ఉక్రెయిన్‌ పర్యటనపై.. పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ | PM Modi Speak To Russia's Putin, Shares Insights From His Recent Visit To Ukraine, Tweet Inside | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ పర్యటనపై.. పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

Published Tue, Aug 27 2024 5:06 PM | Last Updated on Tue, Aug 27 2024 5:48 PM

Pm Modi To Putin Speak After His Ukraine Visit

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఆ పర్యటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

ఈరోజు పుతిన్‌తో మాట్లాడినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపిన ప్రధాని మోదీ..భారత్‌-రష్యా దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం దిశగా అడుగులు పడే చర్యలపై చర్చించారు. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో వివాదాన్ని శాతియుతంగా పరిష్కరించుకోవాలని, అక్కడ శాంతి-స్థిరత్వం కోసం భారత్‌ పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పాము’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement