Man Steal Gold From Old Lady In karnataka - Sakshi

జాగ్రత్తలు చెబుతూ నగలు కాజేశారు 

Jul 2 2021 8:41 AM | Updated on Jul 2 2021 12:03 PM

Man Steals Gold From Old Lady In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హోసూరు(కర్ణాటక): వృద్ధురాలిని ఏ మార్చి నగలు కాజేసిన దుండగుల ఉదంతం హడ్కో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు– బాగలూరు రోడ్డులోని రెయిన్‌బౌ కాలనీకి చెందిన ఉషా(62)  బుధవారం సాయంత్రం అదే ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెతో మాటలు కలిపారు.

ఈ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని, వంటిపై నగలు భద్రపరిచి ఇస్తామని నమ్మబలికి కాగితంలో చుట్టినట్లు నటించి ఖాళీ కాగితం ఉండను అందజేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధురాలికి కాగితం ఉండలో నగలు కనిపించలేదు. దీంతో హడ్కో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. 

చదవండి: కట్టుకున్న భార్య మంత్రాలు చేస్తుందనే అనుమానం.. దీంతో..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement