‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు! | Rahul Gandhi Nearly Quit Bharat Jodo Yatra Over Knee Pain | Sakshi
Sakshi News home page

‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు!

Published Sun, Feb 12 2023 2:22 AM | Last Updated on Sun, Feb 12 2023 3:53 AM

Rahul Gandhi Nearly Quit Bharat Jodo Yatra Over Knee Pain - Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా భారత్‌ జోడో యాత్రను మూడు రోజులకే ఆపేయాలనుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. రాహుల్‌కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వేణు గోపాల్‌ శనివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన రాహుల్‌..యాత్రలో తన బదులుగా మరొకరిని పెట్టాలనుకున్నారని కూడా ఆయన చెప్పారు.

తన స్థానంలో సీనియర్‌ నేతలెవరికైనా ఆ బాధ్యతలను అప్పగించాలని సోదరి ప్రియాంకా గాంధీకి చెప్పారన్నారు. కన్యాకుమారి నుంచి యాత్ర మొదలైన మూడు రోజులకే రాహుల్‌ మోకాలి నొప్పి తీవ్రమైందన్నారు. అయితే, దేవుడి దయతో ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. రాహుల్‌ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర జనవరి 30న జమ్మూలో ముగిసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement