old lady
-
బెడ్డుమీద బామ్మేసుకుంటున్న మేకపు
-
అత్యంత వృద్ధ మహిళ అస్తమయం
అమెరికాలో అత్యంత వృద్ధ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ తన 115 ఏళ్ల వయసులో మరణించారు. ‘క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ హ్యూస్టన్’గా పిలుచుకునే ఫ్రాన్సిస్ అమెరికాలో అత్యంత వృద్ధురాలిగా, ప్రపంచంలో మూడో వృద్ధురాలిగా రికార్డుకెక్కారు. అమెరికాలో అత్యంత ఎక్కువ కాలం బతికిన 21వ వ్యక్తి కాగా.. ప్రపంచంలో 54వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫ్రాన్సిస్ కుటుంబమే దీర్ఘాయుష్సు ఉన్న కుటుంబం. ఆమె సోదరి బెర్తా జాన్సన్ కూడా అత్యధికకాలం జీవించారు. 2011లో మరణించేనాటికి ఆమెకు 106 ఏళ్లు. అప్పటివరకూ అక్కా చెల్లెల్లిద్దరూ కలిసే బతికారు. ఇంత కాలం బతకడం ఎలా సాధ్యమైందంటే ‘సంతోషంగా జీవించాలని ప్రతిరోజూ అనుకున్నాను. అంతా దేవుడి దయ.. నన్ను తీసుకెళ్లడానికి అతని దగ్గర ఏ కారణం లేదు’ అని చెప్పేవారు. 112 ఏళ్ల వయసులోనూ తన మనవరాళ్లు, మనవలతో కలిసి అన్ని కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఫ్రాన్సిస్ ఆయుష్షు రహస్యం మాత్రం.. ‘ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటమే’ అని చెబుతారు ఆమె దగ్గరివారు. లూసియానాలోని సెంట్ మేరీ పారి‹Ùలో 1909లో జని్మంచిన ఫ్రాన్సిస్.. తన జీవిత కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులకు సాక్షిగా ఉన్నారు. 20 మంది అమెరికా అధ్యక్షులను, రెండు ప్రపంచ యుద్ధాలను, పౌర హక్కుల ఉద్యమాలను దగ్గరగా చూశారు. 1920లో తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. టెక్సాస్లోని గాల్వెస్టన్లో ఉన్న అత్త దగ్గర పెరిగారు. 1928లో ఆమెకు పాప జని్మంచింది. ఒంటరి మహిళగానే కూతురిని పెంచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వృద్ధురాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
నూజివీడు : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్లో నివాసముండే మందపల్లి కమలాజేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలాజేసుదాసు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్ చేసి.. తాము ముంబయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్ ఉందని చెప్పింది. మీకు మరో కాల్ వస్తుందంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలాజేసుదాసుకు 7831062545 నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్ఫర్ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబర్కు ఆమె ఫోన్ చేస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలగుంపు
ముస్తాబాద్ (సిరిసిల్ల): వీధికుక్కలు జవహర్నగర్లో బాలు డిని చంపిన ఘటన మరువకముందే మ రో దారుణం చోటు చేసుకుంది. అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కా లే యాన్ని తినేశాయి.ఈ దారుణ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. వేర్వేరు ఇళ్లలో కొడుకులు రామలక్ష్మి ముగ్గురు కుమారులు బాలరాజు, దేవయ్య, అంజయ్యలు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పొద్దంతా పనులకు వెళ్లి వచ్చినవారు బుధవారం రాత్రి గాఢనిద్రలోకి జారుకున్నారు. రామలక్ష్మి తనకున్న ప్రత్యేక గదిలో నిద్రించింది. ఆ గదికి సరైన తలుపులు లేకపోవడంతో రాత్రివేళ కుక్కలు దాడి చేశాయి.మంచంలో ఎంత గింజుకున్నా, కుక్కలు వదల్లేదని అక్కడున్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అందరూ నిద్రలో ఉండడంతో ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదు. గురువారం ఉదయం రామలక్ష్మి కుటుంబీకులు జరిగిన సంఘటన చూసి బోరున విలపించారు. మృతురాలి గదంతా రక్తసిక్తమై, శరీర భాగాలు పడి ఉన్నాయి. -
మనవడికి ప్రాణభిక్ష పెట్టిన 70 ఏళ్ల అమ్మమ్మ..ఎలా అంటే!
ఆధునిక కాలంలో అవయవదానం సాధారణంగా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది తన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని భయపడిపోతారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఒక కిడ్నీని, లివర్లోని కొంత భాగాన్ని దానమిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ 70 ఏళ్ల బామ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన మనవడిని ఎలాగైనా రక్షించుకోవాలని తాపత్రయపడింది. ధైర్యంగా కిడ్నీని దానం చేసి నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది.వివరాల్లోకి వెళితే.. జబల్పూర్లోని సిహోరాకు చెందిన యువకుడు (23) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతనికి కిడ్నీ మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలకోసం కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలు పెట్టారు. కుటుంబ మిగిలిన సభ్యులతో పోలిస్తే బామ్మ, మనవడి బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. వారిద్దరికీ సంబంధిత పరీక్షలు చేయగా, బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అటు బామ్మ కూడాతన కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరించింది. నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మమ్మ ధైర్యంతో ముందుకువచ్చ తన మనవడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం విశేషంగా నిలిచింది.కిడ్నీమార్పిడిఆపరేషన్ విజయవంతమైందనీ, ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జబల్పూర్ మెట్రో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విశాల్ బదేరా, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ రాజేష్ పటేల్ వెల్లడించారు. -
సీఎం జగన్ పెద్ద కొడుకులా 3 వేలు పెన్షన్ ఇస్తున్నారు: వృద్ధురాలు
-
వారెవ్వా.. బామ్మా! ఒకేరోజు మూడు ప్రపంచ రికార్డులు
రికార్డులకు, అవార్డలుకు వయస్సుతో పనేముందని నిరూపించిందో బామ్మ. 99 ఏళ్ల వయసులో ఈజీగా ఈత కొట్టడం మాత్రమే కాదు. ఒకే రోజు ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. డచ్-కెనడియన్ బెట్టీ బ్రస్సెల్ ఈ నెల 20న అద్భుతమైన ఈ ఫీట్ సాధించింది. 400-మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 50-మీటర్ల బ్యాక్ అనే మూడు విభాగాల్లో తన సత్తా చాటింది. తనకు ఏజ్ అస్సలు మేటర్ కాదంటోంది. ఇదీ చదవండి: ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా? స్విమ్మింగ్ కెనడా లెక్కల ప్రకారం 12 నిమిషాల 50 సెకన్లతో ఉన్న 400-మీటర్ల ఫ్రీస్టైల్ రికార్డును దాదాపు నాలుగు నిమిషాల్లో బ్రేక్ చేసింది. అలాగే 50-మీటర్ల బ్యాక్స్ట్రోక్ను ఐదంటే ఐదు సెకన్లలో ఛేదించి వాహ్వా అనిపించుకుంది. ‘‘నేను రేసులో ఉంటే ఇక దేన్నీ పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్!'‘ అని చెప్పిందామె. (Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!) బ్రస్సెల్ 60 సంవత్సరాల వయస్సు నుండి మాత్రమే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండటం విశేషం. కానీ ఇటీవలి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను దక్కించుకుంది. ‘‘అమ్మా నీకు ముసలి తనం వచ్చేసిందని నా 70 ఏళ్ల చిన్న కొడుకుఅంటూ ఉంటాడు. కానీ నాకు అలా అనిపించదు. నిజంగా అలసి పోయినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. అంతే’’ అంటారామె. అలాగే రికార్డుల గురించి కూడా ఆలోచించను. చేయాల్సిన పనిని ధైర్యంగా చేసేస్తాను. గెలిస్తే సంతోషిస్తాను అంటుంది బోసి నవ్వులతో. బ్రస్సెల్స్ ఇప్పటికీ కనీసం వారానికి రెండుసార్లు స్విమ్మింగ్ చేస్తుంది. -
97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...!
ఆసక్తి , పట్టుదల ఉండాలే గానీ వయసుతో పనేముంది. ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు.. ఎంత రిస్క్ అయినా చేయొచ్చు. బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. 97ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ సాహసం, తెగువ చూస్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఈ బామ్మకు సెల్యూట్ చేయకుండా ఉండరు! అందుకే పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్రను కూడా బామ్మ బాగా ఆకట్టుకుంది. ఆమే నా హీరో అంటూ ఈ వీడియోను ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పువ్వులా నేనే...నవ్వుకోవాలి....గాలినే నేనై... సాగిపోవాలి చిన్నిచిన్నిఆశ.. అంటూ సాగే తమిళ బ్యాగ్ గ్రౌండ్ పాటతో ఈ వీడియో మరింత హృద్యంగా నిలిచింది. అనుకున్న పని సాధించాలంటే వయసుతో పని ఏముంది సార్..అని ఒకరు, అద్భుతమైన వీడియో, బామ్మకు అభినందనలు మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరింగ్ అనే ఇన్స్టా పేజ్ ఈ వీడియోను ఇటీవల షేర్ చేసింది. 97 ఏళ్ళ వయసులో ఎగిరే ప్రయత్నం చేసిన, సక్సెస్ అయిన ఈ బామ్మ ధైర్యానికి సెల్యూట్ అని పేర్కొంది. మహారాష్ట్ర జెజురి పట్టణంలోని కొండపై ఉన్న ఖండోబా ఆలయం సమీపంలో ఈ ఫీట్ చేశారు బామ్మ. It’s NEVER too late to fly. She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023 -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్నగర్కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్పేట పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్హెచ్వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్షెహర్కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
వావ్.. ఆ వృద్ధురాలి కోసం రంగంలోకి అగ్నిమాపక దళం!
రోడ్డు దాటేందుకు ఓ వృద్ధురాలు అవస్థలు పడుతోంది. కార్లు రాయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఏ ఒక్కరూ ఆమెకు దారివ్వటం లేదు. రోడ్డు మధ్యలో నిలుచుని ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితలో ఇబ్బందులు పడుతోంది ఆ మహిళ. అయితే, ఆమె కోసం ఏకంగా అగ్నిమాపక దళమే రంగంలోకి దిగింది. రోడ్డుకు అడ్డంగా ఫైర్ ఇంజిన్ను పెట్టి వాహనాలను ఆపేసి ఆమెను రోడ్డు దాటించారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి సాయం చేసిన ఫైర్ ఫైటర్స్పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. రోడ్డు దాటేందుకు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి ఇలానే సాయం చేయండి. రోడ్డుకు అడ్డుగా మీ కారు ఉంచి దారి ఇవ్వండి అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మరోవైపు.. దయ, మానవత్వ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని మరో వ్యక్తి పేర్కొన్నారు. అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించారని మరొకరు రాసుకొచ్చారు. Wow 🥰👏🏽👏🏽👏🏽👏🏽 pic.twitter.com/3ahdMoDHqt — How Things Are Manufactured (@fastworkers6) October 9, 2022 ఇదీ చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్ -
వృద్దురాలి వేషంలో వచ్చి బ్యాంకును కొల్లగొట్టి... దర్జాగా కారులో పరార్
ఇటీవల కాలంలో దొంగలు చాలా విచిత్రంగా దొంగతనాలు చేస్తున్నారు. అందినట్టే అంది చిక్కుకుండా చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నారు. దొంగలు కూడా మనతోపాటే కలిసిపోయి చాలా తెలివిగా బురిడి కొట్టించి మరీ పరారవుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చాలా తెలివిగా బ్యాంకు సొత్తును దొచుకుని పరారయ్యడు. వివరాల్లోకెళ్తే...అమెరికాలోని జార్జియాలో ఒక వ్యక్తి బ్యాంకు వద్దకు వృద్దురాలి వేషంలో వచ్చాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి తుపాకిని చూపి...బెదిరించి డబ్బు దోచుకున్నాడు. ఆ తదనంతరం బయటకు వచ్చి నెంబర్ ప్లేట్ లేని తెల్లటి ఎస్యూవీ కారులో దర్జాగా వెళ్లిపోయాడు. వాస్తవానికి బ్యాంకు పరిసర ప్రాంతంలోని వాళ్లు కూడా ఆ వింత గెటప్ని పసిగట్టలేకపోయారు. ఈ ఘటన అట్టాంటాలోని హెన్నీ కౌంటీలో చోటుచేసుకంది. దోపిడి చేసేటప్పుడూ ఆ వ్యక్తి పూల దుస్తులతో ఆకర్షణీయంగా వచ్చాడు.ఈ మేరకు వృద్ధురాలి రూపంలో వచ్చిన వ్యక్తి ఫోటోలను పోలీసులు నెట్టింట షేర్ చేస్తూ... ఈ విషయం గురించి వెల్లడించారు. సదరు నిందితుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిబ్బంది ఫిర్యాదు చేసేవరకు ఈ విషయం వెలుగు చూడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగుల దొంగతనం చేయడం కోసం ఎంతకైన తెగిస్తారంటూ కామెంట్లు చేస్తూ.. ట్వీట్ చేశారు. (చదవండి: దెబ్బ తిన్న భారీ టెలిస్కోప్ జేమ్స్ వెబ్.. ఆందోళనలో నాసా) -
రెండేళ్లుగా కుళ్లిన వాసన.. తలుపు బద్ధలు కొట్టి చూస్తే షాక్
ఏమైందో ఏమోగానీ.. పాపం ఆ ఒంటరి పెద్దావిడ అస్థిపంజరంగా కనిపించి చుట్టుపక్కల వాళ్లకు షాక్ ఇచ్చింది. పైగా రెండున్నరేళ్లుగా ఆమె ఉండే పోర్షన్ నుంచి కంపు వాసన వస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. వాసనకు ఆ తలుపు బద్ధలు కొట్టే ప్రయత్నం చేయలేదు ఎవరు!. ఎందుకంటే.. లండన్లోని పెచ్కమ్లోని సెయింట్ మేరీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్థుల భవనంలో సదరు మహిళ ఒంటరి(60 ఏళ్ల పైనే వయసు ఉంటుంది)గా ఉంటోంది. అయితే రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూతపడే ఉంది. పైగా ఆమె ఇంటి డోర్కి అడ్డంగా ఓ సైకిల్ పెట్టి ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేదని అంతా అనుకున్నారు. అదే టైంలో దాదాపు రెండేళ్లుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఈ విషయాన్ని హౌజింగ్ అసోషియేషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముక్కు మూసుకుని అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఆ వాసన భరించడం వల్లకానీ ఓ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 18వ తేదీన బలవంతంగా పోలీసులు డోర్లు బద్ధలు కొట్టి చూశారు. కుర్చీలో ఆ పెద్దావిడ అస్థిపంజరం కూర్చున్న పొజిషన్లో కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. కుప్పలుగా లెటర్లు.. ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటుంది? అనే వివరాలు ఎవరికీ తెలియదు. కానీ, పొరుగింట్లో ఉండే ఓ యువతి మాత్రం తాను లేని టైంలో పార్శిల్స్ను రిసీవ్ చేసుకోమని ఆ పెద్దావిడ సాయం తీసుకునేదట!. అక్టోబర్ 2019లో చివరిసారి ఆమెను చూశానని ఆ యువతి చెప్తోంది. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనిపించలేదట. కరోనా కావడంతో లండన్లోని చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఆమె కూడా తన సొంతూరికి వెళ్లిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ, కొన్నాళ్లకు ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఇంటి డోర్కు గుడ్డలు అడ్డుపెట్టారట చుట్టుపక్కల వాళ్లు. అయితే ఆమె ఇంటి బయట కుప్పలుగా లెటర్లు, ఇంటి అద్దె బాకీ ఉన్నట్లు నోటీసులు పేరుకుపోయి ఉన్నాయి. చివరికి గ్యాస్ చెకింగ్కు వచ్చిన వాళ్లు సైతం డోర్కు నోటీసులు అంటించడంతో ఆమె జాడ గురించి చుట్టుపక్కల వాళ్లలో అనుమానాలు మొదలయ్యాయి. హౌజింగ్ అసోషియేషన్ ఎంతకీ విషయం పట్టించుకోకపోవడంతో.. ఓ యువతి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో ఆ పెద్దావిడ కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు? ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ఈ ఘటన లండన్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. ఇదిలా ఉండగా.. ఇటలీలోనూ ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరగడం విశేషం. చదవండి: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై పక్కా స్కెచ్ వేసినా.. -
అవ్వా.. నీకు వందనం! అందుకే ఆ ఊరే మొక్కుతోంది మరి!
ఎప్పుడైనా మీ చుట్టుపక్కల వాళ్లకు సాయం చేశారా?. సపోజ్.. మీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉందనుకోండి!.. ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారా? ఇక్కడో బామ్మ మరో ప్రస్తావన లేకుండా దానం చేసేసింది. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. హుచ్చమ్మ చౌద్రి.. వయసు 75 ఏళ్లు. ఉండేది హవేరీ జిల్లా కునికేరి అనే చిన్న గ్రామం. చిన్న వయసులోనే బసప్ప చౌద్రిని పెండ్లి చేసుకుని ఆ ఊరికి కాపురం వచ్చింది. ఎన్నో ఏళ్లు గడిచినా పాపం పిల్లలు కలగలేదు ఆ జంటకు. ఒకరికొకరు తోడుగా పొలం పనులు చేసుకుంటూ కష్టపడి బతికేవాళ్లు. ముప్ఫై ఏళ్ల క్రితం బసప్ప చనిపోయాడు. అప్పటి నుంచి హుచ్చమ్మ ఒంటరిది అయ్యింది. కానీ, ఆమె కాయకష్టం ఆగలేదు. ఊరికి కష్టం.. పొలం పనులు చేసుకుంటున్న హుచ్చమ్మకి.. ఒకరోజు పంచాయితీలో పెద్దలు మాట్లాడుకుంటున్న విషయం చెవిన పడింది. స్కూల్లో బడి లేదు. ఎక్కడైనా స్థలం దొరికితే కట్టాలని అనుకుంటున్నారు. ఆ పెద్దావిడ ముందుకొచ్చింది. తన ఎకరం స్థలం తీసుకోమని చెప్పింది. అది వినగానే అందరూ కంగుతిన్నారు. నిజంగానే అంటున్నావా హుచ్చమ్మా? అన్నారు. ‘మనస్ఫూర్తిగా..’ అంటూ కాగితాలపై సంతకాలు చేసేసింది ఆమె. అలా ఆ ఊరికి స్కూల్ వచ్చింది. అటుపై పిల్లల ఆట స్థలం కోసం ఇబ్బంది పడకూడదని ఆ పక్కనే మరో ఎకరం కూడా ఇచ్చేసింది. ఈసారి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన అధికారులు.. ఆమెకు ఆ స్థలం విలువ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ భూమిలో ఇనుము ధాతువు ఉందని, ఎకరం కనీసం అర కోటి రూపాయలకు తక్కువకు పోదని ఆమెకు వివరించారు. కానీ, నవ్వుతూ ఆ పెద్దావిడ ‘ ఆ డబ్బు నేనేం చేసుకోను అయ్యా.. ఆకలి తీర్చుకునేందుకు పని చేస్తున్నా.. సంపాదించుకుంటున్నా. ఇలాగైనా ఈ ఊరి బిడ్డలు నన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కదా’ అంటూ సంతకాలు చేసేసింది. హుచ్చమ్మ ఇప్పుడు అదే స్కూల్లో ఆమె మధ్యాహ్నన భోజన పథకం కింద వంట మనిషిగా పని చేస్తోంది. బడి బంద్ ఉన్న టైంలో పొలం పనులు చేసుకుంటోంది. బడిలో అంతా ఆమెను అజ్జీ(అవ్వ) అని పిలుస్తున్నారు. తల్లి ప్రేమను నోచుకోకపోయినా.. ఊరి బిడ్డలకు ప్రేమగా వండిపెడుతోంది. 300 మంది ఆప్యాయంగా అవ్వా అంటుంటే సరిపోదా? అంటూ బోసినవ్వులతో చెప్తోంది హుచ్చమ్మ. అందుకే ఆ అవ్వ సాయానికి ఊరంతా మొక్కుతోంది ఇప్పుడు. -
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా కర్ణాటకలో మంకీ ఫీవర్ మరోసారి కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది. -
‘కాళ్లు మొక్కుతా సారు.. నాకు వద్దంటే వద్దు’
సాక్షి,జోగిపేట(హైదరాబాద్): కాళ్లు మొక్కుతా నాకు సూది(వ్యాక్సిన్) వద్దు అంటూ ఒక వైపు బతిమిలాడుతూనే మరొక వైపు వైద్య సిబ్బందిని దగ్గరకు రానీయకుండా మొండికేయడంతో అధికారులు నచ్చజెప్పి ఎట్టకేలకు ఆ వృద్ధురాలికి వ్యాక్సిన్ ఇప్పించగలిగారు. ఆదివారం అందోలు మండలంలోని కొడెకల్, డాకూరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకోని వారికి ఇప్పించారు. డాకూరు గ్రామంలో మైదాకుచెట్టు షరీఫాబీ(70) ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేసుకోమని కోరగా అందుకు నిరాకరించింది. కాళ్లు మొక్కుతానని, నాకు సూది ఇవ్వొదని మొరపెట్టుకుంది. అక్కడే ఉన్న జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని నచ్చజెప్పారు. ఇంట్లోకి వెళ్లి దాని వల్ల ఏమి భయంలేదని, కరోనా వచ్చినా తట్టుకుంటారని చెప్పి ఎట్టకేలకు వ్యాక్సిన్ వేయించారు. అరగంట సేపు సిబ్బందిని ఇబ్బంది పెట్టిన మహిళ వ్యాక్సిన్ వేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని డీపీఓ సూచించారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
‘అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’
ముంబై: కొంతమంది ఆరోగ్యపరంగా ఏ లోపాలు లేకున్నా, పని చేసే సామర్థ్యం ఉన్నా చేయలేక యాచించేవాళ్లని, ఇతరులపై ఆధారపడే వాళ్లని చూస్తుంటాం. ఇంకొందరు కష్టపడి పని చేయలేక సులభమైన దారిలో డబ్బు సంపాదనకై ఇతరులను మోసం చేస్తూ సంపాదిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. కానీ వయసు మీదపడినా కూడా ఓ బామ్మ మాత్రం ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం లేదని ఈ వయసులోనూ తన కష్టం మీదే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మకి సంబంధించిన ఫోటో సోషల్మీడియాలో చక్కర్లు కొడతూ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్జి రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ బామ్మను(రతన్) కలిసింది. ఆ సమయంలో ఆ బామ్మ రంగురంగుల పెన్నులను కార్డ్బోర్డ్తో తయారు చేసిన పెట్టెలో పెట్టి అమ్ముతోంది. అయితే ఆ కార్డ్బోర్డ్పై ఉన్న ఓ లైన్ చూసి అశ్చర్యపోయింది. ఆ నోట్లో.. ‘నాకు ఎవరీ దగ్గర చేయి చాచను. దయచేసి రూ.10/- బ్లూ కలర్ పెన్నులు కొనండి చాలు. థ్యాంక్యు. బ్లెస్ యూ’.. అని రాసుంది. కాగా ఆ బామ్మ రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగిన వాహనదారులను రిక్వెస్ట్ చేస్తూ పెన్నులు అమ్ముతోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రతి ఆమె ఫోటో తీసి తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు మన వంతు సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Shikha Rathi (@sr1708) చదవండి: Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
ప్రియురాలు పని చేసే చోట దొంగతనం.. పాపం పోవాలని పూజలు..
భోపాల్: ఫేస్బుక్లో ఓ వ్యక్తికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఈ అమ్మాయి 8 సంవత్సరాలుగా ఓ వృద్ధురాలి ఇంట్లో పనిచేస్తోంది. దీంతో తన ప్రియురాలిని కలవడానికి ఆ వ్యక్తి అప్పుడప్పుడు వృద్ధురాలి ఇంటికి వెళ్లేవాడు. అలా వెళ్లిన ప్రతీసారి ఆ యువకుడు కన్ను ఆ మహిళ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అలా ఓ రోజు తన ప్రియురాలు ఆ ఇంట్లో లేదని తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించి తన స్నేహితునితో కలిసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. (చదవండి: గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి) ఆమె అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి నగలను, సొమ్మును వారిద్దరు దోచుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన ప్రియురాలు కూడా ఎవరో దొంగలు వచ్చారే అనుకుంది. ఈ విషయం చుట్టుపక్కలవాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో వారు.. ఈ దోపిడీ తరువాత, నేరుగా ఉజ్జయినికి వెళ్లామని, అక్కడ బాబా మహాకల్ను దర్శనం చేసుకుని క్షమాపణ చెప్పడంతో పాటు అక్కడ దానధర్మాలు కూడా చేసినట్లు పోలీసులకు తెలిపారు. అయితే, ఈ ఘటన గురించి ఆ బాలికకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు -
వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే
తిరువనంతపురం: కొన్ని ఏళ్ల క్రితం మగ పిల్లలు ఆడే ఆటలపై అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యంగా కరాటే, బాక్సింగ్ వంటి క్రీడలవైపు వెళ్లాలంటే అమ్మాయిలతో పాటు.. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఇష్టపడేవారు కారు. ప్రస్తుతం ఈ ఆలోచన ధోరణి మారుతోంది. ఆటలకు ఆడా..మగా తేడా ఏంటని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు క్రీడాంశాల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అయితే వీరు కూడా ఆధునిక క్రీడలవైపే మొగ్గు చూపుతున్నారు కానీ మన సంప్రదాయ ఆటలపై ఆసక్తి కనపర్చడం లేదు. ఈ క్రమంలో కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి అమ్మ మన దేశ పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టులో పరాక్రమం చూపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన వృద్ధురాలు మీనాక్షి అమ్మ భారతదేశ పురాతన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టును నేటికి కూడా సాధన చేయడమే కాక అమ్మాయిలు దాన్ని సాధన చేసేలా ప్రొత్సాహిస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి అమ్మ మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించాను. ఇప్పటికీ ప్రాక్టీస్ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నాను’’ అని తెలిపారు. కలరిపయట్టు నేర్పే ఈ స్కూల్ని మీనాక్షి భర్త 1949లో ప్రారంభించాడు. ఆయన మరణం తర్వాత మీనాక్షి ఈ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. (చదవండి: Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా) ‘‘రోజు ఉదయం పేపర్ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఓ వార్త ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో మంచింది. ఈ మార్షల్ ఆర్ట్ కళను నేర్చుకోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వారు భయపడరు’’ అన్నారు మీనాక్షి. ‘‘కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నం అయితే మన శరీరమే కళ్లవుతాయి. ప్రత్యర్థి మాయమవుతాడు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’’ అన్నారు. (చదవండి: అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) నృత్యం,యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3,000 సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే బ్రిటీష్ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. చదవండి: విద్యుత్ జమాల్.. కలరిపయట్టు -
ఆమె ఒంటరి,జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేరు.. చివరికి..
సాక్షి, పలాస(శ్రీకాకుళం): ఆమె ఒంటరి. జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేని మహిళ. కట్టుకున్న భర్త కాలం చేసిన నాటి నుంచి కన్నబిడ్డలను కష్టపడి పెంచింది. కొడుకు చేతికి అందివచ్చాడని సంతోషించే లోపు విధి అతడిని తీసుకెళ్లిపోయింది. కుమార్తె కూడా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. నా అనే వారు లేక, అద్దె ఇంటిలో కాలం గడిపిన బత్తిన ఆదిలక్ష్మి (70) మంగళవారం కాలం చేశారు. ఇన్నాళ్లుగా ఆమెను చూస్తున్న స్థానికులు ఆదిలక్ష్మి మృతితో కన్నీరు పెట్టుకున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన బత్తిన ఆదిలక్ష్మి(70) మంగళవారం మృతి చెందారు. ఆమె భర్త చాలా కాలం కిందటే చనిపోయారు. పదేళ్ల కిందట కొడుకు కూడా మరణించాడు. ఒక్కగానొక్క కుమార్తె సుమిత్ర వజ్రపుకొత్తూరులో తన భర్తతో కలసి ఉంటున్నారు. కొద్దికాలంగా ఆదిలక్ష్మి ఆరోగ్య స్థితి బాగోలేదు. ఇటీవల కుమార్తె వద్ద కూడా ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కుమార్తె తల్లి వద్దకు వచ్చే సరికి ఆదిలక్ష్మి ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆమె పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చనిపోయారు. దీంతో ఆమె తాను ఉంటున్న వజ్రపుకొత్తూరుకు తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతితో బొడ్డపాడు గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. దుష్ప్రచారం తగదు.. పింఛన్ అందకపోవడం వల్లే వృద్ధురాలు బత్తిన ఆదిలక్ష్మి మరణించిందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పలాస ఎంపీడీఓ ఎన్.రమేష్నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: వైరల్: ‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’ -
నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక..
సాక్షి, చెన్నై: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ నర్సు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కరోనా టీకా వేయడంతో ఓ వృద్ధురాలు స్పృహ తప్పింది. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా పెన్నాడం ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి (55) సోమవారం వచ్చారు. తొలుత ఆమెకు నర్సు వ్యాక్సిన్ వేశారు. వెనువెంటనే సహచర నర్సుతో మాట్లాడుతూ మరో టీకా కూడా వేశారు. ఒకే సమయంలో తనకు రెండు సార్లు టీకా ఎందుకు వేస్తున్నారని లక్ష్మి ప్రశ్నించినా ఆ నర్సు ఖాతరు చేయలేదు. దీంతో లక్ష్మి స్పహ తప్పింది. ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. ఓ టీకా మాత్రమే వేసినట్టుగా నర్సు వాదించినా, బాధితురాలి చేతి నుంచి రెండు చోట్ల రక్తం వస్తుండడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మిని ఉంచారు. ఈఘటనపై ఆరోగ్య శాఖ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. చదవండి: Tamilnadu: తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు -
70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా
విజయనగరం: పురాణాల్లోనూ, కథల్లోనూ మునులు ఒంటరిగా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారని విని ఉంటాం కానీ చూసిన అనుభవం లేదు. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేం కదా! కానీ పద్మావతి అనే వృద్ధురాలిని చూస్తే నమ్మక తప్పదేమో. ఆమె ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా అడవిలోనే ఉంటుంది. కర్పూరాన్ని ఆహారంగా తీసుకుంటూ దైవ చింతనలోనే గడపుతూ ఉంటుందట. ఆ వివరాలు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామంలోని 85 ఏళ్ల పద్మావతి అనే వృద్ధురాలు గ్రామానికి సమీపంలోని అడవిలోనే ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది. తనని వేంకటేశ్వర స్వామి పిలుస్తున్నారంటూ.. 12 ఏళ్ల వయసులో పద్మావతి అడవిలోకి వెళ్లి.. అక్కడే నివాసం ఏర్పరుచుకుందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించిన పద్మావతి అంగీకరించేది కాదట. తన దైవం వేంకటేశ్వర స్వామి అని.. అక్కడి నుంచి రాలేనని చెప్తూ.. కొండపై విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటుందని అంటున్నారు స్థానికులు. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిసి ఆ కొండ పై గుడి నిర్మించామని తెలిపారు. పద్మావతి భక్తుల తెచ్చే పాలు, పళ్లు, కానుకలు ఏమి తీసుకునేది కాదని, అవన్నీ మళ్లీ తిరిగి తమకే ఇచ్చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం భక్తులు సమర్పించే కర్పూరం, అగరబత్తుల దూపం, టీ మాత్రమే తీసుకుంటుందని తెలిపారు. పద్మావతి జీవన శైలి దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు భక్తులు -
బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు !
-
బుల్లెట్ బండికి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో
సోషల్మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అలా ఏదైనా ఓసారి నెటిజన్లను ఆకట్టుకుంటే అవి వైరల్గా మారి నెట్టింట రచ్చ చేస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే వాటి హవా కొంత కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ‘బుల్లెట్ బండి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ తన భర్త ముందు ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం.. శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్ బండి’ పాట ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాటకు ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లోనూ అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. అయితే ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు తాను కూడా తక్కువకాదంటూ ఓ వృద్ధురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్ బండి’ సాంగ్కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్లో రిథమ్కి తగ్గట్టు ఆమె డాన్స్ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు, బహుశా షాక్లో ఉన్నాడేమో! ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్ బామ్మ అంటున్నారు. కొందరు ఫన్నీగా ఉందని కామెంట్ పెడుతుంటే.. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్’ అని కామెంట్ పెడుతున్నారు. చదవండి: Cat Drink Pig Milk: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో -
బతికుండగానే చంపేశారు..
బెల్లంపల్లి(మంచిర్యాల): అధికారుల తప్పిదంతో మండల కేంద్రానికి చెందిన గజెల్లి భూదేవి అనే పండు వృద్ధురాలు పదినెలలుగా ఆసరా పింఛన్ దూరమైంది. ఏళ్లుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ పింఛన్పై ఆధారపడిన ఆమెకు ఆకస్మాత్తుగా పింఛన్ నిలిపివేశారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే.. రికార్డుల్లో నువ్వు చనిపోయావని ఉందని, అందుకే తొలగించామని అధికారులు పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక పది నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ ఆసరా కోసం అధికారుల కాళ్లావేళ్లా పడుతోంది. రెండుసార్లు కలెక్టర్ను కలిసినా ఫ లితం లేదని వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. దా దాపు 25 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా.. కుమార్తెలకు వివాహం చేసి పంపించింది. కుమారులు లేకపోవడంతో రూ.200 పింఛన్ ఉన్నప్పటి నుంచి వాటిపైనే ఆధారపడి ఒంటరిగా ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ పునరుద్ధరించడంతోపాటు పదినెలల నగదు ఇప్పించాలని వేడుకుంటుంది. దొంగిలించిన బైక్పైనే దర్జాగా చక్కర్లు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో బైక్ను దొంగలించి దానిపైనే చక్కర్లు కొడుతున్న దొంగల ఫొటోను మంచిర్యాల పోలీసులు సోషల్మీడియాలో పోస్టుచేయగా శుక్రవారం వైరల్గా మారాయి. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రామకృష్ణాపూర్కు చెందిన పులి సంతోష్ బైక్ను ఆగస్టు 31న జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర టాకీస్ వద్ద దొంగిలించారు. బైక్ యజమాని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బైక్ దొంగిలించిన వ్యక్తులను పట్టుకునేందుకు వారి ఫొటోను సోషల్మీడియాలో పోస్టు చేశారు. నిందితులను గుర్తు పట్టిన వారు 9440795042, 9440908844 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! -
దేశమాతకు గళార్చన స్వతంత్ర గేయాలు
‘‘భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమేమందరం కలసి ఉంటె కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం...’’ హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ప్రసిద్ధ పాఠశాల. పేరు నాజర్ బాయ్స్ స్కూల్. దానికి ఎదురుగా ఓ అధునాతనమైన అపార్ట్మెంట్ లో దేశభక్తి గీతాలాపన జరుగుతుంటుంది. కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ పెద్దావిడ దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. ఆ పెద్దావిడ పేరు గుంటూరు ఈశ్వరమ్మ. పాట ఆగకూడదు! అరవై ఎనిమిదేళ్ల ఈశ్వరమ్మ కు మాటలతోపాటే పాటలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ల అమ్మ దమయంతికి పాటలు పాడడం ఇష్టం. ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలను ఆడిస్తూ పాటలు పాడుతూనే ఉండేవారామె. అలా మొదలైన ఈశ్వరమ్మ పాట నేటికీ అంతే శ్రావ్యంగా జాలువారుతూనే ఉంది. ఇంట్లో వేడుకలు ఈశ్వరమ్మ పాట లేనిదే సంపూర్ణతను సంతరించుకోవు. ఆమె స్కూలుకెళ్లే రోజుల నుంచి ఆగస్టు 15, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి... ఇలా ఏ వేడుక అయినా సరే ఈశ్వరమ్మ పాట తప్పకుండా ఉండేది. ఆమె పాడడంతోపాటు ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నారు కూడా. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాటలు పాడడానికి సిద్ధమవుతున్న పిల్లలకు ఆమె దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నారు. ‘‘నా దగ్గర ఉన్న పాటల్లో చాలా పాటలు బయట ఎక్కడా దొరకవు. అంతమంచి పాటలు నా దగ్గరే ఆగిపోతే ఎలాగ? పిల్లలకు నేర్పిస్తే మరొక తరం తయారవుతుంది. నా దగ్గర నేర్చుకున్న పిల్లల్లో ఏ నలుగురైనా దీక్షగా నేర్చుకుని మరింత మందికి నేర్పిస్తే నాకదే తృప్తి’’ అన్నారు ఈశ్వరమ్మ. పాటల పుటలు ఈశ్వరమ్మది నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ఆమె చిన్నప్పటి నుంచి ఆటగా పాటలు పాడుతుండడంతో పదేళ్లకే మాస్టార్ని పెట్టి సంగీతం నేర్పించారు. ‘‘మా మాస్టారి పేరు పెంటపాటి సర్వేశ్వరరావు. ఆయన గేయ రచయిత కూడా కావడంతో పాటలు సొంతంగా రాసి మాకు నేర్పించేవారు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నవి, నేను సేకరించినవి, మాస్టారు రాసిచ్చినవి అన్నీ కలిపి నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో పడి హార్మోనియం మీటడం మర్చిపోయాను. కానీ పాడడం మర్చిపోలేదు. నేను చదివింది ఎనిమిదవ తరగతి వరకే. కానీ మా వారు తెలుగు పండిట్ కావడంతో ఖాళీగా ఉన్నప్పుడు పద్యాలు పాడుకోవడం ఆయన అలవాటు. అలా నేనూ పద్యాలు నేర్చుకున్నాను. పాటలు, పద్యాలు పాడి పాటలు రాయడం వచ్చేసింది. పిల్లల ను ఉయ్యాలలో వేసేటప్పుడు సొంతంగా పాటలు రాసి పాడాను. సంక్రాంతి ముగ్గుల పాటలు, బతుకమ్మ పాటలు... మొత్తం 15 పాటలు రాశాను. జెండావందన గేయం మా మిర్యాలగూడలో జెండావందనానికి నాలుగు రోజుల ముందే నేను పాట పాడడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని కబురు చేసేవాళ్లు. హైదరాబాద్లో మా అబ్బాయి ఇంట్లో.. అపార్ట్మెంట్ జెండా ఆవిష్కరణలో దేశభక్తి గేయాలు పాడుతున్నాను. కరోనా వల్ల గతేడాది అపార్ట్మెంట్ లో ఉండే వాళ్లలో చాలామంది పతాకావిష్కరణకు రాలేదు. నేను వెళ్లి పాటలు పాడాను. కార్యవర్గ సభ్యులు నాతో గొంతు కలిపారు’’ అన్నారు ఈశ్వరమ్మ. అంతా నా బిడ్డలే! ఈ ఏడాది పిల్లలకు పాటలను జూమ్ సెషన్స్లో నేర్పిస్తున్నారామె. ‘‘దేశమాతను గౌరవిస్తూ పాట పాడడానికి పిల్లలు ముందుకు రావడమే గొప్ప సంతోషం. అలా ముందుకొచ్చిన పిల్లలందరూ నా మనుమళ్లు, మనుమరాళ్ల వంటి వాళ్లే’’ అంటున్న ఈశ్వరమ్మ భరతమాతకు ప్రతిరూపంగా కనిపించారు. – వాకా మంజులారెడ్డి -
పెళ్లి గౌనులో 94 ఏళ్ల బామ్మ క్యూట్ ఎక్స్ప్రెషన్స్... వీడియో వైరల్
మనలో ప్రతి ఒకరికీ ఓ కోరిక ఉంటుంది. అది చేయాలి, అక్కడికి వెళ్లాలి.. అని ఏదోఒకటి ఉండనే ఉంటుంది. ఇక అవి తీరేంత వరకు మనసు లోపల ఏదో వెలితిగా ఉండిపోతుంది. అదృష్టవశాత్తు కొందరికి తొందరగా..మరికొందరికి ఆలస్యంగా తీరుతుంది. అలా ఓ యువతి తనను తాను తెల్లటి పెళ్లి గౌనులో చూడాలనుకుంది. ఆ కోరికి తీరేసరికి ఆ యువతి కాస్త బామ్మగా మారింది. ఏదైతే ఏముంది చివరకు పెళ్లి గౌను వేసుకుని ఆ బామ్మ మురిసిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్తా మే ఓపేలియా మూన్ టక్కర్ అనే 94 ఏళ్ల బామ్మ ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో నివసిస్తుంది. టక్కర్కి తన పెళ్లిలో తెల్ల గౌను ధరించి అది చూసి మురిసి పోవాలని ఆమెకు చిన్నప్పటి నుంచి ఓ కల ఉండేది. కానీ ఆ కోరికి తీరలేదు. ఎందుకంటే టక్కర్ వివాహ సమయంలో అనగా 1952లో తాను నివసిస్తున్న ప్రాంతంలో నల్లజాతీయుల పట్ల వివక్ష ఉండేది. ఈ కారణంగా అప్పట్లో అది కుదరలేదు. ఇక చేసేదేమిలేక టక్కర్ తన పెళ్లి రోజున అద్దెకు తీసుకున్న బట్టలనే వేసుకుని పెళ్లి తతంగాన్ని కానిచ్చింది. అప్పటి నుంచి తన కల కలగానే మిగిలిపోయిందనే బాధ ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. ఇదంతా ఓ రోజు టక్కర్ తన మనవరాలికి చెప్పగా, బామ్మ బాధను అర్థం చేసుకుంది. వెంటనే తన బామ్మను బ్రైడల్ షాప్కు తీసుకెళ్లి ఒక పెళ్లి గౌను కొనిచ్చింది. పెళ్లి గౌను ధరించిన ఆ బామ్మ, ఆలస్యంగానైనా తన కోరిక నెరవేరడంతో చిన్న పిల్లలా సంబరపడిపోయింది. ఆ ఆనందంలో కేరింతలు కొట్టింది. అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోయింది. ఇదంతా వీడియో తీసిన తన మనవరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కోసం తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన బామ్మ కోరిక నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆ పోస్ట్లో తెలిపింది. పెళ్లి గౌనులో బామ్మను చూసిన నెటిజన్లు ఇంత అందమైన పెళ్లి కూతురిని మా జీవితంలో చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా హల్ చల్ చేస్తోంది. Martha Mae Ophelia Moon Tucker, who was married in 1952, always wanted to wear a wedding dress. But at the time Black women weren’t allowed in bridal shops. Now 94, her dream is coming true. https://t.co/hwaA5v9T9B pic.twitter.com/qlJ84ejemX — ABC News (@ABC) July 10, 2021 -
వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు..
సాక్షి, హోసూరు(కర్ణాటక): వృద్ధురాలిని ఏ మార్చి నగలు కాజేసిన దుండగుల ఉదంతం హడ్కో పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు– బాగలూరు రోడ్డులోని రెయిన్బౌ కాలనీకి చెందిన ఉషా(62) బుధవారం సాయంత్రం అదే ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెతో మాటలు కలిపారు. ఈ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని, వంటిపై నగలు భద్రపరిచి ఇస్తామని నమ్మబలికి కాగితంలో చుట్టినట్లు నటించి ఖాళీ కాగితం ఉండను అందజేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధురాలికి కాగితం ఉండలో నగలు కనిపించలేదు. దీంతో హడ్కో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: కట్టుకున్న భార్య మంత్రాలు చేస్తుందనే అనుమానం.. దీంతో.. -
దారుణం: తాగడానికి నీళ్లు అడిగి.. నోట్లో గుడ్డకుక్కి.. ఆపై..
నర్సాపూర్(మెదక్): నర్సాపూర్లో మంగళవారం పట్టపగలు వృద్ధురాలిపై దాడి చేసిన గుర్తు తెలియని మహిళ చోరీకి పాల్పడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక బస్టాండు ఎదురుగా ఉన్న కాలనీలో రెడ్డిపల్లి పెంటమ్మ(65) ఒక్కతే తన ఇంట్లో ఉంటుంది. మంగళవారం ప్రెషర్ కుక్కర్లు అమ్ముతామంటూ ఓ మహిళ అటుగా వచ్చి పెంటమ్మను కుక్కర్ తీసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరించింది. సదరు మహిళ తాగడానికి నీళ్లు ఇవ్వాలని అడగడంతో పెంటమ్మ ఇంట్లోకి వెళ్లగా ఆమె వెనకాల మహిళ వెల్లి తలుపులకు గడియపెట్టి పెంటమ్మ నోట్లో గుడ్డకుక్కి అక్కడే ఉన్న కర్రతో దాడిచేసింది. అనంతరం పెంటమ్మ మెడలో ఉన్న సుమారు తులం బంగారు గుండ్లు, చేతులకు ఉన్న వెండి గాజులు తీసుకుని పారిపోయింది. ఆమె వెళ్లిన కొంత సేపటికి పెంటమ్మ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగరాజు చెప్పారు. తీవ్రంగా గాయపడిన పెంటమ్మను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్స చేయించారు. చదవండి: తల్లిని వేధిస్తున్నందుకు.. తండ్రిని చంపిన తనయుడు -
దారుణం: కరోనా సోకిందని ఖాళీ చేయించారు..
పాలకుర్తి (వరంగల్ రూరల్): కరోనా వచ్చిన వారిపై ప్రేమచూపకున్నా.. వారిని హేళనగా చూడొద్దని, అలాంటి వారిని ఆదరించాలని ఎంత చెప్పినా.. కొంతమంది మారడంలేదు. అందుకు ఉదాహరణే ఈఘటన. సొంత ఇల్లు లేకపోవడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో నివాసముంటున్న ఈగ సుగుణమ్మ అనే వృద్ధురాలకి కరోనా సోకింది. దీంతో ఇంటి యజమాని ఆమెను బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో దిక్కుతోచిని స్థితిలో పడింది. దీంతో స్పందించిన స్థానిక వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు సదరు వృద్ధురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. అయితే సుగుణమ్మకు ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. మరో కుమారుడు కుటుంబ కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నట్లు సమాచారం. -
Shanta Verma: వయసా? హహ్హా...
50 వచ్చేశాయి.. 60 వచ్చేశాయి.. బాబోయ్ 70 వచ్చేశాయి. ఉత్తరప్రదేశ్ శాంతా వర్మకు 76. ‘అప్పుడే ఏం వయసొచ్చిందనీ?’ అంటుందామె నవ్వుతూ. హాయిగా భర్తతో కలిసి వీడియోలు చేస్తుంది. నవ్వుతుంది. ఫ్యాషన్ దుస్తులు ధరిస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో 16000 మంది ఫాలోయెర్స్ను సంపాదించుకుంది. ‘కృష్ణా రామా అనుకునే వయసు’ అని ఎవరైనా అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘ఈ స్టీరియోటైప్స్ను బద్దలు కొట్టండి. సంతోషంగా జీవించండి’ అంటుందామె. వయసును ఫీలవుతూ కుంగుబాటు తెచ్చుకునేవారు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 76 ఏళ్ల శాంతా వర్మ తన జీవితంలో ఎన్నో సుదీర్ఘమైన రోజులు, నెలలు, సంవత్సరాలు చూసి ఉంటుంది. కాని ఇప్పుడు ఆమె నిజంగా బతుకుతున్నది ‘30 సెకన్ల’లో. అవును. ఆమె చేసే 30 సెకన్ల వీడియోలు ఆమెను సంతోషంగా ఉంచుతున్నాయి. పాపులర్ చేస్తున్నాయి. అభిమానులను సంపాదించి పెడుతున్నాయి. వయసు గడిచిపోయింది అనుకుంటుంటారు కొందరు ఒక వయసు వచ్చాక. కాని శాంతా వర్మ వయసు మొదలైంది అనే భావనలో ఉంటారు. ఆమె ఇప్పుడు సోషల్ మీడియా సన్సెషన్. వీడియోల్లో ఆమె చీరలో సంప్రదాయంగా ఆమె దేవుని పటానికి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన గదిలోకి రాగానే ఫోన్ అందుకుంటుంది. ఆ ఫోన్లో చూసిన ఫ్యాషన్ దుస్తులను మనకు చూపించి క్షణాల్లో వాటిలోకి మారిపోతుంది. మహా మహా మోడల్స్కు లేనంత గ్రేస్తో అంటే ఏమాత్రం ఎబ్బెట్టుగా లేకుండా వాటిలో కనిపిస్తుంది. మోడ్రన్ దుస్తుల్లో ఆమె అంత చక్కగా కనిపించడం నిజంగా విశేషం. మరో వీడియోలో హైహీల్స్ చెప్పుల డబ్బా విప్పుతుంది. ఒక హై హీల్ను ఎగరేస్తుంది. అంతే. విఠలాచార్య సినిమాలో లాగా ఆ హైహీల్స్తో వాటికి తగ్గ షర్ట్ అండ్ స్కర్ట్లో కుర్చీలో దర్జాగా కనిపిస్తుంది. మరో వీడియోలో మనవరాలితో కలిసి కోడి కూత పెట్టినట్టు పెడుతూ స్టెప్పులేస్తుంది. ‘ఇన్స్టాగ్రామ్’లో 30 సెకన్ల వీడియోలు పెట్టే వీలుంది. ‘రీల్స్’ అనే ఇన్స్టాగ్రామ్ ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాంటి 30 సెకన్ల వీడియోలతో శాంతా వర్మ పాపులర్ అయ్యింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ పేరు ‘మిస్టర్ అండ్ మిసెస్ వర్మ’. జీవిస్తున్న క్షణాలు శాంతా వర్మ సొంత ఊరు ఉత్తరప్రదేశ్లోని భోకర్హెడి అనే చిన్న పల్లెటూరు. 15 ఏళ్ల వయసులో యశ్పాల్ సింగ్తో పెళ్లయ్యింది. ‘ఆ తర్వాత నా జీవితం అంతా అత్తామామలను చూసుకోవడం, పిల్లలని పెంచడం, వంట చేయడం, ఇల్లు కట్టుకోవడంతోనే సరిపోయింది. స్త్రీలకు కలలు, ఆకాంక్షలు, సరదాలు, ముచ్చట్లు ఎన్నో ఉండొచ్చు. కాని వాటికి టైమ్ లేకుండానే జీవితం గడిచిపోతుంది. కాని జీవితాన్ని ఎప్పుడైనా మొదలెట్టొచ్చని నాకు ఇప్పుడు అనిపిస్తోంది’ అంటుంది శాంతా. 82 ఏళ్ల భర్తతో కలిసి హర్యానాలోని కల్క అనే చిన్న ఊళ్లో స్థిరపడిన శాంతా వర్మ అక్కడ తన కొడుకు, కోడలు, మనవరాలితో కలిసి జీవిస్తోంది. ‘గత సంవత్సరం లాక్డౌన్లో నా మనవరాలు జనిత నాకు ఇన్స్టాగ్రామ్ను పరిచయం చేసింది. ఇక అంతే. దానికి నేను అతుక్కుపోయాను’ అంటుంది శాంతా వర్మ. నిజానికి శాంతా వర్మ మనవరాలు జనిత తాతగారి కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని మొదలెడదామనుకుంది. మొదలెట్టింది కూడా. ఎందుకంటే యశ్పాల్ సింగ్ మంచి జోకులు కట్ చేయగల సమర్థుడు. ఆయన మీద వీడియోలు షూట్ చేస్తుంటే శాంతా వర్మ వచ్చి తాను అంతకన్నా బాగా చేయగలనని చూపించింది. దాంతో ఇద్దరి మీదా వీడియోలు మొదలెట్టింది మనవరాలు. మెల్లగా శాంతావర్మ ప్రతిభ బయటికి వచ్చి ఆమెకు అభిమానులు పెరిగారు. ‘నేను మా ఆయన్ని సరదాగా విమర్శిస్తూ చేసే వీడియోలు నెటిజన్స్కు నచ్చుతున్నాయి. మగాళ్లను ఏదో ఒకటి అనాలని ఆడవాళ్లకు ఉంటుంది కదా’ అంటుంది శాంతా వర్మ. భర్త మీద వంక పెట్టి ఆమె మగవాళ్లలోని లోపాలను సరదాగా ఎద్దేవా చేస్తూ ఉంటుంది. 61 ఏళ్ల దాంపత్యం శాంతావర్మకు, యశ్పాల్ సింగ్కు పెళ్లయ్యి 61 ఏళ్లు. ‘ఇన్ని సంవత్సరాలలో మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు’ అంటుంది శాంతా వర్మ పెళ్లయిన కొత్తల్లో బుల్లెట్ నడపాలని తాను అనుకుంటే భర్త నేర్పడానికి ప్రయత్నించే ఫొటోను చూపెడుతూ. ఆమె భర్త అందుకుంటూ ‘ఆమె ఈ వీడియోలు చేసి తన ప్రతిభను చూపడం మొదలెట్టాక ఉదయాన్నే నా మార్నింగ్ వాక్ అయ్యాక మా ఇంటి తోటలోని పూలను కోసి ఆమెకు బొకేలా అందించడం తప్పక చేస్తున్నాను. ఆమె సిగ్గుపడుతుంది గాని నేను చేయగల పని అదే’ అంటాడు. భార్యకు పూలు అప్పుడప్పుడన్నా కానుక గా ఇద్దాం అనుకునే వయసులో ఉన్న భర్తలు తక్కువ. కాని యశ్పాల్ తన ప్రేమ ప్రకటనకు వయసు లేదు అనుకుంటున్నాడు. 16000 మంది అభిమానులు శాంతా వర్మకు ఇన్స్టాగ్రామ్లో 16 వేల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఒక నానమ్మ తన భర్తతో కలిసి ఉత్సాహంగా జీవించడం వారిలో స్ఫూర్తి నింపుతోంది. మంచి మంచి బట్టల్లో వీడియోలు చేస్తూ బోర్డమ్ను నిర్లిప్తతను నిస్సత్తువను వాళ్లు వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే సంతోషపడుతున్నారు. శరీరం ఏ మంచి ప్రకటనకు అయినా సిద్ధంగా ఉంటుంది. మనసులో జీవం ఉండాలి. ఆ జీవాన్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుందని నిరూపిస్తోంది శాంతా వర్మ. – సాక్షి ఫ్యామిలీ -
Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏం మాట్లాడాలి అనుకున్నా కరోనాతోనే మొదలవుతుంది. దానితోనే ముగుస్తుంది. కరోనా చాలామంది జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మనుషులు ఏదో రకంగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కుల్దీప్ సింగ్ ఓ 82 ఏళ్ల బామ్మను తన చేతుల్లో మోసుకెళ్లి టీకా వేయించారు. శైలా డిసౌజా(స్పిన్స్టర్,రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్) కరోనా టీకా వేయించుకోవాలనే కోరికను కానిస్టేబుల్ కుల్దీప్కు తెలియజేసింది. దాంతో అతడు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు విషయాన్ని తెలిపాడు. అలా టీకా కోసం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆమె గత రెండు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. వీల్చైర్లో వ్యాక్సినేషన్ వేసే దగ్గరకి తీసుకెళ్లడానికి వీలులేదు. దీంతో ఆ కానిస్టేబుల్ బామ్మను రెండో ఫ్లోర్ నుంచి తన చేతుపై మోసుకెళ్లారు. అక్కడ వ్యాక్సిన్ వేయించి తిరిగి ఇంటి దగ్గరకు చేర్చాడు. కానిస్టేబుల్ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ... "ఆమె నా బీట్ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్. ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికి తరచూ వెళ్తుంటాను. అయితే బామ్మ కోవిడ్ టీకా తీసుకోవాలనే కోరికను నాతో పంచుకుంది. దాంతో మా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి తెలిపి పోర్టల్లో టీకా కోసం నమోదు చేయించాం." అని అన్నారు. అంతేకాకుండా "మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటాం. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ఉద్యోగంలో భాగం మాత్రమే కాదు. బాధలో ఉన్న వ్యక్తులలో మా కుటుంబాన్ని చూస్తాం. అలాంటి వారికి నావంతు సహాయం చేస్తాను." అని ఢిల్లీ కానిస్టేబుల్ కుల్దీప్ అన్నారు. కాగా ఢిల్లీ కానిస్టేబుల్ సాయానికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. (చదవండి: Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్.. దిశా పటాని ఫిదా!) -
షాకింగ్ ఘటన: ఒక్కసారిగా పాడెపై నుంచి లేచిన బామ్మ
ముంబై: కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలకు బంధువులను పిలిపించారు. కొద్దిసేపట్లో అంత్యక్రియలు మొదలు పెట్టనుండగా ఒక్కసారిగా ఆ పెద్ద మనిషి పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా షాకయ్యారు. ఎలాగోలా తమ బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో ఆమెకు బెడ్ లభించలేదు. దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. శకుంతల మృతదేహాన్ని పాడెపై ఉంచి బంధవులంతా ఏడుస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు.. బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల -
స్త్రీల దుస్తులకూ వయసుంటుందా?
తెలుగు సినిమాల్లో హీరోయిన్ పెళ్లికి ముందు మోడ్రన్ డ్రస్సుల్లో పాటలు పాడుతుంది. పెళ్లయ్యాక తప్పని సరిగా చీరల్లోకి మారుతుంది. హీరో పెళ్లికి ముందు... తర్వాత కూడా ప్యాంట్లోనే ఉంటాడు. మన దేశంలో స్త్రీలు యాభై దాటాక మన సంస్కృతి సంప్రదాయాలకు తగినట్టుగా దుస్తులు ధరించాలనే ఒక అప్రకటిత నిబంధనకు నిబద్ధులుగా ఉంటారు. యాభై దాటాక వారు తమ మనసు ఎలా ఉన్నా తప్పనిసరిగా వృద్ధాప్యాన్ని ప్రదర్శించాల్సిందేనా? కేరళలో 69 ఏళ్ల నటి రజని చాంది తన సరదా మేరకు మోడ్రన్ దుస్తుల్లో దిగిన ఫొటోలు ఆమెకు ప్రశంసలతో పాటు శాపనార్థాలు కూడా తెచ్చి పెట్టాయి. ‘ఈ వయసులో ఇదేం పని’ అన్నవారే ఎక్కువ. 29 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ అతిరా రాయ్ ఈ ఫొటోలు తీసింది. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వృద్ధులు ఉండొచ్చు.. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వృద్ధ స్త్రీలు ఉండకూడదా అని ఇప్పుడు చర్చ. ‘నేను మా అమ్మను చూశాను. 60 ఏళ్లు రావడంతోటే ఆమె జీవితం అంతా ముగిసిపోయినట్టుగా తయారైంది. 60 తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలన్నింటిని ఎదుర్కొనడానికి సిద్ధపడింది. 60 దాటాక మన దేశంలో స్త్రీలు అమ్మమ్మలుగా, నానమ్మలుగా తమ శరీరాల మీద శ్రద్ధ, అలంకరణ పట్ల ఆసక్తీ లేకుండా ఉండటం అలవాటు చేసుకున్నారు. కాని రజని చాందిని చూసినప్పుడు నాకు మా అమ్మ కంటే భిన్నంగా అనిపించారు. ఆమె తన శరీరాన్ని చక్కగా చూసుకుంటున్నారు. రూపాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఉత్సాహంగా హుషారుగా జీవితాన్ని ఏ వయసులో అయినా గడపొచ్చు అన్నట్టుగా ఉంటారు. ఇలా మిగిలిన స్త్రీలు కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అందుకే ఆమెతో డిఫరెంట్గా ఫొటోషూట్ చేద్దామని అనుకున్నాను. చేశాను’ అంది ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అతిరా రాయ్. ఈమె సంప్రదాయ ఫొటోషూట్లకు కొంచెం ఆవల భిన్నమైన ఫొటోలు తీస్తుంటుంది అన్న పేరు తెచ్చుకుంది. అదే విధంగా ఇప్పుడు రజని చాందికి తీసిన ఫొటోలతో కూడా వార్తల్లోకి ఎక్కింది. ఎవరీ రజని చాంది? రజని చాందిది కేరళలోని కొచ్చి. ఇప్పుడు ఆమె వయసు 69 సంవత్సరాలు. జీవితంలోని చాలా భాగం ముంబైలో గడిచింది భర్త బ్యాంకు ఉద్యోగం వల్ల. అతను రిటైర్ అయ్యాక కొచ్చికి వచ్చి స్థిరపడ్డారు. అయితే ముంబైలో గడిపి వచ్చిన రజని ఆ నగర ధోరణికి తగిన దుస్తులు ధరిస్తూ అక్కడి స్త్రీలను భృకుటి ముడిపడేలా చేస్తూ వచ్చారు. ‘నేను స్లీవ్లెస్ వేసుకొని వెళితే ఒకలాగా చూశారు’ అని రజని చెప్పుకున్నారు. అయినా సరే రాజీ పడుకుండా తనకు నచ్చిన దుస్తులు ధరిస్తూ వచ్చారు. అంతేనా? 65 ఏళ్ల వయసులో నటిగా అవతారం ఎత్తి ‘ఒరు ముత్తాసి గాధ’ అనే మలయాళ సినిమాలో నటించారు. ఇంకా జనాన్ని ఆశ్చర్యపరుస్తూ మలయాళం బిగ్బాస్లో పాల్గొన్నారు. ‘నా వయసు వారు లిప్స్టిక్ రాసుకున్నా తప్పేనా?’ అంటారు రజని. విమర్శలు రేపిన ఫొటోషూట్ ‘మీరు నా భర్త పర్మిషన్ తీసుకుంటే మీరు కోరిన ఫొటోషూట్లో నేను పాల్గొంటాను’ అన్నారు రజని చాంది తనతో ఫొటోషూట్ ప్రస్తావన చేసిన అతిరా రాయ్తో. అతిరా రజని చాంది భర్తను అడిగితే ‘ఆమె జీవితం ఆమె ఇష్టం. నచ్చితే చేయమనండి’ అన్నాడాయన. ఇక ఫొటోషూట్ మొదలైంది. లొకేషన్ రజని చాంది ఇల్లే. ఒక బొటిక్ నుంచి కొన్ని డ్రస్సులు తెచ్చి మొత్తం 30 ఫొటోలు తీసింది అతిరా. ‘మొదట్లో ఆ డ్రస్సులను చూసి షాక్ అయ్యాను. వేసుకున్నాక బాగానే ఉన్నా అనిపించింది’ అన్నారు రజని చాంది. డిసెంబర్ 2020 చివరి వారంలో ఈ ఫొటోషూట్ జరిగింది. వారం క్రితం రజని తన ఫేస్బుక్లో ఇన్స్టాలో ఆ ఫొటోలను పెట్టడంతో మొదట ప్రశంసలు మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే ఒక డ్రస్లో రజనీ మోకాళ్లు కనిపిస్తున్నాయి. మరో డ్రస్సులో వక్ష అంచు కనిపిస్తూ ఉంది. ‘నువ్వెందుకు చచ్చిపోలేదు అని ట్రోల్ చేశాడొకడు. నీకీ వయసు లో కావలసింది బైబిల్. ప్రార్థన చేసుకో అన్నాడొకడు. మరొకడు నువ్వొక పాత ఆటోవి. కొత్త రంగేసినా పాత ఆటో పాతదే అన్నాడు. ఆశ్చర్యంగా మగవాళ్ల కంటే స్త్రీలే నన్ను ఎక్కువ తిట్టారు. నా కాళ్లు బాగుంటే నేనేం చేయను. వాటిని చూపిస్తే మీకేంటి నొప్పి అనాలనిపిస్తోంది. నా మీద మీ శక్తిని ఖర్చుపెట్టడం కంటే దేశం కోసం ఏదైనా పనికొచ్చే పని చేయండి అని బదులు ఇచ్చాను’ అన్నారు రజని చాంది. ‘మన దేశంలో స్త్రీలు అమ్మమ్మలుగా నానమ్మలుగా ఒక వయసు తర్వాత ఇళ్లల్లో గౌరవం పొందుతూ ఉంటారు. వారి బట్టలు కూడా ఎలా ఉండాలో మనం నిర్ణయించేశాం. వితంతువులైతే తెల్లబట్టల్లో ఉండాలి. ఆకర్షణ రహితంగా ఉండాలి వీరు. కాని రజని చాంది చేసిన ఈ ఫొటోషూట్ స్టీరియోటైప్ను బద్దలు కొట్టేలా ఉంది. అందుకే అందరూ ఇబ్బంది పడుతున్నారు’ అని నమిత భండారే అనే ఒక వెబ్సైట్ ఎడిటర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రశంసలు కూడా ఉన్నాయి. వయసు అనేది కేవలం శారీరకమే తప్ప మానసికం కాదని నిరూపించారని చాలామంది రజనిని మెచ్చుకున్నారు. కాని ఆలోచించ వలసింది ఏమిటంటే 70 ఏళ్ల తాతయ్యలు మనవళ్ల టీషర్ట్స్ వేసుకుని మురిసిపోతూ తిరుగుతూ ఉంటారు. వారిని ఎవరూ ఏమీ అనరు. కాని మనవరాలిలా బట్టలు తొడుక్కున్న అమ్మమ్మను మాత్రం విమర్శిస్తారు. స్త్రీల దుస్తులు వారు వ్యక్తం చేసే కోరికకు సంకేతంగా, వారి మేకప్ లైంగిక ప్రేరకంగా, వారి ప్రతి చర్య అభ్యంతరకరంగా భావించబడేంత వరకూ స్త్రీలు ఈ విమర్శలు ఎదుర్కొనక తప్పదు. రజని చాందిలాంటి వారు చేసే ప్రయత్నాలు ఈ లైంగికతకు ఆవల ఉండే సౌందర్య వ్యక్తీకరణలుగా భావించేలా చేస్తాయి. సంఘ నియమాలు ఉంటాయి నిజమే. కాని వ్యక్తుల ప్రతిఘటన జరిగినప్పుడు ఆ నియమాలు కుదుపులకు లోనవుతాయని రజని చాంది ఘటన నిరూపిస్తోంది. రజని చాందితో అతిరా రాయ్ – సాక్షి ఫ్యామిలీ -
వృద్ధురాలిపై టీడీపీ నేతల దాష్టీకం
బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు మితివీురుతున్నాయి. ఇటీవల పొన్నాపురం గ్రామానికి చెందిన దళిత నాయకుడు సుబ్బరాయుడిని హత్య చేశారు. ఆదివారం నాడు ఆర్యవైశ్య సంఘానికి చెందిన సత్యానారాయణశెట్టిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా సోమవారం ఓ వృద్ధురాలి భూమిని కబ్జా చేయడమే కాకుండా.. అదేమని అడిగినందుకు ఆమె చేతి వేళ్లు నరికారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసిం, ఫాతమ్మ దంపతులకు అదే గ్రామంలో 2.80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఖాసిం అనారోగ్యంతో మృతి చెందగా.. ఫాతమ్మ తన ముగ్గురు కుమారులతో కలిసి ఉంటోంది. వారసత్వంగా వచ్చిన ఆ భూమిని ఆమె పెద్ద కుమారుడు హుస్సేన్ పీరా సాగు చేస్తున్నాడు. ఆ భూమిపై రైతు నగరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బెజవాడ నరేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు కన్నేశారు. మృతిచెందిన ఖాసిం ఆ భూమిని తమకు విక్రయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి.. ఆన్లైన్లో కూడా నమోదు చేయించుకున్నారు. దీనిపై ఫాతమ్మ, ఆమె కుమారులు నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కాగా.. కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీ నాయకులు ఆ భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఇది తెలుసుకున్న బాధితులు ‘ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది’ అని రాయించిన బోర్డును పొలంలో పెట్టారు. సోమవారం మధ్యాహ్నం వృద్ధురాలు ఫాతమ్మ పొలంలో పనిచేసుకుంటుండగా.. టీడీపీ నాయకులు ఆమెపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా.. వారిపైనా దాడికి పాల్పడ్డారు. పొలంలో ఉన్న బోర్డును తొలగిస్తుండగా ఫాతమ్మ అడ్డుపడింది. దీంతో టీడీపీ నాయకుడు శ్రీనివాసులు సలిక పారతో ఆమె చేతి వేళ్లను నరికేశాడు. ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చేతి వేళ్లు రెండు పూర్తిగా తెగిపోవటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. ఫాతమ్మ కుమారుడు హుస్సేన్పీరా ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు నరేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులుపై నంద్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్రెడ్డి కేసు నమోదు చేశారు. -
ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి
రెంజల్ (బోధన్): ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
‘యోగా బామ్మ’ కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరుకుచెందిన ప్రఖ్యాత యోగా టీచర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత నానమ్మాళ్ (100) ఇక లేరు. క్లిష్టమైన యోగాసనాలను కూడా చాలా సులువుగా ప్రదర్శిస్తూ ‘యోగా బామ్మ’గా ప్రసిద్ది చెందిన నానమ్మాళ్ శనివారం కోయంబత్తూరులో కన్నుమూశారు. రేపు(ఆదివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు నానమ్మాళ్ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. గ్రామీణ వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చిన ఆమె చిన్నతనం నుంచే యోగాసనాల్లో ఆరి తేరారు. ఫిబ్రవరి 1920న జన్మించిన ఆమె 10 సంవత్సరాల వయస్సు నుండే యోగాభ్యాసం చేయడం ప్రారంభించారు. తన తాతలు యోగా చేయడం చూసి యోగాపై మక్కువ పెంచుకున్నారు. ఆమె ప్రతిరోజూ కనీసం ఒకసారైనా యోగా చేస్తానని చెప్పేవారు. ఈమె దగ్గర శిక్షణ తీసుకున్న చాలామంది పలువురు ప్రస్తుతం యోగా బోధకులుగా ఉన్నారు. దాదాపు 50 రకాల ఆసనాలను అవలీలగా వేయడం ఈ బామ్మ ప్రత్యేకత. నానమ్మాళ్ ప్రతిభ, నైపుణ్యానికి గుర్తుగా 2018 లో పద్మశ్రీ అవార్డు లభించింది. 2016 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి నుంచి నారీశక్తి పురస్కార్ అవార్డును కూడా ఆమె గెల్చుకున్నారు. 2017లో కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే యోగా రత్న అవార్డు దక్కింది. కోయంబత్తూరులో20 వేల మంది విద్యార్థులకు, త్సాహికులకు యోగా నేర్పించడం ద్వారా నానమ్మల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఘనత ఆమె సొంతం. ఎలాంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆమె దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా ఖ్యాతి గడించారు. -
నగల కోసమే చంపేశారా?
సాక్షి, అలంపూర్/ గోపాల్పేట (వనపర్తి): నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉండవెల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం హత్యకు గురై దహనమైన వృద్ధురాలి ఆచూకీని కుటుంబ సభ్యులు, ఆమె ఆనవాళ్ల సహాయంతో గుర్తించినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి ఉండవెల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ విషయమై సోమవారం పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. పత్రికల్లో కథనాలు చూసిన గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన కొమ్ము నర్సయ్య ఆయన కుమారులు పెద్ద సుబ్బయ్య, చిన్న సుబ్బయ్యలు కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఉండవల్లి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐతో మాట్లాడి తమ వివరాలు తెలిపారు. తన తల్లి కొమ్ము రాజమ్మ(72) కనిపించడం లేదని చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రిలో ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని చూపించారు. మృతురాలి శరీరంపై ఉన్న పులిపిరి, వేసుకున్న జాకెట్, చేతికి ఉన్న సాధారణ ఉంగరం, మెట్టలు, తల వెంట్రుకల కొప్పు విధానం చూసి తమ తల్లిగా గుర్తించారు. ఈ నెల 16వ తేదీన మందుల తెచ్చుకొనేందుకు వనపర్తికి వెళ్లిందని ఆ రోజు నుంచి ఇంటికి రాలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలు చూసి అనుమానంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడంతో తమ తల్లిగా నిర్ధారించుకున్నట్లు వివరించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షాకీర్హుసేన్, సీఐ రాజు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వారిచ్చిన ఆధారాల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజమ్మ ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగల కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
శాలిగౌరారం (తుంగతుర్తి) : అనుమానస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని రామాంజాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుంకుంది. ఎస్ఐ గోపాల్రావు తెలిపిన వివరాలి ప్రకారం.. రామాంజా పురం గ్రామానికి చెందిన యల్లంల సాలమ్మ(65) గ్రామంలోని తన సొంతింట్లో ఒంటరిగానే ఉంటుంది. సాలమ్మకు పిల్లలు లేకపోవడంతో పాటు భర్త మల్లయ్య కూడా మూడు సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. సోమవారం రాత్రి ఇంట్లో నింద్రించిన సాలమ్మ మంగళవారం ఉదయం తలుపులు తెరువకపోవడంతో ఆమె అత్త పూలమ్మ వెళ్లి చూడగా తలుపుల రాకపోవడంతో తన మనుమలకు చెప్పింది. దీంతో సాలమ్మ మరిది కుమారులు వెళ్లి తలుపులు తెరిచిచూడగా అప్పటికే సాలమ్మ మంటల్లో పూర్తిగా కాలి మృతిచెంది ఉంది. దీంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చిచూసి పోలీసులకు సమాచారమందించారు. సాలమ్మ మృతిపై అనుమానాలు.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సాలమ్మ మంటల్లో కాలి మృతిచెందడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్చయ్య-పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో సాలమ్మ భర్త మల్లయ్య పెద్దవాడు కాగా యలమంద చిన్నవాడు. మల్లయ్య-సాలమ్మ దంపతులకు పిల్లలు లేరు. యలమందకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరందికి వివాహాలు కూడా జరిగాయి. పిచ్చయ్య-పూలమ్మ సంపాధించిన 20 ఎకరాల వ్యవసాయ భూమిని వారు తన ఇద్దరు కుమారులు మల్లయ్య, యలమందలకు 10 ఎకరాల చొప్పున భాగపంపిణీ చేసి ఇచ్చారు. మల్లయ్య భాగంగా వచ్చిన 10 ఎకరాల భూమిలో తన పేరుమీద 5 ఎకరాలు, భార్య సాలమ్మ పేరుమీద మరో 5 ఎకరాల భూమిని రికార్డుల ప్రకారంగా నమోదు చేయించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం మల్లయ్య మృతిచెందడంతో మల్లయ్య పేరున ఉన్న భూమిని యలమంద తన పేరున మార్చుకున్నారు. ప్రస్తుతం సాలమ్మ పేరున ఉన్న భూమిని కూడా యలమంద కుటుంబీకుల ఆదీనంలోనే ఉంది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాలమ్మ బాగోగులను యలమంద కుటుంబీకులే చూసుకుంటున్నారు. వారం రోజులక్రితం సాలమ్మ తనవద్ద ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను దాచిపెట్టమని అదే గ్రామానికి చెందిన అన్న కత్తుల మల్లయ్యకు ఇచ్చింది. బంగారు ఆభరణాలను దాచిపెట్టిన విషయం తెలుసుకున్న యలమంద కుటుంబీకులు సాలమ్మను బాగోగులు చూసుకోకుండా బంగారు ఆభరణాలు తీసుకురావాలంటూ మానసిక ఒత్తిడికి గురి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే సాలమ్మ ఇంట్లో మంట ల్లో కాలిపోయి చనిపోవడం అనేక అనుమానాల కు తావిస్తోంది. పెద్దగా ఉన్న ఒకే ఇంటిలో ఒక భాగంలో యలమంద కుటింబీకులు, రెండో భాగంలో సాలమ్మ, మూడో భాగంలో సాలమ్మ అత్తమామలు ఉంటున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో సాధారణంగా వ్యక్తులు కేకలు వేస్తారు. లేదా అటుఇటు పరుగులు పెడతారు. ఒకవేళ కేకలు వేస్తే పక్కన ఉన్న యలమంద కుటింబీకులకుగానీ, అత్తమామలకుగానీ వినపడలేదా..? సాలమ్మ ఇంట్లో ఓ మూలన పూర్తిగా కాలిపోయి మృతిచెంది ఉంది. ఒకపక్క అనారోగ్య సమస్యలు.. మరోపక్క ఆలనాపాలనా చూసేవారు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఆస్తికోసం ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా..? అనే అనుమానాలకు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సాలమ్మ అన్న కత్తుల మల్లయ్య పోలీసులకు యలమంద కుటుంబీకులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. మల్లయ్య పిర్యాదు మేరకు ఎస్ఐ గోపాల్రావు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ మండలంలోని రామాంజాపురంలో అనుమానస్పద స్థితిలో వృద్ధురాలు మంటల్లోకాలి మృతిచెందిన విషయం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సాలమ్మ మృతదేహన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాలమ్మ మృతిపై గ్రామస్తులను కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. -
విద్యుదాఘాతానికి వృద్ధురాలు బలి
ఆత్మకూర్ (కొత్తకోట) : ఇంటి ఆవరణలో తెగిపడిన విద్యుత్ తీగను పక్కకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని ఆరేపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఏఎస్ఐ బీచుపల్లి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండమీది తెలుగు లక్ష్మమ్మ(62) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంటి ఆవరణలో నడస్తుండగా తన ఇంటికి ఉన్న సర్వీస్ వైరు తెగిపడటాన్ని గమనించింది. ఆ తీగలు పక్కకు తీసేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమె భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడని, ఈమెకు ఎలాంటి సంతానం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు. -
ముదుసలి మృత్యుపోరాటం
ముగ్గుబుట్ట వంటి తల..ముడుతలు పడిన శరీరం..లోతుకుపోయిన కళ్లు..శ్రమ పడేందుకు సహకరించని శరీరం..అండగా ఉండేందుకు ఎవరూ లేక ఓ వృద్ధురాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి దీన పరిస్థితిలో ఆ వృద్ధురాలి గాథను వినిపించుకునేదెవరు? ఆ అభాగ్యురాలి ఆవేదన ఎవరి హృదయాలను కదిలించగలదు. తిండి, వైద్యం లేకుండా మృత్యువుతో ఒంటరిగా పోరాడుతున్న ఆమె మొరను పట్టించుకునేదెవరు? సభ్య సమాజంలో ఒంటరిగా పోరాడుతున్న దీనురాలి దీనస్థితిని చూస్తున్నా మానవత్వం పరిమళించక పోవడం విచారకరం. రాయగడ : రాయగడ జిల్లా కొల్నార సమితి కలియగుడ గ్రామంలో ఒక నిరుపేద వృద్ధురాలు కొద్దిరోజులుగా తిండి లేక తలకు గాయమైనప్పటికీ వైద్యమందక సహాయం అందించేవారు లేక మృత్యువుతో పోరాడుతోంది. కలియగుడ గ్రామంలో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ ఓ వృద్ధురాలికి తిండి లేక పొయ్యలో నిప్పు వెలగని పరిస్థితుల్లో కూడా సహాయం అందక ఉండగా తలకు గాయమైతే ఏ ఒక్కరూ సహాయం అందించక పోవడమే కాకుండా కనీసం 108 అంబులెన్సు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆకలితో అలమటిస్తూ రోగగ్రస్థురాలై తన ఇంట్లో పొయ్యి దగ్గర నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విచారకరం. గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఆమె నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడడం విచాకరం. ఇటువంటి అభాగ్యులను ఆదుకునేందుకు సమితి అధికారులు, సర్పంచ్లు, సమితి మెంబర్లు, వార్డు మెంబర్లకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందిస్తున్నప్పటికీ ఓ వృద్ధురాలిని ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం విచారకరం. -
వృద్ధురాలి దారుణ హత్య
మోతె(కోదాడ) సూర్యాపేట : వృద్ధురాలిని గొంతునులిమి దా రుణంగా హత్య చేసి, ఆపై ఆమె దగ్గర ఉన్న నగదుతో పరారయ్యాడు నిందితుడు. ఈ సంఘటన మోతె మండలం నామవరం గ్రామంలో సోమవా రం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకా రపు ముత్తమ్మ(80) ఎద్దులను కొనుగోలు చేసేందుకు ఇటీవల అదేగ్రామంలో గుంటి పూలమ్మ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకుని దగ్గర పెట్టుకుంది. ముత్తమ్మ ఇంటి ఎదురుగా ఉన్న దైద మహేందర్ అనే వ్యక్తి ముత్తమ్మ వద్ద డబ్బులు చూసి డబ్బులు ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈనెల 5న ముత్తమ్మ చివ్వెం ల మండలంలో బండమీది చందుపట్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో కర్మకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చింది. అదేరాత్రి మహేందర్ ముత్తమ్మ ఇంట్లోకి జొరబడి రూ.30 వేలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు గమనించిన ముత్తమ్మ అడ్డుకోబోగా ఆమెను గొంతునులిమి చంపి, డబ్బుతో పరారవుతుండగా.. ముత్తమ్మ కూతురు జానమ్మ చూసి ఇంట్లోకి వెళ్లి చూసింది. అప్పటికే ముత్తమ్మ మృతి చెందింది. ఇంట్లో రూ.17,500లు చిందరవందరగా పడి ఉండడంతో ముత్తమ్మ కూతురు ఇంటిపక్కల వారికి విషయం తెలిపి పోలీసులకు సమాచారం అందించింది. హత్య జరిగిన స్థలాన్ని మునగాల సీఐ శివశంకర్, కోదాడ టౌన్ సీఐ శ్రీని వాసరెడ్డి, మునగాల ఎస్ఐ నగేష్, మోతె ఏఎస్ఐ సందర్శించారు. ముత్తమ్మ హత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పాండునాయక్ తెలిపారు. -
ఇంటి కోసం మహాలక్ష్మి మళ్లీ దీక్ష
రేగిడి శ్రీకాకుళం : బూరాడ గ్రామానికి చెందిన దేవకివాడ మహాలక్ష్మి గ్రామంలో మంగళవారం మళ్లీ దీక్ష ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ చొరవతో భూసమస్య పరిష్కారం అయినప్పటికీ మహాలక్ష్మి ఉండేందుకు గూడు లేకపోవడంతో ఇంటి కోసం దీక్షను మళ్లీ ప్రారంభించిందని కుమార్తె గేదెల కల్యాణి విలేకరులకు తెలిపారు. భూమి, ఇళ్లు కోసం గత నెల 11వ తేదీ నుంచి గ్రామంలో దీక్ష చేసినప్పటికీ గత నెల 17న ఈమె ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అక్కడ కూడా వైద్యాన్ని నిరాకరించి ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగించింది. ఈమె పరిస్థితి విషమించడంతో 22వ తేదీన రాత్రి శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్చేశారు. 30వ తేదీ రాత్రి డిశ్చార్జి చేశారని కుమార్తె తెలిపారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన భూమి కోసం దీక్ష చేస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పందించి 1.55 ఎకరాలు భూమిని దేవకివాడ మహాలక్ష్మి పేరున ఆన్లైన్ చేయించి ఆమెకు పాస్పుస్తకాలు అందజేయాలని ఆదేశాలు జారీచేశారని కుమార్తె చెప్పారు. మిగిలిన 10.45 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే తన తల్లి నివాసం ఉండేందుకు ఇల్లును అందజేస్తే దీక్ష విరమింపజేస్తుందని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం
ధారూరు రంగారెడ్డి : ఆగి ఉన్న బస్సును ఎక్కేందుకు వెళుతున్న ఓ వృద్ధురాలు బస్సు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి తాండూర్కు 45 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్డినరీ బస్సు కేరెళ్లి గ్రామ బస్టాప్లో ఆగింది. గ్రామంలోంచి బస్సు ఎక్కేందుకు మోమిన్ఖుర్దు గ్రామానికి చెందిన అల్లిపూరం అంతమ్మ(70) రోడ్డును క్రాస్ చేసి బస్సు ముందు నుంచి వెళుతుంది. డ్రైవర్ శ్రీనివాసులు రోడ్డు ముందుకు చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సు ముందున్న అంతమ్మను ఢీకొట్టిన బస్సు కొద్దిదూరం ఆమెను లాక్కెళ్లింది. బస్సులోని ప్రయాణికులు, బయట ఉన్న ప్రజలు బిగ్గరగా అరవడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. అప్పటికే వృద్ధురాలు అంతమ్మకు తీవ్ర గాయాలై చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంది. అదే గ్రామానికి చెందిన శివకుమార్రెడ్డి 108 వాహనానికి కాల్ చేయగా టైర్ పంక్చర్ అయ్యింది, రాలేకపోతున్నాని చెప్పి నిర్లక్ష్యంగా చెప్పి పెట్టేశాడని శివకుమార్రెడ్డి తెలిపారు. సకాలంలో అంతమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో వృద్ధురాలు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలింది. మోమిన్ఖుర్దు గ్రామానికి చెందిన అంతమ్మ తన కొడుకుతో కలిసి కేరెళ్లి గ్రామంలో ఉంటున్న బంధువు బుడ్డ మణెయ్య ఇంటికి బుధవారం రాత్రి వచ్చింది. గురువారం సొంత ఇంటికి వెళ్లేందుకు వస్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సంతోష్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ శ్రీనువాసులు సంఘటన స్థలం నుంచి పారీపోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి దీక్ష భగ్నం
రేగిడి: ఆస్తి కోసం దేవకివాడ మహాలక్ష్మి చేస్తున్న దీక్షను పక్కా పన్నాగం వేసిన రేగిడి పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. గత వారం రోజులుగా మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన మహాలక్ష్మి తన ఆస్తి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోసం దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధాప్యంలో తనను ఒంటరిని చేసి అయినవారు, ఆప్తులు తన ఆస్తిని దోచుకోవడంపై మండిపడింది. దీనిపై పంచాయతీ పెద్దలు, అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో నిరాహార దీక్షకు ఉపక్రమించింది. వారం రోజులుగా ఆమె దీక్ష చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. పాలకులు కనికరించ లేదు. అయినప్పట్టకీ పట్టు వదలకుండా తన ప్రాణాన్ని పనంగా పెట్టి దీక్ష చేస్తుండగా.. ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా మారడంతో రేగిడి పోలీసులు పన్నాగం పన్నారు. దీక్ష వద్ద ఎవరూ లేని సమయం చూసి మంగళవారం సాయంత్రం దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వృద్ధారాలిని బలవంతగా 108 వాహనంలో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యంపై అప్రమత్తమైన ఎస్ఐ జి.భాస్కర్రావు తగు న్యాయం జరిగేటట్టు చూస్తామని, ముందు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయిస్తామని నచ్చజెప్పారు. అయితే... తన ఆస్తి తనకు దక్కే వరకు పోరాటం విరమించేది లేదని తెగేసి చెప్పిన బాధితురాలు వైద్యానికి నిరాకరించింది. వైద్యులు బలవంతంగా ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీక్ష ఆగదని, తనకు న్యాయం జరిగే వరకు మహాలక్ష్మి పోరాటం చేస్తుందని బాధితురాలి కుమార్తె కల్యాణి, మేనల్లుడు శీర రాధాకృష్ణ తెలిపారు. -
వృద్ధాశ్రమానికి తల్లి తరలింపు.. అంతలోనే!
ప్రియురాలి మోజులో పడి తల్లిని నిర్లక్ష్యం చేశాడు. నానా హింసకు ఆమెను గురిచేశాడు. చివరకు వదిలించుకోవాలని యత్నించిన కొడుక్కి.. ఆ తల్లి శిక్ష విధించింది. అది మరణ శిక్ష... వాషింగ్టన్: అరిజోనా రాష్ట్ర రాజధాని ఫియోనెక్స్ పట్టణం.. ఫౌంటేన్ హిల్స్లో 92 ఏళ్ల అన్నా మే బ్లెస్సింగ్,తన కొడుకు(72) తో జీవిస్తోంది. అయితే ఆరు నెలలుగా ఓ అమ్మాయి(25 ఏళ్ల లోపు)తో ఆ పెద్దాయన డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిని నిర్లక్ష్యం చేయగా.. ఆమె సహించింది. నిత్యం తులనాడుతూ కొడుకు ప్రియురాలు అవమానించినా భరించింది. చివరకు ఆమెను వృద్ధాశ్రమానికి తరలించాలని యత్నించటంతో తట్టుకోలేకపోయింది. సోమవారం తల్లిని ఓల్డేజ్ హోమ్కు తీసుకెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో ఆమె తన వద్ద దాచుకున్న తుపాకీతో కొడుకు, అతని ప్రియురాలిపై కాల్పులు జరిపింది. కొడుకు మెడలోంచి బుల్లెట్లు దూసుకుపోవటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. ప్రియురాలు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కొడుకు శవం ముందు ఆ తల్లి ఈ వీల్ ఛైర్లో కూర్చుని ఉంది. ‘నా జీవితాన్ని నువ్వు లాగేసుకున్నావ్.. ఇప్పుడు నీ బతుకును నేను తీసేసుకున్నా’ అంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. జరిగిందంతా అక్కడున్న వారికి వివరించింది. ఆపై ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆమె తరపున కేసును ఉచితంగా వాదించేందుకు ఓ న్యాయవాది(అటార్నీ) ముందుకు రావటం విశేషం. -
ఎవరీ అమ్మ?
గోపాలపట్నం విశాఖ : మలి సంధ్యలో ఓ అమ్మ ఒంటరి అయింది. ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.. ఎవరి తీసుకొచ్చారో తెలియదు. గోపాలపట్నం పెట్రోల్ బంకు జంక్షన్ బస్షెల్టర్లో నాలుగు రోజులుగా దీనంగా పడి ఉంది. మతిస్థిమతం లేక ఆమెనే వచ్చేసింది.. లేక పిల్లలు తీసుకొచ్చి వదిలేశారా అనేది స్పష్టతలేదు. పిచ్చివాళ్లు ఆమె వద్దకు వచ్చి పోతున్నారు. దీన్ని బట్టి ఆమె కూడా ఎవరో యాచకురాలో, మతిస్థిమితం లేని వృద్ధురాలెవరో అంతా అనుకున్నారు. కానీ బుధవారం రాత్రి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీఎం పేట స్కూల్ మాస్టారు ఎస్.మాధవరావుతో పాటు తోపుడు బండ్ల వర్తకులు మురళీకృష్ణ, బి.జగదీశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు కె.విద్యాసాగర్, టీకొట్టు నిర్వాహకురాలు షేక్రాము, మరో యువకుడు ఆర్.వినయ్, ఆటో డ్రైవర్ కె.నరేంద్ర ఆమెకు టిఫిన్ పెట్టి వివరాలు ఆరా తీశారు. ఆమెలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. వివరాలు చెప్పలేకపోయింది. బ్యాగులో చీరలు, కాశీగంగ, రుద్రాక్షలు, ఆధార్ కార్డు ఉన్నాయి. ఆధార్ కార్డు బట్టి ఆమె పేరు సి.శకుంతలమ్మ, పుట్టిన తేదీ 1945, భర్త (లేట్) సుబ్బిశెట్టి, 22–317, చట్టప్పబావివీధి, గుంతకల్, అనంతపూర్, ఆధార్ నంబరు 779646202682 ఉంది. అలాగే కె.శాంతమూర్తి 9963703563 ఫోన్ నంబరుతో ఓ కాగితం ఉంది. ఈ ప్రకారం వీరు ఫోన్ చేస్తే తనకు తెలీదని అటునుంచి సమాధానం వచ్చింది. మళ్లీ చేస్తే ఫోన్ నుంచి సమాధానం లేదు. దీంతో వీరు పెందుర్తి లయోలా వృద్ధాశ్రమం నిర్వాహకుడు దొడ్డి ప్రకాష్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. గోపాలపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చి తీసుకురావాలని ఆయన స్పందించడంతో సీఐ పైడియ్యకు వీరు సమాచారం చెప్పి తీసుకెళ్లారు. దొడ్డి ప్రకాష్ ఆమెను అక్కున చేర్చుకుని సపర్యలు ప్రారంభించారు. ఆమె బాగోగులు తాను చూస్తానని భరోసా ఇచ్చారు. వృద్ధురాలి పట్ల మానవత్వం చూపిన వీరిని అంతా అభినందించారు. -
20 సంవత్సరాల తర్వాత..
నారాయణపేట రూరల్ : దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు తిరిగొచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గంగమ్మ కూలీ పనిచేస్తుండగా.. భర్త పశువులు కాసేవారు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. అయితే భర్త అనారోగ్యం పాలుకావడంతో కుటుంబ పోషణ గంగమ్మపై పడింది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై చిన్న కూతురు రేణును తీసుకుని అదృశ్యమైంది. ఏళ్ల తరబడి ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు పనిచేసుకుంటూ తండ్రిని పోషిస్తూ వచ్చారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషులు దగ్గరుండి వారికి వివాహం చేశారు. ఈ క్రమంలో గత పదేళ్ల క్రితం గంగమ్మ భర్త మృతిచెందాడు. అదృశ్యమైన గంగమ్మ నాలుగేళ్ల క్రితం చేతకాని పరిస్థితుల్లో భూత్పూర్ మండలం అన్నాసాగర్ పంచాయతీ రావులపల్లికి ఒంటరిగా చేరుకుంది. అక్కడే పాచి పనిచేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నెల 19న కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆచూకీ అడగటంతో సొంతూరు సింగారం అని చెప్పడంతో గ్రామ యువకులు సర్పంచ్ నాగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి గంగమ్మ పెద్ద కుమార్తె చెన్నమ్మకు చెప్పి, భూత్పూర్ పోలీసుల సహకారంతో ఆమెను అప్పగించారు. -
కన్నపేగుకదా..కేసెట్లా పెట్టాలె..
వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన దేనబోయిన పోచక్క 88 ఏళ్ల వృద్ధురాలు. ఆమెకు గుండయ్య, శంకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా కాలంగా పోచక్క చిన్న కొడుకు గుండయ్య వద్దే ఉంటోంది. దీంతో నా వద్ద ఉండొద్దు.. అన్నవద్దకు పో.. అంటూ గుండయ్య తరచూ గొడవ పెడుతున్నాడు. ఇటీవల మాటామాటా పెరగటంతో కొడుకూ కోడలు ఆమెపై చేయిచేసుకున్నారు. గూని నడుముతో నడవలేని స్థితిలో ఉన్నా మండల కేంద్రానికి వచ్చిన బెల్లంపల్లి ఏఎంసీ వైస్చైర్మన్ వేణుమాధవ్ను కలిసింది. తనకు న్యాయం చేయాలని ఆయన పాదాల మీద పడింది. కొడుకూ, కోడలు కలిసి నన్ను కొడ్తుండ్రు.. జెర బుద్ధి చెప్పుండ్రి అంటూ బోరుమంది. దీంతో ఆయన పోలీస్స్టేషన్కు వెళ్లమని సూచించాడు. ముసలవ్వ మాత్రం ‘కన్న పేగు కదా పంతులూ.. కేసెట్టా పెట్టాలె.. రేపో మాపో దేవుని దగ్గరికి పోయేదాన్ని. మా అవ్వ నన్ను ఠాణాల పెట్టి కొట్టించింది అని కొడుకు ఏడుత్తడు.. నేను ఠానాకు పోను.. మీరే బుద్దిమాట చెప్పుండ్రి’ అని వేడుకుంది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొడుకు కొట్టినా వెనకేసుకొచ్చిన తల్లి ప్రేమను అభినందించారు. -
ఇంటికి చేరిన బీజానాబీ
చిట్యాల (నకిరేకల్) : ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి అదృశ్యమైన చిట్యాల పట్టణం శివాజీనగర్కు చెందిన బీజానాబీ మంగళవారం ఇంటికి చేరుకుంది. ఈ నెల 16వ తేదీన ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి బీజానాబీ అదృశ్యమైంది. బీజానాబీ అదృశ్యమైన విషయం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంచరిస్తున్న బీజానాబీని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యుల పోన్ నంబర్కు సమాచారం అందిచారు. ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సాక్షిలో ప్రచురితమైన కథనం వల్లే బీజానాబీ ఆచూకీ లభించినందుకు ఆమె కుటుంబసభ్యులు ‘సాక్షి పత్రిక’కు కృతజ్ఞతలు తెలిపారు. -
అయిన వారి కోసం ఎదురుచూపులు
పరకాల : మానసిక స్థితితో బాధపడుతున్న వృద్ధురాలు రెండు రోజులుగా అమాయకపు చూపులు..చేతులు చాపలేని దుస్థితి. పట్టించుకునేవారు ఒక్కరూ లేరు. వెంట తెచ్చుకున్న నీళ్ల సీసాతోనే రెండు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది. బస్టాండ్లో అందరూ యాచకురాలిగానే చూస్తున్నారు తప్పా ఆమె ఆకలి బాధను, ఆవేదనను గుర్తించేవారే లేరు. బస్టాండ్లో అనుమానస్పదంగా కనిపించడంతో ఎక్కడి నుంచి వచ్చావని, ఎటు వెళ్లాలని సాక్షి విలేకరి ప్రశ్నించగా ఏదో చెప్పాలని ఉన్నా నోటి మాట రాక తల్లడిల్లిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో అరటి పండ్లు, భోజనం అందజేశారు. ఆర్టీసీ సెక్యూరిటీ వృద్ధురాలు బంధువుల జాడ కోసం ఆరా తీస్తున్నారు. -
వృద్ధురాలిపై మహిళ దాడి
నందిగామ(షాద్నగర్) రంగారెడ్డి : తన ఇంటి ఆవరణలో పెట్టిన సామగ్రిని తీసుకెళ్లమని చెప్పిన ఓ వృద్ధురాలిపై మరో మహిళ దాడి చేసిన సంఘటన మండలంలోని వీర్లపల్లి›లో ఆదివారం చోటుచేసుకుంది. నందిగామ ఏఎస్ఐ భాస్కర్రెడ్డి కథనం ప్రకారం.. వీర్లపల్లి గ్రామానికి చెందిన కాట్న పెంటమ్మ ఇంటి ఆవరణలో పొరుగింటి మహిళ రాములమ్మ తన పాత సామగ్రి పెట్టింది. ఈ విషయమై ఇక్కడి నుంచి సామగ్రిని తీసుకెళ్లమని రాములమ్మకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మరోసారి పెంటమ్మ సామగ్రి తీసుకెళ్లమని సూచించగా రాములమ్మ వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగక కర్రతో పెంటమ్మ తలపై దాడి చేయగా ఆమెకు తలకు తీవ్రగాయాలయ్యాయి. పెంటమ్మ ఫిర్యాదు మేరకు రాములమ్మపై కేసు నమోదు చేసినట్లు భాస్కర్రెడ్డి వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మంగమ్మ@111
తూప్రాన్ మెదక్ : బ్రాహ్మణపల్లికి చెందిన వంటేరు మంగమ్మ(111) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 111 ఏళ్లు వచ్చినా మంగమ్మ తనపనులు తానే చేసుకునేదని, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేదని స్థానికులు తెలిపారు -
ఆ అవ్వను చంపింది కన్న కోడుకే..
చేర్యాల(సిద్దిపేట) : గౌరవ్వ హత్య కేసు మిస్టరీ వీడింది. కొమురవెల్లి పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన బండారి గౌరవ్వ(75) ఈ ఏడాది జనవరి 22న అదృశ్యమైంది. మూడు నెలల తర్వాత ఏప్రిల్ 23న అస్థిపంజరంగా దొరికిన ఘటన తెలిసిందే. మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ ఎల్. రఘు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గౌరవ్వ అదృశ్యమైన రోజునే పెద్ద కుమారుడు బండారి కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కొమురవెల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఏప్రిల్ 23న గ్రామ శివారు చెరువులో గుర్తు తెలియని అస్థిపంజరం లభించిందన్నారు. దాని సమీపంలోని బట్టల ఆధారంగా మృతదేహం గౌరవ్వదిగా గుర్తించినట్లు తెలిపారు. గౌరవ్వది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానంతో మంగళవారం ఉదయం గౌరవ్వ పెద్ద కొడుకు కొండయ్యను అరెస్ట్ చేశామన్నారు. అతడిని విచారించగా డబ్బులు, బంగారు ఆభరణాల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. కొండయ్య జనవరి 22వ తేదీ రాత్రి తన తల్లి గౌరవ్వ వద్దకు వెళ్లి డబ్బులు, బంగారం ఇవ్వాలని కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఊరు పక్కన ఉన్న చెరువులోని ఒర్రె ఇసుకలో పూడ్చి పెట్టినట్లు చెప్పాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.10 వేల నగదు, బంగారు ఏనెలు, పూసల దండ, జత కమ్మలు స్వాధీన పరుచుకున్నామన్నారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొమురవెల్లి ఎస్ఐ సతీష్కుమార్ ఉన్నారు. -
శతాధిక వృద్ధురాలికి చెక్కు అందజేత
పెర్కిట్(ఆర్మూర్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బందు పథకంలో భాగంగా పెట్టుబడి సాయాన్ని అధికారులు నిబద్ధతతో అమలు చేస్తున్నారు. మండలంలోని అమ్ధాపూర్లో గురువారం రాత్రి 102 సంవత్సరాల శతాధిక వృద్ధురాలైన తలారి ముత్తెమ్మకు, అలాగే మంథనికి చెందిన శుక్రవారం బూస ముత్తెన్న అనే వికలాంగునికి పెట్టుబడి సాయం చెక్కును ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కును అందజేసిన వారిలో ఉద్యాన శాఖ అధికారి రోహిత్, సర్వేయర్ సూర్య ప్రకాశ్, జూనియర్ అసిస్టెంట్ సురిత్ రెడ్డి తదితరులున్నారు. మంథనిలో 102 ఏళ్ల వృద్ధురాలు ముత్తెమ్మకు చెక్కు అందజేస్తున్న అధికారులు -
హైకోర్టులో వృద్ధురాలి విజయం
సారంగాపూర్(జగిత్యాల) : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన అంబల్ల గంగవ్వకు ఆమె భర్త పేరిట ఉన్న భూములను విరాసత్ చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా పట్టాదారు, టైటిల్డీడ్లు అందజేయాలని సూచించింది. అంబల్ల గంగవ్వ భర్త ముత్యంరెడ్డి నవంబర్ 27, 2002లో మృతి చెందాడు. ముత్యంరెడ్డి పేరిట వివిధ సర్వేనంబర్లలో ఉన్న 15.07 ఎకరాలను తన పేరిట మార్పు చేసి పట్టాదారు, టైటిల్డీడ్ ఇవ్వాలని మృతుడి భార్య గంగవ్వ అధికారులకు విన్నవించింది. అధికారుల నుంచి స్పం దన కరువైంది. పలుమార్లు తహసీల్దార్ కార్యాల యం చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో 2016లో మరోసారి మీసేవ ద్వారా విరాసత్ కు దరఖాస్తు చేసుకుంది. పలు కారణాలు చూపుతూ అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. గంగవ్వ బంధువులు సైతం అడ్డుపడ్డట్లు తెలిసింది. విసిగి వేసారిన గంగవ్వ చివరికి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ప్రతివాదులుగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సారంగాపూర్ తహసీల్దార్లను చేర్చింది. గంగవ్వ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు పట్టాదారు, టైటిల్డీడ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా గంగవ్వ పేరిట ఆమె భర్త భూములను మార్చా లని ఆదేశించింది. ఈ కేసులో ఎలాంటి రిట్పిటిషన్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
వృద్ధురాలిపై ఎలుగుబంటి దాడి
డిచ్పల్లి, నిజామాబాద్ : గ్రామంలో వచ్చిన ఎలుగుబంటి ఓ వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు కర్రలతో వెంటబడడంతో అడవిలోకి పరుగు తీసింది. ఈ ఘటన మండలంలోని ధర్మారం(బి)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు కాసం లక్ష్మి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి బయట గేటును తెరుస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆమె భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి కర్రలతో ఎలుగుబంటిని తరిమేశారు. మదన్పల్లి వైపు ఎలుగుబంటి పారిపోయిందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు కొద్దిగా ఆలస్యంగా వచ్చి ఉంటే లక్ష్మితో పాటు అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి ఉండేదని సర్పంచ్ ఈదర కస్తూరి, ఉప సర్పంచ్ ఎడవెల్లి సోమనాథ్ లు తెలిపారు. యపడిన బాధితురాలిని 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కిమ్స్లో చేర్పించారు. అటవీ ప్రాంతంలో తాగునీరు లేకపోవడంతో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎలుగుబంటి దాడితో ధర్మారం(బి), మదన్పల్లి, కేశాపూర్ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
వృద్ధురాలి హత్య
చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడు గ్రామంలో కుంజా సోమమ్మ(67)ను ఆమె సమీప బంధువు కుంజా లక్ష్మణ్, మద్యం మత్తులో హత్య చేశాడు. శనివారం రాత్రి ఇది జరిగింది. బెండాలపాడు గ్రామస్తుడు వర్సా శ్రీను ఇంట్లో ఆయన కుమార్తె వివాహం జరుగుతోంది. ఈ వేడుకకు కుంజా సోమమ్మ, ఆమె ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చారు. వీరి బంధువు కుంజా లక్ష్మణ్ కూడా వచ్చాడు. పెళ్లింటి వద్ద సోమమ్మ అల్లుడు జయరాజ్తో లక్ష్మణ్ ఘర్షణకు దిగాడు. లక్ష్మణ్ను సముదాయిస్తూ జయరాజ్ తన అత్త గారింటికి వచ్చాడు. అక్కడ కూడా మరింత రెచ్చిపోయాడు. ఎందుకు గొడవ పడుతున్నావని లక్ష్మణ్ను సోమమ్మ వారించింది. మద్యం మత్తులో అతడు, అక్కడే కంచెకు ఉన్న పెద్ద కర్రను తీసుకుని ఆమెపై మోదాడు. సోమమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. ఘటన స్థలాన్ని జూలూరుపాడు సీఐ రాయల వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. కేసును ఎస్ఐ కడారి ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు గొలుసు అపహరణ
పార్వతీపురం : మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన సంఘటన కొమరాడ మండలం గుణానపురంలో సోమవారం జరిగింది. పార్వతీపు రం ఔట్పోస్టు పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... గుణానపురం గ్రామానికి చెందిన మిరియాల రాముడమ్మ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించి, రాముడమ్మ నోట్లో గుడ్డలు కుక్కి బండరాయితో తలపై మోదాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగ దోచుకుపోయాడు. తలుపులకు గడియ పెట్టి వెళ్లిపోవడంతో ఎవరికీ విషయం తెలియలేదు. కొన్ని గంటల తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు తెరవగా అపస్మారక స్థితిలో ఉన్న రాముడమ్మను గమనించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు వైద్యసేవలందిస్తున్నారు. -
అవ్వను కడతేర్చిందెవరు..?
సాక్షి, సిద్దిపేట : ఏడు పదుల వయస్సులో కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ అందరి నోళ్లలో నాలుకలా ఉండే సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలోని పండుటాకు బండారి గౌరవ్వ హత్య సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదృశ్యమైన అవ్వ మూడు నెలల తర్వాత అస్థిపంజరంగా కన్పించడంతో.. అసలు ఆమెను హత్య చేసిందెవరు..? డబ్బులు, ఆభరణాల కోసమేనా హత్య చేశారా? లేదా ఇంకేమైనా మర్మం దాగుందా.. అదే గ్రామానికి చెందిన వారే ఈ పాపానికి ఒడిగట్టారా అనేది చర్చగా మారింది. గౌరవ్వ హత్య వార్త తెలియడంతో ఆ గ్రామంలోని వారు పొద్దుకూకితే చాలు బయటకు రావడానికి సాహసించడం లేదు. మరో వైపు హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అదృశ్యమై.. అస్థిపంజరమై.. గురువన్నపేట గ్రామానికి చెందిన బండారి గౌరవ్వ(75) ఈ ఏడాది జనవరి 22న అదృశ్యమై ఏప్రిల్ 23న అస్థిపంజరంగా దొరికింది. గౌరవ్వ అదృశ్యమైన రోజే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 23న రాత్రి గౌరవ్వ పుర్రె, చీరను కుక్కలు బయటకు తీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బటయకు తీయగా ఒక వైపు శరీర భాగాలు మాత్రమే ఉన్నట్లు, కాలుకు కడియం, చేతులకు కడెం, వెండి గాజులు ఆమె చేతికి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గౌరవ్వను ఇంట్లో హత్య చేసి అదే గ్రామంలోని కాముని చెరువు పక్కన తాళ్ళవాగులో చిన్నగా రెండు ఫీట్ల లోతుగా గుంతలు తీసి పాతపెట్టారు. గౌరవ్వ ఇంట్లో మెడ నుంచి తెగిపోయిన నల్లపూసలు కింద పడిన ఆనవాళ్లున్నాయి. అదే గదిలో ఉన్న చాపలో మృతదేహాన్ని వాగుకు చేర్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంటే గౌరవ్వను ఇంటి వద్దనే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా చెరువులోకి తీసుకెళ్లి పూడ్చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒంటి నిండా ఆభరణాలు? గౌరవ్వ మెడలో నాలుగు తులాల బంగారు గుండ్లు, ఏనెలు, గెంటీలు ఉండగా సుమారు కిలో వెండి ఆభరణాలు ధరించి ఉంది. అదేవిధంగా ఆమె ఇంట్లో రూ. 30వేల నగదు ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంగారు, వెండి ఆభరణాలకు తోడు నగదు అపహరించడం కోసం ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆభరణాలకోసమే హత్య చేస్తే ఆమె కా లుకు కడియాలు, చేతికి ఉన్న గాజులను ఎం దుకు తీసుకెళ్లలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లిన దొంగలు మిగిలిన ఆభరణాలు ఎందుకు తీసుకోలేదనే కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అదను చూసి హత్య.. గౌరవ్వను అదను చూసి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. జనవరిలో కొమురవెల్లి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వచ్చి వెళ్తుంటారు. గౌరవ్వ ఇంటి పరిసర ప్రాంతంలో గౌడ, కుమ్మరి, గొల్ల కులస్తులు ఉంటారు. ఈ మూడు కులాల వారికి జాతర సందర్భంగా కల్లు, కుండలు అమ్మడంతోపాటు గొల్ల కులస్తులు డోలు కొట్టేందుకు వెళ్తారు. ఇంటిలో పసిపిల్లలు, వృద్ధులు మాత్రమే ఉంటారు. ఈ సమయం అనుకూలమైనదిగా భావించి గౌరవ్మను ఇంటిలోనే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే గౌరవ్వ వద్ద బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.30వేల నగదు ఉందనే విషయం స్థానికులు, గౌరవ్వతో మంచి సంబం ధాలు ఉన్న వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గౌరవ్వను హత్యకు తెలిసిన వారే పాల్ప డి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ మెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని కుటుంబీకులు పోలీసులను కోరుతున్నారు. గ్రామంలో ఇదే మొదటి సంఘటన కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వేలాది మంది భక్తులు వస్తూ ఉండే కొండపోచమ్మ దేవాల యం సమీపంలో వెలుగు చూసిన హత్య సంఘటన ఛేదించడం జిల్లా పోలీసులకు కూడా ఛాలెంజ్గా మారింది. జిల్లాకు కొత్త పోలీస్ బా స్ వచ్చిన తర్వాత తొలి కేసు ఇదే కావడంతో ఆ యన ఈ విషయంపై సీరియస్గా ఉన్నట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో గౌరవ్వ హత్య సంఘటన పోలీసులు ఎప్పుడు ఛేదిస్తారో వేచి చూడాలి. హత్య కేసులో నిందితులెవరనేది ఉత్కంఠగా మారింది. విచారణ చేపడుతున్నాం.. గౌరవ్వ హత్యపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం కొంత మందిని విచారించాం. గౌరవ్వ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. త్వరలో పూర్తి సమాచారం సేకరిస్తాం. ఇప్పటికే అనేక కోణాల్లో కేసును విచారిస్తున్నాం. – సత్తీష్, ఎస్ఐ, కొమురవెల్లి -
చిత్ర హింసలకు గురైన వృద్ధురాలి మృతి
రాజమహేంద్రవరం క్రైం : మూడు నెలలు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. రాజా నగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో తనకు చిన్నమ్మ కుమార్తె చెల్లెలు వరుసయ్యే మంగాదేవి ఇంట్లో ఉంటోంది. కాళ్లు, చేతులు చచ్చపడిపోవడంతో మంచానికే పరిమితమైన పుష్పవతిని తనకు ఉన్న భూమి కోసం సంతకం చెయ్యాలంటూ మూడు నెలలుగా నిత్యం కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్ మిడియాలో పెట్టడంతో కలకలం రేగింది. స్థానికుల సహాయంతో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వం హాస్పటల్లో చేర్చారు. వృద్ధురాలి పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ కేసులో చిత్రహిసలకు గురిచేసిన నిందితురాలు ప్రగడ మంగాదేవిని బొమ్మురు పోలీసులు అరెస్ట్ చేశారు. -
వృద్ధులపై హింసను అరికట్టేందుకు చర్యలు
తాడితోట (రాజమహేంద్రవరం): వృద్ధులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. చెల్లెలు(పిన్ని కుమార్తె) ప్రగడ మంగాదేవి చేతిలో చిత్రహింసలకు గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతిని మంగళవారం మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, పీడీ ఎన్.సీతామహాలక్ష్మి, సీడీపీఓ వై.సుశీల కుమారి పరామర్శించారు. వృద్ధురాలి పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు వేధింపులకు గురి కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, ఆర్ఎంఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి పరిస్థితి విషమం.. కాకినాడకు తరలింపు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు పంతం పుష్పవతి పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మంటగలిసిన మానవత్వం..
-
పరిమళించిన మానవత్వం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మానవత్వం పరిమళించింది. ఎంతలా అంటే... కాలువలో దీనావస్థలో పడి ఉన్న వృద్ధురాలికి మెరుపు వేగంతో ఆస్పత్రిలో వైద్యం చేయించడం... అనంతరం ఓ ఆశ్రమానికి తరలించడం... ఇదంతా ఒకే ఒక్క ఫొటో ఆధారంగా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... గోపాలపట్నం శివారు కొత్తపాలెం అండర్ పాత్ వే వద్ద 80 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు పడి ఉంది. మలమూత్ర విసర్జనలతో మూలుగుతోంది. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మనకెందుకులే అని ముందుకు సాగిపోయారు. అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా వెళ్తూ ఆ వృద్ధురాలిని గమనించాడు. మాట్లాడుదామంటే ఆమె నోట మాట లేదు. దగ్గరకెళ్తే తీవ్రంగా రోత... ఇలా ఉన్న చిత్రాన్ని అతను నేరుగా పోలీస్ కమిషనర్ యోగానంద్కు వాట్సాప్లో పంపారు. దయచేసి స్పందించాలని కోరాడు. అంతే యోగానంద్ నుంచి గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావుకు సమాచారం వచ్చింది. ఆయన ఎస్ఐ శ్రీనివాస్మహంతి, సిబ్బందితో హుటాహుటిన కొత్తపాలెం అండర్పాత్వే వద్దకు చేరుకుని రక్షక్లో గోపాలపట్నం ఎస్ఆర్ మల్టీస్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీఈవో గిరి, వైద్యులను ఒప్పించి ఉచితంగా వైద్యసేవలు చేయించారు. అనంతరం సీఐ వైకుంఠరావు ప్రేమసమాజం యాజమాన్యంతోనూ, పలు వృద్ధాశ్రమాల నిర్వాహకులతోనూ సంప్రదించారు. పెందుర్తిలో ఉన్న లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రకాశరావు స్పందించడంతో అక్కడికి పోలీసులు వృద్ధురాలిని అంబులెన్స్లో తరలించారు. అయితే వృద్ధురాలి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. మెరుపువేగంతో పోలీసులు, ఇక్కడి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్పందించిన తీరుకి సీపీ యోగానంద్ వాట్సాప్ ద్వారా ప్రశంసించారు. -
కొత్త మలుపు తిరిగిన ఇళ్ల కూల్చివేత
బషీరాబాద్(తాండూరు): బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇళ్లు లేకుండా రోడ్డుపాలు చేసిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు మ్యాదరి గంగమ్మ గురువారం పోలీసులను ఆశ్రయించింది. నలభై ఏళ్లుగా నివాసముంటున్న తన ఇంటిని సర్పంచ్ భర్త అన్యాయంగా కూల్చివేశారని, అతడిపై చర్య తీసుకోవాలని బషీరాబాద్ ఎస్సై లక్ష్మయ్యకు ఫిర్యాదు చేసింది. అయితే సీసీ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా వచ్చిందని కూల్చిన ఇళ్లు గంగమ్మదే అని ఎలాంటి ఆధారాలు చూపలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని ఎస్సై తెలిపారు. మరోవైపు గ్రామంలోని అక్రమ కట్టడాలపై సర్పంచ్ లావణ్య కొరఢా ఝులిపిస్తున్నారు. రోడ్డుపై నిర్మించిన ఇళ్లను గురువారం కూడా కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. -
వృద్ధురాలి సజీవ దహనం
కొరాపుట్ : వంట గ్యాస్ మంటల్లో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. స్థానిక పండా కాలనీలో గల పి.జగన్నాథ్ ఘడయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గ్యాస్ స్టౌ నుంచి వెలువడుతున్న మంటలను అదుపుచేయడం కోసం వచ్చిన మెకానిక్ డి. మణిపాత్రో చెక్ చేస్తుండగా మంటలు గ్యాస్ సిలిండర్కు వ్యాపించి భారీగా అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆ మంటలకు ఇంట్లో ఉన్న జగన్నాథ్ తల్లి పి.సాయిబాని 90 శాతం మేర ఆహుతై ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు జగన్నాథ్ ఘడయ్ శరీర భాగాలు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. ప్రస్తుతం ఆయన కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెకానిక్ మణిపాత్రో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. -
వృద్ధురాలి సజీవ దహనం
బుచ్చిరెడ్డిపాళెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటల కారణంగా టి.చెంచమ్మ అనే వృద్ధురాలు సజీవదహనమైన సంఘటన మండలంలోని పెనుబల్లిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని కోవూరు కాలువ పక్కనే టి.చెంచమ్మ(82) నివాసముంటోంది. కుమారుడు సుబ్బయ్య భోజన వసతి సమకూర్చుతుడంతో కాలం గడుపుతోం ది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చి చూడగా కళ్లముందే గుడిసె మొత్తం తగలబడిపోయింది. గుడిసెలో ఉన్న చెంచమ్మ సజీవదహనమైంది. అక్కడి పరిసరాలను పరిశీలించగా విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. -
స్వంత ఇంటి ముందే వృద్ధురాలి దీక్ష
సాక్షి, నిజామాబాద్ : కోడలి దాష్టీకానికి నిరసనగా నిజామాబాద్లో స్వంత ఇంటి ముందే ఓ వృద్ధురాలు దీక్ష చేయడం సంచలనం సృష్టించింది. భారతి అనే వృద్ధురాలు తన ఇంట్లో తాను అండే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం తన ఇంటిముందే దీక్ష ప్రారంభించింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భారతి కొడుకు కోడలు అమెరికాలో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన భారతిని కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టడమేకాక నిజామాబాద్లో ఉన్న ఇంటికి తాళం వేయించింది. తనూ, తన భర్త నివసించిన స్వంత ఇంటిని కబ్జాచేసి తన కోడలు తనకు నిలువనీడలేకుండా చేసిందని భారతి కన్నీటి పర్యంతమైంది. దీంతో స్పందించిన కాలనీ వాసులు ఆమెకు అండగా నిలిచారు. ఇంటి తాళం పగులగొట్టి భారతికి ఇల్లు అప్పగించారు. వృద్ధురాలి తరపున తాము పోరాడతామని వారు పేర్కొన్నారు. కాలనీవాసుల జోక్యంతో కథ సుఖాంతమైంది. -
వడదెబ్బతో శతాధిక వృద్ధురాలి మృతి
చాగలమర్రి: స్థానిక లాల్స్వామి మకానం కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు ముల్లా జైతూన్బీ శనివారం వడదెబ్బతో మృతి చెందారు. వృద్ధురాలు రెండు రోజుల క్రితం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం తెల్లవారు జామున కోలుకోలేక మృతి చెందారు. ఈమెకు 108 సంవత్సరాలు ఉంటాయని కుమారుడు ముల్లా గౌస్మోహిద్దీన్ తెలిపారు. మూడేళ్ల క్రితం ఆమెకు దంతాలు ఊడిపోయి పోయి కొత్త దంతాలు వచ్చాయన్నారు. జైతూన్బీకు ముగ్గురు కుమారులు ఉండగా ఇద్దరు మృతి చెందారు. ఆమె మృతి పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు బాబులాల్, మాజీ సర్పంచ్ అన్సర్బాషా, మండల కో ఆప్షన్ సభ్యుడు ముల్లా మాబుబాషా, పారిశ్రామిక వేత్త ఎన్ఎండీ హారీస్, న్యాయవాది పీఎస్ మహబూబ్బాషా సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన చుట్ట
భీమడోలు : చుట్ట కాల్చే అలవాటు ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు పంచాయతీ శివారు పెదలింగంపాడు గ్రామానికి చెందిన గోరింకల శిరోమణి(60) పిల్లలు వేరే గ్రామాల్లో ఉంటున్నారు. శిరోమణి గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. చుట్ట కాల్చే అలవాటు ఉన్న ఆమె బుధవారం మధ్యాహ్నం దానిని వెలిగిస్తుండగా, అగ్గిపుల్ల చీరపై పడింది. దీంతో నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి శిరోమణి మరణించింది. దీనిపై భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గొడ్డలితో దాడిచేసిన వృద్ధురాలు!!
అవును.. మీరు సరిగ్గానే చదివారు. గొడ్డలితో వృద్ధురాలిపై దాడి జరగలేదు, ఆమే గొడ్డలి పట్టుకుని నానా హడావుడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని కుతుబ్మినార్ మెట్రోస్టేషన్లో జరిగింది. ఆమె వయసు సుమారు 65 సంవత్సరాలుంటుంది. ఆమె గొడ్డలి పట్టుకుని తోటి ప్రయాణికులపై దాడి చేసింది. మెట్రో రైల్లో కేవలం మహిళల కోసం ఒక బోగీ రిజర్వు అయి ఉంటుంది. ఆ బోగీలో సీటు కోసం జరిగిన గొడవలో.. ఆమె గొడ్డలితో హల్చల్ చేసింది. రైలు బోగీలోకి ఆమె ఎక్కేసరికి సీట్లన్నింటిలోనూ మహిళలు కూర్చుని ఉన్నారు. అంతలో సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వు చేసిన సీట్లో ఒక 32 ఏళ్ల మహిళ కూర్చుని ఉండటాన్ని ఆమె చూసింది. ఆ సీటు ఖాళీ చేసి తనకు ఇవ్వాలని వృద్ధురాలు కోరగా.. ఆమె నిరాకరించింది. దాంతో ఆ వృద్ధురాలు ఆమెను చెంపమీద కొట్టింది. ఆ సమయంలో మిగిలిన ప్రయాణికులు కలగజేసుకుని.. రైల్లో గొడవలు వద్దని చెప్పారు. దాంతో ఆమెకు మరింత కోపం వచ్చి, బ్యాగులోంచి గొడ్డలి తీసి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఆయుధం చూసిన మహిళలు ఒక్కసారిగా భయపడి.. సాయం కోసం గట్టిగా అరిచారు. కొంతమంది మాత్రం ఎలాగోలా ధైర్యం చేసి ఆమెను పట్టుకుని, ఆమె చేతుల్లోంచి గొడ్డలి లాగేసుకున్నారు. తర్వాతి స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాయంతో ఆమెను దించేశారు. సాధారణంగా మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, దాన్నంతటినీ దాటుకుని మరీ ఆమె తన బ్యాగులో ఈ గొడ్డలి పెట్టుకుని వచ్చింది. అయితే.. ఆమె దాడి చేయబోతుండగా తోటి మహిళలంతా కలిసి ఆమెను అడ్డుకుని, పట్టుకుని తదుపరి స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అయితే.. వాళ్లు ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని అదుపులోకి తీసుకోకుండా, గొడ్డలి స్వాధీనం చేసుకుని, ఆమెను హెచ్చరించి పంపేశారు. -
శతాధిక వృద్ధురాలు చైత్రమ్మ మృతి
కోహీర్: మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో శతాధిక వృద్ధురాలు గూళ్ల చైత్రమ్మ(117) (ఆధార్ కార్డు ప్రకారం) శుక్రవారం రాత్రి మృతి చెందింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చైత్రమ్మ స్వగ్రామమైన బిలాల్పూర్లో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శనివారం గ్రామ శివారులోని బీసీ శ్మశానవాటికలో నిర్వహించారు. చైత్రమ్మ 80వ ఏట భర్త లాలప్ప చనిపోయాడు. అప్పటి నుంచి చైత్రమ్మ కుటుంబ భారాన్ని మోశారు. నిత్య శ్రామికురాలైన చైత్రమ్మ పురుషులతో సమానంగా వ్యవసాయ పనులు చేసేవారు. ఆమెకు నలుగురు సంతానం. వారి పిల్లలు, పిల్లలకు పిల్లలు ఇలా 52 మంది కుటుంబ సభ్యులను ఆమె జీవితం కాలంలో చూశారు. మునిమనవలను ఎత్తుకొని ఆడించే సౌభాగ్యాన్ని పొందారు. గ్రామంలో 117 సంవత్సరాలు జీవించిన వ్యక్తులు ఇంత వరకు ఎవరూ లేరని సర్పంచ్ అశోక్ తెలిపారు. -
వృద్ధురాలిపై దాడి... బంగారం దోపిడీ
ప్రొద్దుటూరు : బీరువాలు తయారు చేసే వ్యక్తిలా ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడి చేసి రెండు బంగారు చైన్లను లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికంగా వసంతగడ్డలో సరోజమ్మ(75) ఇంటికి శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. తాను బీరువాలు తయారు చేస్తానని, రిపేర్ ఉందా అంటూ సరోజమ్మను ప్రశ్నించాడు. అవసరం లేదని చెప్పేలోపలే దుండగుడు ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యాడు. గాయపడ్డ సరోజమ్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బస్సులో వృద్దురాలి పర్సు చోరీ
హైదరాబాద్లోని ఎల్బీనగర్ దగ్గర బస్సులో చోరీ జరిగింది. భారతమ్మ అనే వృద్ధురాలికి చెందిన 7తులాల బంగారం, 2వేల నగదు గుర్తుతెలియన వ్యక్తులు దొంగిలించారు. దీంతో భారతమ్మ పోలీసులను ఆశ్రయించింది. నల్గొండ జిల్లా పోచంపల్లికి చెందిన భారతమ్మ.. ఓ ఫంక్షన్ కోసం మీర్పేట్లోని బంధువు ఇంటికి బస్సులో బయల్దేరింది. బంగారం, నగదు ఉన్న పర్సును కవర్లో పెట్టింది. హయత్నగర్ వరకు తన దగ్గరే ఉన్న పర్సు... ఎల్బీనగర్ వచ్చేసరికి మాయమైందని బాధితురాలు అంటోంది. అయితే తన పక్కసీట్లో కూర్చున్న మహిళపై అనుమానంగా ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.