Ukraine
-
ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆగ్రహం !
వాషింగ్టన్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో రష్యాతో జరుగుతున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘జెలెన్స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా,ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి కారణమే జెలెన్స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది.సౌదీలో చర్చలకు తమను పిలవలేదని జెలెన్స్కీ అంటున్నాడు. మూడేళ్ల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు. ఈ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతా. యుద్ధం ఆపేందుకు పుతిన్,జెలెన్స్కీ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నా’అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా,ఉక్రెయిన్ల మధ్య యుద్ధంపై సౌదీఅరేబియాలో జరుగుతున్న చర్చలకు తమను పిలవకపోవంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము లేకుండా తమ దేశానికి సంబంధించిన చర్చలు ఎలా జరుగుతాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము ఎక్కువ రోజులు మనుగడ సాధించలేమన్నారు. -
ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
స్నేహితుడికి ట్రంప్ వెన్నుపోటు
-
ఉక్రెయిన్పై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్:రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి16) ఫ్లోరిడాలో జరిగిన డేటోనా 500 కార్ రేసులకు విచ్చేసిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు.అయితే ఈ వారం సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు జెలెన్స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్నదానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. గత వారం రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సుదీర్ఘచర్చలు జరిపారు.దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో స్పందించారు.రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా తమను కూడా భాగస్వామిని చేస్తే బాగుండేదన్నారు. అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని, తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కేవలం యుద్ధానికి విరామం ఇచ్చి ఇంకా శక్తి కూడగట్టుకుంటున్నారని చెప్పారు. యూరప్కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు. కాగా, గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో రష్యాతో యుద్ధం చేయడానికిగాను ఉక్రెయిన్కు భారీ సాయం అందిన విషయం తెలిసిందే. -
మేం బతికే అవకాశాలు తక్కువే: ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్:రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు.డొనాల్డ్ ట్రంప్,పుతిన్ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చలపై జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.అమెరికా మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువ అని జెలెన్స్కీ అన్నారు. తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని చెప్పారు.ఇంతేకాక రష్యాతో యూరప్కు ప్రమాదం పొంచి ఉందన్నారు. యూరప్ ఇప్పటికైనా మేల్కొని,సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో యూరప్పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.మరోవైపు రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు. -
చెర్నోబిల్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తుందా?
-
రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తత
-
న్యూక్లియర్ రియాక్టర్పై పేలిన డ్రోన్..ఏమైందంటే..
కీవ్:ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణుప్రమాదం లాంటి మరో దుర్ఘటన తృటిలో తప్పింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో ఉన్న రియాక్టర్ 4 రక్షణ కవచాన్ని డ్రోన్ ఢీకొట్టి పేలింది. శుక్రవారం(ఫిబ్రవరి14)న జరిగిన ఈ ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. డ్రోన్లో పేలుడు పదార్థాలతో కూడిన భారీ వార్హెడ్ ఉన్నట్లు సమాచారం.ఇది ఉగ్రవాద చర్య అని ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.రియాక్టర్ రక్షణ కవచాన్ని ఢీకొట్టి పేలిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారు.మంటలను ఆర్పివేశారు.అయితే ఈ ప్రమాదంలో రియాక్టర్ నుంచి రేడియేషన్ లీకవలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) తెలిపింది.During the night of 13-14 Feb, at around 01:50, IAEA team at the Chornobyl site heard an explosion coming from the New Safe Confinement, which protects the remains of reactor 4 of the former Chornobyl NPP, causing a fire. They were informed that a UAV had struck the NSC roof. pic.twitter.com/Ee5NSRgDo8— IAEA - International Atomic Energy Agency ⚛️ (@iaeaorg) February 14, 2025 రియాక్టర్ వద్ద రేడియేషన్ స్థాయిలు స్థిరంగా ఉన్నట్లు ప్రకటించింది.కాగా,1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలోని అణు రియాక్టర్ పేలింది. ఈ ఘటన చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదంగా నిలిచిపోయింది. కాగా, మూడేళ్ల నుంచి జరుగుతున్న రష్యా,ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రాల భద్రత ప్రమాదంలో పడింది. -
మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం: జెలెన్స్కీ
కెమెల్నిత్స్కీ (ఉక్రెయిన్): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక.. జెలెన్స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హీలి అన్నారు. -
పుతిన్తో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్కు షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్కు వరుస షాక్లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జెలెన్స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.తాజాగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్కాల్లో మాట్లాడారు. అనంతరం, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా అధినేత పుతిన్తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు.మరోవైపు.. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అలాగే, కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో, ఉక్రెయిన్కు డబుల్ స్ట్రోక్ తగిలింది.REPORTER: The borders and the lack of NATO membership -- ultimately these are both demands Russia has made. Is there not a danger of handing Russia a win?TRUMP: Well I think if you look at the war, the way the war is going, you'll have to make your own determination pic.twitter.com/ZGQru3Of2g— Aaron Rupar (@atrupar) February 12, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్తో ఫోన్కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ..‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉక్రెయిన్కు రష్యా ఝలక్
మాస్కో: ఉక్రెయిన్కు రష్యా ఝలక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను మాస్కో వర్గాలు తోసిపుచ్చాయి శాంతి ఒప్పందంలో భాగంగా.. భూభాగాల పరస్పర మార్పిడికి సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు తమ దేశం ఏనాటికీ అంగీకరించబోమని రష్యా ప్రకటించింది.ఇది ఎన్నటికీ జరగదు. రష్యా తన భూభాగాన్ని మార్పిడి చేసే అంశాన్ని ఎన్నడూ చర్చించలేదు.. చర్చించబోదు కూడా అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా భూభాగాల్లో అడుగుపెట్టిన ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టడం లేదంటే నాశనం చేస్తుందని పేర్కొన్నారాయన. రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచి పెట్టాలని జెలెన్స్కీ షరతు విధించారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న వేళ.. కీవ్పై రష్యా బలగాలు డ్రోన్ దాడులు జరపగా ఒకరు మరణించారు. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో.. శాంతి చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని చెబుతున్నారు. -
పుతిన్కు షరతు.. అమెరికాకు జెలెన్ స్కీ బంపరాఫర్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవ చూపాలని చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే మా అధీనంలో ఉన్న కుర్స్క్ను వారికి అప్పగిస్తామం’ అని అన్నారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. రష్యా నుంచి తమ భూభాగాలను ఉక్రెయిన్కు అప్పగించినందుకు అమెరికాలో పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై పుతిన్కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్పై యుద్దం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.JUST IN: 🇺🇦🇷🇺 Ukrainian President Zelensky says he's prepared to offer a territory swap with Russia as part of peace deal negotiations to end the war. pic.twitter.com/N9w9uoYfnl— BRICS News (@BRICSinfo) February 11, 2025 -
ఉక్రెయిన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్దాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు..కాకపోవచ్చు అని ట్రంప్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయినియన్లు.. రష్యన్లు కావొచ్చు..కాకపోవచ్చన్నారు. ఈ విషయంలో ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు రాకపోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్ను త్వరలో ఉక్రెయిన్కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్లో జెలెన్స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉక్రెయిన్పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా,సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. -
ఓ.. పరదేశి!
తమిళనాడు: యుద్ధంతో అట్టుడుకున్న ఉక్రెయిన్(Ukraine) దేశ యువతిని విల్లుపురం యువకుడు ప్రేమించి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురానికి చెందిన జయకుమార్ కుమారుడు ఉదయకుమార్ (30). ఇతను కోవైలో బీఈ చదువు పూర్తి చేసి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం స్లోవేకియా దేశానికి వెళ్లారు. అక్కడ రెండేళ్లు చదువు పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ తనతో పాటూ ఉద్యోగం చేస్తున్న ఉక్రెయిన్ దేశానికి చెందిన అనస్టాసియా (25)ను ప్రేమించాడు. తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని భావించగా, ఇరు కుటుంబీకులు అందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ఆ దేశం నుంచి సొంత ఊరికి వచ్చిన ప్రేమ జంటకు సోమవారం విల్లుపురం సమీపంలో కంబియంపులియూర్ పెరుమాల్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అమెరికా అమ్మాయితో..అదేవిధంగా తిరువన్నామలై జిల్లా చెయ్యారు తాలూకా అనక్కావూరుకు చెందిన భాస్కరన్ అమెరికాలోని ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్గా పని చేస్తున్నాడు. భార్య ఆదిరై, ఇద్దరు కుమారులతో టెక్సాస్లో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అవి నాష్ నాసాలో సైంటిస్ట్గా ఉన్నారు. ఈయన ఆ ప్రాంతానికి చెందిన కేథరిన్ ఓసేవి అనే యువతిని ప్రేమించారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు సమ్మతించడంతో విల్లుపురం జిల్లా సెంజిలో ఉన్న కులదేవత ఏకాంభరేశ్వరర్ ఆలయంలో, తమిళ సాంప్రదాయం ప్రకారం కనులపండువగా వీరి వివాహ వేడుక మంగళవారం సాగింది. -
ఉక్రెయిన్ భీకర దాడులు.. రష్యాలో విమానాల నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. తాజా దాడుల నేపథ్యంతో కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. అక్కడి ఇంధన స్థావరాల నాశనమే లక్ష్యంగా ముందుకు పోతోంది. దీంతో అప్రమత్తమైనట్లు మాస్కో వర్గాలు ప్రకటించుకున్నాయి. అస్ట్రాఖాన్ రీజియన్లోని ఇంధన స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఆ దాడిలో ఎటు వంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారాయన. అదే రీజియన్లోని గ్లాస్ ప్లాంట్పైనా, మరో ఎనర్జీ సెంటర్పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను కీవ్ వర్గాలు ధృవీకరించాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో.. అస్ట్రాఖాన్తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ దేశ పౌరవిమానాయాన విభాగం రోసావయాట్షియా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాలోని ఎనర్జీ, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది.ఇదీ చదవండి: స్కూల్పై క్షిపణి దాడి.. పుతిన్దే బాధ్యత! -
బోర్డింగ్ స్కూల్పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు
కీవ్: రష్యాలోని కుర్స్క్ పరిధిలో గల సుడ్జా నగరంలోని ఒక బోర్డింగ్ స్కూల్పై దాడి జరిగింది. దీనిపై ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నగరం గత ఐదు నెలలుగా ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఈ దాడిలో నలుగురు మృతిచెందారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. భవనం శిథిలాల నుంచి 84 మందిని ఉక్రెయిన్ దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని ఉక్రెయిన్ తెలిపింది. పౌరులకు ఆశ్రయం కల్పించిన బోర్డింగ్ స్కూల్పై మాస్కో బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.ఆదివారం తెల్లవారుజామున పాఠశాలపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించారని పేర్కొంది. ఇదిలా ఉండగా, శనివారం ఉక్రెయిన్లోని పోల్టావా నగరంలోని ఒక అపార్ట్మెంట్పై రష్యా సాగించిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగిందని, వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం తెలిపింది. ఐదు అంతస్తుల భవనంపై జరిగిన ఈ దాడిలో 17 మంది గాయపడ్డారని సమాచారం.మాస్కో ఉక్రెయిన్పై 55 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం రాత్రికి రాత్రే 40 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. ఖార్కివ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సిన్యుహుబోవ్ తెలిపారు. పశ్చిమ రష్యాలోని ఐదు ప్రాంతాలలో రాత్రిపూట ఐదు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుర్స్క్ ప్రాంతంలో మూడు డ్రోన్లను, బెల్గోరోడ్, బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం -
నార్త్ కొరియా సైన్యం ఎక్కడ.. పుతిన్ ప్లాన్ మార్చాడా?
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ దళాలతో ధీటుగా పోరాడలేక ఉత్తర కొరియా సైనికులు తమ దేశానికి వెనుదిరుగుతున్నట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కిమ్ దళాలు దాదాపు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్టు చెప్పుకొచ్చారు.తాజాగా ఉక్రెయిన్కు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో మాట్లాడుతూ.. ‘గత మూడు వారాలుగా మాతో యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదు. మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడటంతో వారు వెనుదిరిగినట్లు విశ్వసిస్తున్నాం. నార్త్ కొరియాకు చెందిన సైనికులు ఎక్కడా కనిపించడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక.. ఉక్రెయిన్తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 వేల మంది కిమ్ సైనికులు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలో దింపినప్పటికీ.. మాస్కో, కొరియన్ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఈక్రమంలోనే కిమ్ సైనికులు తమ దళాల చేతిలో మృతి చెందుతున్నారని కీవ్ ప్రకటించింది.మరోవైపు.. ఉక్రెయిన్ అధికారుల వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ ఘాటు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధికారులు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదు. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వ్యాఖ్యానించలేం అంటూ కొట్టిపారేశారు.ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ చేసిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అనంతరం.. యుద్ధం నిలిపేసేందుకు ఇరు దేశాధ్యక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఇదే సమయంలో ఈ చర్చలకు వచ్చేందుకు రష్యా నిరాకరిస్తే వారిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తికరంగా మారింది.North Korea sent troops to aid Russia in its war against Ukraine. But after months of severe losses, they have been taken off the front line. pic.twitter.com/l92MDNiW48— ☻Joanna (@joanna952544) January 31, 2025 -
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. ఖుషీలో ఇజ్రాయెల్, ఉక్రెయిన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్-గాజా అంశంపై ఫోకస్ పెట్టిన ట్రంప్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, ఇజ్రాయెల్కు మరింత బలం పెరగనుంది.కాగా, గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గత బైడెన్ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కనపెట్టారు. ఇజ్రాయెల్కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దాదాపు 1,800 ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్కు సరఫరా చేయనున్నారు. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా అంటారు. ఇక, ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే పెంటగాన్ ప్రతినిధులు టెల్అవీవ్కు వెల్లడించారు.అయితే, ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైన కొద్దిరోజులకు ఈ బాంబులను బైడెన్ నిలిపివేశారు. గతంలో ఈ బాంబులను జనావాసాలపై వాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం కావడంతో బైడెన్ వీటిని నిలిపేశారు. దీంతో అవి గోదాముల్లోనే ఉండిపోయాయి. నాడు బైడెన్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెలే స్వయంగా దేశంలో ఈ బాంబులను తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. వాస్తవానికి గతంలో అమెరికానే దాదాపు 10,000 ఎంకే-84లను ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. ఇక, తాజాగా ట్రంప్ నిర్ణయంతో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు బాంబు చేరనున్నాయి.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో కూడా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. కష్ట సమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో ఉక్రెయిన్కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచి కీవ్కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. -
యుద్ధ గాయాలకు ఉపశమనం
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో . యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్లో, సాయుధ దళాల కోసం, ఔట్డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన. గాయాలను గుర్తు చేయకుండా భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్. పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు. సైన్యానికి సాయంగా.. ఉక్రెయిన్లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్ యుద్ధంలో అంతిమ క్రీడలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనుండగా, రష్యా–ఉక్రెయిన్లు... యుద్ధంలో చివరి దశ క్రీడలు సాగిస్తున్నాయి. ట్రంప్ ఈ సమస్య పరిష్కారానికి తన ప్రతినిధిగా జనరల్ కీత్ కెల్లోగ్ అనే అనుభవజ్ఞుడిని నియమించారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారైన కెల్లోగ్, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై తన ఆలోచనలను ఇప్పటికే వివరించారు. ఈ పరిణామాల దృష్ట్యా రష్యా, ఉక్రెయిన్లు చర్చలకు సమ్మతిస్తూనే, అవి జరిగేలోగా యుద్ధంలో వీలైనంత పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి.చర్చలు అంటేనే ఎవరి షరతులు వారు విధి స్తారు. మధ్యవర్తి అయినవారు ఇరుపక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నిస్తూనే, తమవైపు నుంచి కొన్ని ప్రతిపాద నలు చేస్తారు. వాటిపై చర్చల క్రమంలో ఒక రాజీ కుదురుతుంది. అయితే ప్రస్తుత అంశంపై చర్చలు త్వరలోనే ప్రారంభం కావచ్చు గానీ, రాజీ ఎప్పటికి జరిగేదీ ఎవరూ చెప్పలేరు. వంద రోజులన్న జనరల్ కెల్లోగ్ అయినా! ఉక్రెయిన్ తూర్పున తమ సరిహద్దుల వెంట గల డోన్ బాస్ ప్రాంతాన్నంతా పూర్తిగా తమకు వదలి వేయటం, 2014 నుంచితమ ఆక్రమణలో గల క్రిమియా దీవిని తిరిగి కోరక పోవటం, ఉక్రె యిన్ యూరోపియన్ యూనియన్లో చేరినా, ఎప్పటికీ నాటోలో చేరక పోవటం అన్నవి రష్యా షరతులు. బ్లాక్ సీలో గల క్రిమియా, ముఖ్యంగా చలికాలంలో ఆ సముద్రం ఘనీభవించదు గనుక నౌకా రవాణాకు రష్యాకు తప్పనిసరి అవసరం. ఉక్రెయిన్ నాటోలో చేరినట్ల యితే రష్యా భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. సోవియట్ యూనియన్, వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లో రద్దయిన తర్వాత, అమెరికన్ నాటో కూటమి మాత్రం మరింత విస్తరిస్తూ, రష్యా సరిహద్దునే గల ఉక్రెయిన్ను కూడా చేర్చుకొన జూస్తుండటం మాస్కో భయానికి కారణం. తక్షణం యుద్ధం ఆగితేనే చర్చలురష్యా దృష్టి నుంచి గల పరిస్థితులు ఇవి కాగా, ఉక్రెయిన్ షరతులు రెండు. ఒకటి–క్రిమియాను, ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్ర మించిన డోన్ బాస్ భూభాగాలను తమకు తిరిగి అప్పగించటం. రెండవది–నాటోలో చేరే స్వేచ్ఛ తమకు ఉండటం. డోన్ బాస్లో రష్యా ఇప్పటికి 20 శాతానికి పైగా భాగాన్ని ఆక్రమించింది. ఇక ట్రంప్ ప్రతినిధిగా జనరల్ కెల్లోగ్ సూచిస్తున్నది, మొదట యుద్ధం వెంటనే ఆగిపోవాలి. ఇరు సైన్యాలు ఎక్కడివక్కడ నిలిచి పోవాలి. తర్వాత చర్చలు ఆరంభమవ్వాలి. రష్యా ఆక్రమణలో గల భూభా గాలు కనీసం కొన్నింటిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధపడాలి. దానికి నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా, కనీసం 20 ఏళ్లపాటు, వాయిదా వేయాలి. ఇందుకు రష్యా అంగీకరించనట్లయితే ఉక్రెయి న్కు తమ సహాయం కొనసాగిస్తారు. ఉక్రెయిన్ కాదంటే వారికి అన్ని సహాయాలూ నిలిపివేస్తారు.వీటన్నింటిపై చర్చలు ఏ విధంగా పురోగమించవచ్చునన్నది అట్లుంచి కొన్ని విషయాలు గమనించాలి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతునిస్తూ రష్యా ఆక్రమణలో గల డోన్ బాస్ ప్రాంతాన్ని, క్రిమియాను వదలుకునేందుకు జెలెన్ స్కీ సిద్ధపడవలసి ఉంటుందని సలహా ఇస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసేందుకు రష్యా ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించ బోదని, అటువంటి షరతు వస్తే యుద్ధాన్ని కొనసాగించగలదని, అపుడు అమెరికా కూటమి ఎంత సహాయం చేసినా రష్యా మరిన్ని భూభాగాలు ఆక్రమిస్తూ పోగలదని, ఉక్రెయిన్ పక్షాన తాము ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదని వారికి తెలుసు. తామూ, అమె రికా ఇప్పటికే ఎంత ఆధునిక ఆయుధాలనిచ్చినా రష్యాను ఉక్రెయిన్ నిలువరించలేక పోతున్నది. ఇప్పటికే రష్యా ఆక్రమణలో గల ప్రాంతా లను, క్రిమియాను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్న సూచనలున్నాయి. కానీ, రష్యా డిమాండ్ చేస్తున్నట్లు డోన్ బాస్ ప్రాంతం యావత్తునూ వదిలేందుకు ససేమిరా అంగీకరించక పోవచ్చు. అట్లాగే, తాము నాటోలో ఎన్నటికీ చేరక పోవటాన్ని.ఇందుకు బహుశా ట్రంప్ కూడా సమ్మతించకపోవచ్చు.ట్రంప్ గెలుపుతో కొత్త చిక్కులు!అమెరికా, యూరప్లకు కూడా కొన్ని ఆందోళనలున్నాయి. సోవి యట్ యూనియన్ పతనం తర్వాత 10–15 సంవత్సరాలకు తమ అపారమైన సహజ వనరుల బలంతో పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకోవటం ప్రారంభించిన రష్యా.. చైనా, ఇండియా తదితర అనేక దేశాలతో మైత్రీ సంబంధాల అభివృద్ధితో ఆర్థికంగా, ఆయుధ బలం రీత్యా ఈసరికి శక్తిమంతంగా మారింది. అటువంటి స్థితిలో పుతిన్ ఉక్రెయిన్తో ఆగక తమకు కూడా సవాలుగా మారగలరన్నది అమెరికా, యూరప్ల సందేహం. అందువల్ల రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఓడించదలచారు గానీ అదీ సాధ్యం కాదని ఆంక్షల వైఫ ల్యంతో, తమ ఆయుధాల వైఫల్యంతో అర్థమైంది. అందుకే ఇపుడు రాజీ ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. అనూహ్యంగా ట్రంప్ గెలుపు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రష్యా పట్ల కొంత మెతకదనం కలవాడనే పేరు తన మొదటి హయాంలోనూ కలిగి ఉండిన ఆయన, ప్రస్తుత యుద్ధం వల్ల అందరికీ నష్టమేనంటూ అసలు యుద్ధాన్నే వ్యతిరేకించారు. జెలెన్స్కీ వైఖరిని విమర్శించి ఆయన వాదనలను కొట్టివేశారు. ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం ఆయుధాలు, నిధులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. అంతటితో ఆగక నాటోను, యూరో పియన్ యూనియన్ను సైతం వేర్వేరు విషయాలపై తప్పుపట్టడం మొదలు పెట్టారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అనే తన నినాదానికి అనుగుణంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెట్టించగలమని ప్రకటించారు. ఐరోపా దేశాలకు అమెరికా భయం!ఈ మార్పులను గమనించి, ఉక్రెయిన్ సందర్భంలోనే గాక ఇతరత్రా కూడా జంకిన యూరప్ నేతలు ట్రంప్కు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే కీడెంచి మేలెంచమన్నట్లు, ట్రంప్ రాక తర్వాత అమెరికా భాగస్వామ్యం పరిమితమైనప్పటికీ ఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక సహాయాలు అదే స్థాయిలో కొనసాగించాలని తీర్మానాలు చేశారు. కానీ, తమ సైనిక, ఆర్థిక శక్తి రెండూ క్రమంగా బలహీన పడుతున్నందున అది సాధ్యం కాదని గ్రహించి రాజీ ఆలోచనలు మొదలు పెట్టారు. పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికి ఉక్రెయిన్కు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందగా అందులో సగం అమెరికాదే. ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ అక్షరాలా కుప్పకూలుతుంది. ఇది యూరోపియన్ దేశాలను భయపెడుతున్న అతి పెద్ద విషయం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఉభయుల మధ్య రాజీని కుదర్చటం కెల్లోగ్కు సమస్య కాబోదు. బేరసారాలకు ఇరు దేశాల ఎత్తుగడపోతే, పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారే అవకాశా లున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రచార సమయంలోనే అను మానించిన జెలెన్స్కీ రష్యాతో చర్చల సమయంలో పై చేయి సాధించలేక పోయినా కనీసం సమ ఉజ్జీ అయేందుకు కొన్ని ఎత్తుగడలను అనుసరించారు. తూర్పున విశాలమైన భూభాగాలను ఆక్రమించిన రష్యా, పోక్రొవ్ స్కీ అనే కీలకమైన నగరంపై దృష్టి కేంద్రీకరించింది. దానిని ఆక్రమిస్తే, ఆ మొత్తం ప్రాంతానికి గుండెకాయ వంటి కూడలి కేంద్రం తన అధీనమై ఉక్రెయిన్ తీవ్రంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఆ నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరానికి చేరిన రష్యన్ సేనలు, చర్చల లోగా దాని స్వాధీనానికి భీకర యుద్ధం సాగిస్తు న్నాయి. ఉక్రెయిన్ ఆ నగర రక్షణకు పోరాడుతూనే, రష్యాతో ఉత్తర సరిహద్దున గల కుర్స్క్ ప్రాంతంలోకి అకస్మాత్తుగా చొచ్చుకు పోయింది. చర్చలు జరిగినపుడు ఈ రెండు నగరాలు బేరసారాల కోసం ఉపయోగపడాలన్నది ఇరువురి ఎత్తుగడ. ఇటువంటి చివరి దశ యుద్ధ క్రీడలే మరికొన్ని సాగుతున్నాయి. రష్యా ఉత్తర కొరియన్ సేనలను రప్పించటం, ఉక్రెయిన్ యూరప్ సహాయంతో తన రాజ కీయ బేరసారాల శక్తిని పెంచుకోజూడటం, రష్యా పైకి దీర్ఘ శ్రేణి క్షిపణుల ప్రయోగం వంటివన్నీ అవే. మొత్తానికి ఈ చివరి దశ క్రీడ లకు జనవరి చివరిలోగా కొద్ది సమయమే మిగిలి ఉంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు
గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ షంషుద్దీన్ జబ్బార్ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్ అమెరికన్ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సన్నిహత సహచరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్లోని క్వీన్స్ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్ పైప్లైన్ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్కు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న డోనాల్డ్ ట్రంప్ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్, న్యూయార్క్, లాస్ వెగాస్ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్ పుతిన్ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్ పైప్లైన్ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్–హమాస్ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్జీపీటీ4ని ఓపెన్ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్రాబిట్ అనే వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్జీపీటీ4 ఔట్సోర్స్ చేసి, సర్వీస్ ప్రొవైడర్కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని క్లోన్ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్ కాల్స్ చేశారు. ఈ ఆపరేషన్ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్ వ్యాసకర్త ‘హిందుస్థాన్’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
యూరప్లో శాంతి తక్షణావసరం
ఒకప్పుడు ఉక్రెయిన్ తుది విజయం వరకూ మద్దతునిద్దామనే పశ్చిమ దేశాల ప్రజల అభిప్రాయం ఇప్పుడు క్రమేపీ తగ్గుతోంది. యూగోవ్ సర్వే సంస్థ తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, యూకేలలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించింది. ఈ ఏడు దేశాల ప్రజలు సంవత్సరం క్రితం ఇచ్చిన మద్దతుకు కట్టుబడి లేరు. ఉక్రెయిన్కు మద్దతునిచ్చే వారి సంఖ్య స్వీడన్లో 57 శాతం నుంచి 50 శాతానికి, యూకేలో 50 శాతం నుంచి 36 శాతానికి, డెన్మార్క్లో 51 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో శాంతి చర్చల ద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతకాలనే వారి సంఖ్య ఇటలీలో 45 శాతం నుంచి 55 శాతానికి, స్పెయిన్లో 38 నుంచి 46 శాతా నికి, ఫ్రాన్స్లో 35 నుంచి 43 శాతానికి, జర్మనీలో 38 నుంచి 45 శాతానికి పెరిగింది. జనవరి 20 నాడు అమెరికా అధ్యక్ష అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఉప సంహరించుకొనే అవకాశాలు ఉన్నాయని 62 శాతం జర్మనీ ప్రజలు, 60 శాతం స్పెయిన్ వాసులు, 56 శాతం బ్రిటన్ ప్రజలు, 52 శాతం ఫ్రెంచ్ జనాలు అభిప్రాయ పడ్తున్నారని యూగోవ్ వెల్లడించింది.ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు నిండనున్నాయి. ఆర్థిక ఆంక్షలతో రష్యాను అదుపులోకి తెచ్చుకోవచ్చునని రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాల అంచనాలకు విరుద్ధంగా రష్యా చమురు వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగానే ఉంచుకొంది. రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఫ్రాన్స్, జర్మనీ, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు పతనమైపోతు న్నాయి. డిసెంబర్ ప్రారంభంలో ఫ్రెంచ్ ప్రధాని మైకెల్ బార్నియర్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక కూలిపోయింది. జర్మన్ ఛాన్సలర్ షోల్జ్ తన ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయటంతో 3 సంవత్సరాల సోషల్ డెమాక్రాట్స్–గ్రీన్స్–ఫ్రీ డెమాక్రటిక్ పార్టీల కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఓక్స్ వాగెన్, ఆడీ వంటి అనేక కార్ల కంపెనీలు మూత పడుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు జర్మనీ మద్దతు కూడా జర్మనీ ప్రజలు స్వాగతించటం లేదు.బ్రిటన్లో 22 నెలలు ఏలిన కన్సర్వేటివ్ ప్రధాని రిషి సునాక్ రాజీనామా చేసి ఎన్నికలకు పిలుపునివ్వగా లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ అవినీతి ఊబిలో కూరుకుపోయి, నేషనల్ అసెంబ్లీ తీర్మానాలను తన వీటో ద్వారా నిరోధించటంతో జనాగ్రహానికి గురై రాజీనామా చేయక తప్పలేదు. పశ్చిమాసియాలో గాజాపై యుద్ధం చేయిస్తూ 50 వేల వరకూ సామాన్య ప్రజల్ని చంపిన ఇజ్రాయెల్కు మద్దతు పలికిన అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ ట్రంప్ చేతిలో ఓటమి చెందారు. 2023లో ఉక్రెయిన్ విషయంలో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారని అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగేలా చేసి... రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకరినొకరు చంపుకునేలా చూడటమే పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. అమెరికా ప్రత్యర్థి రష్యాను బలహీన పర్చటమే తమ ధ్యేయమని, అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్ప టికే అనేకసార్లు ప్రకటించారు. రష్యాతో నాటో దేశాలు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకొన్నాయి. రష్యా సంపదను కొల్లగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటమే అమెరికా ధ్యేయం.యుద్ధం ప్రారంభంలో శాంతి ఒప్పందాలకు ఉక్రె యిన్–రష్యాలు అంగీకరించాయని టర్కీ, ఇజ్రాయిల్ తెలిపాయి. రష్యా యుద్ధం విరమిస్తే, ఉక్రెయిన్ తటస్థ దేశంగా నాటో సభ్యత్వాన్ని కోరదనేది సారాంశం. అయితే అప్పటి యూకే ప్రధాని జాన్సన్ ఆఘ మేఘా లపై కీవ్ వెళ్లి ఉక్రెయిన్ ఆధ్యక్షుడు జెలెన్స్కీని ఒప్పందానికి దూరంగా ఉంచగలిగాడు. 9 ఏళ్ల క్రితం జరిగిన మిన్స్కు ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఎప్పుడూ గౌర వించలేదు. ఉక్రెయిన్ మిలిటరీ పరంగా బలం పుంజు కోటానికే మిన్స్కు ఒప్పందాన్ని ఎర వేశామని సాక్షాత్తు ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్ మెర్కల్ ప్రకటించారు కూడా. ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి లేమని ఒప్పుకొంది. నాటో దేశాలు యుద్ధానికే మొగ్గు చూపా యని టర్కీ విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కూడ తెలియజేశారు. లిండేగ్రాహం వంటి అమె రికా కాంగ్రెస్ సభ్యుడు ‘చివరి ఉక్రేనియన్’ వరకూ రష్యాతో పోరాటానికి బహిరంగ మద్దతు ఉంటుందని, ‘అమెరికా ప్రాణాలను పణంగా పెట్టకుండా ఉక్రెయి న్కు ఆయుధ సహాయం చేయటం అమెరికా ‘తెలివైన పెట్టుబడి’ అని అన్నారు.ఉక్రెయిన్లో ఏ ప్రాంత ప్రజలు కూడా నిరంతర యుద్ధానికి మద్దతు పలకటం లేదు. ఒకప్పుడు ఉక్రెయిన్ నాయకుల విజయంపై ఉన్న ఆశలను నేడు క్రమేపీ వదులుకొంటున్నారు. తాజా సర్వేల్లో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీపై భ్రమల్ని ప్రజలు వదులుకుంటున్నారు. ఉక్రెయిన్ ఫ్రంట్లైన్లు కుప్పకూలిపోతున్నాయి. నాటో భౌగోళిక విస్తరణకు ఉక్రెయిన్ భారీ మూల్యం చెల్లిస్తున్నది. సంఘర్షణ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్ ప్రజలు మరిన్ని ప్రాణ నష్టాలతో, ఆర్థిక నష్టాలతో అంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ స్పష్టతతో పశ్చిమ దేశాల వ్యూహం భవి ష్యత్తులో విఫలమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్ శత్రు వైఖరిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం ముగు స్తుంది. రష్యా కూడా శాంతి మార్గాలు వెతకాలి.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,కేఎల్ యూనివర్సిటీ ‘ 98494 91969 -
ఉక్రెయిన్ డ్రోన్ దాడి..రష్యా జర్నలిస్టు మృతి
మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్టు అలెగ్జాండర్ మరణించారని రష్యా(Russia)కు చెందిన మీడియా సంస్థ ఇజ్వెస్టియా తెలిపింది. డోనెస్క్ ప్రాంతంలో హైవేపై కారులో వెళుతుండగా అలెగ్జాండర్పై ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో అలెగ్జాండర్తో పాటు మరో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇది కావాలని చేసిన దాడేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది జెలెన్స్కీ ప్రభుత్వం చేసిన మరో దారుణ హత్య అని మండిపడ్డారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 మంది రష్యా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ తన నివేదికలో తెలిపింది.2022 ఫిబ్రవరిలో మెదలైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. -
బందీల విడుదల..జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్:గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు,పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. వారిని విడిపించేందుకు ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. కొత్త ఏడాది 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని జెలెన్స్కీ తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు,పౌరుల విడుదలలో మిత్ర దేశాల పాత్ర కీలకమని తెలిపారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాది ముగియాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ ఆకాంక్షించారు.2022లో ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు చెందిన 30 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.ఉక్రెయిన్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.In 2024, we managed to bring 1,358 of our people back home to Ukraine from Russian captivity. These are our soldiers and civilians.Their fates are different, but they are equally happy to return home. Each and every one of them for the sake of whom a large Ukrainian team… pic.twitter.com/AxTPYlmYhv— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 3, 2025 ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
రష్యాకు గ్యాస్ రూపంలో ఉక్రెయిన్ ఝలక్!
రష్యాకు గ్యాస్ రూపంలో ఉక్రెయిన్ ఝలక్! -
రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్
మాస్కో/కీవ్: రష్యా నుంచి చౌకగా గ్యాస్ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టంచేసింది. → గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.→ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది 6.9 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. → రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్నకు చేరుతోంది. → యూరప్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెనింగ్ గ్లోస్టీన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. → 2022లో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్ను రష్యా నుంచే పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. → అయితే యూరప్కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం -
ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం
కీవ్:కొత్త ఏడాది సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. రాజధాని కీవ్ నుంచి ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు.‘శాంతి మాకు బహుమతిగా రాదని తెలుసు. అన్ని వనరులున్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతాం.అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నా. పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు’అని జెలెన్స్కీ అన్నారు.కాగా, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ ఏడు రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్లో బందీగా ఉత్తరకొరియా సైనికుడు
సియోల్:రష్యా(Russia) తరపున యుద్ధం చేసేందుకు వెళ్లిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బందీగా తీసుకువెళ్లాయని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం చేసేందుకు వేలాది మంది సైనికులను ఉత్తరకొరియా రష్యాకు పంపిన విషయం తెలిసిందే.రష్యాలోని క్రస్క్ సరిహద్దు వద్ద గతంలో ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా రష్యాలోకి చొచ్చుకువచ్చి దాడి చేశారు.ఈ సమయంలోనే ఉత్తరకొరియా సైనికుడిని ఉక్రెయిన్ బలగాలు తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.రష్యాతో జరిగిన యుద్ధంలో వెయ్యి మంది ఉత్తరకొరియా సైనికులు మరణించారని ఇప్పటికే దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది.రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులను రష్యా ముందుంచి పోరాడుతోందని తెలిపింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం లేకపోవడంతో ఉత్తరకొరియా సైనికులు భారీగా మృత్యువాత పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
ఉక్రెయిన్పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి
కీవ్ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.క్రిస్టమస్ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్స్కీ ప్రశ్నించారు. Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. నగరాలపై దాడులుఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్లోని అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్మెంట్లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్లో వెల్లడించారు.అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. -
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
-
పుతిన్ పగ.. అణు యుద్ధానికి టైమ్ ఫిక్స్
-
బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ మృతి
మాస్కో: రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(54) మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలోని కారు వద్దకు రాగా ఆ పక్కనే స్కూటర్లో అమర్చిన బాంబు పేలింది. ఘటనలో కిరిల్లోవ్తోపాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్(ఎస్బీయూ) హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. సోమవారం జనరల్ కిరిల్లోవ్పై పలు నేరారోపణలను సంధించిన ఎస్బీయూ, మరునాడే ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉక్రెయిన్లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయి న్లో రష్యా పాల్పడు తున్న దారుణాల్లో కిరిల్లోవ్ కీలకంగా ఉన్నారంటూ కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్ ఆదేశాలే కారణమని సోమవారం ఎస్బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విష వాయువును ఉక్రెయిన్ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.తగు రీతిలో ప్రతీకారం తప్పదుజనరల్ కిరిల్లోవ్ను చంపేందుకు స్కూటర్లో అమర్చిన బాంబును రిమోట్తో పేల్చినట్లు గుర్తించామని రష్యా అధికారులు చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఉక్రెయిన్ను తగు రీతిలో దండిస్తామని ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ స్పందిస్తూ..సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఆ దేశ సైనిక, రాజకీయ నాయకత్వం ప్రతీకార చర్యలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇటువంటి దాడుల్లో పలువురు రష్యా ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఉక్రెయినే కారణమని రష్యా నిందించింది.🛑Breaking🛑Senior Russian General Igor Kirillov, head of Russia’s NBC defense forces, killed in a scooter bomb explosion in Moscow (Dec 17). pic.twitter.com/Zn9hhzuz3D— Taymur Malik (@Taymur918) December 17, 2024 -
ఉక్రెయిన్లో తక్షణమే శాంతి నెలకొనాలి
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.నాటో నుంచి బయటికొస్తాంనాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే. -
వెంటనే ఆ పిచ్చి పని ఆపేయండి.. రష్యా-ఉక్రెయిన్కు ట్రంప్ పిలుపు
వాషింగ్టన్ : ఉక్రెయిన్,రష్యా యుద్ధాన్ని పిచ్చితనంతో పోల్చారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు తక్షణ కాల్పుల విరమణ, చర్చలు జరపాలని కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో చైనా కీలక పాత్ర పోషించగలదని ట్రంప్ అభిప్రాయ పడ్డారు.2019లో అగ్ని ప్రమాదానికి గురైన ఫ్రాన్స్లోని నోట్రే డామ్ కేథడ్రల్ను పునఃప్రారంభించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ,ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్లు ఒక ఒప్పందం కుదుర్చుకుని పిచ్చి (యుద్ధాన్ని)ని ఆపాలని జెలెన్ స్కీ కోరుకుంటున్నారు. ఉక్రెయిన్ ఇప్పటికే దాదాపు 400,000 మంది సైనికులను కోల్పోయింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలి. ఇందుకోసం ఇరుదేశాలు చర్చలు జరపాలి. చర్చలు జరిపేందుకు చైనా సహాయం చేస్తుంది. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాలని, యుద్ధం ఆపాలని ప్రపంచం మొత్తం కోరుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్తో రష్యా పోరులో భాగంగా పుతిన్కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
ఉక్రెయిన్పై రష్యా సంచలన ఆరోపణలు
న్యూయార్క్:సుదీర్ఘంగా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. సిరియాలో అంతర్యుద్ధానికి కారణమైన ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ రెబల్స్కు ఉక్రెయిన్ సాయం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఐక్యరాజ్యసమితి(యూఎన్)లో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరియాలో అధ్యక్షుడు బషర్ అసద్ అల్ పాలనపై తిరుగుబాటు చేస్తున్న రెబల్స్కు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అండదండలున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ తమకు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయాన్ని కొంత మంది రెబల్స్ బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు.రెబల్స్కు శిక్షణ కూడా ఇస్తున్నారన్నారు. కాగా,రెబల్స్ నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తూ తిరుగుబాటుదారులపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. -
అమెరికా కీలక నిర్ణయం.. టార్గెట్ రష్యా..!
వాషింగ్టన్: కొన్నిరోజుల్లో అధ్యక్ష పదవీకాలం ముగియనుందనగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించి ప్రాధాన్యమున్న పనులన్నీ చకచకా చక్కబెట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు రూ.6వేల కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ల్యాండ్ మైన్లు,యాంటీ ఆర్మర్ వెపన్లను అమెరికా ఉక్రెయిన్కు సమకూర్చనుంది.భవిష్యత్తులో ఉక్రెయిన్కు ఇలాంటి సహాయం అందకపోవచ్చనే ఆలోచనతో హుటాహుటిన ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా దాడులను అడ్డుకొని,ఉక్రెయిన్ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేలా ప్యాకేజీ ఇస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. -
రష్యా రక్షణ బడ్జెట్ రూ.10 లక్షల కోట్లు!
కీవ్: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. 2025 బడ్జెట్లో 32.5శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు. రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్లో 28.3శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి. -
Russia Ukraine War: నాటోలో చేర్చుకోండి.. యుద్ధం ఆపేస్తాం
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.ఉక్రెయిన్కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేశారు.ఇది కూడా చదవండి: నైజీరియన్ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్ -
రష్యాకు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న ఉక్రెయిన్ దళాలు!
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. తాజాగా రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంట్పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ.. 24 గంటల్లో ఐదుసార్లు డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్కు చెందిన మూడు డ్రోన్లను తాము కూల్చివేసినట్టు రష్యా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, అణ్వాయుధాలను ఉక్రెయిన్కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్తో రష్యా పోరులో అమెరికా.. కీవ్కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. రష్యా వద్ద మొత్తం 4,380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఆ దేశ సైనికుడు ఆంటోన్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసే వాళ్లమని.. కానీ, కీవ్పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు. 🇷🇺🇺🇦The deputy head of Russia's Security Council, Dmitry Medvedev, has commented on discussions by US politicians and journalists about the transfer of nuclear weapons to Kiev:The very threat of transferring nuclear weapons to the Kiev regime can be seen as a preparation for a… pic.twitter.com/m92Vg3HeGK— dana (@dana916) November 26, 2024 -
ఉ.కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
సియోల్: ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా, రష్యాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాల్లో పాల్గొనేందుకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు అక్టోబర్లో రష్యాకు తరలివెళ్లిన విషయం తెల్సిందే. ఉత్తరకొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణకొరియా శుక్రవారం ప్రకటించింది. గగనతల రక్షణ క్షిపణులను ఉ.కొరియాకు రష్యా అందించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్సుక్కు జాతీయ భద్రతా సలహాదారు షిన్ వోన్సిక్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీసీ టీవీ కార్యక్రమంలో షిన్ మాట్లాడారు. ‘‘ ఉ.కొరియా గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణులను రష్యా సరఫరా చేసింది. వీటితోపాటు ఇతర ఉపకరణాలనూ ఉ.కొరియాకు పంపించింది. తమను ద్వేషించేలా దేశ వ్యతిరేక కరపత్రాలను తమ దేశంలోనే డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారని, ఇది పునరావృతమైతే క్షిపణి దాడులు తప్పవని ఉ.కొరియా ఇటీవల ద.కొరియాను హెచ్చరించిన విషయం విదితమే. అయితే ఈ కరపత్రాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని ద.కొరియా స్పష్టంచేసింది. -
ప్రపంచాన్ని వల్లకాడు చేస్తారా..!
-
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
ఉక్రెయిన్పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా
కీవ్: అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంత దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారికావడం గమనార్హం. మధ్యతూర్పు ఉక్రెయిన్లోని డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసెంజింగ్ యాప్లో ప్రకటించింది. వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. ‘‘ ఐసీబీఎంతోపాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి, ఏడు కేహెచ్–101 క్రూజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే ఆర్ఎస్–26 రూబెజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్స్(ఎంఐఆర్వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.క్షిపణితో హెచ్చరించారా?సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణ మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనుకాడబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ‘‘ ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో క్షిపణులు, ఆరు హిమార్స్ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం’’ అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్మ్షాడో క్షిపణులను తమ గగనతలరక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే గురువారం ఉక్రెయిన్పై ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో, అసలు ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమెకు ఫోన్కాల్ వచ్చింది. ‘‘ మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమదేశాలు అప్పుడే మాట్లాడటం మొదలెట్టాయి. ఐసీబీఎంను వాడిన విషయాన్ని ప్రెస్మీట్లో ప్రస్తావించొద్దు’’ అని సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు ఫోన్లో చెప్పారు. సంబంధిత వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.ఏమిటీ ఖండాంతర క్షిపణి?సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఉపయోగపడుతుంది. 5, 500 కిలోమీటర్లకు మించి ప్రయా ణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్హెడ్నూ మోస్తాయి. రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్ఎస్26 రూబెజ్ క్షిపణి ఎంఐఆర్వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్ లాంఛర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్లను రబ్బర్లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది. దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్హెడ్ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు. తొలుత కనిపెట్టిన అమెరికాఎంఐఆర్వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్లో ఎస్సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్ ఎస్ఎల్బీఎంను రూపొందించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది. -
ఉక్రెయిన్కు బైడెన్ భారీ ఆఫర్.. ట్రంప్ సమర్థిస్తారా?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా దాడుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్కు అమెరికా ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్కు ఇచ్చిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేల సంఖ్యలో ఉక్రెయిన్వాసులు దేశం విడిచివెళ్లారు. రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్కు అగ్ర రాజ్యం అమెరికా అండగా నిలిచింది. బైడెస్ ప్రభుత్వం జెలెన్ స్కీకి ఆర్థికంగా, ఆయుధాల విషయంలోనూ సాయం అందజేసింది.ఇక, తాజాగా అధ్యక్షుడు బైడెన్.. ఉక్రెయిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్కు అందజేసిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపిన అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. బైడెన్ తన పదవి నుంచి దిగేపోయే ముందే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు తాము చేయాల్సినంత సాయం చేసి వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక సాయం అందించే దిశగా బైడెన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, బైడెన్ నిర్ణయం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. The Biden Administration has moved to forgive $4.7 billion of US 🇺🇸 loans provided to Ukraine 🇺🇦 says State Department Spokesperson Matthew MillerThese loans were approved as part of a $60.8 billion package for Ukraine this April. Great news for Ukraine this week from US pic.twitter.com/hbob3Ixvji— Ukraine Battle Map (@ukraine_map) November 20, 2024 -
Russia-Ukraine war: రష్యా సైన్యానికి ల్యాండ్ మైన్స్తో అడ్డుకట్ట!
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది. తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్కు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు. రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు. -
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
ఉక్రెయిన్లో అమెరికా ఎంబసీ మూసివేత
కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఉక్రెయిన్లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆ మహా విపత్తుకు... 1,000 రోజులు!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.రావణకాష్టంలా... 2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.చిరకాలంగా రష్యా కన్ను 1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.ఆర్థిక వ్యవస్థ పతనం.. యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. -
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బైడెన్ గ్రీన్సిగ్నల్..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు
కీవ్: అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్రేంజ్ ఆర్మీ ట్యాక్టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.రష్యాపై లాంగ్రేంజ్ మిసైల్స్ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యాతమ దేశంపైకి ఉక్రెయిన్ ఆరు అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్ను ధ్వంసం చేసింది.ధ్వంసమైన మిసైల్కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ఉక్రెయిన్ పవర్గ్రిడ్పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్కు కీలకమైన పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్గ్రిడ్ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
ఉక్రెయిన్పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్పై రష్యా తరచూ దాడులు చేస్తూ వస్తోంది.కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన డ్రోన్లను రష్యా వినియోగించినట్లు సమాచారం. కీవ్లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నారని, వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకుల్లోనే ఉండాలని ఉక్రెయిన్ అధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది.మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేవారు. ఈ యుద్ధాన్నిశాంతింపజేయడంపై దృష్టి పెడతామని ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్కాల్
-
ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడంలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చారని, ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే ఐరోపాలో అమెరికాకు ఉన్న బలమైన సైనిక ఉనికి గురించి రష్యాను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్లో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఉపఖండంలో శాంతిని కొనసాగించే ప్రయత్నాల గురించి కూడా చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఇదివరకే ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ తాజాగా పుతిన్తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని ఖండించింది. ఈ ఫోను సంభాషణ గురించి ఉక్రెయిన్కు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు రిపోర్టు అని పేర్కొంది. BREAKING: 🇺🇸🇷🇺 President-elect Donald Trump holds phone call with Russia's Vladimir Putin to discuss de-escalating the war in Ukraine. pic.twitter.com/2pDW1vARaE— BRICS News (@BRICSinfo) November 10, 2024మరోవైపు ట్రంప్తో ఉక్రెయిన్పై చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం కాదని కూడా రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ పుతిన్- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అధికారికంగా ధృవీకరణ పొందలేదు. స్కై న్యూస్ వంటి ప్రధాన వార్తా నెట్వర్క్లు కూడా ఈ నివేదికను స్వతంత్రంగా ధృవీకరించలేదు.ఇది కూడా చదవండి: పేజర్ దాడులు మా పనే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు -
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే!
ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల మానవాళి మాటలకు అందని నష్టాలను చవిచూసింది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా తరచూ యుద్ధాల ద్వారానే పలు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాదిమంది అమాయకులు ఈ రెండు యుద్ధాల వల్ల బలైపోయారు.ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరని చెప్పారు ‘యుద్ధము–శాంతి (వార్ అండ్ పీస్)’ అనే తన అద్భుత నవల ద్వారా రష్యన్ మహా రచయిత లియో టాల్స్టాయ్. సరిహద్దులు లేని పరస్పర ప్రేమ ఒక్కటే విశ్వశాంతికి మార్గం వేస్తుందని రెండు శతాబ్దాల ముందే చెప్పారాయన.1910లో టాల్స్టాయ్ మరణించిన 4 ఏళ్ల తర్వాత 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1 కోటి 30 లక్షల మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ తర్వాత, 1939–45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది ఆశువులు బాశారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి.1947 తర్వాత... జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య సాగిన ఆధిపత్యపోరు క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధార పడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆ యా దేశాలు సైతం ఆ ప్రచ్ఛన్నయుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్ యూనియన్ పతనమయ్యేంతవరకు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. అంతకుముందే ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య ఘర్షణలు మొదలై పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. తదుపరి ఇరాన్–ఇరాక్ల మధ్య కీచులాటలు కొనసాగాయి. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం, 1972లో ఇండియా–పాక్ల మధ్య యుద్ధం, తిరిగి 1999లో ఈ రెండు దేశాల నడుమ కార్గిల్ యుద్ధం, దక్షిణాఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మధ్య అంతర్యుద్ధం... ఇలా చెప్పుకుంటూపోతే అనేక యుద్ధాలు ప్రపంచాన్ని అస్థిరపరిచాయి. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా (యురేషియా) యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ (పశ్చిమాసియా) యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్లో, ఇటు గాజాలో పసిపిల్లలతోసహా వేలాదిమంది అమాయకులు బలైపోయారు. రెండు ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా... ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది. హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు ఆ దశ దాటి పోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంత పాడటంతో... కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డుపడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్కు గానీ, ఇటు ఇరాన్కు గానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే.పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్కు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. పశ్చిమాసియా పరిణామాలు భారత్ స్టాక్ మార్కెట్లను ఇప్పటికే ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత ఇంధన అవసరాలు దాదాపు 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ కనుక తన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసినట్లయితే ఈ మార్గం ద్వారా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకొంటున్న భారత్ ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే, సూయిజ్ కాలువ ద్వారా రవాణాను అనుమతించనట్లయితే... చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చమురును రవాణా చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇప్పటికే యెమన్ కేంద్రంగా పనిచేసే హౌతీలు హమాస్కు మద్దతుగా సూయిజ్ కాలువ ద్వారా రవాణా అవుతున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది భారత్కు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తోంది. ఇక, దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయం. 2014–15 లో బ్యారెల్ ముడిచమురు ధర అత్యధికంగా 140 డాలర్లకు చేరినపుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయింది. ప్రçస్తుతం బ్యారెల్ ముడిచమురు 85–90 డాలర్ల మధ్యనే ఉండటం వల్ల... భారత్ స్థిమితంగానే ఉంది. కానీ, మధ్య ప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత ముదిరితే జరిగే పరిణామాలు చేదుగానే ఉంటాయి. పొద్దు తిరుగుడు నూనె, పామాయిల్ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ వేగం పుంజుకొన్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఒకప్పుడు ‘రష్యా’తో దౌత్యపరంగా సఖ్యత సాగించిన భారత్... తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరయింది. అమెరికా–చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువయింది. రష్యా, అమెరికా... ఈ రెండు అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్కు మేలు చేసేదే. అయితే, భారత్ తన దౌత్యనీతిలో ఎల్లప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.యుద్ధాలతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్కు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన విదేశాంగ విధానాన్ని చాటి చెప్పారు. ముడిచమురుతో సహా పలు వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్నప్పటికీ... ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు తెలపలేదు. పైగా, ఉక్రెయిన్కు నైతిక మద్దతు ప్రకటించింది. విస్తరణ వాదాన్ని సహించబోమని ఒక్క రష్యాకే కాదు.. అరుణాల్ప్రదేశ్ను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు కూడా భారత్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.నిజానికి, అటు యురేషియాలో, ఇటు పశిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి గల మార్గాలను భారత్ తీవ్రంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్కు ఈ అంతర్జాతీయ పరిణామాలు మింగుడు పడనివే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పశ్చియాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తనవంతు కృషి చేయడం మినహా భారత్ చేయగలిగింది ఏమీలేదు. లియో టాల్స్టాయ్ చెప్పినట్లు పరాజితులుగా మిగిలిపోతారా లేక యుద్ధవిరమణ చేసి విజేతలుగా అవతరిస్తారా అన్నది యుద్ధాల్లో మునిగి ఉన్న దేశాలు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాల వైఖరి మీద ఆధారపడి ఉంది. -డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
వారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మిసైల్స్ కావాలి: ఉక్రెయిన్
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు.‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
ఉక్రెయిన్లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తరకోరియా సైనికులు ఉక్రెయిన్లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యాతో పాటు ఉక్రెయిన్లో పోరాడేందుకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని అమెరికా ఉత్తరకొరియాకు వార్నింగ్ ఇచ్చింది.‘‘రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించినట్లయితే.. కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయి.కాబట్టి అటువంటి నిర్లక్ష్య, ప్రమాదకరమైన చర్యలకు పాల్పటం ఒకటికి రెండుసార్లు ఆలోచించమని నేను ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్-ఉన్కు సలహా ఇస్తాను’’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ అన్నారు.North Korean Troops Who Enter Ukraine Will "Return In Body Bags", Warns US"Should DPRK's troops enter Ukraine in support of Russia, they will surely return in body bags," US deputy ambassador to the UN Robert Wood told the Security Council.https://t.co/HVoaV5LbYo— M. Rowland (@melrow74) October 31, 2024చదవండి: ఉక్రెయిన్పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం -
యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది : జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆయనకే కాదు, అంతర్జాతీయంగాను భారత్ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జెలెన్స్కీ ఇటీవల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ జోక్యంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు జెలెన్స్కీ..‘ప్రధాని మోదీ దీనిని నిజం చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు భారత్లోనే చర్చలు జరగొచ్చు. అయితే, యుద్ధం మా గడ్డపై జరుగుతున్నందున మేమిచ్చే షరతులకు లోబడే సంప్రదింపులు జరగాలి’అని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు ప్రయతి్నస్తానన్న మోదీ ప్రకటనపై జలెన్ స్కీ..మాటలు కాదు, చేతలు అవసరమన్నారు. ‘జనాభాపరంగా, ఆర్థికంగా, పలుకుబడిపరంగా భారత్ పెద్ద దేశం. అలాంటి దేశానికి ప్రధాని అయిన మోదీ..యుద్ధాన్ని ఆపేందుకు ప్రయతి్నస్తామని కేవలం మాటగా చెప్పడం సరికాదు. యుద్ధాన్ని ఆపేందుకు పలుకుబడిని ఉపయోగించాలి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఆదేశం నుంచి చౌకగా దొరుకుతున్న చమురును, రక్షణ రంగ ఉత్పత్తులను కొనరాదు. ఫలితంగా ఆ దేశ యుద్ధ సామర్ధ్యం దెబ్బతింటుంది’అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎత్తుకుపోయిన మా చిన్నారుల్లో కనీసం వెయ్యి మందినైనా తిరిగి మాకు ఇచ్చేలా మోదీ రష్యాపై తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. తటస్థత అంటే రష్యా వైపు ఉన్నట్టే ‘యుద్ధం జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉండటమంటే రష్యా పక్షాన ఉన్నట్లే అర్థం. దురాక్రమణదారు, బాధిత దేశం మధ్య తటస్థత అనేదే ఉండదు. అలా ఉండటమంటే పరోక్షంగా రష్యాకు మద్దతివ్వడమే’అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొన్న నేతలు కూడా సంక్షోభం సమసేందుకు సహకరిస్తామని చెప్పారు. నా దృష్టిలో అది కూడా మాకంటే రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నా’అన్నారు. ‘అంతేకాదు, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాల నేతలు రానందున బ్రిక్స్ శిఖరాగ్రం విఫలమైనట్లే లెక్క. ప్రపంచాన్ని పుతిన్ పశి్చమ అనుకూల, బ్రిక్స్ అనుకూల దేశాలుగా విభజించాలనుకుంటున్నారు. అందుకే, బ్రెజిల్, చైనాలు తీసుకువచి్చన శాంతి ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. ఈ పరిణామం చైనా, బ్రెజిల్లకు చెంపపెట్టు వంటిది’అని చెప్పారు. -
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్కు బిగ్ బూస్ట్ -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి అన్నివిధాలా సహకరిస్తాం. పుతిన్కు స్పష్టం చేసిన మోదీ. బ్రిక్స్ సదస్సు కోసం రష్యాలో మొదలైన మోదీ పర్యటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్లో కూర్చుంటారు: కమల
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే. -
ఉద్రిక్తతల నడుమ ఉక్రెయిన్కు అమెరికా రక్షణ మంత్రి
కీవ్: రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో లాయిడ్ ఆస్టిన్ ఉక్రేనియన్ నేతలతో ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారు.I’m back in Ukraine for the fourth time as Secretary of Defense, demonstrating that the United States, alongside the international community, continues to stand by Ukraine. pic.twitter.com/0gCwAqqEpK— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) October 21, 2024తన పర్యటన సందర్భంగా ఆస్టిన్ ఒక ట్విట్టర్ పోస్టులో ‘అంతర్జాతీయ సమాజంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్కు అండగా నిలుస్తుందని తెలియజేయడానికే తాను నాల్గవసారి ఉక్రెయిన్కు తిరిగి వచ్చానని’ తెలిపారు. మరోవైపు రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్ III ఉక్రెయిన్కు చేరుకున్నారని, ఉక్రెయిన్ స్వాతంత్ర్య పోరాటానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతును పునరుద్ఘాటించారని పెంటగాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా దురాక్రమణ నుండి ఉక్రెయిన్కు అవసరమైన భద్రతా సహాయాన్ని అందించడానికి యూఎస్ కట్టుబడి ఉందని పెంటగాన్ తెలిపింది. ఇది కూడా చదవండి: యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్కు చీఫ్ లేనట్లే! -
‘భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ హక్కు’
ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తగ్గించటంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ‘దీ ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో పాల్గొన్న డేవిడ్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వ్యవహరించే సత్తా భారతదేశానికి ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భారతదేశం మధ్యవర్తిత్వం వహించే స్థితిలో ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలవంతంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి’’అని అన్నారు.అదేవిధంగా ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో ప్రస్తుతం భారత్ దృక్పథం చాలా అవసరమని అన్నారు. ‘‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించాలి. ప్రపంచానికి బలమైన ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి భారత్ దృక్పథం అవసరం. ఈ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొవటంలో భారతదేశం ఒక ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే భారతదేశపు ఎదుగుదలను కనబరుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని 2015 ప్రకటన చేశాను. యూఎన్ఏలో సభ్యత్వం పొందటం.. భారతదేశం హక్కు’ అని అన్నారు. -
రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ శనివారం రాత్రి తమ పశ్చిమ ప్రాంతంపైకి 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది.గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయని ప్రకటించింది. మొత్తం ఏడు ప్రాంతాల్లోకి 110 డ్రోన్లు చొచ్చుకురాగా, సరిహద్దుల్లోని ఒక్క కస్క్పైకే ఏకంగా 43 డ్రోన్లను పంపిందని రష్యా ఆర్మీ ప్రకటించింది. నిజ్నీ నొవ్గొరోడ్లోని పేలుడు పదార్థాల కర్మాగారానికి సమీపంలోకి వచ్చిన డ్రోన్ను గాల్లోనే ధ్వంసం చేశామని వివరించింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, శనివారం సాయంత్రం ఉక్రెయిన్లోని క్రివ్యి రిహ్లో రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో 17 మంది గాయపడ్డారని యంత్రాంగం తెలిపింది. పలు నివాసాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో రష్యా 800 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. నిత్యం తమ నగరాలు, పట్టణాలపై రష్యా దాడులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. -
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్స్టాప్గా దౌడు తీస్తున్న బుల్కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Russia-Ukraine war: రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్ ముప్పేట దాడి
కీవ్: రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లతో ఎదురుదాడిని పెంచింది. అయితే ఈ డ్రోన్లలో చాలావాటిని రష్యా విజయవంతంగా నేలకూల్చడంతో భారీ నష్టం ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకు రష్యా దండయాత్ర మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసి ప్రతిఘటనల్లో ఇదీ ఒకటని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటవీప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. రష్యావ్యాప్తంగా ఏడు రీజియన్లలో పెద్దసంఖ్యలో ఉక్రె యిన్ డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క ఓల్గోగ్రేడ్ రీజియన్లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది. ఓరోనెజ్, రస్తోవ్ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు, వాటిని రష్యా గగనతల రక్షణ వ్య వస్థ కూల్చేసిన ఘటనలు నమోద య్యాయి. డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది. -
న్యూక్లియర్ వార్కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్ ఇచ్చాడు.అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. BREAKING:🇷🇺 Vladimir Putin: "We will use NUCLEAR weapons if a mass enemy missile or UAV is launched towards Russia, or when these weapons cross into Russian territory" pic.twitter.com/oDJz1zTTzU— Megatron (@Megatron_ron) September 25, 2024 పుతిన్ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 1982 to 2024: ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్జ్బొల్లా రక్తచరిత్ర