కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం | Monkey Fever Reported In Old Lady Shimoga Karnataka | Sakshi
Sakshi News home page

Monkey Fever-Karnataka: కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం

Jan 23 2022 11:44 AM | Updated on Jan 23 2022 1:05 PM

Monkey Fever Reported In Old Lady Shimoga Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా కర్ణాటకలో మంకీ ఫీవర్ మరోసారి కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.

ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement