ప్రధాని మోదీని చంపేస్తాం!.. ఎన్‌ఐఏకి బెదిరింపు కాల్‌ | NIA Chennai office receives threat to assassinate PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని చంపేస్తాం!.. ఎన్‌ఐఏకి బెదిరింపు కాల్‌

Published Fri, May 24 2024 5:29 AM | Last Updated on Fri, May 24 2024 5:42 AM

NIA Chennai office receives threat to assassinate PM Narendra Modi

ఎన్‌ఐఏకి ఆగంతకుడి బెదిరింపు కాల్‌

సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్‌తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. చెన్నై పురసైవాక్కంలో ఎన్‌ఐఏ కార్యాలయం ఉంది. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్‌ చేసి...ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని హతమా రుస్తామంటూ హిందీలో హెచ్చరించాడు.

 వెంటనే ఎన్‌ఐఏ అధికారులు చెన్నై సైబర్‌క్రైం బ్రాంచిని అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఆ కాల్‌ వచ్చిన ట్టుగా తేలడంతో గురువారం ఉదయం ఎన్‌ఐఏ, సైబర్‌ క్రైం బృందాలు భోపాల్‌కు వెళ్లాయి. అదేవిధంగా, చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement