస్తువులు, 83 మత్తు బిళ్లలను చూపించారు. నిందితుడు జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం ఇలా అనేక ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్టు తెలిపారు. సోమవారం ఉదయం అమలాపురంలోని నల్లా సూర్యచంద్రరావు ఘాట్ వద్ద శ్రీను బంగారు నగలు, మత్తు బిళ్లలతో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి విచారించగా నేరాలు అంగీకరించాడని తెలిపారు. రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు ఆరేళ్ల నుంచి నేరాలు చేస్తున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి అతడి నుంచి బంగారు నగలు రికవరీ చేసిన పట్టణ సీఐ శ్రీనివాస్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, హోంగార్డు సుందర అనిల్ను డీఎస్పీ ప్రసన్నకుమార్ అభినందించారు. వీరికి రివార్డులు ప్రకటించేందకు జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
టార్గెట్ లక్ష కోట్లు
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం ద్వారా ఖజానాను భారీస్థాయిలో నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఏడాదికి కనీసం రూ.లక్ష కోట్ల వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాక ఇందుకు అదనంగా పెట్రోలు, డీజిల్ అమ్మకాల ద్వారా రూ.30 వేల కోట్లను సమకూర్చుకోవాలని తహతహలాడుతోంది. ⇒ జీఎస్టీ వసూళ్లపై ప్రభుత్వ లక్ష్యం ⇒ పెట్రోలు, డీజిల్ ద్వారా అదనంగా రూ.30వేల కోట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై : జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నులశాఖ ద్వారా విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అమ్మకపు పన్ను, లగ్జరీ పన్ను, వినోదపు పన్ను, ప్రవేశపన్ను ఇలా అనేక పేర్లతో పన్నుల వసూళ్లు జరిగేవి. ఈ పన్నుల ద్వారా ప్రభుత్వాలు తమ ఆదాయాలను బేరీజు వేసుకునేవి. ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం పొందే ప్రతి వ్యాపార సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. ఆదాయ వ్యయాల వివరాలను ఏటా అందజేయాలి. వ్యాపారస్తులు అమ్మే అన్ని వస్తువులకు వివిధ స్థాయిలో పన్నులు విధించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకులకు ప్రవేశపన్ను విధించేవారు. తమిళనాడుకు సంబంధించి 5, 10.5, 14.5 శాతం పన్నులు వసూలు చేసేవారు. ఈ పన్నుల ద్వారా ప్రతి ఏడాది సగటున రూ.60 వేల కోట్ల వరకూ వసూలయ్యేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 70 శాతం వాణిజ్య పన్నుల ద్వారా అందేది. ఈ దశలో కేంద్రం ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా జీఎస్టీ కొత్త విధానాన్ని ఈనెల 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా 5, 12, 18, 28 శాతాలుగా నాలుగు రకాల పన్నులను ప్రవేశపెట్టారు. తమిళనాడు వరకు పరిశీలిస్తే ఇంతవరకు 8 రకాల పన్నులను వేర్వేరుగా విభజించి వసూలు చేసేవారు. ఇక జీఎస్టీ అనే పన్ను రూపంలో వసూళ్లు ఉంటాయి. ఇప్పటివరకు సరుకులకు రాష్ట్ర ప్రభుత్వమే పన్ను విధించేది. ఇకపై సర్వీసు టాక్సును సైతం రాష్ట్రప్రభుత్వం వసూలు చేయనుంది. ప్రతి ఒక్క పన్నులోనూ రాష్ట్ర పన్ను, కేంద్ర పన్ను అని విభజించనున్నారు. ముఖ్యంగా 18 శాతం పన్ను విధిస్తే చెరీ 9శాతం లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్యశాఖ నుంచే రూ.ఒక లక్ష కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఎవరూ తప్పించుకోలేరు రాష్ట్ర ప్రభుత్వ భారీ లక్ష్యంపై ఒక అధికారి మాట్లాడుతూ, 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.60,314కోట్లు, 2015–16లో రూ.61,709కోట్లు, 2016–17లో రూ.67, 576కోట్లు పన్ను వసూళ్లు సాధించినట్లు తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినందున 2016–17 రూ.79 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం వసూళ్ల లక్ష్యం పెట్టుకున్నా పన్నుల విధానంలో లొసుగులు, పన్నుల ఎగవేత వల్ల సాధించలేకపోయిందని తెలిపారు. జీఎస్టీ వల్ల ఎవరూ పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరని ఆయన చెప్పారు. తమిళనాడు పన్నుల వసూళ్లను ఇకపై ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్నందున ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకునట్లు ఆయన వివరించారు. జీఎస్టీ నుంచి పెట్రోలు, డీజిల్, మద్యం మినహాయింపుతో ఏడాదికి రూ.30వేల కోట్లు అదనంగా రాబట్టుకోవడం ఖాయమని వాణిజ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మూసేయండి
ఆకివీడు : ప్రాథమిక పాఠశాలల్ని మూసివేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట మూడేళ్లుగా బడులను మూసివేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాదీ అదే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 70కి పైగా ప్రాథమిక పాఠశాలల్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట బడుల మూతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 19 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిస్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. జెడ్పీ హైసూ్కళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలుగా మారుస్తారు. 6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40లోపు విద్యార్థులు ఉంటే.. వాటిని కూడా ప్రాథమిక పాఠశాల స్థాయికి తగ్గిస్తారు. జిల్లాలో 2,250 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. వాటిలో 70కి పైగా బడులను మూసివేస్తారని తెలుస్తోంది. ఇవి కాకుండా 50 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిని కుదించే అవకాశం ఉన్నట్టు అంచనా. ఉపాధ్యాయుల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 2016 డిసెంబర్ 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 20 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు. 21 నుంచి 60 లోపు పిల్లలుంటే ఇద్దర్లు, 60 మంది దాటితే ముగ్గురు ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి దానిని మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు. 80 నుంచి 131 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. ఈ మేరకు జీవో–29 జారీ కాగా.. దానికి అనుబంధంగా ఆర్సీ నంబర్ 4102తో మార్గదర్శకాలు సైతం వెలువడ్డాయి. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలతో కూడిన నివేదికలను ఈనెల 30న విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సదరు నివేదికల తుది పరిశీలన అనంతరం ఆయా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను జూన్ 1న అధికారికంగా ప్రకటిస్తారు. బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనను అందుబాటులోకి తెచ్చాక విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ స్థాయి నుంచి తరగతులు ఉండాలి. పాఠశాలలు మూసివేయడమనేది అవివేక చర్య. విద్య ఉమ్మడి వ్యవస్థగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకూడదు. దీనిని వ్యతిరేకిస్తున్నాం. – కె.రామలింగరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు, ఆకివీడు మండలం పాఠశాలల్ని కుదించడం దారుణం విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో ప్రభుత్వ పాఠశాలల్ని కుదించడం దారుణం. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలో 27వ స్థానంలో ఉంది. ఈ చర్యల వల్ల మరింత దిగజారుతుంది. నిరుపేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలల కుదింపు, ఎత్తివేత వంటి చర్యల్ని వెంటనే మానుకోవాలి. – పిల్లి జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్ జిల్లా శాఖ -
స్త్రీ నిధి రుణాల లక్ష్యం రూ.30 కోట్లు
మెప్మా పీడీ రత్నబాబు గొల్లప్రోలు : ఈ ఏడాది రూ.30 కోట్లు స్త్రీ నిధి రుణాలు మంజూరు చేయడం లక్ష్యంగా నిర్ణయించామని మెప్మా పీడీ కేవీకే రత్నబాబు తెలిపారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచి పట్టణంలోని 11 గ్రూపులు ఇంటింటా సర్వే చేపట్టి గ్యాస్కనెక్షన్ లేనివారిని గుర్తించాలన్నారు. జూన్ 2నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పట్టణంలో 1,370 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేనట్టు గుర్తించామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది రూ.15 కోట్లు స్త్రీనిధి రుణాలు ఇచ్చామని, ఈ సంవత్సరం రూ.30 కోట్లు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష7వేలు ఉండగా డ్వాక్రామహిళల ఆదాయం రూ.40వేలు మాత్రమేనన్నారు. సరాసరి ఒక్కో మహిళ నెలకు రూ.10వేలు సంపాదించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు గతేడాది రూ.150 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది రూ.180 కోట్లు ఇస్తామన్నారు. గొల్లప్రోలులో మెప్మానిధులు పక్కదోవ పట్టిన విషయంపై ఏజీఎం, మెప్మా కార్యాలయ సిబ్బందిని విచారిస్తామన్నారు. ఇప్పటికే తొమ్మిది గ్రూపులకు సంబంధించి నిధులు పక్కదోవ పట్టినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేస్తామన్నారు. కమిషనర్ టి.రాజగోపాలరావు, డీపీఎం ఐబీ కెనడీ, డీసీ రాజేంద్రకుమార్, టీఎంసీ శ్రావణ్ పాల్గొన్నారు. -
8 లక్షల హెక్టార్లు
- ఖరీఫ్ సాగు లక్ష్యం ఇదీ.. – ఇందులో వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లు – కంది 50 వేలు, పత్తి 46 వేలు, వరి 22 వేల హెక్టార్లు - అంచనా వేసిన వ్యవసాయ శాఖ అనంతపురం అగ్రికల్చర్ : జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్-2017లో జిల్లా వ్యాప్తంగా 8,01,675 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వర్షాధారంగా 7,43,902 హెక్టార్లు కాగా, నీటి వసతి కింద 57,773 హెక్టార్లుగా గుర్తించింది. ప్రధాన పంట వేరుశనగ 6,04,693 హెక్టార్ల విస్తీర్ణంలో వేసే అవకాశముందని అధికారులు నివేదిక తయారు చేశారు. గత ఐదేళ్లలో ఖరీఫ్లో సాగైన వివిధ రకాల పంటల విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సాగు లక్ష్యాలను అంచనా వేశారు. వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటలతో పాటు ఉల్లి, ఎండుమిర్చి, పొగాకు, చెరకు, పసుపు తదితర 25 రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని కూడా అంచనా వేశారు. అత్యధికంగా వేరుశనగ కాగా, ఆ తరువాత కంది 50 వేల హెక్టార్లు, పత్తి 46 వేల హెక్టార్లు, వరి 22 వేల హెక్టార్లు, మొక్కజొన్న 18 వేల హెక్టార్లు, జొన్న 12 వేల హెక్టార్లు, ఆముదం 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని భావిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే అనుకున్న ప్రకారం సాగు చేసే పరిస్థితి ఉంటుంది. లేదంటే పంటల విస్తీర్ణం తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గతంలోనూ పలుమార్లు స్పష్టమైంది. అనుకున్న ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపించి, సకాలంలో తొలకర్లు కురిస్తే సాధారణ సాగు విస్తీర్ణానికి కాస్త అటూఇటుగా పంటలు వేసే అవకాశం ఉంటుంది. గతేడాది కూడా 8.73 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణంగా అంచనా వేశారు. అననుకూల వర్షాల వల్ల సీజన్ ముగిసేనాటికి 7.72 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. గత నాలుగైదేళ్లుగా విస్తీర్ణం తగ్గుముఖం పట్టడంతో సాధారణ సాగు 9.05 లక్షల హెక్టార్ల నుంచి ప్రస్తుతం 8.01 లక్షల హెక్టార్లకు తగ్గించారు. ఐదేళ్ల కిందటి విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న పంటల విస్తీర్ణం కాస్త తగ్గింది. ఇదే తరుణంలో సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, ఉలవ, కంది, పత్తి పంటల విస్తీర్ణంలో కొద్దిగా పెరుగుదల కనిపించింది. అధికారిక నివేదిక ప్రకారం ఈ ఖరీఫ్లో పంటల సాగు అంచనా ఇలా... –––––––––––––––––––––––––––––––––––––––– పంట పేరు విస్తీర్ణం (హెక్టార్లలో) పంట పేరు విస్తీర్ణం (హెక్టార్లలో) –––––––––––––––––––––––––––––––––––––––– వరి 22,169 వేరుశనగ 6,04,693 జొన్న 12,560 సజ్జ 2,191 మొక్కజొన్న 18,768 రాగి 1,420 కొర్ర 3,217 ఉలవ 6,335 పెసర 6,357 మినుము 495 కంది 50,570 అలసంద 1,320 పత్తి 46,161 పొద్దుతిరుగుడు 5,058 ఆముదం 13,292 సోయాబీన్ 834 మిరప 3,343 ఉల్లి 1,952 చెరకు 112 పొగాకు 15 పసుపు 30 ఇతరత్రా .. 781 –––––––––––––––––––––––––––––––––––––––– -
కాంగ్రెస్ సభ్యత్వాల లక్ష్యం 4 లక్షలు
డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ కాకినాడ : జిల్లాలో నాలుగు లక్షల పార్టీ సభ్యత్వాలు చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తెలిపారు. స్థానిక కళావెంకట్రావు భవనంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు ఈనెల 15 నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. రెండు నెలలుగా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని చెప్పారు. దళితులు, మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. బీజేపీ, టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆదరణ చూపిస్తున్నారన్నారు. బూత్ స్థాయిలో 50 మంది చొప్పున సభ్యత్వాలు చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల దొరబాబు, అంకం గోపి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఎన్వీ శ్రీనివాస్, ఒంటెద్దు బాబి, గంగిరెడ్డి త్రినా«థ్, నియోజకవర్గాల పరిశీలకులు దుళ్ల ఏడుకొండలు, మచ్చా అప్పాజీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి అయితాబత్తుల సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం లేనివారే నిజమైన పేదలు
- బిషప్ పూల ఆంతోని - భక్తి శ్రద్ధలతో దివ్యసంస్కారాల దినం - జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు కర్నూలు సీక్యాంప్: ఎలాంటి లక్ష్యం లేకుండా జీవించే వాళ్లే నిజమైన పేద వారని అని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని అన్నారు. నగరంలోని బిషప్ చర్చిలో ఆదివారం ఫాదర్ కోల విజయరాజు ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య దివ్యసంస్కారాల దినం జరిపారు. నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లి, పత్తికొండ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని పూల ఆంథోని తన ప్రసంగంలో అన్నారు. లక్ష్యం లేకుండా బతికే వారే పేదలని, అంతే కానీ ధనం లేనివారు కాదన్నారు. జీవితం సముద్రం లాంటిదని, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని జీవించాలన్నారు. కార్యక్రమంలో క్రైస్తవులు దివ్యసంస్కారాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఫాదర్ జోజిరెడ్డి, లూర్ధయ్యబృందం, మరియ దళ సభ్యులు, యువకులు, సిస్టర్లు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ తీరును కడిగిపారేసిన కాగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కాగ్ భారీగా అక్షింతలు వేసింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీరుపై కాగ్ కడిగిపరేసింది. పట్టిసీమను ఓ ప్రతికూల ప్రాజెక్ట్గా కాగ్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్ట్పై ఖర్చు చేసిన దానికి, దాని వల్ల పొందే ప్రయోజనానికి మధ్య పొంతనే లేదని కాగ్ వెల్లడించింది. పోలవరం కుడికాల్వ, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండా పట్టిసీమ ప్రాజెక్ట్ను చేపట్టారని కాగ్ రిపోర్ట్ పేర్కొంది. పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే పట్టిసీమ పథకం చేపట్టడం మూలంగా ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది. పట్టిసీమ టెండర్ ప్రీమియం గరిష్ట పరిమితిని కూడా సడలించారని, అధిక ధరలతో టెండర్లను ఒప్పుకున్నారని.. దీని ద్వారా 199 కోట్ల అధనపు భారం పడిందని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. అవసరం లేకున్నా నిర్మాణ పద్ధతిని మార్చారని, దీని ద్వారా 106 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది. పైపుల మీద రాయితీ ఉన్నా.. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కాంట్రాక్టర్కు తిరిగి చెల్లించారని రిపోర్ట్ వెల్లడించింది. ఈపీసీ ఒప్పందాల్లో లేని నిబంధనల కారణంగా ప్రభుత్వం మరో రూ. 20.62 కోట్లు నష్టపోయిందని వెల్లడించింది. కాగ్ రిపోర్ట్లోని అంశాలు.. ► గురు రాఘవేంద్ర పులికనుమ ప్రాజెక్ట్లో 4.12 కోట్లు ప్రభుత్వం నష్ట పోయింది. పైపుల సామర్థ్యం తగ్గినా.. మిగులు అనేది ప్రభుత్వానికి దక్కకుండా పోయింది. సరైన నిర్వహన, శ్రద్ధ లేకపోవడం మూలంగా ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలు అందడం లేదు. ► పురుషోత్తపట్నం పంప్హౌస్ విషయంలో కాంట్రాక్టర్కు రూ. 1.57 కోట్ల అనుచిత లబ్ధి చేకూరింది. ► పుష్కర ఎత్తిపోతల పథకం కింద సరైన ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటైనా వాటిమీద కాంక్రీట్ పనులు పూర్తి కావడం లేదు. ప్రభుత్వం చెబుతున్న ఆయకట్టు టార్గెట్ను చేరుకోవడం లేదు. ► వ్యవసాయ మార్కెట్ యార్డ్ల పనితీరు ఘోరం. 99 మార్కెట్ యార్డ్లు తనిఖీ చేస్తే.. 90 చోట్ల ఎలాంటి లావాదేవీలు జరగలేదు. వీటిని పర్యవేక్షించడానికి సరైన యంత్రాంగం లేదు. మార్కెటింగ్ శాఖ వద్ద కనీస వివరాలు లేవు. ► హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 53లో పనుల పరిధి తగ్గినా ప్రభుత్వానికి డబ్బు మిగల్లేదు. రూ. 6.47 కోట్ల మిగులు ఖజానాకు చేరలేదు. ► హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 610లో కాంట్రాక్టర్కు లబ్ధి. రూ. 4.97 కోట్ల మేర అధిక చెల్లింపులు. ► వృద్ధాప్య పెన్షన్ల కోసం చేసిన దరఖాస్తులు లక్షల కొద్ది పెండింగ్లో ఉన్నాయి. వయో వృద్ధుల సంక్షేమం కోసం పెద్దగా నిధులు ఇవ్వడం లేదు. ► విశాఖలోని ప్రధాన వాణిజ్య ప్రాంతంలో భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించారు. దీని ద్వారా ప్రభుత్వానికి 63.89 లక్షల రూపాయల నష్టం. ► రెసిడెన్సియల్ స్కూళ్లకు ఆహారాన్ని తక్కువగా సరఫరా చేస్తున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేయడం లేదు. పర్యవేక్షణ అత్యంత పేలవంగా ఉంది. ► కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయడం లేదు. -
‘ఉపాధి’ వెతలు
- గిట్టుబాటు కాని ‘ఉపాధి’ కూలి - పెండింగ్లో రూ.10 కోట్ల వేతనాలు - ఇతర ప్రాంతాలకు కూలీల వలస - పూర్తికాని ఫారంపాండ్స్ లక్ష్యం జాబ్ కార్డులు ఉన్నవారు: సుమారు 8 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్న వారు: 1,05,000 మంది కర్నూలు(అర్బన్): ఉపాధి హామీ పథకం..లక్ష్యం నెరవేరడం లేదు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం..కూలి తక్కువగా ఉండడంతో ఉపాధి పనులపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కూలి ఎక్కువగా ఇస్తుండడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. జిల్లాలోని 36 కరువు మండలాలు ఉండగా.. ఇక్కడ కూలీలకు 150 రోజులు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే ఈ మండలాల్లో చేసిన పనులకు వేతనాలు చెల్లించడం లేదు. ఎండలు అప్పుడే మండి పోతున్నాయి .. గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. మండుతున్న ఎండల్లో కూలీలు పనులు చేయలేక పోతున్నారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, మంచినీటి సరఫరా కూడా అంతంత మాత్రంగా ఉంటోంది. పైగా అధికారులు ఫారంపాండ్స్పైనే ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి వర్షాలు పడకపోవడంతో భూమి గట్టిపడి తవ్వడం చాలా కష్టంగా మారింది. దీంతో కూలీలు కొంత సులభంగా ఉండే వంకలు, వాగులు, చెరువుల్లో పూడికతీత పనులకు వెళ్లేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫారంపాండ్స్ తవ్వేందుకు వీరు ముందుకు రావడం లేదు. జిల్లా సరిహద్దుల్లోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఇంకా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్లి పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య లక్షకు మించడం లేదు. పెండింగ్లో రూ.10 కోట్ల ఉపాధి బకాయిలు ... ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదు. ఈ బకాయిలు దాదాపు రూ.10 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి వేతనాలకు సంబంధించిన బడ్జెట్ను విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ అవుతున్న కారణంగా కూడా పలు సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనేక మంది కూలీలకు బ్యాంకు ఖాతాలు లేక పోవడం, ఒకవేళ ఖాతాలు ఉన్నా, వారి ఆధార్కార్డును అనుసంధానం చేయకపోవడం, ఎన్సీపీఐ డాటాలో సింక్ కాకపోవడం వల్ల దాదాపు రూ.3 కోట్లు వివిధ బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాల్లోనే మూలుగుతున్నట్లు తెలుస్తోంది. వారమంతా పనిచేసినా, వేతనాలు అందకపోవడం వల్ల రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన వారు ఉదయమే ట్రాక్టర్ల ద్వారా మన కూలీలను తీసుకువెళ్తున్నారు. 11 రోజుల్లో 9,992 ఫారంపాండ్స్ పూర్తి సాధ్యమేనా ... జిల్లాకు మొత్తం 80,329 ఫారంపాండ్స్ మంజూరు కాగా, 36,169 పనులు ప్రారంభించారు. ఇందులో 26,177 ఫారంపాండ్స్ పూర్తి అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 9,992 పనులను పూర్తి చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరుకు వీటిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంకా 11 రోజుల గడువులో వీటిని ఎలా పూర్తి చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూలి గిట్టుబాటు కాకపోవడం వల్ల కూడా ఈ పనుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని 150 నుంచి 200 గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ఆయా ప్రాంతాల్లోని సీనియర్ మేటీలే మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ కారణంగా పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. పైపెచ్చు సీనియర్ మేటీలను కూడా ఆయా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇందులో కూడా రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గుతోంది. రోజుకు రూ.200 ఇస్తున్నారు: మద్దయ్య, జి. శింగవరం ఏటవతల కొరివిపాడు, క్యాంపు తదితర గ్రామాల్లో మిరప తెంపేందుకు పోతే రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఉదయం 7 గంటలకు ట్రాక్టర్ మీద తీసుకుపోయి సాయంత్రం 3 గంటలకు తిరిగి ఊర్లో వదలి వెళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున నీడ పాటున చేసే పనులకు పోతున్నాం. కుటుంబంలో ఐదుగురు పనికి పోతే రోజుకు రూ.1000 వస్తోంది. నదీ తీర గ్రామాల్లోని కూలీలందరూ మిరప తెంపేందుకే పోతున్నారు. వేతనాలు పెండింగ్లో ఉన్నాయి: డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ కూలీలకు వేతనాలు దాదాపు ఎనిమిది వారాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తే సాయంత్రానికే కూలీలు ఇస్తున్న కారణంగా ఆయా ప్రాంతాలకు పనికి వెళ్తున్నారు. అందులో మిరప తెంపేందుకు కుటుంబంలో ఎంత మంది ఉంటే చిన్న, పెద్ద తేడాలేకుండా అంతమంది పనికి వెళ్లే అవకాశం ఉంది. ఉపాధిలో జాబ్కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశం. ఆయా ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు మాత్రమే పనులు ఉంటాయి. ఏప్రిల్ నుంచి ఉపాధి కూలీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
అడిగిన వారందరకీ డ్రిప్
- వంద శాతం లక్ష్య సాధనకు కృషి - రైతులకు సహకరించని కంపెనీలకు జరిమానా -ఏపీఎంఐపీ పీడీ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): అడిగన వారందరికి బిందు సేద్యం సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సూక్ష్మ సేద్యం లక్ష్యాలను వందశాతం సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది 15వేల హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.10,500 హెక్టార్లకు పూర్తయిందన్నారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 5వేల హెక్టార్లకు మాత్రమే డ్రిప్ కల్పించామన్నారు. డ్రిప్ కల్పనలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ ఏడాది ముగింపునకు 45 రోజుల సమయం ఉందని, రోజుకు 100 హెక్టార్ల ప్రకారం మంజూరు చేసి డ్రిప్ పరికరాలు అమర్చాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిపారు. మార్చి నెల చివరి నాటికి లక్ష్యం మేరకు డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. డ్రిప్ కంపెనీలు కూడా నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని తెలిపారు. నిర్వహణలో రైతులకు సహకరించని 19 కంపెనీలకు రూ.4.80 లక్షలు జరిమానా విధించినట్లు చెప్పారు. స్ప్రింక్లర్ల కంటే డ్రిప్ విధానాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. సూక్ష్మ సేద్యం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా లక్ష్యాలను అధికమిస్తామన్నారు. . -
అప్పుల్లేవ్.. తిప్పలే
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – కె.శ్రీనివాసులు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ -
ఏదీ సౌరభం !
సోలార్ విద్యుదుత్పత్తిలో జిల్లా చతికిలబడింది. నిర్దేశిత లక్ష్యానికి చాలాదూరంలో నిలిచిపోయింది. సబ్సిడీ ఉన్నా.. సౌర ఫలకాల కొనుగోలుకు జిల్లా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అధికారుల ప్రచార లోపమే దీనికి కారణం. ఏలూరు(ఆర్ఆర్పేట) : సోలార్ విద్యుదుత్పత్తి పథకం ఆశించిన ఫలితాలు సాధించ లేకపోయింది. ఈ పథకం ద్వారా గృహాలపై ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాలను 50శాతం సబ్సిడీపై సర్కారు అందిస్తున్నా.. వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ పథకం అమలులో అధికారులూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. తగిన ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం జిల్లాలో సోలార్ ద్వారా 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు గృహావసరాలకు, పరిశ్రమలకు , కళాశాలలకు సౌరఫలకాలు అందించాలని నిర్ణయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 83 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో సౌరఫలకాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్న 51 మంది దరఖాస్తుదారులకు వాటిని అందించారు. ప్రస్తుతం వీటి ద్వారా సుమారు 881 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అంటే ఒక మెగావాట్ కూడా పూర్తిగా ఉత్పత్తి కావడం లేదన్నమాట. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా సుమారు 1500 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కిలో వాట్కు రూ.85 వేల ఖర్చు గృహావసరాల నిమిత్తం సౌరఫలకాలు ఏర్పాటు చేసుకోవాలంటే కిలోవాట్ సామర్థ్యానికి రూ.85 వేలు ఖర్చవుతుంది. ఒక్కో గృహానికి ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు ఏసీలు వంటి పరికరాల వినియోగానికి రోజుకు రెండు కిలోవాట్ల (8 యూనిట్లు) కరెంట్ అవసరమవుతుందని విద్యుత్ సంస్థల అంచనా. ఈ లెక్కన ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రూ.1.70 లక్షలు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం రూ.70 వేలు నెడ్క్యాప్ ద్వారా సబ్సిడీగా అందిస్తుంది. అంటే వినియోగదారులు రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు వారు వినియోగించే సుమారు 240 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు. మిగిలిన విద్యుత్ను అమ్ముకోవచ్చు. దీనికోసం విద్యుత్ సంస్థలు సౌరఫలకాలు ఏర్పాటు చేసే సమయంలో బై డైరెక్షనల్ మీటరును అమర్చుతాయి. ఆ మీటరు ద్వారా వినియోగదారుడు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు చేరుతుంది. అలా చేరిన కరెంట్కు యూనిట్కు రూ.5.40 చొప్పున విద్యుత్ సంస్థలు వినియోగదారునికి చెల్లిస్తాయి. విద్యా సంస్థలు ముందుకొచ్చాయి సోలార్ విద్యుదుత్పత్తికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు ముందుకొచ్చాయి. భీమవరం విష్ణు, ఎస్ఆర్కేఆర్ కళాశాలలు, తాడేపల్లిగూడెం వాసవి కళాశాల, తణుకులోని చిట్టూరి విద్యా సంస్థ, ఏలూరులో సెయింట్ ఆన్స్ కళాశాల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలూ ఫలకాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అయితే గృహ వినియోగదారులు ముందుకు రావడం లేదు. వారిలోనూ అవగాహన పెరగాలి. –డి.వి.ప్రసాద్, నెడ్క్యాప్ జిల్లా మేనేజర్ -
రూ.100 కోట్ల రుణాల లక్ష్యం
– రేపటి నుంచి అందుబాటులో బ్యాంకు సేవలు – విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు అనంతపురం అగ్రికల్చర్ : సామాన్య, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వచ్చే రెండేళ్లలో కనీసం రూ.100 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ఆదివారం నుంచి జిల్లా ప్రజలకు ‘విశాఖ’ బ్యాంకు సేవలు అందజేస్తామన్నారు. స్థానిక రాజురోడ్డులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ బ్యాంకు 45వ శాఖను ‘అనంత’లో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రిజర్వ్బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి సహకార చట్టానికి అనుగుణంగా తమ బ్యాంకు సేవలందచేస్తుందన్నారు. దేశంలోనే మొదటి 20 అర్బన్ బ్యాంకుల జాబితాలో తమ బ్యాంకు స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. అన్ని రకాల ఆధునాతన సేవలు, సులభమైన బ్యాంకింగ్ అందజేస్తామన్నారు. ఏ ప్రాంతంలో సేకరించిన డిపాజిట్లు ఆయా ప్రాంత ప్రజలు, ఖాతాదారుల అభ్యున్నతి కోసమే రుణం రూపంలో అందజేస్తామన్నారు. సెలవు రోజైనా ప్రతి ఆదివారం కూడా బ్యాంకు పనిచేస్తుందన్నారు. విశాఖ బ్యాంకు సీఈవో పీవీ నరసింహారావు, గుత్తి కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎస్కే అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు. -
‘సూక్ష్మ’ లక్ష్యం 15వేల హెక్టార్లు
– ఏపీఏంఐపీ రాష్ట్ర ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 15వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐఏఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో ఇప్పటి వరకు 8300 హెక్టార్లకు సూక్ష్మ సేద్యాన్ని అందించామని.. ఫిబ్రవరి నెల చివరిలోగా వంద శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. సూక్ష్మ సేద్యం కల్పనలో దేశంలోనే ఆంధ్రపదేశ్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఉల్లికి మినీ స్ప్రింక్లర్లు, మిరపకు డ్రిప్ ద్వారా నీటిని వినియోగించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీడీ మురళీమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక పన్నీర్ వర్సెస్ చిన్నమ్మ
-
టీఆర్ఎస్ను టార్గెట్ చేయడంలో వ్యూహం లేదా
-
మెప్మా లక్ష్యం నెరవేర్చాలి
20 లక్షల కుటుంబాలను నగదు రహితం వైపు నడిపించాలి ఒక్కో రీసోర్స్పర్సన్కు 300 కుటుంబాల బాధ్యత సమీక్ష సమావేశంలో మెప్మామిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య హిందూపురం అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 20 లక్షల కుటుంబాలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించడమే మన లక్ష్యమని, 2017 ఫిబ్రవరి 15 నాటికి దీనిని నేరవేర్చాల్సిన బాధ్యత రీసోర్స్పర్సన్లపై ఉందని మెప్మామిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య అన్నారు. ఆ దిశగా ఒక్కో రీసోర్స్పర్సన్ దాదాపు 300 కుటుంబాల బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్థానిక జేవీఎస్ ప్యారడేజ్ హాల్లో సోమవారం పీడీ సావిత్రి అధ్యక్షతన మెప్మా జిల్లా సమీక్షా సమావేశం, నగదురహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో చిన్నతాతయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. బ్యాంకు రుణాలు ఇప్పించే సమయంలో రీసోర్స్పర్సన్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అలా కాకుండా వారికి తగినంత పరితోషికం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల సమావేశాలకు జనాలను తీసుకొచ్చే వారిలా కాకుండా ప్రతి కుటుంబానికీ రెండింతల ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలన్నారు. ఆ దిశగా వారికి 15 రోజులు శిక్షణ అందించాలని పీడీని ఆదేశించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లోని సమాఖ్య సభ్యులందరూ మురికివాడలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి పాటుపడాలని, వారిని కూడా నగదురహిత లావాదేవీల వైపు నడిపించాలని సూచించారు. తర్వాత జిల్లాలోని 14 మున్సిపాల్టీల టీపీఓ, మెప్మా సిబ్బందితో సాయంత్రం వరకు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీబీ మేనేజర్ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దాడుల పర్వం
బంగారం దుకాణాలపై ఐటీ దాడులు ఆభరణాల తయారీదారుడి నుంచి కిలో బంగారం స్వాధీనం తణుకు : నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్పిడి చేసే కార్యక్రమం ఊపందుకోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడుల పర్వానికి తెరలేపారు. తణుకు పట్టణంలో శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఇప్పటికే కొందరు కిలోల కొద్దీ బంగారాన్ని రహస్య ప్రదేశాలకు తరలించగా.. వెలికితీసేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. తణుకు నుంచి వేల్పూరు వెళ్లే రోడ్డులోని బంగారు ఆభరణాల తయారీదారుడి దుకాణంపై దాడి చేశారు. అతని వద్ద బిస్కెట్లు రూపంలో ఉన్న సుమారు కిలో బంగారానికి లెక్కలు చూపించమని కోరినట్లు సమాచారం. దుకాణదారుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సదరు బంగారాన్ని సీజ్ చేసి తీసుకెళ్లారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారం కిలో కంటే ఎక్కువే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆటోలు వచ్చిన ఐటీ అధికారులు వేల్పూరు రోడ్డులో సాధారణ వ్యక్తుల్లా సమాచారం సేకరించారు. అనంతరం ఆభరణాల తయారీదారుపై దాడి చేశారు. -
కొనుగోళ్లు లేక కళ తప్పిన మాల్స్
-
రూ.75 వేల కోట్ల వ్యాపారమే లక్ష్యం
ఆంధ్రాబ్యాంకు సర్కిల్ జీఎం రంగనాథ్ రాయవరం : ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల కోట్ల వ్యాపారం చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆంధ్రాబ్యాంకు సర్కిల్(ఏపీ) జనరల్ మేనేజర్ కె.రంగనా«థ్ తెలిపారు. రాయవరం ఆంధ్రాబ్యాంకును సందర్శించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆంధ్రాబ్యాంకు విశాఖ సర్కిల్ పరిధిలో(13 జిల్లాలు) 750 బ్రాంచిల పరిధిలో రూ.64వేల కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన వ్యాపారంలో రూ.36వేల కోట్లు డిపాజిట్లు సేకరించగా, రూ.28వేల కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వ్యాపార లక్ష్యాని అధిగమించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెలంతా ఫౌండేషన్ డే ఉత్సవాలు.. ఈ నెల 23న ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిరామయ్య, 28న ఆంధ్రాబ్యాంకు 94వ వార్షికోత్సవం కావడంతో ఈ నెలంతా ఫౌండేషన్ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జీఎం రంగనాధ్ తెలిపారు. ఫౌండేషన్ డే పురస్కరించుకునిసర్కిల్ పరిధిలో సుమారు 15 బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జోన్ పరిధిలో మురముండ, జొన్నాడలో ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీజీఎం పి.భాస్కరరావు, బ్యాంకు ఏజీఎం డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలిని టార్గెట్ చేసిన బన్సాలీ ?
-
రాబడి.. వెనుకబడి..!
• ఇంటి పన్నుల లక్ష్యం రూ.14కోట్లు • ఇప్పటి వరకు వసూలైంది రూ.1.88కోట్లు • టార్గెట్ చేరేదెప్పుడో..? • వసూళ్లలో ముందున్న మధిర ఖమ్మం జెడ్పీసెంటర్ : పన్నుల వసూళ్లకు ప్రభుత్వ యంత్రాంగం టార్గెట్ విధించింది. అనుకున్న మేరకు పన్నులన్నీ సకాలంలో వసూలైతే స్థానిక వనరులతోనే పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణరుుంచింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నారుు. 2016-17 సంవత్సరానికి జిల్లాలోని 20 మండలాల్లో రూ.14కోట్లు లక్ష్యంగా నిర్ణరుుంచారు. ఇందులో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.1.88కోట్ల(13 శాతం) పన్నులు వసూలు చేశారు. ఇంకా రూ.12కోట్ల వసూళ్ల లక్ష్యంగా అధికార యంత్రాంగం టార్గెట్ నిర్ణరుుంచింది. ఈ ఏడాది మధిర మండలం పన్నుల రూపేణ రూ.45,53,801 వసూలు చేసి(41.22 శాతం) ముందంజలో ఉంది. లక్ష్యం చేరని 2015-16 నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అతికష్టం మీద 54.54 శాతం అంటే.. రూ.5.78కోట్లు వసూలు చేసి పంచాయతీ సిబ్బంది చేతులు దులుపుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి గతంలో మండల పరిషత్లలో సమావేశాలు నిర్వహించటంతోపాటు తన కార్యాలయంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి.. డిసెంబర్ నాటికే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ ఆయన మాటలు పట్టించుకున్న వారు లేరనే విమర్శలున్నారుు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 427 గ్రామ పంచాయతీలకు 285 క్లస్టర్లు ఉన్నారుు. వీటిలో 81 మంది గ్రామ కార్యదర్శులే ఉన్నారు. కొందరు గ్రామ కార్యదర్శులు సుమారు 4 గ్రామాల్లో పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. వీటికి తోడు ఎంపీడీఓ కార్యాలయాల్లో సమావేశాలు, ఎమ్మెల్యే, మంత్రుల సభలు, సమావేశాలు, శంకుస్థాపనలకు సగం సమయం సరిపోతుందని కార్యదర్శులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. ఖమ్మంకు కూటవేటు దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో 17 పంచాయతీలుండగా.. ఇద్దరు కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. వారిలో ఒకరు మహిళా కార్యదర్శి కావటం గమనార్హం. పన్నులు వసూలు అరుుతేనే అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సొంత వనరులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా.. స్థానికంగా ఉన్న వనరులపై ఆధారపడాల్సి ఉంది. గ్రామాల్లో ఇంటి, నీటి పన్నులు కీలకంగా ఉండనుండగా.. ఇంటి పన్నులు చెల్లించేందుకు గ్రామస్థారుులో ఆసక్తి చూపించే వారు కరువయ్యారు. దీనికోసం ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు కూడా స్థానిక పరిస్థితులనుబట్టి ఆసక్తి చూపించటం లేదు. పలు గ్రామాల్లో ఇంటి పన్నులు 30 శాతం కూడా వసూళ్లు కావటం లేదు. ఇదే అదనుగా భావించిన పాలకులు, కార్యదర్శులు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి కనబరచడం లేదు. నిధులు మింగుతున్న ప్రజాప్రతినిధులు కార్యదర్శుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు అన్ని గ్రామాల్లో రోజువారీగా వెళ్లే అవకాశం ఉండటం లేదు. దీంతో ఇదే అదనుగా భావించిన కొందరు ప్రజాప్రతినిధులు అక్రమాలకు తెరలేపారు. అవకాశాన్నిబట్టి అందిన కాడికి దోచుకోవడంతో పదుల సంఖ్యలో సర్పంచ్లకు చెక్పవర్ రద్దు, షోకాజ్ నోటీసులు జారీ అరుున సంఘటనలున్నారుు. మరికొందరు సర్పంచ్లపై జిల్లాస్థారుులో విచారణ కూడా జరుగుతోంది. -
కశ్మీర్ బ్యాంకులకు టార్గెట్ చేసిన లష్కరే తోయిబా
-
కలిదిండిలో నకిలీ నోట్ల కలకలం
కైకలూరు : కొల్లేరు తీరంలో నకిలీ నోట్ల చలామణి అంశం మరోసారి తెరపైకొచ్చింది. రెండేళ్లు స్తబ్ధతగా ఉన్న ముఠా తిరిగి తన కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. జిల్లా సరిహద్దు మండలాల్లో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2014 జులై 24న కలిదిండి మండలం అమరావతికి చెందిన ప్రధాన సూత్రదారి జలసూత్రం వెంకన్న నుంచి రూ.51వేల నకిలీ నోట్లును పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తిరిగి నకిలీ నోట్ల చలామణికి రంగం సిద్ధం చేస్తున్నారనే వాదన బలంగా ఉంది. మండలంలోని తాడినాడ, పోతుమర్రు, వెంకటాపురం గ్రామాల్లో కొందరు నకిలీ నోట్లును గుట్టుగా దాచినట్లు సమాచారం. గతంలో పట్టుబడ్డ ప్రధాన సూత్రదారి జలసుత్రం వెంకన్న వెంకటాపురం గ్రామంలోని ఓ ఇంటిలో రూ.100, రూ.500 నోట్లు తయారు చేయానికి కలర్ ఫ్రింటర్, తెల్ల నోటు కాగితాలను సిద్ధం చేసుకోవడం గుర్తించిన పోలీసులు వాటని స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా ఓ వ్యక్తి నకిలీ నోట్లు సిద్ధంగా ఉన్నాయంటూ, ఇప్పుడు తీసుకోపోతే తిరిగి వెనక్కి Ðð ళ్ళిపోతాయి అని కొందరితో చెబుతున్నట్లు తెలిసింది. కొల్లేరు ప్రాంతంపై కన్ను... కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చేపల, రొయ్యిల చెరువులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని నకిలీ కరెన్సీ ముఠా అనుకూల ప్రాంతంగా మలుచుకుంటుంది. ఆక్వా పరిశ్రమ ద్వారా ప్రతి రోజు ఇక్కడ కోట్లలో నగదు బట్వాడ జరుగుతుంది. ముఠా సభ్యులు కొందరిని ఈ ఉచ్చులోకి దించుతున్నారు. నకిలీ డబ్బు ఆశిస్తున్నా వ్యక్తి ఎదురుగా నకిలీ నోటుతో దుకాణాల్లో వస్తువు కొంటున్నారు. నమ్మకం కలిగిన సదరు వ్యక్తులు వీరి వద్ద నుంచి నకిలీ నోట్లు తీసుకుంటున్నారు. గతంలో కైకలూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు అందించిన రూ. 500, రూ. 100 నోట్లు నకిలీవి వచ్చినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. కొందరికి నకిలీ నోట్లు తెలియక వస్తున్నా పోలీసులకు చెబితే ఆరాలు తీస్తారని వాటిని చింపిపడేస్తున్నారు. పోలీసులు నకిలీ నోట్లు ముఠా ఆగడాలను ఆదిలోనే అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బీసీల బలోపేతానికి ప్రభుత్వం కృషి
కాకినాడ సిటీ : వెనుకబడిన తరగతుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏపీ నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య, బీసీ కార్పొరేష¯ŒS స్థానిక అంబేడ్కర్ భవ¯ŒSలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీలు సమాజంలో పైస్థాయికి ఎదగడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. మరో అతిథి, పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏపీ నాయీబ్రాహ్మణ సహకార సంఘ సమాఖ్య చైర్మ¯ŒS గంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ 11 నుంచి 15 మంది బీసీలు సంఘంగా ఏర్పడి బీసీ వెల్ఫేర్ డీడీ వద్ద అన్ని వివరాలు సమర్పిస్తే 15 రోజుల్లో రిజిస్ట్రేష¯ŒS పూర్తి చేస్తారన్నారు. చేతివృత్తులు, కుల వృత్తులపై ఆధారపడే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, బీసీ కార్పొరేష¯ŒS డైరెక్టర్ చంద్రమౌళి, ఈడీ ఎం.జ్యోతి, బీసీ వెల్ఫేర్ డీడీ చిన్నబాబు, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
టార్గెట్ ఎస్పీ
సాక్షి ప్రతినిధి, ఏలూరుః అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీని టార్గెట్ చేశారు. ఏలూరులో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కాకపోవడానికి నెపం పోలీసులపై నెట్టివేయడానికి సన్నద్ధం అయ్యారు. దీనిలో భాగంగా ఎస్పీ భాస్కర్భూషణ్పై ద్వజమెత్తారు. అతనిని మార్చేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. మంగళవారం జరిగిన సమన్వయ కమిటీ దీనికి వేదికగా మారింది. జిల్లా ఇంఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి పీతల సుజాత, జిల్లా అద్యక్షురాలు సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎక్కువ సేపు పోలీసులపైనే చర్చ జరిగింది. జిల్లాలో పోలీసులు మా మాట వినకపోతే ఒక మేమెందుకు.. ప్రజా ప్రతినిధులు అన్న పదానికే అర్థం లేదని పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీలు, సీఐలు కూడా తమ మాటను లెక్క చేయడం లేదని, ఇటువంటి పరిస్థితిలో తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆయన దష్టికి తీసుకువెళ్ళారు. చిన్నచిన్న కేసులకు సంబంధించికి కూడా తమ సిఫార్సులను తోసిపుచ్చుతుంటే ప్రజలు, అబిమానులు, కార్యకర్తల ఎదుట తల ఎత్తుకోలేకపోతున్నామని వాపోయారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన తగాదాల్లో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు విషయంలో అక్కడి డీఎస్పీ అత్యుత్సాహం ప్రదర్సించారని, దానిపై తాము రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో కూడా పోలీసుల వైఖరి వల్లే విద్యార్ధులు సభాప్రాంగణంలోకి రాలేదని వారు ఆరోపించారు. చింతలపూడి, ఆచంట, పోలవరం ఏఎంసీతో పాటు ఇతర పదవులు విషయంపై చర్చ జరిగింది. ఇప్పటికే ఈ జాబితాను అధిష్టానం వద్దకు పంపించామని అక్కడ ఆమోదం పొందాల్సి ఉందని ఇంఛార్జి మంత్రి తెలిపారు. పోలవరంలో పదవుల పంపకంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చింతలపూడి ఏఎంసీ విషయంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, రాష్ట్ర మంత్రి పీతల సుజాతలతో చర్చించి ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత తీసుకురావాలని పలువురు కోరారు. వక్ఫ్బోర్డు ఛైర్మన్గా జంగారెడ్డిగూడెంకు చెందిన ముస్తఫా పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమన్ని జిల్లా వ్యాప్తంగా విస్తతంగా అమలు చేయాలని, గ్రామీణ రహదారుల అభివద్ధిపై దష్టి సారించాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఇళ్ళ నిర్మాణం విషయంలో వెనుకడుగులో ఉన్నామని, ఎంత త్వరగా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తే అంత మంచిదని, అలాగే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ త్వరగా రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
విద్యార్థులు ప్రణాళికతో చదువుకోవాలి
రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి నసీమా సుల్తానా మంచిర్యాల టౌన్ : విద్యార్థులు లక్ష్యం లేకుండా ముందుకు వెళ్లవద్దని, భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని ఓ ప్రణాళికతో చదువును కొనసాగిస్తూ విజయాన్ని అందుకోవాలని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి నసీమా సుల్తానా అన్నారు. మంచిర్యాల పట్టణంలోని వివేక వర్ధిని డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థి దశలో ఉన్నవారు ఎలాంటి లక్ష్యం లేకుండా చదవడం వల్ల, అల్లరి చిల్లరిగా తిరుగుతూ చదువును అశ్రద్ధ చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోలేక పోతారన్నార ని వివరించారు. కళాశాలలో చేరగానే ర్యాగింగ్ చేసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారని, ఒక్కసారి ర్యాగింగ్ చేస్తూ కేసు నమోదైతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకుంటే నేరుగా కోర్టుకు వారి సమస్యను విన్నవించుకోవచ్చని సూచించారు. లాయర్ను పెట్టుకునే స్థోమత లేని వారు, కోర్టుకు విన్నవిస్తే, ప్రభుత్వం తరుఫున లాయర్ను ఏర్పాటు చేస్తామని, కోర్టు ద్వారా బాధితులకు తప్పనిసరిగా న్యాయం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు సదయ్య, వీవీడీసీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎస్సై ఆకుల అశోక్, న్యాయవాదులు చిదానంద కుమారి, మల్లారెడ్డి, జగన్, ఉమేశ్, చంద్రగిరి రమేశ్, గంగయ్య, ఇండ్ల వెంకట్ పాల్గొన్నారు. -
బీసీల సంక్షేమమే ధ్యేయం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : వెనుకబడిన తరగతుల సంక్షమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో చంద్రన్న బీసీ స్వయం ఉపాధి ఉత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించి, 4013 మందికి రూ.102 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 897 హాస్టళ్లలో లక్ష మంది, 32 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 16 వేల మంది, 370 బీసీ కళాశాల వసతి గృహాల్లో 36 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అన్ని బీసీ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 1000 మందిని విద్యోన్నతి పథకం ద్వారా విదేశాల్లో చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైతే బ్యాంకుల ద్వారా ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు రుణం ఇప్పిస్తామన్నారు. గతంలో మత్స్యకారులకు పడవలు పంపిణీ చేశామని, ఈసారి పడవలతో పాటు వలలు కూడా అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 150 ఎకరాలు సేకరించి బీసీ యువ పారిశ్రామిక వేత్తలకు అందజేస్తామన్నారు. బీసీల్లోని అన్ని కులాల కోసం 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తామన్నారు. రూ. 5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణం అన్ని జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జెడ్పీచైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ బీసీలందరూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ అరుణ్కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ హర్షవర్ధన్, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జ్యోతి, డీడీ ఎం.చినబాబు పాల్గొన్నారు. సభ మొత్తం విద్యార్థులే..! ఆనం కళా కేంద్రంలో జరిగిన బీసీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎటు చూసినా 18 ఏళ్లలోపు విద్యార్థులే కనిపించారు. లబ్ధిదారులు, నాయకులు కలిపి సుమారు 150 మంది ఉన్నారు. సభను విజయవంతం చేసేందుకు నగరంలోని రామకృష్ణ మఠం, దానవాయిపేట, గణేష్చౌక్, సీతంపేట, టీటీడీ కల్యాణ మండపం సమీపం, టూ టౌన్ ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు సుమారు 1100 మందిని ఆటోల్లో ఆనం కళాకేంద్రానికి తరలించారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
తిరుపతి మంగళం: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. మంగళవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ్జైన్, పోలీస్, అటవీ శాఖ, విజిలెన్స్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దళితులపై దాడులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదన్నారు. చంద్రన్న బీమా పథకంలో కార్మికులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే రూ.5లక్షల బీమా సౌకర్యం పొందవచ్చునని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటి పట్టాల సమస్య ఉందని, స్పెషల్ డ్రైవ్ పెట్టి స్థలాల మంజూరుకు కృషి చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు చట్ట ప్రకారం భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాపవినాశనం వద్ద నక్కల జాతుల వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో పురోగతిని వివరించారు. -
త్వరలో ఓట్ల రాజకీయం వైపు
గన్ఫౌండ్రీ: బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా తర్వలో ఓట్ల రాజకీయాల వైపు పయనిస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం బషీర్బాగ్లోని పీజీ న్యాయ కళాశాలలో సూడ్టెంట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రచించిన తెలంగాణలో బహుజనుల రాజ్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ... బహుజన మేధావులు అందరూ ఐక్యం కావాలని సూచించారు. దేశంలో అసలైన బహుజనులు అంటే మహిళలే అని, వారికి ముందుగా బహుజన సిద్ధాంతాలను తెలియజేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ... బహుజనులలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బహుజనుల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ కృషి చేస్తుందన్నారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ... భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ బహుజన తెలంగాణ రాలేదన్నారు. అనంతరం ఇటీవల మరణించిన పౌరహక్కుల నేత బొజ్జా తారకంకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి. సత్యనారాయణ, ప్రొఫెసర్ అన్సారీ, ప్రొఫెసర్ చంద్రన్లతో పాటు కళాశాల బోధన సిబ్బంది, స్టూడెంట్స్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయండి
రాజమహేంద్రవరం సిటీ : పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని సికింద్రాబాద్ చీఫ్ ఇంజనీర్ (నిర్మాణం)బ్రహ్మానందరెడ్డి పిలుపు నిచ్చారు. స్వచ్చత సప్తాహ్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో శనివారం ప్రారంభించారు. మొదటి రోజు స్టేషన్ ఆవరణ, రైల్వే ఉద్యోగుల కాలనీల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఉన్న వాటిని ట్రిమ్మింగ్ చేసే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత సప్తాహ్లో స్వచ్ఛ స్టేషన్, స్వచ్ఛ రైలు, స్వచ్ఛ నీరు, స్వచ్ఛ పరిశర్, స్వచ్ఛ సహయోగ్, స్వచ్ఛ సంవాద్ కార్యాక్రమాలను రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తామని స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. స్టేషన్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశవభట్ల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ జాన్ విజయ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జేసీ డి.దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ సీజన్లో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య పేర్కొన్నారు. శనివారం పౌరసరఫరా శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వరి సాధారణ సాగు 1,25,990 హెక్టార్లకు గాను ప్రస్తుతం 69,185 హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు ఉన్నట్లు చెప్పారు. వరి విస్తీర్ణం ఆధారంగా 3,59,762 మెట్రిక్ టన్నుల రావచ్చునని అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇందులో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 199 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 32 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయని, 15 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబర్లో ఐకేపీ 20, పీఏసీఎస్ 95, జీసీసీ 37, ఐటీడీఏ 47 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సత్యవాణి, డీఎస్ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జేసీ డి.దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ సీజన్లో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య పేర్కొన్నారు. శనివారం పౌరసరఫరా శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వరి సాధారణ సాగు 1,25,990 హెక్టార్లకు గాను ప్రస్తుతం 69,185 హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు ఉన్నట్లు చెప్పారు. వరి విస్తీర్ణం ఆధారంగా 3,59,762 మెట్రిక్ టన్నుల రావచ్చునని అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇందులో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 199 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 32 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయని, 15 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబర్లో ఐకేపీ 20, పీఏసీఎస్ 95, జీసీసీ 37, ఐటీడీఏ 47 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సత్యవాణి, డీఎస్ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఫోటోరైటప్286: మాట్లాడుతున్న జేసీ దివ్య -
ధర్మవరంలో పోలీసుల అరాచకం
వైఎస్సార్సీపీ కార్యకర్తలు టార్గెట్ స్టేషన్కు పిలిచి చావబాదిన వైనం ఆస్పత్రిలో చేరిన బాధితులు అనంతపురం సెంట్రల్ : ధర్మవరంలో పోలీసులు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు. అధికాపార్టీ నేతల మెప్పు పొందేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి చావబాదుతున్నారు. బాధితులు సోమవారం తెలిపిన మేరకు... వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్’ పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న అధికార పార్టీ నేతలు సీఐ హరినాథ్పై ఒత్తిడి తీసుకొచ్చి తమపై కక్షసాధిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, కౌన్సిలర్ ఉమాదేవి భర్త రవీంద్రప్రసాద్ వాపోయారు. పని ఉందని స్టేషన్కు పిలిపించి చావబాదుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని కౌన్సిలర్ ఉమాదేవి ప్రశ్నించారు. తన భర్తకు పోలీసుల నుంచే ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తనకు, తన భర్తకు రక్షణ కల్పించాలని కోరారు. అకారణంగా తనను కూడా చావగొట్టారని మరో బాధితుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఈశ్వరయ్య విలపించాడు. అధికారపార్టీ నాయకుల మెప్పు పొందేందుకు ఈ విధంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం మొత్తం 15 మందిని స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారని బాధితులు పేర్కొన్నారు. -
ఒంటరిగా ఉన్న మహిళలే వారి టార్గెట్
బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం క్రైంసీఐ శ్రీధర్ వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరధిలో ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసుల దొం గతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఆరెస్టు చేసినట్లు సీసీఎస్ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. ఈసందర్భంగా నిందితుల నుంచి సుమారు రూ. మూడు లక్షల విలువైన 48గ్రాముల బంగారు అభరణాలు, నాలుగు మొబైల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం తో పాటు రూ.14వేల నగదును స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్లో గీసుకొండ మండ లం శాయంపేట గ్రామానికి చెందిన కోటగిరి సునీల్, ఆత్మకూరు మండ లం దుర్గంపేట గ్రామానికి చెందిన మేకల రాజు, మల్కపేట గ్రామానికి చెందిన మేకల మహేష్గా గుర్తించి నట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసై.. వ్యసనాలకు బానిసైన సునీల్ గత ఏడాది మొబైల్ ఫోన్లు చోరీ చేసిన కేసులో ఇంతేజార్గంజ్ పోలీస్లకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈఏడాది మే నెలలో విడుదలైన సునీల్ కేయూ పరిధిలో సెల్ఫోన్లు దొంగతనం చేసి పోలీసులకు చిక్కగా మళ్లీ జైలు పాల య్యాడని తెలిపారు. ఈసారి జైలు నుంచి విడుదలైన సునీల్ సమీప బంధువులైన మేకల రాజు, మహేష్లతో ఒక ముఠాగా ఏర్పడి నగరంలో మూడు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ఎర్రగట్టుగుట్ట, వరంగల్ వాసవీకాలనీ తదితర ప్రాం తాల్లో జరిగిన దొంగతనాల్లో ఈ ము గ్గురు పాల్పడినట్లు సీఐ తెలిపారు. దొంగిలించిన బంగారు అభరణాలను అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వరంగల్ చౌరస్తాకు వస్తుండగా ఏసీపీ ఈశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన అదేశాల మేరకు నిందితులను పట్టుకున్నట్లు శ్రీధర్ వెల్లడిం చారు. నిందితులను పట్టుకున్న పోలీసులు, అధికారులను సీపీ సుధీర్భాబు అభినందించారు. -
2021 నాటికి 2 లక్షల కోట్ల ఆదాయం
లార్సెన్ అండ్ టూబ్రో చైర్మన్ నాయక్ ముంబై: ఇంజినీరింగ్, నిర్మాణ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్టీ) 2020-21 నాటికి రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. చైర్మన్ ఏఎం నాయక్ ఇక్కడ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే యేడాది పదవీ విరమణ చేయనున్న నాయక్ 71వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) సందర్భంగా షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కంపెనీతో నాలుగు దశాబ్దాల సంబంధం ఉన్న ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలను చూస్తే... ⇔ మార్జిన్లలో ఎటువంటి రాజీ లేకుండా ఆదాయ లక్ష్యాలను సాధించాలన్నది కంపెనీ లక్ష్యం. వార్షికంగా ఆర్డర్ బుక్ను రూ.2.5 లక్షల కోట్లకు అభివృద్ధి చేసుకోసుకోవడంపై కంపెనీ దృష్టి సారించింది. లక్ష్యాలను సాధించే విధంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊపందుకుంటుందని భావిస్తున్నా. ⇔ కంపెనీ భారీ వృద్ధికి సంబంధించి కొన్ని ప్రత్యేక రంగాలపై దృష్టి సారిస్తోంది. ఐటీ, టెక్నాలజీ సేవలు, రక్షణ, స్మార్ట్ వరల్డ్, వాటర్ మేనేజ్మెంట్ ఇందులో ఉన్నాయి. ⇔ డిజిటల్ విభాగంలో సాధించే ప్రగతి మున్ముందు కంపెనీకి లాభదాయకం కానుంది. ఇందులో గ్రూప్ కంపెనీలు ఎల్ అండ్టీ ఇన్ఫ్రా, ఎల్ అండ్ టీ టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తాయి. ⇔ వృద్ధి సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. మౌలిక రంగంపై కేంద్రం దృష్టి సారించడం కంపెనీకి లాభించే అంశం. అలాగే రక్షణ రంగంలో సంస్కరణలు రానున్న 10 సంవత్సరాల్లో కంపెనీకి 13 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. ఇక అణు ఇంధనానికి సంబంధించి కంపెనీకి మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసం ఉంది. ⇔ కాగా 2016 మార్చితో ముగిసిన కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,03,522 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 12 శాతం అధికం. కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రం 7 శాతం వృద్ధితో రూ.5,091 కోట్లకు పెరిగింది. -
వచ్చే ఏడాదికి 4.04 కోట్ల మొక్కల లక్ష్యం
కలెక్టర్ లోకేష్కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారం కింద 2017–18 సంవత్సరానికి జిల్లాలో 4.04 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు కలెక్టర్ లోకేష్కుమార్ తెలిపారు. హరితహరంలో జిల్లాలో నాటిన మొక్కలు, వాటి సంరక్షణ చర్యలు, వచ్చే ఏడాది లక్ష్య సాధన, మరుగుదొడ్లు నిర్మాణం, పొగరహిత గ్రామాలు తదితరాంశాలపై ఆయన శుక్రవారం జాయింట్ కలెక్టర్ దివ్యతో కలిసి ఎంపీడీఓలు, తహసీల్దారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 3.77 కోట్ల మొక్కలు నాటామన్నారు. వచ్చే ఏడాది 4.04 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని అన్నారు. 4.95 కోట్ల మొక్కలను వివిధ శాఖల నర్సరీల ద్వారా పెంచేందుకు లక్ష్యాలను నిర్దేశించినట్టు చెప్పారు. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను గ్రామ పంచాయతీలవారీగా గ్రామ స్థాయిలో రిజిస్టర్ నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి బాధ్యునితోపాటు మండలాధికారులు వారానికి రెండుసార్లు తప్పనిసరిగా పర్యటించి మొక్కలను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంలో 70 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలినవి త్వరగా పూర్తిచేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిపై ప్రతి గురువారం తహసీల్దారులు, ఎంపీడీఓలు గ్రామాలమ సందర్శించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ దివ్య మాట్లాడుతూ.. దీపం పథకం కింద రెండువేల రూపాయపలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇంతకు మించి వసూలు చేసిన గ్యాస్ ఏజెన్సీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ మారుపాక నాగేశ్, ఆర్డీఓలు వినయ్కృష్ణారెడ్డి, రవీంద్రనా«ద్ తదితరులు పాల్గొన్నారు. -
సాగును లాభసాటి చేద్దాం
సాగును లాభసాటి చేద్దాం prafit agriculture our target సాగును, లాభసాటి, చేద్దాం prafit, agriculture, our, target పాలీహౌస్ ప్రారంభోత్సవంలో మంత్రులు పోచారం, తుమ్మల, ఈటల సత్తుపల్లి: రైతుల బతుకులు మారాలంటే వ్యవసాయ సాగును లాభసాటిగా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో రూ.1.20 కోట్లతో నిర్మించిన పాలీహౌస్ను మంగళవారం స్పీకర్ మధుసూదనచారి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలీహౌస్లలో మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించి రైతులు లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 ఎకరాలకు మాత్రమే పాలీహౌస్ల నిర్మాణాలకు 20శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ 70శాతం సబ్సిyీ తో గతేడాది వెయ్యి ఎకరాలు, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలు పాలీహౌస్ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కావాలంటే పల్లెలు బాగుపడాలని.. వ్యవసాయం పండుగలా చేసుకోవాలన్నారు. వ్యవసాయం అంటే..దండగ కాదు పండగలా చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతులు పెట్టుబడి ఖర్చు తగ్తించుకోవాలని, కొత్తరకం వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్కుమార్, నగరపంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ హసావత్ లక్ష్మీ ఆర్డీఓ వినయ్కుమార్ పాల్గొన్నారు. -
సాగును లాభసాటి చేద్దాం
పాలీహౌస్ ప్రారంభోత్సవంలో మంత్రులు పోచారం, తుమ్మల, ఈటల సత్తుపల్లి: రైతుల బతుకులు మారాలంటే వ్యవసాయ సాగును లాభసాటిగా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో రూ.1.20 కోట్లతో నిర్మించిన పాలీహౌస్ను మంగళవారం స్పీకర్ మధుసూదనచారి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలీహౌస్లలో మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించి రైతులు లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 ఎకరాలకు మాత్రమే పాలీహౌస్ల నిర్మాణాలకు 20శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ 70శాతం సబ్సిyీ తో గతేడాది వెయ్యి ఎకరాలు, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలు పాలీహౌస్ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కావాలంటే పల్లెలు బాగుపడాలని.. వ్యవసాయం పండుగలా చేసుకోవాలన్నారు. వ్యవసాయం అంటే..దండగ కాదు పండగలా చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతులు పెట్టుబడి ఖర్చు తగ్తించుకోవాలని, కొత్తరకం వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్కుమార్, నగరపంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ హసావత్ లక్ష్మీ ఆర్డీఓ వినయ్కుమార్ పాల్గొన్నారు. -
‘హారం’ లక్ష్యం దాటాం
జిల్లా కలెక్టర్ లోకేశ్కుమార్ ఖమ్మం జెడ్పీ సెంటర్: హరితహారం పథకంలో భాగంగా జిల్లాలో 3.61 కోట్ల మొక్కలు నాటి 103.25 లక్ష్యం సాధించామని కలెక్టర్ లోకేష్కుమార్ తెలిపారు. నిర్దేశిత లక్ష్యకంటే ఎక్కువగా మొక్కలు నాటామన్నారు. హరతహారం నిర్దేశిత లక్ష్యాలు, సాధించిన ప్రగతి, నాటిన మొక్కల సంరక్షణ, 2017 సంవత్సరం ప్రణాళిక తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన హరితహారం గురించి కలెక్టర్ వివరించారు. జిల్లాకు నిర్దేశించిన 3.50 కోట్ల లక్ష్యానికి గాను 3.61 కోట్ల మొక్కలు నాటామన్నారు. 2017 సంవత్సరానికి 3.60 కోట్లతో నర్సరీ ప్లానింగ్ చేసినట్లు వివరించారు. ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణకు 635 ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. 650 ప్రాంతాల్లో నీటి వసతి కల్పించామని కలెక్టర్ వివరించారు. మొక్కల సంరక్షణ, నీటి సౌకర్యం కోసం గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళిక ప్రకారం బాధ్యులను నియమించామని తెలిపారు. 671 గ్రామ పంచాయతీల్లో 29,717 మొక్కలను సూక్ష్మ ప్రణాళిక కింద నాటుతామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయిక్రిష్ణ, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నగేష్, డ్వామా పీడీ జగత్కుమార్రెడ్డి, అటవీ సంరక్షణాధికారి నర్సయ్య, సామాజిక వన విభాగం అటవీ సంరక్షణాధికారి సతీష్, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
భవితకు పునాది.. తొలి ఏడాదే
ఆదిలో ఎదురయ్యే అవరోధాల్ని అధిగమిస్తేనే పురోగతి లక్ష్యసాధనకు కృషి, ప్రణాళికలే కీలకం వెలుగుబంద (రాజానగరం) : ఇంజనీరింగ్ చదువును మంచి ఉపాధికి మార్గంగా ఎంచుకుని ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఆ కోర్సులో చేరుతున్నారు. అయితే ఎంచుకున్న చదువుతో లక్ష్యాలను చేరుకోవాలంటే అంతకు మించిన సాధన ఉండాలంటున్నారు అధ్యాపకులు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమని, దానిని నిర్లక్ష్యం చేస్తే భవిషత్తు అంత ఆశాజనకంగా ఉండదని హెచ్చరిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇంటర్లో 90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ పరీక్షల్లో తప్పుతున్నారంటున్నారు. మొదటి సంవత్సరంలోనే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడం వలన క్యాంపస్ రిక్రూట్మెంట్లో అవకాశం వచ్చినా∙ఉద్యోగాలు పొందలేకపోతున్నారంటున్నారు. ఇందుకుగల కారణాలను పరిశీలిస్తే.. కళాశాలలో చేరినప్పటి నుంచి విద్యార్థి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కూడా లక్ష్య సాధనకు అవరోధాలుగా పరిగణిస్తున్నాయంటున్నారు. సీనియర్స్ ర్యాగింగ్ ఇంజనీరింగ్లో చేరిన వెంటనే విద్యార్థులు ఎదుర్కొనే సమస్య సీనియర్ల నుంచి ర్యాగింగ్. విద్యాభ్యాసంలో ఆదర్శంగా ఉంటూ జూనియర్లకు మెళకువలు, సూచనలు ఇవ్వవలసిన సీనియర్లు ర్యాగింగ్తో ఇంజనీరింగ్ విద్యపై భయాన్ని కలిగిస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఇటువంటి వాతావరణానికి జూనియర్లు దూరంగా ఉండాలి. ‘బట్టీపట్టుడు’ కాదు..పట్టు ముఖ్యం ఇంజనీరింగ్ విద్యలో ప్రతి విద్యార్థికీ సబ్జెక్టుపై పట్టు ఉండాలి. అందుకు బట్టీ పట్టే విధానం సరైంది కాదు. ఆయా సబ్జెక్టులపై విశ్లేషణ, అవగాహన ఉండేలా తరగతుల్లో అధ్యాపకులు చెప్పే విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుంటూనే పుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సమయ పాలనా కీలకం.. రోజుకు ఎన్ని గంటలు, ఏఏ సమయంలో చదువుకు కేటాయించాలి, ఏ సమయంలో ఆటవిడుపుగా గడపాలి అనే విషయమై విద్యార్థికి ప్రణాళిక అవసరం. సమయ పాలన (టైమ్ మేనేజ్మెంట్) ఎవరికైనా మంచి ఫలితాలను అందిస్తుంది. మెుబైల్, టీవీ, చిట్చాట్ వంటి వాటితో సమయాన్ని వృథా చేసుకోకుండా నిర్ణీత సమయాన్ని చదువుకు కేటాయిస్తే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి వీలుంటుంది. లక్ష్యం ఉండాలి.. లక్ష్యం నిర్ణయించుకుంటేనే దానిని సాధించేందుకు తపనతో కృషి చేస్తుంటాం. అలాగే విద్యార్థి చదువులో కూడా లక్ష్యం నిర్ణయించుకుంటేనే సెమిస్టర్ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ వరకూ అనుకున్న విజయాలను సాధించడం సుసాధ్యం అవుతుంది. లక్షా్యనికి అనుగుణంగా తనలో ఉన్న లోపాలను సరిచేసుకోవడంతోపాటు ఉన్న నైపుణ్యాలను మరింతగా వృద్ధి చేసుకునేందుకు దృష్టిని సారిస్తాడు. తద్వారా ప్లేస్మెంట్లో కూడా లక్షా్యన్ని చేరుకుంటాడు. భాషా పరిజ్ఞానాన్నిపెంపొందించుకోవాలి.. విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, భావప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయని అనేక సాఫ్ట్వేర్ సంస్థలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తరుణంలో తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరిన నాటి నుంచి భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మేగజైన్లు చదవడానికి, వార్తలను వినడానికి రోజూ కొంత సమయం కేటాయించాలి. – బాసిరెడ్డి రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీవీసీ కళాశాల, పాలచర్ల తల్లిదండ్రుల బాధ్యత.. ‘ఇంజనీరింగ్లో చేర్పించాం, మన బాధ్యత అయిపోయిం’దని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అది సరికాదు.. కళాశాలకు వెళ్లిన విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటోంది అనే విషయాలను తరచూ తెలుసుకోవాలి. కనీసం నెలకోసారైనా సంబంధిత అధ్యాపకుని కలిసి, ఆ విద్యార్థి తీరును తెలుసుకోవాలి. అలాగే సెమిస్టర్ పరీక్షలో ప్రగతిని కూడా పరిశీలిస్తుండాలి. కొత్త ఆలోచనలతోనేరాణింపు.. ఇంటర్ వరకూ ఏవిధంగా చదివినా.. ఇంజనీరింగ్లో చేరిన నాటి నుంచీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆంగ్లభాషపై మంచి పట్టును సాధించే దిశగా ప్రతి విద్యార్థీ కసరత్తు చేయాలి. అలాగే సబ్జెక్టుపై పరిజ్ఞానంతోపాటు కొత్త ఆలోచనలతో నూతనావిష్కరణల వైపు పయనించే వారికే రాణింపు ఉంటుంది. – డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు, ప్రిన్సిపాల్, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ఫస్ట్ ఇయర్ పునాది వంటిది.. ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమైనది. నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఒక రకంగా పునాది వంటిది. ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా దారుణమైన ఫలితాలను చవిచూడవలసి వస్తుంది. పట్టుదలతో ఫస్ట్ ఇయర్ని పూర్తి చేస్తే సెకండ్ ఇయర్ నుంచి వారు ఎంచుకున్న కోర్ సబ్జెక్టులపై దృష్టిని సారించడానికి అవకాశం ఉంటుంది. – ప్రొఫెసర్ టి.చంద్రశేఖర్,హెచ్ఓడీ, ఈసీఈ, గైట్ కళాశాల -
హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి
హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి మీనా అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పీసీ సీఎఫ్ పీకే ఝాతో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల వివరాలు, ఇప్పటివరకు నాటిన మొక్కలు, మొక్కల సైజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు గట్లపై ఈత మొక్కలు నాటాలని సూచించారు. ఈ వీసికి సోషల్ ఫారెస్టు డీఎఫ్ఓ రాంమూర్తి, ఎక్సైజ్ ఈఎస్ నర్సింహారెడ్డి, చిన్ననీటి పారుదల ఎస్ఈ సదాశివ హాజరయ్యారు. -
లక్ష్యం రూ.17 వేల కోట్లు.. ఇచ్చింది రూ.6 వేల కోట్లు
►ఖరీఫ్ రుణాల పంపిణీలో బ్యాంకుల మొండిచెయ్యి ►వర్షాలు ఊపందుకోవడంతో పెద్ద్ద ఎత్తున రైతుల రాక హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ పంటల సాగులో రైతులు మునిగిపోయారు. మరోవైపు రుణాల కోసం రైతులు బ్యాంకులకు పోటెత్తుతున్నారు. బ్యాంకుల్లో మాత్రం సకాలంలో రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు సాంకేతిక సమస్యలు... మరోవైపు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు రైతులకు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. ఈ ఖరీఫ్లో బ్యాంకులు రూ. 17,460 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ. 6,114 కోట్లకు మించి ఇవ్వలేదు. అంతేకాదు మొత్తం 36 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటారని అంచనా వేయగా... 13.50 లక్షల మందికే రుణాలు ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. ఖరీఫ్ కీలక తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు అప్పుల వైపు వెళ్లకతప్పడంలేదు. ఆన్లైన్ నమోదుతో మరింత ఆలస్యం... రైతులకు పంట రుణాలు విడుదల చేయడంలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని బ్యాంకులు వ్యవసాయ శాఖకు చెబుతున్నాయి. బ్యాంకుల్లో సిబ్బంది కొరత కూడా కారణమేనని అంటున్నారు. ఆన్లైన్ కారణంగా రైతుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయాల్సి వస్తోంది. ఆన్లైన్ నమోదు ప్రక్రియకు అధిక సమయం తీసుకుంటుండటంతో రైతుల తాకిడిని తట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు బ్యాంకులకు తరలి వస్తున్నారు. ఆన్లైన్ సమస్య కారణంగా తక్కువ మందికే రుణాలు ఇస్తున్నామని బ్యాంకు వర్గాలు వ్యవసాయశాఖకు విన్నవించాయి. సాధారణంగా చేతి రాతతో రుణాలు ఇచ్చేట్లయితే ఇంత సమస్య ఉండేది కాదని అంటున్నారు. -
కార్మికుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
ఆటో కార్మికుల అడ్డా ప్రారంభంలో ఎమ్మెల్యే అజయ్కుమార్ ఖమ్మం అర్బన్: ప్రభుత్వం కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని బల్లేపల్లిలో టీఆర్ఎస్ అనుబంధ ఆటో కార్మికుల సంఘం ఏర్పాటు చేసి ఆటో వర్కర్స్ అడ్డాను ప్రారంభించి టీఆర్ఎస్ జెండాను ఎగర వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యాక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.ఆనంతరం ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొనకంచి ప్రసాద్,ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్యాంసుందర్, కార్యదర్శి సుధాకర్, ప్రధాన కార్యదర్శి మంగ్యా, మల్లూరు, కుమార్,టీఆర్ఉస్ జిల్లా నాయకులు కాట్రాల శ్రీరాములు, రమణ, మధన్, మాజీ సర్పంచ్ భూక్యా భాషా, హెచ్. ప్రసాద్,సోమరాజు, రమేష్, సాయిరాం .పాల్గొన్నారు. ఈర్లపుడిలో హరితహారం.. రఘునాథపాలెం మండలంలోని ఈర్లపుడి పంచాయతీలోని వివిధ తండాల్లో గురువారం హరితహారంలో ఎమ్మెల్యే అజయ్కుమార్ మొక్కలు నాటారు.పల్లెలు పాడి పంటలతో పచ్చగా ఉండాలన్నా, కాలుష్య రహిత వాతావరణ కావాలన్నా మొక్కలు నాటడమే ప్రధాన లక్ష్యం అన్నారు. కోర్లబోడు తండా, లచ్చిరాం తండా, దోనబండ గ్రామాల్లో మొక్కలు నాటారు.కార్యక్రమంలోఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల ఏఈ ఆదిత్య రాజు,సొసైటీ చైర్మన్ తుమ్మల పల్లి మోహన్రావు,జెడ్పీటీసీ, ఎంపీపీ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. -
మొక్కలను సంరక్షించాలి
అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోండి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి అధికారులతో కలెక్టర్ సమీక్ష ఇందూరు : నాటిన ప్రతి మొక్కను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యోగితా రాణా మండల స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణకు హరితహారంపై సంబంధిత అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పూర్తి స్థాయిలో నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి 800 మొక్కలను సంరక్షించడానికి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. మైక్రోప్లాన్ ద్వారా ఒక్కో కుటుంబానికి 800 మొక్కలను సంరక్షించడానికి కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో భాగంగా గ్యాప్ ఉన్నచోట వాటిని పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో సంయుక్త కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఇన్చార్జి డ్వామా పీడీ సునంద, డీఎఫ్వోలు సుజాత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఇందూరు : విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ యోగితా రాణా డ్వామా అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరును పరిశీలించారు. పని తక్కువగా ఉన్న సిబ్బందికి పనులను కేటాయించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి నమోదు చేయాలని, ఇందుకు టీంలుగా విడిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అంచనాలను వాస్తవానికి అనుగుణంగా సిద్ధం చేయాలని సూచించారు. విధులపై సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం చేస్తే చర్యలు తప్పవని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి డ్వామా పీడీ సునంద, విజిలెన్స్ అధికారి శ్రీహరి, అధికారులున్నారు. -
మొక్కలకు రక్షణ కల్పించాలి
హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయండి కలెక్టర్లకు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు నాటుతామని కలెక్టర్ యోగితా రాణా వెల్లడి ఇందూరు : హరితహారం కార్యక్రమంలో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసి, మొక్కల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారంపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, లక్ష్యానికి చేరువలో ఉన్న జిల్లాలను అభినందిస్తూనే, 40–45 శాతమే పూర్తి చేసిన విషయంలో బాగోలేదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. వచ్చే సంవత్సరంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంకా మొక్కలు కావాలని అడిగిన వారికి సరఫరా చేయడానికి తక్కువగా ఉన్న మొక్కలను మార్కెట్లో కొనుగోలు చేసి తెప్పించుకోవాలన్నారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తిచేయాలని సూచించారు. 82శాతం పూర్తి : కలెక్టర్ జిల్లాలో 3.35 కోట్ల మొక్కటు నాటే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 82 శాతం 2.76 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ యోగితా రాణా సీఎస్కు వివరించారు. మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉన్నామని, అంతే గాక వాటి రక్షణకు, నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే టేకు మొక్కలకు ఉపాధిహామీలో నీటిని అందించడానికి సదుపాయాలు లేనందున రూ.42 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఉపాధిహామీ ద్వార నాటిన మొక్కలకు ముళ్ల కంచె ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షల ట్రీ గార్డులు అవసరమని తెలిపారు. 15 రోజుల్లో ఫెన్సింగ్ పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. లక్ష్యాన్ని మించి మరిన్ని మొక్కలను నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని, రెండవ వారంలో ఇందు కోసం కార్యచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు. కాన్ఫరెన్స్లో ఎస్పీ విశ్వ ప్రసాద్, జేసీ రవీందర్ రెడ్డి, డీఎఫ్వోలు సుజాత, ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తునికాకు తుస్..!
టార్గెట్ చేరని దైన్యం... అందని బోనస్ ధైర్యం సేకరించాల్సింది 86,085 స్టాండర్డ్ బ్యాగ్లు సేకరించింది 52,814 స్టాండర్డ్ బాగ్యులే సంవత్సరం పెండింగ్ బోనస్ 2012–13 రూ.15.41 కోట్లు 2013–14 రూ.11.19 కోట్లు 2014–15 రూ.6.52 కోట్లు ఇల్లెందు: ఆదివాసీలు రెండో పెద్ద పంటగా భావించే తునికాకు సేకరణ ఈ ఏడు నిరాశజనకంగా సాగింది. సంకన జోలె, మెడలో నీటిబుర్ర వేసుకొని..అడవిలో కొండాకోనా..చెట్టూ పుట్టా తిరుగుతూ, దాడికి వచ్చే జంతువులతో పోరాడి కోసుకొచ్చే బీడీ ఆకు పల్చబడుతోంది. పోడు భూముల్లో యంత్రాలతో సాగు, ఫ్రూనింగ్ సమయంలో వానలు లేకపోవడంతో..ఆశించిన లక్ష్యం తుస్సుమంది. ఐదు నెలల పాటు సాగే ఆకుల పండగ..పూర్తిస్థాయిలో ఆదాయాన్నివ్వక..మూడేళ్లుగా పెండింగ్ బోనస్ అందక..జిల్లాలో బీడీ పరిశ్రమ ఏర్పాటు ఆచరణకు నోచక అడవిబిడ్డలకు ఆపసోపాలు తప్పడం లేదు. జనవరి నుంచి మే వరకు ఐదు నెలల పాటు జిల్లాలో తునికాకు సేకరణ నిర్వహిస్తారు. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ డివిజన్ల పరిధిలో విస్తారంగా, ఖమ్మం డివిజన్లోని కారేపల్లి, కామేపల్లి, తల్లాడ పరిసరా ప్రాంతాల్లో నామమాత్రంగా ఇలా మొత్తం 29 మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు దీనిని రెండో ప్రధాన పంటగా భావిస్తారు. పిల్లలు, పెద్దలు అడవిలో ఆకులు సేకరిస్తారు. 50 ఆకులతో ఒక కట్టను కడతారు. ఇలా వెయ్యి కట్టలతో ఒక స్టాండర్డ్ బ్యాగుగా రూపొందిస్తారు. గతేడాది కొత్తగూడెం డివిజన్లో 50 ఆకుల కట్ట రేటు రూ.1.30 ఉండగా ఈ ఏడాది సీజన్లో రూ. 1.36 పైసలకు సాధించుకున్నారు. భద్రాచలం డివిజన్లో ఒక్క స్టాండర్డ్ బ్యాగుకు ప్రభుత్వ ధర రూ.1,290 ఉండగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రూ.1,250గా నిర్ణచించారు. 2015–16లో 67.66 శాతం తునికాకు సేకరణ సాగగా, ఈ ఏడాది జిల్లాలో 47 యూనిట్లలో 86.085 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యం కాగా 52. 814 స్టాండెర్డ్ బ్యాగులు సేకరించారు. అంటే 61.23 శాతమే సాధ్యమైంది. తునికాకు సేకరణ ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల ఆదాయం లభిస్తుంది. జిల్లాలోని 47 యూనిట్లలో 976 కల్లాల్లో లక్షమందికిపైగా కార్మికులకు ఇది మంచి ఆదాయ వనరు. రాజకీయ, స్వచ్ఛంద సంఘాల పోరాటంతో తునికాకు కట్ట రేటు పెరిగినా..ఆకు సేకరణ గణనీయంగా తగ్గిపోతుండటంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దక్కని బీడీ పరిశ్రమ..కార్మికులకేదీ ధీమా జిల్లాలో ఏటా లక్షమందికి పైగా కార్మికులు తునికాకు సేకరిస్తున్నా..కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా..జిల్లాలో బీడీ పరిశ్రమ మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వేసవి కాలం వచ్చిందంటే ఆదివాసీలకు తునికాకు రెండో అతిపెద్ద పంట. సీజన్పై గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూసే ఆదివాసులకు ఆదాయం చేకూర్చేందుకు ఇక్కడే ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. ఆకు సేకరించి కాంట్రాక్టర్లకు కల్లాల్లో అప్పగించే గిరిజనులు..నేరుగా ఆదాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇళ్ల వద్దే ఉంటూ..బీడీలు చుట్టడం, ఆకు కత్తిరించడం ద్వారా ఉపాధి కల్పించే వీలు కల్పించడం లేదు. జిల్లాని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలో నాణ్యమైన ఆకు లభిస్తుండడంతో..ఎక్కడో ఓ చోట బీడీ పరిశ్రమ ఏర్పాటు అవుతుందని ఏళ్లుగా ఆశపడుతున్న ఆదివాసీలు, గిరిజనులకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. -
నెలాఖరులోగా టార్గెట్ పూర్తి చేయాలి
ప్రతి మొక్కను సంరక్షించాలి అడవిని నాశనం చేయిస్తే కఠిన చర్యలు విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల సాక్షిప్రతినిధి, ఖమ్మం హరితహారం కార్యక్రమం కింద జిల్లాలో పెట్టుకున్న లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం డీసీసీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటారని, ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. మొక్కల సంరక్షణకు ఒక్కోదానికి రూ.85లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, సింగరేణి ఆధ్వర్యంలో కూడా రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. దేశస్థాయిలో చూస్తే జిల్లాలో అటవీ విస్తీర్ణం ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయిందని, దీనికి సామాజిక, రాజకీయ కారణాలు అనేకం ఉన్నాయన్నారు. గిరిజనుల బతుకులను బుగ్గిపాలు చేయవద్దని, సమాజ వ్యతిరేక కార్యకలాపాలను ప్రొత్సహించే పార్టీలు ఏవీ బాగుపడలేదన్నారు. కన్నతల్లి లాంటి అడవిని సంరక్షించుకోవాలని, అడవిని నాశనం చేయాలనే చూసే వారిపై కఠినంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, కలెక్టర్ డీఎస్.లోకేశ్కుమార్, జేసీ దివ్య, అటవీశాఖ చీప్ కన్జర్వేటర్ రఘువీర్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయ సెస్సు వసూలు లక్ష్యం రూ.కోటి
శ్రీకాకుళం కల్చరల్ : గ్రంథాలయ సెస్సు వసూలు లక్ష్యం కోటి రూపాయలుగా నిర్ణయించమని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరికట్ల విఠల్రావు అన్నారు. పట్టణంలోని గ్రంథాలయ సంస్థలో కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యుు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాల్డుతూ ఈ ఏడాది రూ.40 లక్షల మేర గ్రంథాలయ సెస్సు వసూలైందన్నారు. గత ఏడాది రూ.60లక్షలు వసూలైందని చెప్పారు. ఈ ఏడాది కోటి రూపాయలు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందడుగువేస్తున్నామని అన్నారు. గార, కోటబొమ్మాళి, కొత్తూరు గ్రంథాలయాలకు నూతన భవనాలు కోసం రూ.20లక్షలతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో పనిచేయని 14 బుక్ డిపాజిట్ కేంద్రాలను రద్దు చేసి, అవసరం ఉన్న చోట వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాజాం శాఖా గ్రంథాలయం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయినందున త్వరలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ నిర్వాహకులు విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వజ్రపుకొత్తురు గ్రంథాలయాధికారి క్రమశిక్షణ ఉల్లంఘించడంతో సస్పెన్షన్ విధించామన్నారు. ఈ సందర్భంగా 2016–17 ఏడాదికి గాను పౌరగ్రంథాలయ సంచాలకుల ఆమోదంతో వచ్చిన బడ్జెట్లోని అంచనాలను, వివిధ పద్దుల కింద కేటాయింపులను సభ ఆమోదించింది. సమావేశంలో సంస్థ కార్యదర్శి కె.కుమారరాజా, బోర్డు డైరెక్టర్ తెలుగు నాగేశ్వరరావు, డీపీఆర్వో ఎల్.రమేష్, డీపీవో కార్యాలయ పరిపాలనాధికారి నారాయణరావు, వయోజన విద్య సహాయ ప్రాజెక్టు అధికారి కె.డొంబు, డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్ ఏ.వి.ప్రసాద్ పాల్గొన్నారు. -
వారంలోగా హరితహారం టార్గెట్ పూర్తి
కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ నేలకొండపల్లి: మొక్కలు నాటడం, పెంపకం కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని మరో వారంలోగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీఎస్.లోకేష్కుమార్ స్పష్టం చేశారు. సోమవారం నేలకొండపల్లి మండలం ఆరెగూడెం, కోనాయిగూడెం గ్రామాల్లో హరితహారం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..జిల్లాలో 3.9 కోట్ల మొక్కలు నాటాలన్నది టార్గెట్ అని, ఇప్పటికే 1.9 కోట్ల మొక్కలను నాటించామని తెలిపారు. మరో వారంలో మిగిలిన మొక్కలు కూడా నాటించాలన్నది లక్ష్యంగా వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా నాటాలని, కాల్వ కట్టలపై మొక్కలు వేయించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు కూడా మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించినట్లు వివరించారు. ప్రతి మండలంలో హోం సీడ్ మొక్కలను ఐదు వేల వరకు నాటేలా చూడాలన్నారు. నాటిన మొక్కలను డిసెంబర్ వరకు సంరక్షించుకోవాలని, ఆ తర్వాత అవే ఎదుగుతాయని తెలిపారు. ఆన్లైన్ ఇబ్బందుల వల్ల దాదాపు 29 వేల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మ్యాన్యువల్ పహనీలు ఇప్పిస్తామని, రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ.3300 కోట్ల రుణాలకు గాను రూ.1100 కోట్లు చెల్లించామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ వసంత, ఈజీఎస్ ఏపీఓ సునీత, ఏఓ నారాయణరావు, సర్పంచ్ కొమ్మినేని కృష్ణయ్య, ఈఓఆర్డీ ప్రభాకర్, వీఆర్వో చైతన్యభారతి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం 3 కోట్లు
జిల్లాలో 1.19కోట్ల మొక్కలు నాటాం హరితహారం జిల్లా ప్రత్యేకాధికారి నారాయణఖేడ్: హరితహారంలో భాగంగా జిల్లాలో 1.19కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ విజిలెస విభాగం అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, మెదక్ జిల్లా హరితహారం ప్రత్యేక అధికారి రాకేష్ డిబ్రియాల్ తెలిపారు. శనివారం నారాయణఖేడ్ ప్రాంతంలో హరితహారాన్ని పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా మొత్తంలో 3కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా 1.19కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 14కోట్ల మొక్కలు నాటడం లక్ష్యమని వివరించారు. అనంతరం ఆయన మండలంలోని ర్యాలమడుగు, నిజాంట్, హన్మంత్రావుపేట్, మాద్వార్, కాంజీపూర్ పరిధిలోని అటవీ భూములను పరిశీలించారు. నారాయణఖేడ్ రేంజి పరిధిలో 2.70లక్షల మొక్కలు అటవీ భూముల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించి నాటుతున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో రేంజ్ అధికారి గణేశ్, సబ్రేంజ్ అధికారి విజయ్కుమార్ పాల్గొన్నారు. -
హరితహారంలో బీర్కూర్ టాప్
బీర్కూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో బీర్కూర్ మండలం జిల్లాలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. లక్ష్యానికి మించి మొక్కలు నాటి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. మండంలో 6.80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా, 7.22 లక్షల మొక్కలు నాటి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలిచింది. మొత్తం 106 శాతం మొత్తం నాటినట్లు ప్రత్యేకాధికారి, డీఎల్పీవో హనూఖ్ తెలిపారు. ప్రణాళిక బద్దంగా ముందుకు.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికబద్దంగా ముందుకెళ్లారు. మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో హనూక్, తహసీల్దార్ కిష్టానాయక్, ఎంపీడీవో భరత్కుమార్ సారథ్యంలో అన్ని శాఖల అధికారులను రెండు బృందాలుగా విడిపోయారు. పల్లె నిద్ర చేస్తూ హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపాధి హామీ ఏపీవో హలీం అక్మల్, క్షేత్రస్థాయి సిబ్బంది, గ్రామస్తులంతా కలిసి సమష్టిగా కదిలారు. లక్ష్యాన్ని అధిగమించి మొక్కలు నాటారు. ఎంపీపీ మల్లెల మీనా, మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు కిషన్నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపునకు అవకాశాలు.. వ్యవసాయ దినోత్సవం రోజున అన్ని గ్రామాల్లోని పొలం గట్లపై టేకు మొక్కలు నాటారు. శనివారం ఎక్సైజ్ డే సందర్భంగా తిమ్మాపూర్లోని చెరువు కట్టపై మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి సహా ప్రజలు ఈత మొక్కలు నాటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, కూలీలు భాగస్వాములై టార్గెట్ను పూర్తి చేశారు. లక్ష్యం సాధించిన తొలి మండలంగా నిలిచిన బీర్కూర్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని డీఎల్పీవో హనూఖ్ తెలిపారు. మండలంలోని 17 పంచాయతీల్లో వంద శాతం మొక్కలు నాటడంతో కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అభినందనలు.. లక్ష్యాన్ని అధిగమించి జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన బీర్కూర్ మండల ప్రజలకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిస్తే జిల్లాలో తన సొంత నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం టాప్ ప్లేస్లో నిలవడం హర్షణీయమన్నారు. ప్రతి పంచాయతీలో 40 వేల మొక్కలు నాటే వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. -
లక్ష్యం చేరేలా మెుక్కలు నాటాలి
ఎస్పీ జోయల్డేవిస్ గంగాధర : జిల్లా పోలీస్శాఖ దత్తత తీసుకున్న అన్ని గ్రామాల్లో లక్ష్యం మేరకు మెుక్కలు నాటాలని ఎస్పీ జోయల్డేవిస్ అన్నారు. గంగాధర పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని కురిక్యాల శివారులోని బొమ్మలమ్మగుట్ట సమీపంలో నిర్వహించిన హరితహారంలో ఎస్పీ మొక్కలు నాటారు. గ్రామాల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఎంపీపీ దూలం బాలాగౌడ్, కురిక్యాల, కొండన్నపల్లి సర్పంచులు నేరెళ్ల భూమాగౌడ్, ఉప్పుల అంజలి, ఎంపీటీసీ నందయ్య, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ రేండ్ల పద్మకిరణ్, వైస్ చైర్మన్ ఎండీ నజీర్, డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ లక్ష్మీబాబు, ఎస్సైలు నీలం రవి, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. -
క్లీన్ సిద్దిపేట .. ఇక గ్రీన్ సిద్దిపేట
‘లక్ష’ణంగా లక్ష్యం సాధించారు మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్దిపేట మున్సిపాల్టీ బొట్టు, చెట్టుతో సత్ఫలితాలు పేటలో 1.29 లక్షల మొక్కలు నాటిన ప్రజలు సిద్దిపేట జోన్: గ్రీన్ సిద్దిపేటగా మార్చాలనే మంత్రి హరీశ్రావు ఆశయానికి సిద్దిపేట మున్సిపాల్టీ చేయూతగా నిలిచింది. వినూత్న పథకాల ప్రయోగాలతో దేశ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాల్టీ హరితహారంలో మరోరికార్డు సొంతం చేసుకుంది. ఇటీవల సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో ఒకే రోజు లక్ష మొక్కలను నాటి రికార్డు సొంతం చేసుకున్న విషయం విదితమే. అలాగే పట్టణ పరిధిలో అత్యధికంగా మొక్కలు నాటి సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ మరో రికార్డు సాధించింది. హరితహారంలో భాగంగా 1, 29 లక్షల మొక్కలను నాటిన సిద్దిపేట మున్సిపల్ యంత్రాంగం మెగా ప్లాంటేషన్లో భాగంగా ఒక్కరోజే 86, 278 మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి మొక్కను అందించే లక్ష్యంతో మున్సిపల్ యంత్రాంగం డ్వాక్రా మహిళ సంఘాల సౌజన్యంతో బొట్టు, చెట్టు అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి డ్వాక్రా మహిళలు బొట్టు పెట్టి మొక్కలను అందించి హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రతి వ్యక్తికి మొక్కను పంపిణీ చేసిన మున్సిపల్ అధికారులు దత్తత అంగీకార పత్రాన్ని అందజేసి మొక్క పరిరక్షణ బాధ్యతను ప్రజలపైనే పెట్టడం నిరే్ధశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు దోహదపడింది. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో 28 వేల నివాస గృహాలు ఉండగా, 1.5 లక్షల జనాభా ఉంది. పట్టణంలోని 34 వార్డుల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ప్రభుత్వం నిరే్ధశించింది. అ దిశగానే మంత్రి హరీశ్రావు గత నెలలో హరితహారాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు సమీక్షలు నిర్వహించారు. ఉద్యమం తరహాలో హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సిద్దిపేట మున్సిపాల్టీకి ప్రభుత్వం ఈ యేడు 50 వేల మొక్కలు నాటాలని నిరే్ధశించింది. క్లీన్ సిద్దిపేటగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేటలో ప్రభుత్వ లక్ష్యాన్ని రెట్టింపు చేసి లక్ష మొక్కలు నాటి గ్రీన్ సిద్దిపేటగా మార్చాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ దిశగా పట్టణంలోని 34 వార్డుల ప్రజాప్రతినిధులును, విద్యాసంస్థలను, స్వచ్ఛంద సంఘాలను, ఆధికారులను ఐక్యం చేసి హరితహరాన్ని ప్రారంభించారు. రెండేళ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తూ.. సిద్దిపేటలో గతేడాది సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించిన హరితహారం కార్యాక్రమ స్పూర్తితో సిద్దిపేట మున్సిపల్ అధికారులు వరుసగా రెండేళ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంలో ప్రభుత్వ నిరే్ధశిత లక్ష్యాన్ని పూర్తి చేశారు. గతేడాది మున్సిపల్ శాఖ పట్టణానికి 75 వేల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిరే్ధశించింది. ఈ క్రమంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా హరితహారాన్ని చేపట్టి 1.25 లక్షల మొక్కలు నాటారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 50 వేల మొక్కలు నాటాలని సూచించగా గత కొన్ని రోజులుగా ప్రణాళికాబద్ధంగా హరితహరాన్ని నిర్వహించి ఈ నెల 18వ తేదీ నాటికి పట్టణంలో 1,29,638 మొక్కలను నాటారు. మెగా ప్లాంటేషన్ సందర్భంగా సోమవారం ఒక్కరోజే పట్టణంలో 86,278 మొక్కలను మున్సిపల్ ఆధ్వర్యంలో నాటారు. పక్కాగా ప్రణాళిక .. సిద్దిపేటను గ్రీన్ సిద్దిపేటగా మార్చాలనే మంత్రి ప్రణాళికను అధికార యంత్రాంగం నిర్ధేశిత లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించింది. పట్టణంలోని 28 వేల ఇండ్లకు 22 వేల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ప్రధానంగా మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, బాదం, ఖర్జూర, బొప్పాయ లాంటి పండ్ల మొక్కలతో పాటు నాలుగు రకాలు ఆయుర్వేద మొక్కలు అందజేశారు. మొక్కలను పరిరక్షించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య టౌన్ప్లానింగ్ విభాగం ఆద్వర్యంలో దత్తత పత్రాలను రూపొందించి ప్రతి వ్యక్తికి వాటిని అందజేసి వారి ద్వారా మొక్క దత్తతను అధికారికంగా తీసుకున్నారు. దీనికి తోడు మహిళల్లో చైతన్యం, స్ఫూర్తి కలిగించేందుకు మున్సిపాల్టీకి చెందిన మెప్మా విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు బొట్టు పెట్టి మొక్కను అందించి హరితహారం యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని డ్వాక్రా సంఘాలు పిలుపునిచ్చాయి. సమిష్టిగా రూపొందించిన హరితహారం నిరే్ధశిత లక్ష్యాన్ని సిద్దిపేట మున్సిపల్ అధిగమించినప్పటికి ఈ నెల చివరి వరకు కొనసాగింపు దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. గ్రీన్ సిద్దిపేట నా స్వప్నం హరితహారంలో భాగంగా దశల వారిగా పట్టణాన్ని గ్రీన్ సిద్దిపేటగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. గత యేడాది, ఈ యేడు పెద్ద ఎత్తున పట్టణంలో మొక్కలు నాటాం. ప్రతి ఒక్కరు నాటిన మొక్కను పరిరక్షించాలి. – హరీశ్రావు, నీటిపారుదల శాఖ మంత్రి -
ఆరు కోట్ల చేప పిల్లల ఉత్పత్తే లక్ష్యం
లక్ష్యసాధనలో కడెం సిబ్బంది కడెం కేంద్రంలో సమస్యల తిష్ట కడెం : కడెంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో శనివారం నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్రంలో వివిధ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేసి వాటిని ఫారం పరిధిలోని మత్స్యకార్మిక సంఘాలకు పంపిణీ చేస్తారు. ఏటా ప్రభుత్వం కేంద్రానికి చేప పిల్లల ఉత్పత్తికోసం ఒక లక్ష్యాన్ని ప్రకటిస్తుంది. ఈసారి ఆరు కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా సిబ్బంది ఆ దిశగా కషి చేస్తున్నారు. కేంద్రంలో పిల్లల ఉత్పత్తికి అవసరమైన 46 హౌజ్లుండగా పలు సమస్యలూ ఉన్నాయి. జలాశయంలోకి నీరు రావడంతో.. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టు జలాశయంలోకి నీరు పెద్ద మొత్తంలో రావడంతో అధికారులు ఉత్పత్తి ప్రారంభించారు. మొదట మిరుగాల, రహు, బొచ్చ రకం చేపల ఉత్పత్తి చేపట్టారు. తల్లి చేపకు ఇంజక్షన్ల ద్వారా గర్భం వచ్చేలా చేసి మగ చేపలతో వాటిని ఫలదీకరణ చేయిస్తారు. ఈ ప్రక్రియను స్వయంగా అధికారులే చేపడతారు. ఇలా ఫారంలోని హాచరీలో ఆ గుడ్డును వేసి రెండు రోజుల వరకు నీటితో సర్క్యులేషన్ చేయగా దాని నుంచి పిల్లలు విడుదలవుతాయి. ఇలా ఆ చిరుచేప పిల్లలను ఉత్పత్తి చేయగా వాటిని 45రోజుల వరకు నర్సరీలో వాటికి అవసరమైన పల్లిపిండి, తౌడు తదితర ఆహారం వేస్తూ జాగ్రత్తగా పెంచుతారు. 45రోజుల తర్వాత అవి ఒక ఇంచు సైజులో పెరుగుతాయి. అపుడు వాటిని జిల్లాలోని గుర్తింపుగల 264 మత్స్యకార సంఘాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తారు. అధికారుల పర్యవేక్షణలో.. హౌజుల్లో వేసిన పిల్లలకు ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి సిబ్బంది రోజూ వేస్తారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కడెం ప్రాజెక్టు జలాశయంలో కూడా వర్షాకాల సీజన్ తర్వాత ఆ పిల్లలను వదులుతారు. ప్రస్తుతం తల్లి చేపలు పిండోత్పత్తి దశలో ఉన్నాయి. దీంతో ఆ జాతి చేపలు నశిస్తాయన్న కారణంతో మత్స్య కార్మికులను ఈ సమయంలో చేపల వేటకు అనుమతించరు. ఈ సారి 6కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం ఉండడంతో లక్ష్య సాధన దిశగా అంతా కషి చేస్తున్నారు. అంతేగాక దోమల నివారణ కోసం ప్రస్తుతం కేంద్రంలో 4 లక్షల గంబూజియా చేపలున్నాయి. మురికికాల్వల్లో నీటి గుంతల్లో నిల్వ ఉండే దోమ లార్వాను ఈ చేప పిల్లలు చంపేస్తాయి. వాటిని ఆయా పంచాయతీలకు ఉచితంగా సరఫరా చేస్తారు. కేంద్రంలోని సమస్యలు కేంద్రంలో సమస్యలు తిష్ట వేశాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. ఉన్న కొద్ది మంది కేంద్రంలో కాకుండా బయట ఉంటున్నారు. సిబ్బంది కోసం దశాబ్దాల క్రితం నిర్మించిన గదులు శిథిలావస్థకు చేరాయి. నాలుగైదేళ్లుగా కేంద్రానికి ఇన్చార్జి అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం చుట్టూ కంచె లేదు. పశువులు విచ్చల విడిగా సంచరిస్తుంటాయి. కేంద్రం ప్రాంగణం అంతా గుంతలుగా ఉంది. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. ఫారం అంతా సిమెంట్తో ఫ్లోరింగు, కేంద్రంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని సాధిస్తాం కేంద్రం నిర్వహణకు రూ.6లక్షలు మంజూరు కాగా చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించాం. లక్ష్యాన్ని సాధించేందుకు కషి చేస్తున్నాం. సిబ్బంది సరిపడా లేరు. భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించాం. కేంద్రాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. గంబూషియా చేప పిల్లలు ఉచితంగా అందజేస్తాం. -
లక్ష్యం..దూరం
నత్తనడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో నివాసమున్న కుటుంబాలు : 4,77,712 వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న కుటుంబాలు: 2,61,992 ఈ ఏడాది వందగ్రామాల్లో లక్ష్యం: 20,000 ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లు: 4200 వివిధ దశల్లో ఉన్న మరుగుదొడ్లు: 2600 ఇంకా మొదలుపెట్టనివి: 13,200 కడప ఎడ్యుకేషన్: సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే దిశగా జిల్లాలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రెండేళ్లు గడిచినా మరుగుదొడ్ల నిర్మాణంలో ఆశించిన పురోగతి మాత్రం కన్పించడంలేదు. గ్రామీణ ప్రాంతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్న చోట కొంత ఫర్వాలేదనిపించినా నూరుశాతం సాధించడంలో మాత్రం వెనుకబడిపోయారనే చెప్పొచ్చు. జిల్లాలో 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 51 మండలాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే లక్ష్యంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువ కింద 2,61,992 కుటుంబాలను గుర్తించారు. ఇందులో భాగంగా 790 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో 2015-16కు గాను 59 పంచాయతీల్లో గత ఏడాది 11,225 మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లబ్ధిదారులు సహకరించకపోవడం, సరైన అవగాహన లేకపోవడంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు వెనుకబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది 2016-17 ఏడాదికి గాను వంద గ్రామ పంచాయతీల్లో 20 వేలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో ఇప్పటికి 4200 మరుగుదొడ్లను పూర్తి చేయగా, 2600 వివిధ దశల్లో ఉన్నాయి. ఈ లక్ష్యం 2017 మార్చి నాటికి కనుక ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో భాగంగా మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం వచ్చే వారికి అవగాహన కల్పించడంతోపాటు వారికి అవసరమైన డాటాను నమోదు చేసేందుకు మండలానికి ఒక ఎమ్మార్పీని ఈ ఏడాది ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల్లో నిర్లిప్తత వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో మంజూరు చేసిన నిధుల కంటే అధికంగా పెంచి రూ. 15 వేలు చొప్పున నిధులను మంజూరు చేస్తోంది. గతంలో నిధులు తక్కువగా మంజూరు చేయడం, లబ్దిదారులు సైతం సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు పెంచి మంజూరు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నిర్లిప్తత కనిపిస్తోంది. ఆరుబయట మలవిసర్జన వల్ల పారిశుద్ధ్య సమస్య, నీరు కలుషితం కావడం వంటి ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అయితే వీరిలో చైతన్యం తీసుకువచ్చే విధంగా అవగాహన సదస్సులతోపాటు ప్రదర్శనలు నిర్వహిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుంది. -
100 మంది యువకులను మోసగించి...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనీ ట్రాప్ గ్యాంగ్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఉద్యోగాలు చేస్తూ సోషల్ మీడియాను వినియోగించే యువకులే లక్ష్యంగా ఈ గ్యాంగ్ లు నడుస్తున్నాయి. నగరంలో తాజాగా జరిగిన ఓ సంఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఢిల్లీ హోం గార్డు శాఖకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా యువకులను మోసగించి డబ్బులు దోచుకున్నట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పనిచేసే పైలట్ ను ఓ ముఠా బెదిరించి రూ.9.70 లక్షలు దోచుకుందని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన సియా అనే అమ్మాయితో గత ఏడాది ఫ్రెండ్ అయ్యాడని, కొద్ది రోజుల చాటింగ్ తర్వాత ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఆమె తన ఫ్లాట్ కు వెళ్దామని చెప్పిందని, దారిలో సలోని అనే మరో అమ్మాయిని తన స్నేహితురాలిగా అతని కి పరిచయం చేసిందని తెలిపారు. వాళ్లిద్దరితో కలిసి ఫ్లాట్ కు వెళ్లగా.. ఉన్నట్టుండి సియా తనను సలోనితో వదిలేసి బయటకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు పోలీసు అధికారుల్లా నటించి అతన్ని ఓ గదిలో బంధించి యువతిని రేప్ చేశావని నిందించారని చెప్పారు. యువతిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారని వివరించారు. బాధితుడిపై రేప్ కేసు పెడతామని బెదిరించారని చెప్పారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.10 లక్షలకు కేసును మూసేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఘటన జరిగిన కొన్ని నెలల వరకు మామూలుగానే ఉన్న ఈ ఏడాది మార్చిలో కోర్టులో కేసు ఇంకా పెండింగ్ ఉందని, యువతి కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని కేసు సెటిల్ చేయడానికి మరో రెండు లక్షలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశారని చెప్పారు. కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బాధితుడిని బెదిరించిన ఫ్లాట్ అద్దెకు తీసుకుందని పోలీసులు తొలుత నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ఢిల్లీ హోం గార్డులో పనిచేసే అధికారి జగ్తిందర్ సింగ్ గా గుర్తించి అరెస్టు చేశారు. సింగ్ ఇచ్చిన వివరాల ప్రకారం మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఆర్ధికంగా బలంగా ఉన్నవ్యక్తులను తాము సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి డబ్బులు గుంజినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. -
స్వామి అసలు టార్గెట్ జైట్లీ:దిగ్విజయ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ రేసులో ఉన్న ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న స్వామి అసలు టార్గెట్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ.. స్వామికి ఆర్థికమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారని అందుకే స్వామి అరవింద్ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని సింగ్ వ్యాఖ్యలు చేశారు. మోదీకి స్వామికి మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగానే స్వామి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామి అసలు టార్గెట్ రఘురాం రాజన్, అరవింద్ సుబ్రమణ్యంలు కాదని అరుణ్ జైట్లీ అని దిగ్విజయ్ స్పష్టం చేశారు. అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్కు 2013లో సూచించారని, జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి అరవింద్ సుబ్రమణ్యం చెప్పారని స్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
దళితులను ‘పంది’తో పోల్చిన ఎమ్మెల్యే
ముంబై: దళితులను అభ్యున్నతి గురించి మాట్లాడుతూ వారిని పందితో పోల్చిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నెల 17న థానే జిల్లాలో జరిగిన ఓ మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే దొంబివ్లీ రవీంద్ర చవాన్ దళితుల అభ్యున్నతిపై ఉపన్యసిస్తూ వారిని పందితో పోల్చారు. అబ్రహం లింకన్ డ్రైనేజీలోని పందిని తీసి శుభ్రం చేసిన తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా దళితుల అభ్యన్నతికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ అభ్యతరంకరమైన వ్యాఖ్యలపై ఆన్లైన్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై నిరసన చేపట్టిన ఎన్సీపీ ఆ పంది పేరు రవీంద్ర చవాన్ అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన చవాన్ తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, దళితులపై అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, తన వ్యాఖ్యల వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. -
టార్గెట్ రూ. 40 కోట్లు!
► పూటుగా తాగించే యత్నం ► దుకాణదారులకు అబ్కారీ శాఖ హుకుం ► బీరు కావాలంటే దారి మార్చండి ► పెరిగిన బీరు వినియోగంతో ఇక్కట్లు ప్రజారోగ్యం ఎలా పోతే తమకేంటన్న ధోరణిలో పాలకులు ముందడుగు వేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఎండల తీవ్రత నేపథ్యంలో బీరుకు డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. దీంతో బీర్లు కావాలంటే ఇతర మద్యం కొనుగోలు చే సి ఆదాయ లక్ష్యాన్ని పెంచుకునేందుకు అబ్కారీ శాఖ వినూత్నంగా ఆలోచించింది. బీరు కావాలంటే ఇతర మద్యం కూడా తీసుకోవాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. ఓ వైపు మండే ఎండల్లో బీరు కొరత ఏర్పడగా మరో వైపు యువత ఎక్కువగా బీరు మత్తులో మునిగి తేలుతుండడంతో ఇదే అదనుగా వ్యాపారాన్ని పరుగులెత్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం టౌన్/సిటీ : కొద్ది రోజుల కిందట రోను ప్రభావంతో రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తరువాత క్రమేణ మళ్లీ ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. మద్యం ప్రియులు మరింత బేజారెత్తిపోతున్నారు. ఇదే అదనుగా తెగ తాగేస్తున్నారు. ఇదేమి తాగుడు ఇంకా తాగించండంటూ పరోక్షంగా ప్రభుత్వమే సంబంధిత అబ్కారీ శాఖ అధికారులను ప్రోత్సహిస్తుంది. ఇదే అదను ఇంకా తాగించేయండి...ఆదాయ లక్ష్యాన్ని మరింత పెంచండంటూ హుకుంలు జారీ అవుతుండడంతో మద్యం ప్రియులు మరింత మత్తులో జోగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, పలాస అబ్కారీ డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 232 మద్యం దుకాణాలు, 18 బార్లు నడుస్తున్నారుు. వీటి పరిధిలో ప్రతి నెలా రూ.20 నుంచి 30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నారు. మండే ఎండల నడుమ బీరుకు మరింత డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో వ్యాపారుల మధ్య అధికారులు పోటీ పెట్టి మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు వ్యూహాన్ని రూపొందించి వెంటనే అమలు చేశారు. దుకాణదారులు ఇదే అదనుగా మద్యం అమ్మకాలను పెంచుకునేందుకు అవకాశం లేక బీర్లు పొంగించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పెరిగిన బీర్ల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్న నిల్వలన్నీ ఖాళీ కావడంతో కొద్దిపాటి నిల్వలకు తోడుగా మద్యం లిప్టు చేయడానికి ప్రయత్నించి సఫలమవుతున్నారు. ఈ సీజన్లో రూ.40 కోట్ల మేర మద్యం తాగించాలని జిల్లా అధికారులు నిర్ణయించి ఈ పోటీ పెట్టారని మద్యం వ్యాపారులే గుసగుసలాడుకుంటున్నారు. మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు జిల్లాలో అబ్కారీ శాఖ కొత్తగా బీరు కావాలంటే మందు కొనాల్సిందేనంటూ కొత్త నినాదం తీసుకొచ్చింది. ఈ రకంగా మరింత మద్యం జిల్లాలో ఏరులై పారిస్తే తప్ప ప్రభుత్వ ఆదాయూన్ని పెంచుకోలేమని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా మద్యం వ్యాపారులతో మాట్లాడి అమ్మకాలపై మద్యంతర ఆదేశాలిచ్చారు.మద్యం లిప్టు చేయని దుకాణాలకు బీరు అమ్మబోమని తెగేసి చెప్పడంతో దుకాణదారులు బీరు కోసం బారులు తీరక తప్పడం లేదు. సిండికెట్లు రంగంలోకి దిగి ఇదే అదనుగా బీరుల ధరలు పెంచుకునేందుకు కొత్త రేట్లు నిర్ణరుుంచేశారు. దీంతో అబ్కారీ గోదాం వద్ద వ్యాపారులు బారులు తీరుతున్నారు. -
'ఐదు నిమిషాల్లో ఢిల్లీని టార్గెట్ చేయగలం'
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో భారత్ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేయగలదని పాక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పితామహుడు డా. అబ్దుల్ ఖాదీర్ ఖాన్ అన్నారు. న్యూక్లియర్ పరీక్షలు మొదలుపెట్టి 18వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1984లోనే మొదలు కావాల్సిన న్యూక్లియర్ పరీక్షలు అప్పటి ప్రెసిడెంట్ జనరల్ జియా ఉల్ హక్ కారణంగా 1998 వరకు ఆగాల్సి వచ్చినట్లు వివరించారు. రావల్పిండిలోని కహుతా న్యూక్లియర్ పరీక్షల కేంద్రం నుంచి ఢిల్లీని ఐదు నిమిషాల్లో టార్గెట్ చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి పాక్ న్యూక్లియర్ పరీక్షల్లో భాగస్వామిగా ఉన్న ఖాన్ కు అంతకుముందు జీవితకాలం హౌస్ అరెస్టు శిక్షను విధించారు. 2009లో ఇస్లామాబాద్ కోర్టు ఖాన్ ను స్వతంత్ర పౌరుడిగా ప్రకటించింది. తన సహకారం లేకుంటే పాకిస్తాన్ న్యూక్లియర్ శక్తిని సాధించిన మొదటి ముస్లిం దేశంగా చరిత్ర సృష్టించేది కాదని అన్నారు. మాజీ ప్రధాని ముషారఫ్ హయాంలో న్యూక్లియర్ శాస్త్రజ్ఞులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. దేశం నుంచి న్యూక్లియర్ ప్రయోగాలకు అతి తక్కువ ప్రోత్సహం ఉంటోందన్నారు. -
పక్కా ప్రణాళికతో భవితకు భరోసా
ఏదైనా లక్ష్యం సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎలాగైతే కీలకమో.. భవిష్యత్లో ఆర్థిక భద్రత పొందాలంటే కచ్చితమైన ప్లానింగ్ కూడా అంతే అవసరం. సాధారణంగా చిన్న చిన్న వాటికి కూడా ఆచితూచి ఖర్చు చేసే వారు సైతం.. భారీ పెట్టుబడుల విషయంలో కాస్త అశ్రద్ధ చూపుతుంటారు. ఆర్థిక లక్ష్యాలు, సాధనాలు మొదలైన వాటిపై పెద్దగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో లక్ష్యాలను చేరగలిగే తీరును వివరించేదే ఈ కథనం. ప్రణాళికకు కీలకమైనవి.. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దశలో ఏదో ఒక ఆర్థిక లక్ష్యం ఉంటుంది. సొంత ఇల్లు తీసుకోవడమో లేదా వాహనం కొనుక్కోవడమో లేదా పిల్లల చదువులు/వారి వివాహాలు, రిటైర్మెంట్ వంటి అవసరాలు ఉంటాయి. వీటిని ముందుగా గుర్తించి, ఆయా అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడంలో ఈ కింది అంశాలు తోడ్పడతాయి. * ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి * కాలవ్యవధి నిర్ణయించుకోవాలి * రిస్కు సామర్ధ్యాలను బేరీజు వేసుకోవాలి * రిస్కు సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడి సాధనాలకు నిధులు కేటాయించుకోవాలి * కెరియర్ తొలినాళ్లలో కాస్త రిస్కు తీసుకునే సామర్ధ్యం ఉంటుంది. ఎక్కువ రిస్కు ఉన్నా, అధిక వృద్ధికీ అవకాశముండే షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వల్పకాలానికి ఇవి కాస్త రిస్కీయే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులే అందించగలవు. ఇక, తర్వాత కాలంలో రిస్కు సామర్ధ్యం తగ్గుతూ రిటైర్మెంట్కు దగ్గరయ్యే కొద్దీ షేర్లు వంటి రిస్కీ సాధనాల్లో తగ్గిస్తూ.. స్థిరమైన రాబడులు ఇచ్చే డెట్ ఫండ్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటివైపు మొగ్గు చూపవచ్చు. ఈ క్రమంలో పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. * కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేలా జీవిత బీమా పాలసీ తీసుకోవడం * తగినంత వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవడం * రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం * వీలునామా కూడా రాసి ఉంచడం పెట్టుబడుల పరమార్థం .. ఏదైనా సాధనంలో మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఆశించేవి కొన్ని ఉంటాయి. అవి.. * స్థిరంగా రాబడులు * సదరు అసెట్ విలువ పెరగడం * అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు ఉండటం (లిక్విడిటీ) * భద్రత. పెట్టుబడుల విషయంలో రాబడులతోపాటు భద్రతకూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. * పన్నులపరమైన ప్రయోజనాలు * ప్రయోజనాలన్నీ అందించే సాధనాలు చాలా తక్కువ ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు స్థిరమైన ఆదాయం ఇస్తాయి కానీ వాటి విలువ పెరగదు. బంగారం, స్థలం విలువ దీర్ఘకాలంలో పెరుగుతుంది కానీ, స్థిరమైన ఆదాయం, పన్నుపరమైన ప్రయోజనాలూ పెద్దగా ఉండవు. రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ లిక్విడిటీ అంతగా ఉండదు. ఇక కొన్ని స్కీములు అత్యధిక రాబడులు ఇచ్చినా, అంత సురక్షితమైనవి కావు. మెరుగైన షేర్లు, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లాంటివి అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాయి. కానీ స్వల్పకాలికంగా మాత్రం వీటిలో రిస్కులు ఉంటాయి. పెట్టుబడి సాధనాలు.. * ఇన్వెస్ట్ చేసేందుకు అనేక సాధనాలు ఉన్నాయి. * బ్యాంక్ డిపాజిట్లు, ఎన్నారై డిపాజిట్లు: ఎఫ్సీఎన్ఆర్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో * నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో డిపాజిట్లు, ఇతరత్రా కంపెనీ డిపాజిట్లు * నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు * పసిడి, ఇతర విలువైన లోహాలు * నేషనల్ పెన్షన్ స్కీమ్ * పీపీఎఫ్, జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పోస్టాఫీస్ డిపాజిట్లు * షేర్లు, ఫండ్స్, ఈటీఎఫ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు * రియల్ ఎస్టేట్ వీటన్నింటిలో బ్యాంకు డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు, పీపీఎఫ్, ఎన్ఎస్సీల్లో రిస్కు చాలా తక్కువ. అలాగే రాబడులూ తక్కువగానే ఉంటాయి. ఇక స్టాక్స్, ఫండ్స్ లాంటి వాటిల్లో స్వల్పకాలికంగా రిస్కు ఉన్నా.. దీర్ఘకాలికంగా రాబడులు మెరుగ్గానే ఉండగలవు. గత పదేళ్ల చరిత్రను చూస్తే మిగతా సాధనాలను పోల్చి చూసినప్పుడు స్టాక్సే అధిక రాబడులు ఇచ్చినట్లు తెలుస్తుంది. స్టాక్స్లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్కి పన్నుపరమైన మినహాయింపులు లభిస్తాయి. కేటాయింపులు ఇలా.. రిస్కు సామర్ధ్యాలు, కెరియర్ దశలను బట్టి పెట్టుబడులకు కేటాయింపులు జరపాలి. కెరియర్ తొలినాళ్లలో అంటే దాదాపు 35 ఏళ్ల దాకా కాస్త దూకుడుగా, ఆ తర్వాత 50 ఏళ్ల దాకా కొంత బ్యాలెన్స్డ్గా, అటుపైన రిస్కులు మరింత తగ్గించుకునేలా పెట్టుబడులు ఉండాలి. షేర్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికాంశాలపై పట్టు ఉండాలి కాబట్టి.. అంతగా అనుభవం లేని వారు ఫండ్స్ ద్వారా పరోక్షంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) ఇందుకు అనువైనవి. బంగారం విషయానికొస్తే గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాంక్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్లో పెట్టుబడులనేవి.. అప్పటి వడ్డీ రేట్ల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక వీటన్నింటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా కనీసం ఆరు నెలల ఖర్చుల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంటులోనో లేదా లిక్విడ్ ఫండ్స్లోనో ఉంచుకోవడం శ్రేయస్కరం. - వీకే విజయకుమార్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్పీ పారిబా -
టెలిఫోన్ కార్యాలయాలే టార్గెట్
గండేపల్లి : టెలిఫోన్ కార్యాలయాలే లక్ష్యంగా కేబుల్ వైర్లను దొంగిలించి, అందులో రాగిని విక్రయించే ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపారకు చెందిన రూప శేషుబాబు, కంచర్ల సునీల్రాజా, అమ్మిశెట్టి బాలఫణీంద్ర కలిసి టెలిఫోన్ కార్యాలయాల్లో కేబుల్ వైర్లను దొంగిలించారు. అందులో రాగి తీగలను వేరుచేసి, విక్రయించారు. వీరికి పాత గుంటూరుకు చెందిన ఎస్కే మహమ్మద్ సహకరించాడు. గండేపల్లి టెలిఫోన్ కార్యాలయంలో గతేడాది అక్టోబర్లో ఈ ముఠా కేబుల్ వైర్లను దొంగిలించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నిందితులను నీలాద్రిరావుపేట వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. పలు జిల్లాల్లో 35 నేరాలు తూర్పుగోదావరిలో 24, పశ్చిమ గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, ప్రకాశం, విశాఖలో ఒకొక్క నేరానికి ఈ ముఠా పాల్పడింది. వీరి వద్ద నుంచి 610 కిలోల రాగి దిమ్మెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. నిందితులను పెద్దాపురం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై రజనీకుమార్, క్రైం సిబ్బంది బి.నరసింహరావు, పి.సత్యకుమార్, జీఎస్ఎన్ మూర్తికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు. -
కసిపెంచిన కష్టాలు
♦ అడ్డా కూలీ బిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంకు ♦ పేదింట విరిసిన కుసుమం...మౌనిక ♦ పట్టుదలే పునాదిగా రాణింపు ♦ కష్టాలు వెంటాడుతున్నా అద్వితీయ ప్రతిభ ♦ ఇంటర్లో 987(ఎంపీసీ) మార్కులతో.. ♦ రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు కైవసం గజ్వేల్/కొండపాక: తండ్రి ఓ అడ్డా కూలీ... తల్లి బీడీ కార్మికురాలు... కేవలం రెండెకరాల మెట్ట పొలం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. ఇవన్నీ ఆ విద్యార్థి లక్ష్యానికి అవరోధంగా మారలేదు. తనను ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే తల్లిదండ్రుల ఆశను తీర్చడానికి నిరంతరం శ్రమించింది. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ సెలవులు వచ్చినప్పుడల్లా కూలీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. కసిగా చదివి తాజాగా శుక్రవారం విడుదలైన ఇంటర్(ఎంపీసీ) 987/1000మార్కులతో రికార్డు సృష్టించింది. కష్టాలే తనలో విజయకాంక్షను రగిల్చాయని ఆ విద్యార్థిని చెబుతోంది. ఈ సందర్భంగా శనివారం ‘సాక్షి’తో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఆ వివరాలు..కొండపాక మండలం ధమ్మక్కపల్లి గ్రామానికి కూరాటి నర్సింలు. యాదమ్మకు మౌనిక(17), జ్యోతి(14), ప్రసాద్(13), మధు(9)లు సంతానం. నర్సింలు రెండెకరాల ఆసామి. వరుసగా నాలుగు బోరుబావులు వేసినా అవి ఫెయిల్ కావడంతో ఆశలు చాలించుకొని..ఆ భూమిలో ఏటా పత్తి, మొక్కజొన్న లాంటి మెట్టపంటలు సాగు చేసుకుంటున్నాడు. మూడేళ్లుగా కాలం కలిసి రాక వ్యవసాయంపై ఆశలు చాలించుకొని...అడ్డా కూలీగా స్థిరపడ్డాడు. గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద పనికెళ్తున్నాడు. గ్రామం చుట్టు పక్కల.. లేదంటే సిద్దిపేటకు పనికి వెళ్తుంటాడు. పనికి వెళ్లనిదే పూట గడిచే పరిస్థితి లేదు. నిత్యం పని వెతుక్కుంటాడు. యాదమ్మ బీడీలు చుడుతుంది. మౌనిక కొండపాకలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతోంది. ఇంటర్ చదువుతున్న మౌనికకు పేదరికం ఏనాడూ అవరోధంగా మారలేదు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి మాత్రం మౌనిక చలించిపోయింది. నిత్యం విజయకాంక్షతో రగిలిపోయింది. ఇంటర్ ఎలాగైనా రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా శ్రమించింది. తల్లిదండ్రులకు తోడూ అధ్యాపకుల ప్రోత్సాహం లభించడంతో లక్ష్యాన్ని సాధించడానికి బాటలు వేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 987/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకును సాధించి అందరినీ అబ్బురపరిచింది. ఐఏఎస్ కావడమే లక్ష్యం చిన్నప్పటి నుంచి కష్టాల్లో పుట్టిపెరిగాను. నేను బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్లికిక కష్టాలుండొద్దు. ఐఏఎస్ సాధించాలనేదే నా జీవిత లక్ష్యం. పాఠశాలలో నన్ను మ్యాథ్స్ లెక్చరర్ అక్బర్ సార్, ప్రిన్సిపాల్ జ్యూటికా వన్నీసా మేడమ్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి సహకారం జీవితంతో మరిచిపోలేను. చురుకైన విద్యార్థిని మా విద్యా సంస్థలో మౌనిక చాలా చురుకైన అమ్మాయి. ఇలాంటి విద్యార్థిని మా విద్యాసంస్థలో ఉన్నందుకు సంతోషించేవాళ్లం. పాఠాలు శ్రద్ధగా వినేది. చదువులో ఎప్పుడూ ముందుండేది. - జ్యూటికావన్నీసా, ప్రిన్సిపాల్ ఏకసంతాగ్రహి మౌనిక లాంటి విద్యార్థినులు చాలా అరుదు. ఏ విషయం చెప్పినా బాగా గుర్తు పెట్టుకునేది. ప్రతి పరీక్షలోనూ మొదటి స్థానం సాధించేది. ఎన్ని ఇబ్బందులున్నా బాధపడేది కాదు. దిగమింగుతూ లక్ష్యాన్ని సాధించింది. ఈ అమ్మాయి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. - షేక్ అక్బర్, మ్యాథ్స లెక్చరర్ కష్టాలను లెక్కచేయ.. నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలున్నాయని చదవడం ఆపేయలేదు. మేము ఉపాసముంటే తనూ ఉపాసముంది. మాతోపాటు ఎన్నో సార్లు కూలీ పనులకు వచ్చింది. మా కష్టంలో పాలు పంచుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా బిడ్డ చదువు ఆపేయ. ఆమెను కలెక్టర్ను చేస్తానని మాట ఇచ్చిన. దీనికి ఎంతైనా కష్టపడుతా. నా బిడ్డకోసం కష్టపడడంలో ఎంతో ఆనందముంది. - మౌనిక తండ్రి కూరాటి నర్సింలు -
దొరికి...తప్పించుకున్నారు..!
చోరీ చేసిన వాహనంపై స్నాచింగ్లు అడ్డుకోబోయిన కానిస్టేబుల్పై దాడి కానిస్టేబుల్ వాహనంతో పారిపోయిన దుండగులు దుండగులను గుర్తించిన పోలీసులు ఒంటరిగా నడుచుకుంటువెళ్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేశారు.ఆమె వెనకాలే వెళ్తున్న వారిని ఓ కానిస్టేబుల్ గుర్తించి.. స్కూటీపై అనుసరించాడు.. అరగంటపాటు వారి వ్యవహార శైలిని గమనించిన ఆయన ఎవరు మీరు అని నిలదీశాడు..దీంతో వారు కానిస్టేబుల్పై దాడి చేసి అతని వాహనంపైనే పరారయ్యారు.. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.. వివరాలు ఇలా ఉన్నాయి.. నాగోలు: సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సమ్మయ్య సోమవారం మధ్యాహ్నం కర్మన్ఘాట్ ఆంప్రోకాలనీలోని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం (ఏపీ25ఏఎం 0642)పై ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని ఆమె వెనుకాల వెళ్తుండటాన్ని గమనించిన కానిస్టేబుల్ వారిని స్కూటీ (టీఎస్08ఈజే 7564)పై అనుసరించాడు. బైరామల్గూడ సమీప కాలనీల్లో అతను వారి వెంట వెంటపడ్డాడు. బైరామల్గూడ చెరువు సమీపంలో రాగానే నిందితులకు బైకు అడ్డం పెట్టి ఆపి వారి వివరాలను ఆరా తీశారు.వారు ప్రయాణిస్తున్న పల్సర్ తాళంచెవిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే సమ్మయ్య మఫ్టీలో ఉండడంతో స్నాచర్లు అతనితో గొడవకు దిగారు. దీంతో వీరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకుని తాను పోలీసునని, వీరు దొంగలని అరచినా స్థానికులు అతనికి సహకరించకపోవడంతో స్నాచర్లు సమ్మయ్యను పక్కకు తోసేసి అతని స్కూటీపై పారిపోయారు. దీనిపై సమ్మయ్య ముందుగానే సరూర్నగర్ పోలీసులకు సమాచారం అందించినా వారు సకాలంలో స్పందించకపోవడంతో దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్రావు, క్రైం సిబ్బంది దొంగలు వదిలేసిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనపై ఎల్బీనగర్ సీఐ కాశిరెడ్డి, కానిస్టేబుల్ సమ్మయ్యలను సైబరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ తన కార్యాలయానికి పిలిచి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. చోరీ చేసిన వాహనంపైనే స్నాచింగ్లు... సీసీ కెమెరాల ఆధారంగా కానిస్టేబుల్పై దాడిచేసిన వారు పాత నేరస్తులని పోలీసులు గుర్తించారు. దొంగలు వదిలేసిన ద్విచక్ర వాహనం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నామానంద గ్రామానికి చెందిన శ్రీకాంత్దిగా గుర్తించారు. ఈ వాహనం 2014 జూన్, 30న నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోరీకి గురైంది. అప్పటి నుంచి నిందితులు ఈ వాహనంపైనే స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్రావు తెలిపారు. కానిస్టేబుల్ సమ్మయ్య స్నాచర్లను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. -
'స్వచ్ఛభారత్ చేతల్లో చూపండి'
ముంబై: స్వచ్ఛభారత్ పేరుతో ఫోటోలు దిగడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని శుభ్రత కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీకి చురకలంటించారు. ఈశాన్య ముంబైలోని దేవనార్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ ను మంగళవారం రాహుల్ పరిశీలించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కోసం మరింత కృషి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డంపింగ్ యార్డులో చెత్త కాల్చడంతో పర్యావరణ కాలుష్యం పెరిగి ముంబై వాసులు అనేక దీర్ఘకాలక వ్యాధుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్ ప్రాంతంలో చిన్న పిల్లలు సైతం టీబీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఇక్కడ చెత్తను మండించడం ద్వారా వస్తున్న పొగ శాటిలైట్ నుంచి కూడా కనిపించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వచ్ఛభారత్ గురించి చెప్పడం, ఆచరణ రెండూ వేరని ప్రభుత్వాన్ని విమర్శించారు. ముంబై నగరం దేశ అభివృద్ధికి చిహ్నంగా ఉండాలని ఇలా కాలుష్యంతో రోగాల బారినపడ్డ ప్రజలతో కాదని రాహుల్ అన్నారు. జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. -
భారత్కు మళ్ళీ టెర్రర్ ముప్పు?
దేశానికి మరోసారి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిఘావర్గాలకు అందిన సమాచారం నిజమైతే.. భారీ ఎత్తున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పక్కాగా ప్లాన్ చేశారు. పెద్దమొత్తంలో ఆయుధాలతో ఉగ్రవాదులు కశ్మీర్వైపు కదులుతున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందంది. వాళ్లు ప్రధానంగా అర్ధరాత్రి సమయంలోనే కదులుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడుల ముప్పు ఉందంటూ పంజాబ్ లోని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల నుంచి అందిన సమాచారంతో హై అలర్ట్ ప్రకటించారు. మందుగుండు సామగ్రితో కూడిన ఓ కారుతో పాటు ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు ఢిల్లీ, ముంబై, గోవాలే లక్ష్యంగా చొరబడే ప్రయత్నంలో ఉన్నట్లు ఏజెన్సీల నుంచి తమకు వార్తలు అదినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ బూడిద రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో (నెం.జెకె-01 ఏబీ-2654) ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులతో పాటు, ఓ కాశ్మీరీ కూడా ప్రయాణిస్తున్నట్లు తమకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల నుంచి సమాచారం అందిందని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ తెలిపారు. దాడులకు కావలసిన ఆయుధాలతో పాటు, మందుగుండు సామగ్రిని కూడా ఉగ్రవాదులు తీసుకెళ్తున్నారని, వారి వద్ద బహుశా ఆత్మాహుతి బెల్ట్ కూడ ఉన్నట్లు పోలీసుల సమాచారం ప్రకారం తెలుస్తోందని ఆయనన్నారు. ఆయుధాలు, సామగ్రితో కూడిన ఆ ప్రత్యేక వాహనంలో పాక్ తీవ్రవాదులు బుధవారం రాత్రి తర్వాత బనిహాల్ టన్నెల్ దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని, మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని డీజీపీ వివరించారు. -
భారత్ను టార్గెట్ చేసిన ఐసిస్
-
ఉగ్రవాదుల నయా ట్రెండ్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు తమ ట్రెండ్ మార్చారు. మార్కెట్లు, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కాకుండా.. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసి దాడులు జరపడానికి కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు తాజాగా అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల విచారణలో తేలింది. రాజకీయ నాయకులు, విదేశీయులు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపాల్సిందిగా వారికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు దేశవ్యాప్తంగా పలువురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్ఐఏ అధికారులు 12 మందిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
చిన వెంకన్నపైనే ‘ముళ్ల’పూడి టార్గెట్ ఎందుకు!?
జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు ఇటీవల కాలంలో చీటికీ మాటికీ ద్వారకా తిరుమల ఆలయ పాలకవర్గాన్ని, అధికారులను టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. జిల్లావ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ వాటి అభివృద్ధిపై కించిత్ దృష్టి సారించని జెడ్పీ చైర్మన్ కేవలం చినవెంకన్న ఆలయ వ్యవహారాలను రచ్చకీడుస్తుండటం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి ద్వారకాతిరుమల ఆలయం ఎన్నో దశాబ్దాలుగా ట్రస్టుబోర్డు పాలనలోనే నడుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తొమ్మిదేళ్లు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనూ ఇదే ట్రస్టుబోర్డు కొనసాగింది. ఇప్పుడు అదే పాలకవర్గంపై ఒంటెత్తు పోకడలతో విరుచుకుపడటం వెనుక బాపిరాజు ‘అసహనం’ చాలానే ఉంది. ఇటీవల ద్వారకాతిరుమలలో విర్డ్స్ ఆసుపత్రి భవనం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు వేయలేదని బాపిరాజు రచ్చ చేసిన సంగతి తెలి సిందే. ఆయన ఒత్తిళ్లతో ఆలయ పాలకవర్గం ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఉద్యోగ సం ఘాల ఆందోళనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన పాలకవర్గం సస్పెన్షన్ ఎత్తివేసింది. దరిమిలా బాపిరాజు ‘అహం’ దెబ్బతింది. అప్పటినుంచి ఆలయ వ్యవహారాలపై రగిలిపోతున్న ఆయన ఈనెల 22న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మరోసారి ఆలయ అధికారులపై విరుచుకుపడ్డారు. దేవస్థానం ఆదాయ, వ్యయాలపై పూర్తిస్థాయిలో జిల్లా పరిషత్కు సమాచారం కావాలంటూ తీర్మానం చేయించారు. మద్యం తాగుతున్నారు.. పేకాట ఆడుతున్నారంటూ ఆలయ ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. మిగిలిన ఆలయాల ఊసు పట్టదా? జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 64 ఆలయాలకు సంబంధించి 367.09 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీని నిమిత్తం మార్కెట్ విలువ ప్రకారం రూ.25 కోట్ల 75 లక్షల 86వేల 254లను దేవాదాయ శాఖకు చెల్లించాలి. కానీ కేవలం రూ.2కోట్ల 79లక్షల 35వేల 453 మాత్రమే చెల్లించింది. దీనిపై జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ముళ్లపూడి బాపిరాజు సర్కారు నుంచి దేవాదాయ శాఖకు నిధులు అందించే దిశగా కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో రూ.25 లక్షలకు పైగా వార్షిక ఆదాయం వచ్చే ఆలయాలు 14, రూ.2లక్షల నుంచి రూ.25లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాలు 52 ఉన్నాయి. వాటిలోనూ లెక్కకు మించిన సమస్యలున్నాయి. ఇక ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు 1,400 పైబడి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 41 ఆలయాలకు సంబంధించిన భూముల్లో 206 ఎకరాలు కబ్జాదారుల చెరలో చిక్కుకున్నాయి. వీటిపై జిల్లాకే చెందిన.. ఇంకా చెప్పాలంటే సొంత నియోజకవర్గానికే చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో చర్చించి చర్యలు తీసుకునే అవకాశముంది. ఇవేమీ పట్టించుకోకుండా ద్వారకాతిరుమల వ్యవహారాలపైనే ఆయన దృష్టి పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ పక్కా సమాచారంతో ఆలయ వ్యవహారాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టినా బాపిరాజు ‘ఉక్రోషానికి’ అర్థముంటుంది. కానీ.. కేవలం ఆలయంపై పట్టుకోసం, అధికారులను, ఉద్యోగులను వెంటపడి వేధించడమే లక్ష్యంగా బాపిరాజు పావులు కదుపుతున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
సైబర్ దొంగల టార్గెట్ క్రిస్మస్, న్యూ ఇయర్
క్రిస్మస్, నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. పండుగల్లో కొనుగోలుదారులను టార్గెట్ చేసి... అధునాతన మాల్వేర్, స్పామ్ ప్రచారాలతో దోచేస్తున్నారు. రిటైల్ మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ వైరస్ లా వ్యాపిస్తున్న సైబర్ దొంగలతో జరభద్రం అంటూ... నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధునాతన మాల్వేర్ సాఫ్ట్ వేర్, స్పామ్ లతో ఓ దొంగల ముఠా చోరీలకు తెగబడుతోందని ఐ సైట్ భద్రత సంస్థ హెచ్చరిస్తోంది. జనాన్ని ఫిషింగ్ ఈ మెయిల్స్ తోనూ, స్పామ్ లతోనూ భయపెట్టి బేరసారాలకు పాల్పడుతోంది. ఏకంగా కొన్ని దొంగల ముఠాలు ప్రసిద్ధ షాపింగ్ యాప్ ల నకిలీలు సృష్టించి, పేమెంట్ కార్డు డేటాను దోచేస్తున్నాయి. ఆమెరికా వంటి దేశాల్లో 'బ్లాక్ ఫ్రైడే', 'సైబర్ మండే', వీకెండ్ థ్యాంక్స్ గివింగ్ హాలీడే సమయంలో ఆన్ లైన్, ఆఫ్టైన్ స్టోర్లు ఇచ్చే ఆఫర్లనే సైబర్ నేరగాళ్ళు అదనుగా చేసుకొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలోని ప్రసిద్ధ 50 రిటైల్ బ్రాండ్స్ కు ఇప్పుడు అత్యంత అధునాతన 'మాడ్ పాస్ మాల్వేర్' (వైరస్) సోకినట్లు అనుమానించి, వారి వారి అంతర్గత కార్పొరేట్ నెట్ వర్క్ లను పరిశీలిస్తున్నట్లు ఐ సైట్ భద్రతా సంస్థ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ వార్డ్ చెబుతున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ ఎక్విప్ మెంట్ మాటున దాగి ఉండే మాడ్యులర్ మాల్వేర్ వైరస్... పేమెంట్ కార్డ్ డేటాను క్షణాల్లో కంప్యూటర్ కు చేరుస్తుంది. ఈ వివరాలను ఎటువంటి దుర్మార్గమైన చర్యకైనా ఉపయోగించవచ్చని వార్డ్ అంటున్నారు. అమెరికా ప్రభుత్వ సంయుక్త రిటైల్ ఇంటిలిజెన్స్ భాగస్వామ్య కేంద్రం '2015 హ్యాకింగ్ సీజన్' పై రిటైల్ వ్యాపారస్థులకు సూచనలు, సలహాలు అందజేసింది. సంవత్సరంలో ముఖ్యంగా అత్యధికంగా అమ్మకాలు జరిగే ఈ సమయంలో రిటైలర్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచిస్తోంది. మాడ్ పాస్ వెనుక ముఠాను పట్టుకునేందుకు ట్రాక్ చేస్తున్నామని, అయితే ఈలోపు ముఖ్యమైన ఈ క్రిస్మస్ సందడిలో మోసపూరిత లావాదేవీలకు లొంగిపోకుండా జాగ్రత్త పడాలని భద్రతా సంస్థలు సూచిస్తున్నాయి. సంప్రదాయ వ్యతిరేక వైరస్ మాల్వేర్ ను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, దొరికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఆన్ లైన్ వ్యాపారస్తులు కూడ హైటెక్ నేరస్తుల దాడికి గురయ్యే అవకాశం ఉందని... మోసాలకు వ్యతిరేకంగా పనిచేసే... యాంటీ ఫ్రాడ్ కంపెనీ 'థ్రెట్ మెట్రిక్స్' హెచ్చరిస్తోంది. నిజానికి మూడో త్రైమాసికం వ్యాపారం సన్నగిల్లే సమయమని... క్రిస్మస్, నూతన సంవత్సరం షాపింగ్ సీజన్ వల్ల వినియోగదారులు ఖర్చుచేసే అవకాశం ఉండటంతో దాడి ప్రయత్నాలు రికార్డు స్థాయిలో జరుగుగున్నాయని థ్రెట్ మాట్రిక్స్ డైరెక్టర్ వనితా పాండే అంటున్నారు. ఎక్కువగా ఈ దాడులు నకిలీ లాగిన్ లతోనూ, చోరీ చేసిన ఆధారాలను ఉపయోగించి జరుగుతున్నాయని పాండే అన్నారు. నకిలీ వ్యాపారాలకు, ఆన్ లైన్ మోసాలకు ఇదే సరైన సమయమని, ఈ విషయంలో వినియోగదారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మోసాలకు లొంగకుండా జాగ్రత్త పడాలని సీనియర్ భద్రతా సలహా దారులు హెచ్చరిస్తున్నారు. ఆఫర్లకు లొంగి ఆయాచిత ఈ మెయిళ్ళను నమ్మొద్దని, కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
దేవాలయాలను టార్గెట్ చేస్తున్న దోంగలు
-
షారుక్ ఖాన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ముంబై: దేశంలో ‘అసహనం’ పెరిగిపోతోందని మూడు రోజుల క్రితం తన 50వ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ హీరో షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం, దానిపై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడడం నగరంలో హాట్ టాపిక్గా మారింది. బాంద్రాలోని షారుక్ ఖాన్ మన్నాట్ ఇంటి వద్ద అభిమానుల సందడి పెరిగింది. దీంతో గురువారం నుంచి ఆయన ఇంటి వద్ద గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకు షారుక్ ఖాన్ హిందూ అతివాద పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారని షారుక్ ఖాన్ ఇంటివద్ద అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ వెబ్సైట్లో కూడా ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు. షారుక్ ఖాన్ వ్యాఖ్యలపై ముందుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గీయ ట్విట్టర్లో స్పందించారు. షారుక్ భారత్లో నివసిస్తున్నారని, అయితే ఆయన ఆత్మ మాత్రం పాకిస్తాన్లోనే ఉందంటూ వివాదాస్పద ట్వీట్లు చేశారు. షారుక్ పాకిస్తాన్ ఏజెంట్ అంటూ విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచి ఆరోపించారు. షారుక్ భాష, పాకిస్తానీ ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాష ఒకేలాగా ఉందని, భారత్ను అగౌరవించేవాళ్లు పాకిస్తాన్కు వెళ్లిపోవాలంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ మరింత ఘాటుగా స్పందించారు. పలువురు అభిమానులు గురువారం షారుక్ ఇంటి వద్ద సందడి చేశారు. ఆయన ఇంటి ముందు ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఒక్కసారైనా షారుక్ బయటకు రాకపోతారా! అనుకొని ఇంటి ఎదురుగా గంటలకొద్దీ నిరీక్షించారు. ‘షారుక్ మంచి నటుడు, మాకు కావాల్సిందే అంతే....రాజకీయ నాయకులు ఏం మాట్లాడారన్నది మాకనవసరం. వారుండేది కేవలం ఐదేళ్లు. షారుక్ ఉండేది జీవితాంతం’ అని పుణె నుంచి వచ్చిన అభిషేక మిశ్రా అనే ఇంజనీరు మీడియాతో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లోకన్నా ముస్లింలు భారత్లోనే సురక్షితంగా ఉన్నారు’ అని మరో అభిమాని షాహిద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ‘బాలీవుడ్లో ఎంతోమంది ముస్లిం నటులు ఉన్నారు. ఎందుకు షారుక్ ఖాన్ను టార్గెట్ చేస్తున్నారు? పాకిస్తాన్లో కనీసం ఇంటి స్థలం కూడా లేని షారుక్ను అక్కడికెళ్లిపోండని ఎలా అంటారు’ అని అస్సాం నుంచి వచ్చిన ఓ కళాకారుడు వ్యాఖ్యానించారు. ‘షారుక్ ఖాన్ను టార్గెట్ చేసుకొని రాజకీయ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. రానున్న (రాయీస్) సినిమాలో షారుక్ ఖాన్ జంటగా పాకిస్తానీ నటి మహీరా ఖాన్ నటించడమే’ అని మరో అభిమాని వ్యాఖ్యానించారు. -
క్యాష్ ఏజెంట్లే వాళ్ల టార్గెట్: సీపీ మహేందర్రెడ్డి
హైదరాబాద్: ఫయిమ్ మిర్జా ముఠా నగరంలో భారీ దోపిడీకి వ్యూహం పన్నిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పట్టపగలు జూబ్లీహిల్స్లో అంతర్రాష్ట్ర ముఠా కాల్పుల ఘటన పై మాట్లాడుతు.. గుల్బర్గా నుంచి వచ్చిన ఆ ముఠా నగరంలో దోపిడీ చేసేందుకు వ్యూహం పన్నినట్లుగా తెలిపారు. బిగ్ సీ మేనేజర్ దుండగులతో కలిసి దోపిడికి ప్రణాకలు రచించారని తెలిపారు. క్యాష్ కలెక్షన్ బాయ్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లే సమయంలో డబ్బు దోపిడీ చేయాలని పథకం రచించారాని చెప్పారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఐదు రోజులుగా గ్యాంగ్ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారని ఆయన తెలిపారు. మాదాపూర్ లో వీరి కదలికలను గమనించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 బైక్ లపై వాళ్లని వెంబడించారు. నీరుస్ జంక్షన్ వద్ద వారిని ఆపడానికి ప్రయత్రించగా కాల్పులు జరిపారన్నారు. కాల్పుల్లో ఎల్ అండ్ టీ ఉద్యోగి ధర్మేందర్ గాయపడటం దురదృష్టకరమన్నారు. దైర్యసాహసాలు ప్రదర్శించి దుండగులను పట్టుకున్న పోలీసులకు రివార్డులు ఇవ్వనున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు. ఎవరీ ఫయీమ్? టోలీచౌకికి చెందిన ఫయిమ్ మిర్జా ఏడేళ్ల క్రితం గుల్బర్గాకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. 2012లో అక్కడ ఓ హత్య కేసులో నిందితుడు. బెయిల్పై వచ్చి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నగరంలో దోపిడీలకు పాల్పడి గుల్బర్గాలో తలదాచుకుంటాడు. అక్కడ కూడా దోపిడీలు చేసి పోలీసులను చిక్కకుండా ఉండేందుకు మకాంను హైదరాబాద్కు మార్చుతుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భారీ దోపిడీకి స్కెచ్ వేసి పోలీసులకు దొరికిపోయాడు. అసలు ఎవరు వారు..? గుల్బర్గాలో నివాసం ఉంటున్న టోలీచౌకి వాసి మీర్జా మహమ్మద్ అబ్దుల్లా(32) అలియాస్ ఫయీమ్ మిర్జా ఈ ముఠాకు నాయకుడు. కరుడుగట్టిన నేరగాడిగా పోలీసు రికార్డుల్లో ఉన్న ఇతడు హైదరాబాద్లో భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. తన సహచరులు మహమ్మద్ సమీయుద్దీన్ (లంగర్హౌస్వాసి), అబ్దుల్ ఖదీర్(గుల్బర్గావాసి)తో కలిసి ఐదు రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. వీరంతా ఫయీమ్ మిర్జా ఇంట్లోనే ఉంటున్నారు. -
ఎంజీబీఎస్ ప్రయాణికులే టార్గెట్
అఫ్జల్గంజ్: మహాత్మాగాంధీ బస్స్టేషన్కు వచ్చే ప్రయాణికులను మోసగిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అఫ్జల్గంజ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పాతబస్తీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఇజాజ్, సయ్యద్ ఇబ్రాహీం, మహ్మద్ రిజ్వాన్లు ముఠాగా ఏర్పడి ఎంజీబీఎస్లో ప్రయాణికులను పథకం ప్రకారం తమ ఆటోలో ఎక్కించుకుంటారు. కొంత దూరం వెళ్లాక ఆటో చెడిపోయిందని వారిని కిందికి దింపి, బాగుచేస్తున్నట్లు నటిస్తారు. అదే అదనుగా ఆటోలోని ప్రయాణికుల బ్యాగుల్లో సెల్ఫోన్లు తదితరాలు, నగదును ఉంటే దొంగిలిస్తుంటారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం కాపువేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా నేరాలు వెల్లడయ్యాయి. వారి వద్ద ఉన్న రెండు ఆటోలను సీజ్ చేసి రూ.2.10 లక్షల విలువైన వస్తువులను, 4సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
లక్ష్యాన్ని.. గురిచూసి కొట్టాలంటే..
‘నేను చాలా డబ్బు సంపాదించాలి’ ‘నేను మంచి ఉద్యోగంలో చేరాలి’ ‘నేను ఉన్నత స్థానంలో ఉండాలి’.. ఇవన్నీ లక్ష్యాలు కావు.. కేవలం కలలు మాత్రమే. అయితే ఒక కలను లక్ష్యమని చెప్పుకోవాలంటే దానికి ఏమి ఉండాలి? దీనికి సమాధానాన్ని 5-డి సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. 1. ఆశయం 2. దిశ 3. సంకల్పం 4. క్రమశిక్షణ 5. తుది గడువు మీ ఆశయాలకు మిగిలిన 4-డిలు జతకలిస్తేనే ఆ కలలు లక్ష్యాలు (గోల్స్) అవుతాయి. ఇలాంటి లక్ష్యాలున్న వ్యక్తి అసలైన విజేతగా నిలుస్తాడు. మీ కలలో ఈ ఐదు అంశాల్లో ఏది లోపించినా అది గోల్ కాదు.. ఉత్త కల మాత్రమే! అపనమ్మకమే అసలు అడ్డంకి... మీ లక్ష్యం గురించి చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారా? మొహమాట పడుతున్నారా? అయితే మీరిలా ఆలోచిస్తూ ఉండవచ్చు. ‘ఒకవేళ నేను నా లక్ష్యాన్ని సాధించలేకపోతే ఎదుటి వారు నవ్వుకుంటారేమో’! అంటే మీ విజయం పట్ల మీరు వంద శాతం నమ్మకంగా లేరు. మీరు మానసికంగా మీ విజయాన్ని శంకించకండి.. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్ఎల్పీ) సాధనలో ఇది ముఖ్య సూత్రం. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టిస్తున్న ‘ది సీక్రెట్’ అనే పుస్తకం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. నిర్హేతుకమైన, అసాధారణమైన, అసాధ్యమైన కలల్ని సైతం పదే పదే బలంగా అనుకుంటే మీ మనసు వాటిని సాధించేందుకు ఉరకలేస్తుంది.. మీ కలలు నూటికి నూరుశాతం ఫలిస్తాయని ఈ పుస్తకం చెబుతోంది. అందుకే 5-డి తో కూడిన మీ స్పష్టమైన లక్ష్యం తాలూకు విజయావకాశాలను మీరు బలంగా విశ్వసించండి.. విజయం మీ సొంతమవుతుంది. ‘నా జీవిత గమ్యం ఇది’ అని మొదటే బలంగా అనుకొని, సరైన దిశలో, సరైన సంకల్పం, క్రమశిక్షణతో ముందుకెళ్తే మీరు ముందే నిర్దేశించుకున్న గడువులోగా లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఇదే అసలైన లక్ష్య నిర్దేశం! అద్దం ఎంత స్పష్టంగా, ఎలాంటి మరకలు లేకుండా ఉంటే అందులో మన ప్రతిబింబం అంత స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా మన లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని సాధించేందుకు అవసరమైన మార్గాలు అంతే స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తాయి. లక్ష్యాలు- రకాలు 1 స్వల్పకాలిక లక్ష్యాలు (ఏడాదిలో సాధించాల్సినవి) 2 మధ్యకాలిక లక్ష్యాలు (మూడేళ్లలో సాధించాల్సినవి) 3 దీర్ఘకాలిక లక్ష్యాలు (ఐదేళ్లలో సాధించాల్సినవి) ఈ విధంగా ఒక పెద్ద లక్ష్యాన్ని, చిన్న లక్ష్యాలుగా విడగొట్టొచ్చు. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే, లక్ష్య సాధన అంత తేలికవుతుంది. ఎప్పుడైతే ఇలా మీ లక్ష్యానికి సంబంధించి స్పష్టత ఉంటుందో అప్పుడు దాన్ని సాధించడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ ఏమిటో మీకు తెలిసిపోతుంది. వాటిని సాధించే క్రమంలో మీకు తక్షణ లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, సుదూర లక్ష్యాలు వాటంతటవే వరుస క్రమంలో (ప్రాధాన్యత క్రమంలో) మీ ముందు ప్రత్యక్షమవుతాయి. 5-డి సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తుంటే తక్షణ లక్ష్యాలు ఎప్పటికప్పుడు నెరవేరుతుంటాయి. ఈ విజయాలు మనల్ని తొలుత మధ్యకాలిక లక్ష్యాలకు, తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దగ్గర చేస్తాయి.విజేత జేబులో ఎప్పుడూ ‘థింగ్స్ టు డు టుడే’ అనే పాకెట్ సైజ్ పుస్తకం ఉంటుంది. అందులో ఆరోజున చేయాల్సిన పనులు (తక్షణ లక్ష్యాలు) రాసుకుంటారు. ఒక్కో పని పూర్తవుతుంటే టిక్ చేస్తారు. ప్రతి టిక్ మార్క వారికి కొత్త ప్రేరణ ఇస్తుంది. -వివేకానంద్.ఆర్, డెరైక్టర్, రాయల్ స్పోకెన్ ఇంగ్లిష్ అకాడమీ.