
సాక్షి, చెన్నై: చెన్నైలో కరోనాతో 60 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడని తెలిసింది. బుధవారం రాజీవ్గాంధీ జీహెచ్లో ఈఘటన వెలుగుచూసింది. అయితే ప్రభుత్వం అధికారికంగా సమాచారం వెలువరించలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతున్నట్టు సమాచారం.
అదే సమయంలో ఆరోగ్యపరంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న సూచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆరుగురు కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. వీరిలో రాజీవ్గాంధీ జీహెచ్లో చికిత్స పొందుతున్న ఒకరు మృతిచెందినట్టు సమాచారం.