KC Venugopal
-
మార్చిలోగా పూర్తి చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మార్చిలోగా జీహెచ్ఎంసీ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. ఆ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను అప్రమత్తం చేయాలి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను తొలుత నిర్వహించాలి. తర్వాత మిగతా ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న దృష్ట్యా కనీసం 80 శాతం విజయాలు నమోదు చేయాలి. రాష్ట్ర మంత్రులు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండొద్దు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి. ముఖ్య నేతలు కూడా స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసింది. ‘స్థానిక’ సంసిద్ధతపై ఆరా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. మండల, జిల్లా పరిషత్ల పదవీకాలం గత జూలైతో పూర్తయ్యింది. ఇక ఈ నెల 26వ తేదీకి ఒకటీ రెండు మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ వాటి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ సంసిద్ధతపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కేసీ పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా ఈ కీలక భేటీని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరు, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, రాహుల్గాంధీ సభ తదితర అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కుల గణనపై కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు వివరించిన నేతలు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను కేసీ వేణుగోపాల్కు రాష్ట్ర నేతలు వివరించారు. రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందజేయనుండటం, కొత్త రేషన్ కార్డుల జారీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తదితరాలపై తాజా వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీ మాట్లాడారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలన్న కేసీ మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయని, ఇన్చార్జి మంత్రులు తమ తమ జిల్లాల కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేలా బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్థత, ఆయా ఎన్నికల్లో విజయడంకా మోగించడంపై దిశానిర్దేశం చేశారు. పీసీసీకి సంబంధించి సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు జిల్లాల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగిలిపోయిన నామినేటెట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న రాహుల్గాంధీ సభ విజయవంతం చేసేలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. కష్టపడి పనిచేస్తున్న వారికే పదవులు: మహేశ్గౌడ్ ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు, పెండింగ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, పీసీసీ కూర్పు ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్గాంధీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
మరో 20 ఏళ్లు పవర్లో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ళే కాకుండా మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పనిచేయాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. సీఎంతో సహా రాష్ట్ర కేబినెట్, టీపీసీసీ అధ్యక్షుడు, అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రశంసించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతమేర వెనుకబడ్డామని చెప్పారు. ప్రజలను విస్తృతంగా కలవడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చునని సూచించారు. రాష్ట్ర మంత్రులు విధిగా నెలకోసారి జిల్లాలకు వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పనితీరును, కార్యక్రమాలను వివరించాలని సూచించారు, పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను పీఏసీ సభ్యులందరూ తీసుకోవాలని కోరారు. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా,రాష్ట్ర పార్టీ కమిటీలను మూడు వారాల్లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీలున్నంత త్వరగా ప్రభుత్వ పదవులను కూడా భర్తీ చేయాలని చెప్పారు. అంబేడ్కర్ను అవమానించడాన్ని సీరియస్గా తీసుకోవాలి దేశ రాజకీయ చరిత్రలో అంబేడ్కర్ను అవమానించిన నాయకులు లేరని, మొదటిసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పాదయాత్రలు నిర్వహించాలని కోరారు. మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశించిన మేర కృషి జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వేణుగోపాల్..ముఖ్యమంత్రిపై మంత్రులకు, మంత్రులపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలను వివరించిన సీఎం గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ అమలు చేశామని, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని, జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నామని తెలిపారు. ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందించబోతున్నామని, కొత్త రేషన్కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్ను అవమానించిన ఉదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి నిరసనలు తెలియజేశామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ సభ్యులు వి.హన్మంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్కుమార్, వంశీచందర్ రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, బలరాం నాయక్, గీతారెడ్డి, అజారుద్దీన్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు. పీఏసీ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా గురువారం పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సమావేశం జరిగే ఫలక్నుమా ప్యాలెస్ హోటల్లోనే వేణుగోపాల్ బుధవారం రాత్రి బస చేశారు. అక్కడే ఆయనతో కలిసి రేవంత్, తదితరులు డిన్నర్ చేశారు. 25–28 తేదీల మధ్య సంవిధాన్ బచావో ర్యాలీ పీఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి శ్రీధర్బాబు పలువురు నేతలతో కలిసి వాటిని విలేకరులకు వెల్లడించారు. అంబేడ్కర్ను అవమానిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 28వ తేదీ మధ్యలో తెలంగాణలో సంవిధాన్ బచావో ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ హాజరు కావాలని కోరుతూ పీఏసీ తీర్మానించినట్లు తెలిపారు. సంవిధాన్ బచావో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు పాదయాత్రలు నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ నేతల అభిప్రాయాలను కేవలం పీఏసీ సమావేశంలో మాత్రమే వివరించాలని, ఎవరూ బయట మాట్లాడకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర మంత్రులు ప్రతినెలా జిల్లాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని కూడా నిర్ణయించామన్నారు. మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలం పాటు రాష్ట్రమంతటా నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. కొత్త గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
రేపటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేక భేటీ నిర్వహింనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెలగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైఠక్గా నామకరణం చేసింది. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు హాజరుకానున్నారు. మొత్తంగా 200ల మంది కీలక నేతలు హాజరవుతారని ఏఐసీసీ ప్రకటించింది. 26న మహాత్మాగాంధీ నగర్లో మధ్యాహ్నం 2.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై ఇందులో కీలక చర్చలు చేయనున్నారు. దీంతో పాటే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా అంశంపైనా చర్చించనున్నారు. ‘1924లో బెలగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మాగాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, వివిధ వర్గాల మధ్య ఐక్యత, సామాజిక–ఆర్ధిక సమతుల్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రసంగించారు. ఈ భేటీకి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నాం. 200 మందికి పైగా నాయకులు దీనికి హాజరవుతారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో కీలక నేతలతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు’అని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆర్ధిక అసమానత, ప్రజాస్వామ్య ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లు వంటి అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు. -
వయనాడ్లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
కాంగ్రెస్లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
‘బుల్డోజర్’ ప్రభుత్వంగా మారొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.అదే తరహా బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. ఆ చెడ్డపేరు మనకొద్దు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దసరాకు ముందే.. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. -
సెబీ చైర్మన్ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా వేణుగోపాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్గా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ను నియమించినట్లు లోక్సభ సచివాలయం శుక్రవారం పేర్కొంది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలుసహా 4 కొత్త కమిటీలకు చైర్మన్లుగా బీజేపీ నేతలను నియమిస్తూ లోక్సభ స్పీకర్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికసంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వ చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఓబీసీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత గణేశ్ సింగ్, ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత ఫగాన్ సింగ్ కులస్తే చైర్మన్గా వ్యవహరించనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమించారు. -
సెబీ చీఫ్పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్సభలో రచ్చ.. కేంద్రమంత్రి రిప్లై
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మృతి అంశం లోక్సభను కుదిపేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ప్రమాదంలో యూపీఎస్సీ విద్యార్ధుల మరణాలను ప్రస్తావిస్తూ దేశంలో కోచింగ్ సెంటర్లు ఓ మాఫియాలా తయారయ్యాయని మండిపడ్డారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల పట్ల వివక్ష చూపడం కలిగిస్తోందన్నారు.‘2023లో రాజ్యసభలో ఓ మంత్రి పెరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యపై సమాధానం ఇచ్చారు, 2018 నుంచి 2022 వరకు ఐఐటీలు, ఐఐఎంలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో సుమారు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇందుకు అక్కడ నెలకొన్న కుల వివక్ష ప్రధాన కారణాలలో ఒకటి.. దీనీనీ తక్షణమే పరిశీలించాలి.దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో భద్రత, నియంత్రణ సమస్యలను వేణుగోపాల్ ప్రస్తావించారు. నిన్నగాక మొన్న న్యూఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కోచింగ్ సరైన అనుమతి, తగిన సౌకర్యాలు లేకుండా పనిచేస్తోందని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. కొన్ని కోచింగ్ సెంటర్లు 'మాఫియా'లుగా మారాయి. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా వారి శారీరక- మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవినెత్తిన ఈ ప్రశ్న నేటి చర్చకు సంబంధించినది కాదు. కానీ కోచింగ్ సెంటర్, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూట్లు ఇలా విద్యార్ధులు ఎక్కడ చదువుతున్నప్పటికీ వారి శారీరక, మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నారు.కాగా కోచింగ్ సెంటర్లకు సంబంధించి కేంద్రం జనవరిలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు సమగ్రమైన, వివరణాత్మక మార్గదర్శకాలు అందించింది. అయితే రాజస్థాన్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను కలిగి ఉన్నాయి. కాగా ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద చేరడంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. -
Kc Venugopal: ప్రభుత్వం నా ఫోన్ను హ్యాక్ చేసింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్ను శనివారం షేర్ చేశారు. ‘మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్ను రిమోట్గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం’అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీకెంతో ఇష్టమైన స్పైవేర్ను నా ఫోన్కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది’అని పేర్కొన్నారు. -
స్పీకర్కు రాహుల్ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్కు గురయ్యా’
ఢిల్లీ: లోక్సభలో చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించటంలో తనను షాక్కు గురిచేసిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సోమవారం లోక్సభలో నీట్, హిందుత్వ, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాహుల్ స్పీచ్లో మాటలను రికార్డుల నుంచి తొలగించినట్ల స్పీకర్ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాను మాట్లాడిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్కు లేఖ రాశారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 ‘నేను నిన్న లోక్సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్ను తొలగించటంపై షాక్కు గురయ్యా. నా మాటాలను పునురుద్ధరించండి. నా ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం’అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సవాల్లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. గత ఎన్డీయే పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కట్టిన నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. బీజేపీ పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్పోర్టుల రూఫ్లు కూలిపోయాయని అన్నారు. రాజ్కోట్ ఎయిర్పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 .. రామ మందిరంలో నీరు లీక్ అయింది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్లో మూడు బ్రిడ్జ్లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. -
పేర్లు ఫైనల్.. మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. వరుసగా నేతలతో భేటీలు.. కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షీ తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్సాగర్రావు, వివే క్, బాలూనాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా చేరినవారికి ఎలా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీకే పీసీసీ చీఫ్ పదవి! పీసీసీ చీఫ్గా బీసీ వర్గ నేతకే చాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. -
హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. -
‘జగిత్యాల జగడం’.. జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ బంపరాఫర్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ‘జగిత్యాల జగడం’ హాట్ టాపిక్గా మారింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవడంతో ఆయనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఫోన్తో మాట్లాడించారు. కాగా, వేణుగోపాల్తో జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సంద్భంగా కేసీ వేణుగోపాల్.. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి రాగానే నా నిర్ణయం చెబుతాను. తొందరలోనే మండలి ఛైర్మన్ దగ్గరికి వస్తాను. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ నాతో మాట్లాడారు. సీనియర్ నాయకులు, సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నేను కాంగ్రెస్లోనే ఉంటాను. పార్టీతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. జరిగిన పరిస్థితులు నాకు బాధ కలిగించాయి. మండలి ఛైర్మన్ను సమయం అడిగాను అంటేనే మీరు ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులంతా గాంధీభవన్కు రావాలని పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా నిలవాలన్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా క్రియేట్ అయ్యింది. నిన్న(సోమవారం) కూడా జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
Mallikarjun Kharge: ఎదురొడ్డి నిల్చున్నారు
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రబోధించిన అంకితభావం, విలువలున్న రాహుల్ గాంధీ దేశంలో తమ వాణిని వినిపించలేకపోయిన కోట్లాది మందికి గొంతుకగా మారారని రాహుల్ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పొగడ్తల్లో ముంచెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ 54వ పుట్టినరోజు వేడుకను పార్టీ కీలక నేతలు జరిపారు. ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్ మాకెల్ తదితరుల సమక్షంలో రాహుల్ కేక్ కట్చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికొచ్చిన కార్యకర్తలు రాహుల్కు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో నిమగ్న మవ్వాలని పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘ కాంగ్రెస్ పాటించే సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, తపన అన్నీ మీలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాలు తుడిచేసి సత్యానికి ఉన్న శక్తిని చాటుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. ‘‘ నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం కోసం పరితపించే విలక్షణమైన వ్యక్తి, నా స్నేహితుడు, మార్గదర్శకుడు, నేత’ అంటూ ప్రియాంకా ట్వీట్చేశారు. ‘‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీకున్న అంకితభావం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
లోక్సభ ఎన్నికల్లో 15 సీట్లలో గెలవాలి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని.. ఉత్తర భారతంలో బీజేపీ బలహీనపడుతుందని అంతర్గత సర్వేలు చెప్తున్నాయని వివరించారు. తెలంగాణలో కనీసం 14 స్థానాల్లో గెలుస్తామని వెల్లడైందన్నారు. ఈ సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని.. ఎన్నికలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్కు వచ్చిన కేసీ వేణుగోపాల్.. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో టీపీసీసీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, కీలక నేతలు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనే ఉండండి.. ‘‘ఈ నెల 18లోపు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో.. అసెంబ్లీ, మండలం, గ్రామం ప్రాతిపదికన ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రచారం చేపట్టాలో పక్కా షెడ్యూల్ రూపొందించుకోవాలి. దాన్ని ఏఐసీసీకి పంపాలి. అభ్యర్థులు పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలి. వీలైనన్ని ఎక్కువ గ్రామాలు తిరగాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల సదస్సులు పెట్టండి. మాదిగ సామాజికవర్గ ఓట్లను పొందేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లండి. ఏఐసీసీ నేతలు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి తెలంగాణలో పర్యటిస్తారు. అందుకు తగినట్టుగా ప్రచార షెడ్యూల్, ఏర్పాట్లు చేసుకోండి..’’ అని కేసీ వేణుగోపాల్ సూచించారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని, బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల వ్యతిరేకత ఉందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని.. ఆ పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, బీఆర్ఎస్ దుర్మార్గాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. లోక్సభ స్థానాల వారీగా సర్వే వివరాలతో.. రాష్ట్రంలోని లోక్సభ స్థానాల వారీ పరిస్థితులపై నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించారు. లోక్సభ స్థానాల వారీగా సర్వేల్లో వెల్లడైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు చాలా అవసరమని.. ఆ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు నాయకులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం సెగ్మెంట్లలో ఎవరిని ఖరారు చేయాలన్న దానిపై నేతల నుంచి కేసీ వేణుగోపాల్ మరోమారు అభిప్రాయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే ఓ కీలక నేత కాంగ్రెస్లో చేరనున్నారని చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో ఘర్ వాపసీని ముమ్మరం చేయాలని.. గతంలో బీజేపీ, బీఆర్ఎస్లలోకి వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెస్లోకి వస్తామంటే చేర్చుకోవాలని సూచించారని తెలిసింది. కాగా.. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, డి.శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ స్థానాల ఇన్చార్జులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మధుయాష్కీగౌడ్, సుదర్శన్రెడ్డి, సంపత్కుమార్, మైనంపల్లి హన్మంతరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్చౌదరి, విష్ణునాథ్లతోపాటు పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. మీ ప్రణాళికలేంటో చెప్పండి కేసీ వేణుగోపాల్తో భేటీకి ముందు ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ విడివిడిగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో ప్రచారం తీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ సమన్వయం, నేతల సహకారం, ఇన్చార్జులతో కలసి రూపొందించుకున్న ప్రణాళికలపై అభ్యర్థులతో చర్చించారు. ఆయా నియోజకవర్గాల సర్వే రిపోర్టులను వారికి వివరించి.. తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు. -
అందుకే వాళ్లు మా పార్టీ నుంచి వెళ్లిపోయారు..కేసీ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం : సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందిన వెంటనే కొందరు నేతలు పార్టీ నుంచి వైదొలిగి, ‘బీజేపీ, కేంద్ర ప్రభుత్వ కాళ్లపై పడ్డారు’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. కేరళ కాంగ్రెస్ ఆలప్పుళ లోక్సభ అభ్యర్ధి కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీ వేణుగోపాల్ తరుపున ప్రచారం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా కేసీ వేణుగోపాల్ డీకే శివకుమార్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ను అన్యాయంగా బీజేపీ, దర్యాప్తు సంస్థలు పలురు నేతల్ని లేఖలతో బెదిరిస్తున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ డీకే శివకుమార్లాంటి గట్స్ ఉన్న నేతలు బీజేపీ,ప్రభుత్వ ఏజెన్సీల ఒత్తిడిలకు తలొగ్గలేదని కొనియాడారు. కారణం లేకుండా కేంద్ర ఏజెన్సీలు డీకే శివకుమార్ను అన్యాయంగా జైలుకు పంపాయని, అయినప్పటికీ ధైర్యంగా పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. ఎంతోమంది నేతలు పార్టీని వీడే సమయంలో దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నోటీసులకు బయపడి బీజేపీకి సరెండర్ అవుతున్నారన్న ఆయన.. డీకే మాత్రం తన తల్లిలాంటి కాంగ్రెస్ను వదల్లేదని తెలిపారు. ధైర్యంగా ఎదుర్కొని కారణం లేకుండానే శివకుమార్ తీహార్ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. పార్టీని వదిలేస్తే జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆ చెప్పింది ఎవరో నాకు బాగా తెలుసు. కానీ శివకుమార్ కాంగ్రెస్ తనకు తల్లిలాంటిదని, పార్టీని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. -
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 43 అభ్యర్థులతో రెండో జాబితా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. రెండో జాబితాలో.. అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో జనరల్ కేటగిరీకి చెందిన 10 మంది అభ్యర్థులు, 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒకరు ముస్లిం అభ్యర్థి ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అస్సాం నుంచి 12 మంది, గురజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ 10 మంది, రాజస్థాన్ 10 మంది, ఉత్తరఖండ్ 3, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక్కరికి రెండో జాబితాలో చోటు దక్కింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా సెగ్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ను మరోసారి బరిలోకి దింపింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్ గెహ్లాత్కు రాజస్థాన్లోని జలోర్ సెగ్మెంట్ను కేటాయించారు. అదేవిధంగా సోమవారం బీజేపీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాహుల్ కుశ్వాన్ను రాజస్థాన్లోని చురూ లోకసభ నియోజకవర్గం బరితో దింపింది. LIVE: Congress party briefing by Shri @kcvenugopalmp in New Delhi. https://t.co/K3nuDYA7P9 — Congress (@INCIndia) March 12, 2024 చదవండి: 39 మందితో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా -
ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన!
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు.. టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
తెలంగాణ 'సీఎం రేవంత్'
వన్ మ్యాన్ షో ఉండదు తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మొదటిది. అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు తెలిపేది రెండో తీర్మానం. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగిస్తూ మూడో తీర్మానం చేశారు. పార్టీ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం సీనియర్లతో చర్చించాం. రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వంలో వన్మ్యాన్ షో ఉండదు. అందరినీ కలుపుకొంటూ కలసి టీమ్గా ముందుకు వెళ్తాం. సీనియర్లు అందరికీ సముచిత గౌరవం ఉంటుంది. – కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. తీర్మానాలను అధిష్టానానికి అందజేసి.. రాష్ట్ర ఎన్నికల్లో జయకేతనం అనంతరం సోమవారం కొత్త ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్టానం దూతలు, ఏఐసీసీ పరిశీలకులు సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. సీఎం ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానం, ఎమ్మెల్యే అభిప్రాయాల నివేదికలతో ఢిల్లీకి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర నేతలు మంగళవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. సీఎంతోపాటు ఇతర కీలక పదవులపై రాష్ట్ర, జాతీయ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. మరోవైపు సాయంత్రానికల్లా సీఎంను ఖరారు చేస్తామని ఖర్గే ప్రకటించారు. వరుసగా భేటీలు.. విస్తృతంగా సంప్రదింపులు.. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు కొద్దిసేపు పదవుల అంశంపై చర్చించుకున్నారు. 10.45 గంటలకు ఉత్తమ్ డీకే శివకుమార్తో భేటీ అయి.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కీలక శాఖలకు మంత్రులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తనకు సీఎం పదవికి అర్హత ఉందని నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల మద్దతు ఉందని వివరించినట్టు సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తనకు ఆమోదమేనని ప్రకటించారు. డీకేతో ఉత్తమ్ భేటీ జరుగుతున్న సమయంలోనే.. భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. సీఎం పదవి కోసం తన అర్హతను పరిశీలించాలని కోరారు. ఈ భేటీలు సాగుతున్న సమయంలోనే ఖర్గే నివాసంలో మరో కీలక భేటీ జరిగింది. రేవంత్రెడ్డి వైపే మొగ్గు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేతలు రాహుల్గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. పదవికి పోటీ పడుతున్న రేవంత్, ఉత్తమ్, భట్టి పేర్లను పరిశీలించారు. పారీ్టకి పనిచేసిన అనుభవంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న పార్లమెంట్ ఎన్నికలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రేవంత్రెడ్డి వైపే అంతా మొగ్గుచూపినట్టు తెలిసింది. ఈ భేటీ మొదలైన అరగంటకు డీకే శివకుమార్, ఠాక్రే కూడా ఖర్గే నివాసానికి చేరుకుని.. ఎమ్మెల్యేల తీర్మానం కాపీ, వారి అభిప్రాయాల నివేదికను అగ్రనేతలకు అందించారు. ఈ సందర్భంగా అంతా కలసి.. పార్టీ సీనియర్ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు, కీలక శాఖల అప్పగింత, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. రేవంత్ ఎంపికను ఖరారు చేసి, ఈ విషయాన్ని అగ్రనేత సోనియాగాం«దీకి తెలిపి ఆమోదం తీసుకున్నారు. భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఉత్తమ్, దామోదర, శ్రీధర్బాబు, సీతక్కలకు కీలక శాఖలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, మంత్రులకు శాఖలపై నేడు స్పష్టత సీఎం ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్తో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవులతోపాటు మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులపై వారు సుమారు గంట పాటు చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే, ఉత్తమ్, భట్టిలను వెంట పెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన కేసీ వేణుగోపాల్.. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులు ఎందరు ఉండాలి, మంత్రి పదవులు ఎవరికి అన్న దానిపై బుధవారం రేవంత్రెడ్డితో కలసి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. సోనియాతో జి.వినోద్ భేటీ మరోవైపు మాజీ మంత్రి జి.వినోద్ ఢిల్లీలో సోనియాగాంధీతో విడిగా భేటీ అయ్యారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని సోనియాను కోరానని భేటీ అనంతరం వినోద్ తెలిపారు. తన విజ్ఞప్తిపై ఆమె సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఉత్తమ్ సీఎల్పీ నేత ప్రకటనకు ముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయాన్ని పరిశీలించాలని హైకమాండ్ను కోరానని చెప్పారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సీఎం ఎంపిక జరుగుతోందని, మిగతా పార్టీ అంతర్గత విషయాలను బయటికి వెల్లడించలేనని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా మంగళవారం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లోనే గడిపారు. ఓవైపు ఢిల్లీలో సీఎల్పీ నాయకుడి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా.. అదే సమయంలో రేవంత్రెడ్డి హోటల్లో కొత్త ఎమ్మెల్యేలతో ఉండి చర్చలు జరుపుతూ గడిపారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రొఫెసర్ నాగేశ్వర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రేవంత్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రయాణంలో ఉండగానే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు ప్రెస్మీట్ పెట్టి రేవంత్ను సీఎంగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. రేవంత్ వెళ్లాక ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. వారంతా బుధవారం మళ్లీ ఎల్లా హోటల్లో సమావేశం కానున్నారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎంగా రేవంత్ ఎంపిక ప్రకటన వెలువడగానే.. ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ, జై రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం – వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పారిశుధ్యం, త్రాగునీరు, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్శర్మ, ముఖ్య కార్యదర్శులు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ ఆదేశిస్తే కేసీఆర్పై పోటీకి రెడీ: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశం జరిగింది. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లోకి రాజగోపాల్రెడ్డి చేరనున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రాజగోపాల్రెడ్డి.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్పై కూడా పోటీకి రెడీ అన్నారు. బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది’’ అని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. -
ఢిల్లీలో టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీ
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోన్న కాంగ్రెస్.. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశంఉంది. ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కాంగ్రెస్ అభ్యర్థులు 70 మంది ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో 119 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు తొలి జాబితాను 15న విడుదల చేసే అవకాశం ఉంది. సర్వేల ఆధారంగానే.. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరిగింది. సోనియాగాందీ, రాహుల్గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్లను సైతం సమావేశానికి ఆహ్వనించారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికల ఆధారంగా ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో మురళీధరన్ కమిటీకి వివరించారు. ఈ స్థానాలపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ 70 నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోమారు సీఈసీ భేటీ కానుంది. దసరాకు ముందే 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేటి భేటీలో 70 సీట్లపై చర్చించాం. మరోమారు సీఈసీ భేటీ ఉంటుంది’ అని తెలిపారు. తొలి జాబితాలో ముఖ్య నేతలు తొలి జాబితాలో రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్అలీ, సంపత్కుమార్, గడ్డం ప్రసాద్కుమార్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్ఖాన్, ప్రేమ్సాగర్రావు, అంజన్కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ, రామ్మోహన్రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిరుద్రెడ్డి, వీర్లపలి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రోహిత్రావు, గడ్డం వినోద్, ఎర్ర శేఖర్, కుంభం అనిల్కుమార్రెడ్డి, కేకే మహేందర్రెడ్డి, కాట శ్రీనివాస్గౌడ్, వంశీకృష్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు, స్థానాలపై చర్చ సీఈసీ భేటీకి ముందు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ మురళీధరన్తో పాటు మాణిక్రావ్ ఠాక్రే, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సింగిల్ పేర్లతో, రెండు, మూడేసి పేర్లతో ఉన్న అభ్యర్థుల జాబితాలు రూపొందించారు. వాటిని సీఈసీ ముందుంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సి సీట్ల కేటాయింపుపైనా చర్చించారు. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీ తర్వాత జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఇక టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. -
కమలం అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారిపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ నుంచే వల విసురుతోందని, ‘ఆపరేషన్ బీజేపీ అసమ్మతి’ కోసం సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తోందని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీపై నెలకొన్న ప్రజాభిప్రాయాన్ని దృష్టిలోఉంచుకుని బీజేపీతో కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా ఉంటున్న నాయకులు లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాగా వేణుగోపాల్ ఇప్పటికే బీజేపీ అసమ్మతి నేతలతో టచ్లోకి వెళుతున్నారని, వారి రాజకీయ భవిష్యత్తుకు హామీలివ్వడమే కాకుండా, తెలంగాణలో బీజేపీకి అవకాశం లేనందున తమతో కలిసిరావాలని కోరుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను, కేసీఆర్ను గద్దె దించడమే తమ ధ్యేయమని, అందుకే బీజేపీలోకి వెళుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన వారితో పాటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొందరిని టార్గెట్గా చేసుకుని వేణుగోపాల్ రంగంలోకి దిగారని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా వారం పది రోజుల్లోనే ఫలితం కనబడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్రెడ్డి మాత్రం తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మిగతా నేతల గురించి తమకు తెలియదని వారన్నారు. కానీ ప్రధాని మోదీ పాలమూరు, నిజామాబాద్ సభలకు అసంతృప్త నేతలు పలువురు హాజరుకాక పోవడం అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మోదీ సభలకు వెళ్లలేదెందుకో? బీజేపీ అసమ్మతి నేతల వ్యవహారశైలిపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం కొంతకాలంగా విస్తృతంగానే జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎవరూ గట్టిగా ఖండించలేదనే చెప్పాలి. పైగా చాలాకాలంగా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ఈ నేతలంతా ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఫామ్హౌస్, డిన్నర్ మీటింగ్లు పెట్టుకున్నారు. కానీ ఈనెల 1, 3 తేదీల్లో జరిగిన మోదీ బహిరంగ సభలకు మాత్రం.. ఆ మీటింగ్లకు వెళ్లిన నేతల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు హాజరు కాలేదు. దీంతో దీనివెనుక ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతోంది. తర్జనభర్జన! కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారో స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. బీజేపీ అసమ్మతి నేతల్లోని కీలక నేత ప్రధాన అనుచరుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మేం బీజేపీలో ఇమడలేకపోతున్నాం. వాస్తవానికి రజాకార్లతో కొట్లాట నుంచి కమ్యూనిస్టులతో పోట్లాట వరకు తరతరాలుగా కాంగ్రెస్తోనే ఉన్నాం. ఇప్పుడు మా నాయకుడు బీజేపీలోకి వెళ్లాడు కాబట్టి మేం కూడా ఆ కండువా కప్పుకున్నాం. మాలో చాలా మంది మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లాలని అంటున్నారు. మా నాయకుడు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ తరచూ పార్టీలు మారడమే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే పార్టీ మారినా ప్రయోజనం ఉంటుంది. అలా కాకపోతే ఎక్కడైనా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు బీజేపీలో ఉండడం వల్ల నష్టం ఏంటి? కాంగ్రెస్లోకి వెళ్లి లాభం ఏంటనే దానిపై మా నాయకుడు మల్లగుల్లాలు పడుతున్నారు. మిగతావారు కూడా దాదాపుగా ఇదే ఆలోచనతో ఉన్నారు. వారం, పది రోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది..’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆపరేషన్పై ఆ పార్టీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పెద్దలు చాలామందితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లిన వారిని మళ్లీ రమ్మని కోరుతున్నారు. రాజగోపాల్తో పాటు చాలామంది బీజేపీ అసమ్మతి నేతలతో వేణుగోపాల్ మాట్లాడుతున్నారన్నది వాస్తవం..’ అని చెప్పడం గమనార్హం. -
తెలంగాణలో దారుణమైన పాలన నడుస్తోంది: కేసీ వేణుగోపాల్
-
‘రాహుల్పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇరిటేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు. ఈమేరకు 17న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. చదవండి: మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..? కాంగ్రెస్ అగ్రనేతంతా హైదరాబాద్కే.. సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఆగ్ర నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. -
ముగిసిన స్క్రీనింగ్ కమిటీ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. పార్టీ కీలక నేతలతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఓ హోటల్లో ఈ సమావేశం జరగ్గా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్తో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్కుమార్లు గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. స్క్రీనింగ్ కమిటీ మొదటిసారి భేటీ అయ్యింది. స్క్రీనింగ్ కమిటీలో సీనియర్ల సూచనలు తీసుకున్నాం అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ థాక్రే తెలిపారు. సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపై రూపొందించిన నివేదికతో మురళీధరన్ ఈ రాత్రికే ఢిల్లీకి బయల్దేరతారని సమాచారం. ఇదిలా ఉంటే.. దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు తీవ్రంగానే సాగుతోంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలతో పాటు, ఆపై పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతోనూ వన్ టు వన్ భేటీ నిర్వహించారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. వాళ్ల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా చివరకు ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారిగా 1 నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన నివేదికను తీసుకుని మురళీధరన్ ఈ రాత్రికే ఢిల్లీకి పయనం అవుతారు. అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కావొచ్చని తెలుస్తోంది. ఇక.. రేపు(సెప్టెంబర్ 7వ తేదీన) సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఆ నివేదికను సమర్పిస్తారు. ఆపై అభ్యర్థుల జాబితా ప్రక్రియ ఎంపిక ఓ కొలిక్కి వస్తుంది . అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందా? అనేది అనుమానంగానే మారింది ఇప్పుడు. నేడు హైదరాబాద్కు కేసీ వేణుగోపాల్ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీలలో హైదరాబాద్ లో cwc సమావేశాలు ఉండడంతో కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Cwc సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్ తో పాటు.. భారీ బహిరంగ సభ కోసం పీసీసీ చూసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం cwc సమావేశాల నేపథ్యంలో.. ఏఐసీసీ గైడ్ లైన్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. ఇదే హోటల్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుండడంతో.. కేసీ వేణుగోపాల్ ఆ కమిటీతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఈనెల 16న హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశం..
సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ 16న హైదరాబాద్లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్నట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లుత తెలిపారు. 16 తేదీ సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 17 తేదీ విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిపారు. ఆరోజు సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు హాజరువతారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.సెప్టెంబర్ 17 సాయంత్రం హైదరాబాద్కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. చదవండి: తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు సెలవులు కాగా సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారన్నారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్లమెంటరి పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ ,రాహుల్ గాంధీని కలిశారని, చాలా మంచి సమావేశం జరిగిందన్నారు కేసీ వేణుగోపాల్. అయితే షర్మిల చేరిక, పార్టీ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షర్మిల చేరికపై వేచి చూడాలని తెలిపారు. Congress president Shri @kharge will convene the first meeting of the newly constituted Working Committee on September 16 in Hyderabad, Telangana. On September 17, there will be an extended Working Committee meeting. All CWC members, PCC Presidents, CLP leaders and Parliamentary… pic.twitter.com/VjwmZ5fEgx — Congress (@INCIndia) September 4, 2023 🔥Team @INCTelangana is extremely thankful to AICC President shri @kharge ji for convening the first meeting of the newly constituted CWC in #Telangana. We shall all make it a huge success and work towards the betterment of the people. https://t.co/F306R4Wlf3 — Revanth Reddy (@revanth_anumula) September 4, 2023 Congress president Shri @kharge will convene the first meeting of the newly constituted Working Committee on September 16 in Hyderabad, Telangana. On September 17, there will be an extended Working Committee meeting. All CWC members, PCC Presidents, CLP leaders and Parliamentary… pic.twitter.com/VjwmZ5fEgx — Congress (@INCIndia) September 4, 2023 -
Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్న టీ కాంగ్రెస్... అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వస్తోంది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కసరత్తు నివేదిక ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్కు అందినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్లో ఆయన పర్యటనకు ముందే సునీల్ కనుగోలు ఈ నివేదికను వేణుగోపాల్కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో వేణుగోపాల్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. సునీల్ కనుగోలు మూడు రకాలుగా విభజన... వాస్తవానికి గత నెల 24న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సునీల్ కనుగోలు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ అంతంత మాత్రంగానే ఉందని, మిగిలిన చోట్ల ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నామని వివరించారు. అయితే ఏ అసెంబ్లీ స్థానంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో వెల్లడించలేదు. తాజాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశముందని, మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని, 36 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదని, ఆ స్థానాలపై ప్రస్తుత పరిస్థితుల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని కె.సి.వేణుగోపాల్కు ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకా రం గెలుపు అవకాశాలున్న చోట్ల ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని, గెలుపు కోసం కష్టపడాల్సిన స్థానాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కె.సి.వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. ఇక, పరిస్థితి ఏమాత్రం బాగాలేని 36 స్థానాల్లో ఏం చేస్తే మెరుగుపడతామన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని వేణుగోపాల్ మార్గనిర్దేశం చేసినట్టు తెలు స్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్బాబు, విష్ణునాథ్, మన్సూర్అలీఖాన్, రోహిత్చౌదరి, వంశీచందర్రెడ్డి, సంపత్కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఓవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే మీరిలా పరస్పరం ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం ఏమిటి? ఎన్నికల వేళ ఈ లొల్లి ఆగకపోతే ఎలా? కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేది మీరే... మేం కాదు. కర్ణాటక నేతలను చూసి నేర్చుకోండి. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ 100 రోజులు ఐకమత్యంగా పనిచేయండి’అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. శనివారం గాంధీ భవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతల అనైక్యత గురించి వేణుగోపాల్ మాట్లాడారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బరాబర్... కలుగజేసుకుంటాం సమావేశంలో భాగంగా పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అభ్యంతరం తెలిపారు. కమిటీల ఏర్పాటు ఏకపక్షంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ అన్ని జిల్లాల్లోనూ కలుగజేసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తీవ్రంగా స్పందించిన ఉత్తమ్... పీసీసీ చీఫ్గా పార్టీని నడిపించామని, 30–40 ఏళ్లుగా పారీ్టలో ఉంటున్నామని, తమకు రాష్ట్రమంతా అనుచరులు ఉన్నందున కలుగజేసుకోవద్దంటే ఎలా అని వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన వాళ్లు నిర్ణయాలు తీసుకుంటుంటే తాము పట్టించుకోకుండా ఎలా ఉంటామని, బరాబర్ కలుగజేసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యలో కలుగజేసుకున్న వేణుగోపాల్ నేతలందరూ సమన్వయంతో పనిచేసి ఈనెల 15లోపు మండల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ గురించి కసరత్తు చేస్తున్నామని చెప్పగా అన్ని వర్గాల డిక్లరేషన్లనూ పూర్తి చేయాలని వేణుగోపాల్ సూచించారు. చదవండి: Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42 ఆరు సభలు... సోనియా,రాహుల్, ప్రియాంక రాక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పలు వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించడం కోసం ఆరు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నేతలు పీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సభలకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్యలను ఆహ్వానించాలని, సమయాన్నిబట్టి ఒక్కో సభకు ఒక్కో జాతీయ నేతను తీసుకురావాలని, రాహుల్ వీలైనన్ని సభలకు వచ్చేలా చూడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15 లోగా 3 బహిరంగ సభలు: షబ్బీర్ అలీ పీఏసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్తో కలసి పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడారు. పార్టీ గెలుపునకు కేసీ వేణుగోపాల్ కీలక సూచనలు చేశారని చెప్పారు. గిరిజన దినోత్సవం రోజున తండాలలో బస చేయాలని, రాష్ట్రంలో భూ కుంభకోణాలు, అమ్మకాలపై చార్జిషీట్ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15లోగా జహీరాబాద్, మహబూబ్నగర్, నల్లగొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు కె.సి.వేణుగోపాల్కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
అరవింద్ కేజ్రీవాల్ తగ్గేదే లే.. పంతం నెగ్గించుకున్న ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలంటూ ఎప్పటినుంచో కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. బీహార్ లో జరిగిన తొలి విడత విపక్షాల సమావేశానికి హాజరైన అరవింద్ కేజ్రివాల్ బెంగళూరులో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరు కావడంలేదని ముందు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో ఢిల్లీ కోరిన మద్దతు ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి పాల్గొంటుందని తెలిపాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ ససేమిరా.. ఢిల్లీ బ్యూరోక్రాసిపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మెజారిటీ పార్టీల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంతకాలం మద్దతు ఇవ్వకుండా మంకుపట్టు పట్టింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించదని తెలిపిన కాంగ్రెస్ గతంలో కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. మీతో వచ్చేది లేదు.. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసివచ్చేది లేదని ఇదివరకే ప్రకటించాయి ఆప్ వర్గాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాకాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కర్ణాటకలో జరగనున్న రెండో విడత విపక్షాల సమావేశాలకు హాజరయ్యే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఆప్ అధినేత. సరే కానివ్వండి.. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తమ పార్టీ ఎప్పుడూ ఆర్డినెన్సుకు వ్యతిరేకమేనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెలువడిన కొద్దీ గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. VIDEO | "I think they (AAP) are going to join the meeting tomorrow. As for the ordinance (on control of services in Delhi), our stand is very clear. We are not going to support it," says Congress general secretary KC Venugopal on the opposition meet, scheduled to be held in… pic.twitter.com/YdeUZYmPG5 — Press Trust of India (@PTI_News) July 16, 2023 ఎందుకీ తిప్పలు.. ఢిల్లీ పరిపాలన విధానాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ప్రతిపక్షాల మద్దతు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు చేసున్నారు. అధికార పార్టీకి మద్దతు భారీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభలో ఈ బిల్లు ఎలాగైనా ఆమోదం పొందుతుంది. ఎగువ సభ అయిన రాజ్యసభలో మాత్రం ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా అడ్డుకోవాలంటే ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల నాయకుల్ని ఒక్కొక్కరినీ కలిసి మద్దతు కూడగడుతూ వచ్చారు. తాజాగా ఆయన పట్టుదలకు కాంగ్రెస్ పార్టీ కూడా దిగివచ్చింది. Congress announces its unequivocal opposition to the Delhi Ordinance. This is a positive development. — Raghav Chadha (@raghav_chadha) July 16, 2023 ఇది కూడా చదవండి: ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు.. -
విపక్షాల భేటీ.. 17, 18 తేదీల్లో...?
న్యూఢిల్లీ: దేశంలో అధికార బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలు జూన్ 23న బిహార్ రాజధాని పాటా్నలో సమావేశమైన సంగతి తెలిసిందే. తదుపరి భేటీ ఈ నెల 17, 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం ట్వీట్ చేశారు. ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించాలన్నదే ధ్యేయమని, అందుకోసమే ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే విపక్ష కూటమి సంకల్పమని వివరించారు. వాస్తవానికి విపక్షాల సమావేశాన్ని ఈ నెల 13, 14న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తమ భేటీని 17, 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు. -
రాజస్థాన్ ముసలం: కాంగ్రెస్ హైకమాండ్ కీలక ప్రకటన
ఢిల్లీ: రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన నాలుగు గంటల సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసింది. ‘‘ఇక మీద నుంచి ఇద్దరూ కలిసికట్టుగా పని చేస్తార’’ని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియా ముందు ప్రకటించారు. ‘‘ఇద్దరు నేతలూ ఏకగ్రీవంగా పని చేసేందుకు అంగీకరించారు. అలాగే కీలక నిర్ణయాన్ని హైకమాండ్కు వదిలేశారు’’ అని ప్రకటించారు కేసీ వేణుగోపాల్. అయితే.. జరిగిన చర్చల పూర్తి సారాంశం ఏమిటి? ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య ఒప్పందం.. లేదంటే బాధ్యతల అప్పగింత ఏంటన్నదాని గురించి మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ల నడుమ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో.. తాజాగా సొంత ప్రభుత్వంపైనే పైలట్ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్య ‘డెడ్లైన్’ల శపథాలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. పరిస్థితి చేజారకూడదనే ఉద్దేశంతో.. ఇద్దరినీ హస్తినకు పిలిపించుకున్న అధిష్టానం సోమవారంనాడు సమాలోచనలు జరిపింది. ఈ సందర్భంగా.. కర్ణాటక రిఫరెన్స్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కలిసి కట్టుగా పోరాడితేనే ఫలితం దక్కుతుందనే విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం విషయంలో.. ఆప్కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్ -
మరో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో భారీ విజయం సాధించి మంచి జోరుమీద ఉన్న కాంగ్రెస్ అదే ఊపును జాతీయ ఎన్నికల్లో కొనసాగించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మరో భారత్ జోడో యాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో భారీ విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై గట్టిగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఈ ఫలితాలు ప్రతిపక్ష ఐక్యతకు సందేశం మాత్రమే గాక జాతీయ స్థాయిలో మనం కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలతో సైద్ధాంతిక విభేదాలతో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అయితే తాము కేరళలో సీపీఎంతో లేదా తెలంగాణ బీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోలేమని తేల్చి చెప్పారు. అయితే ఈ పొత్తు ఎన్నికల తర్వాత లేదా ఒక్కోసారి ముందస్తుగా కూడా ఉండొచ్చన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. దీని గురించి ఖర్గేని ప్రశ్నించకండి, పుకార్లను నమ్మవద్దని అన్నారు. రాజస్తాన్లోని కాంగ్రెస్ నాయకుల మధ్య రగులుతున్న వివాదాన్ని సైతం క్రమబద్ధీకరిస్తాం అని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో ఇదే జోరుని కొనసాగించేలా దేశవ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తాము ఈసారి తూర్పు నుంచి పడమర వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. గతేడాది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించి, బీజేపీని సునాయాసంగా మట్టికరిపించిందన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అతని పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను రూపొందించేలా ఈ ఫలితం ప్రతిపక్ష కూటమి ఓ కొత్త ఊపునిచ్చిందని వేణుగోపాల్ అన్నారు. (చదవండి: నెక్స్ట్ ప్రధాని రాహుల్! దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు: ప్రియాంక గాంధీ) -
ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్ తేల్చిచెప్పారు. -
రాజకీయ వ్యవహారాల ఉపకమిటీలో ఉత్తమ్కు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) 85 వప్లీనరీ సమావేశాలకు ముసాయిదా కమిటీతోపాటు వివిధ అంశాల్లో ఉపకమిటీలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా వీరప్పమొయిలీ, కన్వీనర్గా అశోక్ చవాన్తోపాటు 20 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డితోపాటు మాణిక్యం ఠాగూర్కు చోటుకల్పించారు. ముసాయిదా కమిటీ చైర్మన్గా జైరాం రమేశ్, కన్వీనర్గా పవన్ ఖేరాతోపాటు మరో 21 మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఇందులో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు సీనియర్ నేత కొప్పుల రాజుకు అవకాశం కల్పించారు. ఆర్థిక వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా చిదంబరం, కన్వీనర్గా గౌరవ్ వల్లబ్తోపాటు 14 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సంజీవరెడ్డి, జేడీ శీలంకు అవకాశం ఇచ్చారు. అంతర్జాతీయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా సల్మాన్ ఖుర్షీద్, కన్వీనర్గా శశిథరూర్తోపాటు 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి పల్లంరాజుకు ఈ కమిటీలో చోటు కల్పించారు. రైతులు–వ్యవసాయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా భూపేందర్ సింగ్ హుడా, కన్వీనర్గా రఘువీరారెడ్డితోపాటు 14 మంది సభ్యులు ఉన్నారు. సామాజిక న్యాయం సాధికారత వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా ముకుల్ వాస్నిక్, కన్వీనర్గా కొప్పుల రాజుతోపాటు 16 మంది సభ్యులు ఉన్నారు. -
‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు!
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా భారత్ జోడో యాత్రను మూడు రోజులకే ఆపేయాలనుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వేణు గోపాల్ శనివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన రాహుల్..యాత్రలో తన బదులుగా మరొకరిని పెట్టాలనుకున్నారని కూడా ఆయన చెప్పారు. తన స్థానంలో సీనియర్ నేతలెవరికైనా ఆ బాధ్యతలను అప్పగించాలని సోదరి ప్రియాంకా గాంధీకి చెప్పారన్నారు. కన్యాకుమారి నుంచి యాత్ర మొదలైన మూడు రోజులకే రాహుల్ మోకాలి నొప్పి తీవ్రమైందన్నారు. అయితే, దేవుడి దయతో ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. రాహుల్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర జనవరి 30న జమ్మూలో ముగిసిన విషయం తెలిసిందే. -
కాశ్మీర్లో బాంబు పేలుళ్లు.. రాహుల్ యాత్రపై వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్లోని నర్వాల్ వద్ద శనివారం ఉదయం బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో వరుస పేలుళ్ల ధాటికి తొమ్మిది మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ బాంబు దాడికి ఉగ్రవాదలు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వరుస బాంబు దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రపై టెన్షన్ నెలకొంది. భారత్ జోడో యాత్ర ముందే ఇలా బాంబు దాడులు జరగడంతో రాహుల్ యాత్ర కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాడి జరిగిన నర్వాల్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు, అమ్మకాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్రపై సంగ్ధిదం నెలకొంది. కాగా, భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమలో కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ప్రణాళిక ప్రకారమే జమ్మూ కాశ్మీర్లో భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. యాత్ర ప్రారంభానికి రెండు వారాల ముందుగానే నేను లెప్ట్నెంట్ గవర్నర్ను కలిశాను. భద్రత విషయంపై ఆయనతో చర్చించాను. జమ్మూ కాశ్మీర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భద్రతా సిబ్బందితో నిరంతరం టచ్లోనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం వారి బాధ్యత. రాహుల్ యాత్ర ఎట్టిపరిస్థితుల్లో కొనసాగుతుంది. భద్రత విషయం భద్రతా సిబ్బంది చూసుకుంటారు’ అని స్పష్టం చేశారు. "2 weeks before yatra began, I met J&K L-G & all our leaders in J&K are in constant touch with the security personnel. It is their responsibility to take care of such incidents. #BharatJodoYatra will continue no matter what" : KC Venugopal, #Congress General Secretary (ANI) pic.twitter.com/l2Ou8Bc8uA — NewsMobile (@NewsMobileIndia) January 21, 2023 -
ఆజాద్ పార్టీకి షాక్.. తిరిగి కాంగ్రెస్ గూటికి 17 మంది కశ్మీర్ నేతలు..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం గులాంనబీ ఆజాద్తో కలిసివెళ్లిన 17 మంది సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వీరంతా సొంతగూటికి చేరుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లోకి ప్రవేశించడానికి రెండు వారాల ముందు వీరంతా మళ్లీ కాంగ్రెస్లోకి రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్నిస్తోంది. సొంతగూటికి వచ్చిన 17 మంది కాంగ్రెస్ నాయకుల్లో కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, పీసీసీ మాజీ చీఫ్ పీర్జాద మహమ్మద్ సయీద్ వంటి ముఖ్య నాయకులున్నారు. వీరంతా రెండు నెలల క్రితం గులాం నబీ ఆజాద్తో కలిసి కాంగ్రెస్ను వీడి వెళ్లారు. ఆయన స్థాపించిన కొత్త పార్టీలో చేరారు. అయితే పార్టీలో తమకు విలువ ఇవ్వడం లేదని, ఆయనను నమ్మి మోసపోయామని కొద్ది రోజుల క్రితమే వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ పార్టీ నుంచి కొందరు సస్పెండ్ కూడా అయ్యారు. శుక్రవారం మొత్తం 19 మంది కశ్మీర్ నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరాల్సి ఉంది. అయితే ఇద్దరు కశ్మీర్ నుంచి ఢిల్లీ రాలేకపోయారు. గులాం నబీ ఆజాద్ కూడా తిరిగి కాంగ్రెస్లోకి వస్తారా? అని కేసీ వేణుగోపాల్ను ప్రశ్నించగా.. తనకు ఆయన గురించి ఏమీ తెలియదని చెప్పారు. కాంగ్రెస్ సిద్దాంతాలను నమ్మేవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చని స్పష్టం చేశారు. చదవండి: ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్.. -
టీపీసీసీ ‘జంబో జట్టు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ.. జంబో జట్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇందులో 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అ«ధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 17 మంది సభ్యులు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేగాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చైర్మన్గా 40 మందితో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. ఇదీ జాబితా.. రాజకీయ వ్యవహారాల కమిటీ(22) : మాణిక్యం ఠాగూర్ (చైర్మన్), రేవంత్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర సి. రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఎండీ అజారుద్దీన్, అంజన్కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్కుమార్ గౌడ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (40) .. రేవంత్రెడ్డి (చైర్మన్), మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, డి.శ్రీధర్బాబు, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్రెడ్డి, ఎ.సంపత్ కుమార్, పి. సుదర్శన్రెడ్డి, ఆర్.దామోదర్రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, అంజన్కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్కుమార్ గౌడ్, డి.సీతక్క, పొదెం వీరయ్య, ఎ.మహేశ్వర్రెడ్డి, ప్రేమ్సాగర్రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్కుమార్, వేం నరేందర్రెడ్డి, మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని. టీపీసీసీ ఉపాధ్యక్షులు (24) .. పద్మావతిరెడ్డి, బండారు శోభా భాస్కర్, కొండ్ర పుష్పలీల, నేరెళ్ల శారదాగౌడ్, సీహెచ్.విజయ రమణారావు, చామల కిరణ్రెడ్డి, చెరుకు సుధాకర్గౌడ్, దొమ్మటి సాంబయ్య, శ్రవణ్కుమార్ రెడ్డి, ఎర్ర శేఖర్, జి.వినోద్, గాలి అనిల్కుమార్, హర్కర వేణుగోపాల్రావు, జగదీశ్వరరావు, మదన్మోహన్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పొట్ల నాగేశ్వరరావు, రాములు నాయక్, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్ యాదవ్, తాహెర్బిన్ హందాని. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు (84) .. మధుసూదన్రెడ్డి, అద్దంకి దయాకర్, బి.కైలాశ్కుమార్, బి.సుభాష్రెడ్డి, భానుప్రకాశ్రెడ్డి, బీర్ల ఐలయ్య, భూపతిగల్ల మహిపాల్, బొల్లు కిషన్, సీహెచ్. బాల్రాజు, చలమల కృష్ణారెడ్డి, చరణ్కౌషిక్ యాదవ్, చారుకొండ వెంకటేశ్, చేర్యాల ఆంజనేయులు, చిలుక మధుసూదన్రెడ్డి, చిలుక విజయ్కుమార్, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్ తాండూర్, సుధాకర్ యాదవ్, దుర్గం భాస్కర్, ఈ.కొమురయ్య, ఎడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్, ఫిరోజ్ఖాన్, గడుగు గంగాధర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గోమాస శ్రీనివాస్, గౌరీ శంకర్, జానంపల్లి అనిరుధ్రెడ్డి, జెరిపేటి జయపాల్, కె.నాగేశ్వరరెడ్డి, కైలాష్ నేత, కాటం ప్రదీప్కుమార్ గౌడ్, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్రెడ్డి, కోటూరి మానవతారాయ్, కుందూరు రఘువీరారెడ్డి, ఎం.నాగేశ్ ముదిరాజ్, ఎం.వేణుగౌడ్, ఎం.ఎ. ఫహీం, మొగల్గుండ్ల జయపాల్రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఫహీం, ఎన్.బాలు నాయక్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ, పి.హరికృష్ణ, పి.ప్రమోద్ కుమార్, పి.రఘువీర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి, పిన్నింటి రఘునాథ్రెడ్డి, ప్రేమ్లాల్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, నర్సాపూర్ రాజిరెడ్డి, రాంగోపాల్రెడ్డి, రంగినేని అభిలాశ్రావు, రంగు బాలలక్ష్మిగౌడ్, రాపోలు జయప్రకాశ్, ఎస్.ఎ. వినోద్కుమార్, సంజీవ ముదిరాజ్, సత్తు మల్లేశ్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్ చెక్లోకర్, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణరెడ్డి, వెడ్మ భొజ్జు, వెన్నం శ్రీకాంత్రెడ్డి, వీర్లపల్లి శంకర్, జహీర్ లలాని, భీమగాని సౌజన్యగౌడ్, లకావత్ ధన్వంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్, జువ్వాడి ఇంద్రారావు, కందాడి జ్యోత్స్న శివారెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితారెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కుచన రవళిరెడ్డి, శశికళా యాదవ్, సింగారపు ఇందిర, ఉజ్మా షకీర్ జిల్లా అధ్యక్షులు (26) : సాజిద్ ఖాన్ (ఆదిలాబాద్), పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.రాజేందర్రెడ్డి(హనుమకొండ), వలీయుల్లా సమీర్ (హైదరాబాద్), ఎ.లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల). పటేల్ ప్రభాకర్రెడ్డి (జోగుళాంబ గద్వాల), కైలాశ్ శ్రీనివాస్రావు (కామారెడ్డి), కె.సత్యనారాయణ (కరీంనగర్), రోహిన్రెడ్డి (ఖైరతాబాద్), జె.భరత్చంద్రారెడ్డి(మహబూబాబాద్), జి.మధుసూదన్రెడ్డి (మహబూబ్నగర్), కె.సురేఖ (మంచిర్యాల), టి.తిరుపతిరెడ్డి (మెదక్), నందికంటి శ్రీధర్ (మేడ్చల్ మల్కాజ్గిరి), ఎన్.కుమారస్వామి (ములుగు), సి.వంశీకృష్ణ (నాగర్కర్నూల్), టి.శంకర్నాయక్(నల్లగొండ), శ్రీహరి ముదిరాజ్ (నారాయణపేట), ప్రభాకర్రెడ్డి (నిర్మల్), మానాల మోహన్రెడ్డి (నిజామాబాద్), ఎం.ఎస్. రాజ్ఠాకూర్ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల), టి.నర్సారెడ్డి (సిద్దిపేట), టి.రామ్మోహన్రెడ్డి (వికారాబాద్), ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్ (వనపర్తి), కె.అనిల్కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి) -
తెలంగాణలో రోజంతా నడుద్దామా?.. రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: యాభై రెండేళ్ల వయసు.. చుట్టూ వందలు, వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు.. పెద్ద ఎత్తున పోలీసు భద్రత... ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి వేగంగా, వడివడిగా రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అనూహ్య ప్రతిపాదనను తీసుకువచ్చారు. రోజంతా విరామం లేకుండా ‘వాకింగ్ మారథాన్’చేద్దామని, ఒక్కరోజులో వీలున్నన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్దామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అన్నారు. రాహుల్గాంధీ చేసిన ఈ అనూహ్య ప్రతిపాదనతో నిర్ఘాంతపోవడం అక్కడే ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరుల వంతయింది. 100 కి.మీ రికార్డు యోచనలో రాహుల్? మంగళవారం టీ బ్రేక్ సమయంలో రాహుల్గాంధీ చేసిన ఈ మారథాన్ ప్రతిపాదనకు ఎలా స్పందించాలో అర్ధం కాక వేణుగోపాల్, రేవంత్రెడ్డిలు కొంతసేపు మౌనంగా ఉన్నారని సమాచారం. ఆ తర్వాత తేరుకున్న రేవంత్రెడ్డి ‘విరామం లేకుండా వాకింగ్ మారథానా?.. ఇప్పటికే మీ వేగాన్ని అందుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్రలోకి వెళ్లి నాందేడ్ దాటిన తర్వాత మీరు మారథాన్కు ప్లాన్ చేసుకోండి.’అని రాహుల్తో సరదాగా వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలతో కేసీ వేణుగోపాల్ కూడా ఏకీభవించడంతో ప్రస్తుతానికి వాకింగ్ మారథాన్ ప్రతిపాదనను రాహుల్ పక్కన పెట్టారని, కశ్మీర్ వరకు వెళ్లేలోపు కచ్చితంగా ఆయన మారథాన్ చేస్తారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమవుతోందని, ఈ నేపథ్యంలోనే ఒకేరోజు దాదాపు 100 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాలన్నది రాహుల్ ఆలోచన అయి ఉంటుందని చెబుతున్నారు. 8 రోజులు.. 170కి పైగా కిలోమీటర్లు ఈ నెల 23వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా కృష్ణా మండలం గూడేబల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్గాంధీ బుధవారం నాటికి ఎనిమిది రోజుల్లో 170కి పైగా కిలోమీటర్లు నడిచారు. తొలి రోజు కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే నడిచిన ఆయన మిగిలిన ఏడు రోజుల్లోనే 166 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం గమనార్హం. అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ పాదయాత్ర అంటే కేవలం నడుచుకుంటూ వెళ్లడమే కాదు. దారిలో కనిపించిన వారందరినీ పలకరించుకుంటూ రాహుల్ యాత్ర సాగుతోంది. ఆయన ఉదయం, సాయంత్రం నడిచే సమయంలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన ముందూ, వెనుకా నడుస్తున్నారు. ముందు భాగంలో పోలీసులు ఏర్పాటు చేసిన వలయంలో నడుస్తున్న రాహుల్.. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తనతో కలిసి నడుస్తున్న వారిలో కొందరిని దగ్గరకు పిలిచి మాట్లాడుతున్నారు. దారిలో వచ్చే గ్రామాల్లో రోడ్డుకిరువైపులా, మిద్దెల మీద, చెట్లు, వాహనాలపైనా తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలందరినీ రాహుల్ పలకరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలల విద్యార్థులు, కూలీలు, బస్సులు, ఇతర వాహనాల్లో వెళుతున్న ప్రయాణికుల వద్దకు ఆయనే వెళ్లి మాట్లాడుతున్నారు. పరుగెత్తడం, బస్సు ఎక్కడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, జిమ్నాస్టిక్స్, కళారూపాలను వీక్షించడం లాంటివి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నడిచే సమయంలోనే కలుస్తున్నారు. విశ్రాంతి, విసుగు లేకుండా.. మధ్యాహ్నం విశ్రాంతి సమయంలోనూ పలువురిని కలుస్తున్న రాహుల్గాంధీ వారితో కూడా ఆప్యాయంగా వ్యవహరిస్తున్నారు. తనను కలిసేందుకు వెళ్లినవారితో కలివిడిగా మాట్లాడడమే కాకుండా వారి సమస్యలను శ్రద్ధగా వినడం, వారి కుటుంబ పరిస్థితులను ఆరా తీయడం, పిల్లల చదువుల గురించి అడగడం, చిన్నారులను దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. మొత్తం మీద పాదయాత్రను రాహుల్ జనాకర్షకంగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెక్యూరిటీ కారణాల రీత్యా కూడా రాహుల్ పాదయాత్ర వేగంగా సాగుతోందని పోలీసులు చెబుతుండగా.. 3,750 కిలోమీటర్లు 150 రోజుల్లో నడవాలి కదా, ఆమాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? అంటూ ఆయనతో కలిసి నడుస్తున్నవారు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
Bharat Jodo Yatra: తెలంగాణలో నవంబర్ 7న ముగింపు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి నవంబర్ 6 వరకు ఈ యాత్ర జరగాల్సి ఉంది. కానీ, తాజామార్పుల ప్రకారం యాత్ర రాష్ట్రంలో నవంబర్ 7న ముగియనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23న ఉద యం 11 గంటలకు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడబెల్లూరులో రాహుల్గాంధీ తెలంగాణలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మక్తల్ వరకు ఆ రోజు యాత్ర సాగిస్తారు. ఆ తర్వాత దీపావళి సందర్భంగా 3 రోజులు యాత్రకు విరామం ఇచ్చి, 27న మక్తల్ నుంచి తిరిగి ప్రారంభిస్తారు. ఆరోజు నుంచి నవంబర్ 3 వరకు యాత్ర జరగనుండగా, 4న విరామం తీసుకోనున్నారు. మళ్లీ 5న మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం చొట్కూరు వద్ద యాత్రను ప్రారంభించి 7వ తేదీ సాయంత్రం ఏడుగంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని షాపూర్ మీర్జాపూర్ హనుమాన్ గుడి వద్దకు చేరుకోవడంతో యాత్ర రాష్ట్రంలో ముగియనుంది. అక్కడి నుంచి ఆయన మహారాష్ట్రకు వెళతారు. ఫారెస్ట్లో.. పది కిలోమీటర్లు తాజా షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల మేర రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో యాత్ర చేయనున్నారు. నవంబర్ 7న ఉదయం జగన్నాథపల్లెలోని జుక్కల్చౌరస్తా వద్ద యాత్రను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, రిజర్వ్ ఫారెస్టు గుండా ప్రయాణించి షాపూర్గేట్ వద్దకు చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో 11 చోట్ల జరిగే (కార్నర్ మీటింగ్లు) సమావేశాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ అసహనం
-
రేవంత్పై అసహనం.. రాహుల్ యాత్రను టీపీసీసీ లైట్ తీసుకుందా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ముందుకు సాగుతున్నారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతానికి ఏపీకి చేరుకుంది. ఇక, అక్టోబర్ 23న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరుకోనుంది. ఈ తరుణంలో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై ఇందిరా భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ తీరుపై వేణుగోపాల్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. యాత్రకు సంబంధించి ఎక్కడా కూడా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో, తేరుకున్న టీపీసీసీ దిద్దుబాటు చర్యలు దిగింది. కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో టీపీసీసీలో కదిలిక వచ్చినట్టు తెలుస్తోంది. భారత్ యాత్ర ఏర్పాట్లపై 10 రకాల కమిటీలను వేసేందుకు పార్టీ సమాయత్తం అయినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రానికి కమిటీల గురించి టీపీసీసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కమిటీల్లో ముఖ్యంగా అలంకరణ కమిటీ, ట్రాఫిక్ అండ్ పార్కింగ, మౌలిక వసతులు, పబ్లిక్ మొబిలైజేషన్, మీడియా మేనేజ్మెంట్ కమిటీలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలో కాంగ్రెస్ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
‘భారత్ జోడో యాత్ర’ 7 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల మీదుగా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’రాష్ట్రంలో 15 రోజులపాటు 375 కి.మీ. సాగనుంది. ఈ మేరకు రూపొందించిన షెడ్యూల్, రూట్మ్యాప్లను టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఆమోదించింది. గురువారం సాయంత్రం ఇందిరాభవన్లో జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవగా ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీతోపాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్ర సాగే రూట్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ నెల 23న నారా యణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే యాత్ర 7 పార్లమెంటు నియోజకవర్గాలు, 16 శాసనసభా సెగ్మెంట్ల మీదుగా సాగనుంది. మహబూబ్నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల మీదుగా సాగే ఈ పాద యాత్ర హైదరాబాద్ పరిధిలో 60 కి.మీ. మేర నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 31న శంషా బాద్ నుంచి ఆరాంఘర్ మీదుగా హైదరాబాద్లోకి ప్రవేశించే రాహుల్ పాదయాత్ర... చార్మినార్ నుంచి గాంధీభవన్, నెక్లెస్రోడ్డు, బోయినపల్లి వరకు చేరుకోనుంది. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని 31న నెక్లెస్రోడ్డు వద్ద బహిరంగ సభ జరగనుంది. ఆ రోజు రాత్రి బోయిన్పల్లిలోని గాంధీ ఐడి యాలజీ సెంటర్లో రాహుల్ రాత్రి బస చేస్తారు. నవంబర్ 1న బాలానగర్, కూకట్పల్లి, పటాన్చెరు మీదుగా ఓఆర్ఆర్ వద్ద ముత్తంగి నుంచి సంగారెడ్డిలోకి ప్రవేశించే లా మ్యాప్ రూపొందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాదయాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన వేణుగోపాల్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, అంజన్కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. పార్టీ ఐక్యతను చాటండి రాహుల్ చేపట్టిన పాదయాత్రను తెలంగాణలో విజ యవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోరారు. టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీ లో ఆయన మాట్లాడు తూ.. తెలంగాణలో కాంగ్రె స్ ఐక్యంగా ఉందని ఈ యా త్ర ద్వారా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 375 కి.మీ.పాటు సాగే పాదయాత్రలో అన్ని వ ర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. యాత్రపై విస్తృతంగా ప్రచారం చేయాలని.. బీజేపీ, సంఘ్ పరివార్ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రాహుల్ పాదయాత్ర రూట్మ్యాప్... ►ఈ నెల 23న కర్ణాటక–నారాయణపేట జిల్లా సరిహద్దునున్న కృష్ణా నది బ్రిడ్జి నుంచి మక్తల్ వరకు.. ►24, 25 దీపావళి నేపథ్యంలో యాత్రకు విరామం ►26న మక్తల్–దేవరకద్ర ►27న దేవరకద్ర–మహబూబ్నగర్ పట్టణం ►28న మహబూబ్నగర్–జడ్చర్ల ►29న జడ్చర్ల–షాద్నగర్ ►30న షాద్నగర్–శంషాబాద్ (29 కి.మీ.) ►31న శంషాబాద్ నుంచి ఆరాంఘర్–చార్మినార్–గాంధీభవన్–నెక్లెస్రోడ్డు–బోయిన్పల్లి ►నవంబర్ 1న బాలానగర్–కూకట్పల్లి–పటాన్చెరు మీదుగా ముత్తంగి ►నవంబర్ 2న పటాన్చెరు నుంచి శివంపేట (సంగారెడ్డి) ►నవంబర్ 3 యాత్రకు విరామం ►నవంబర్ 4న సంగారెడ్డి నుంచి జోగిపేట ►నవంబర్ 5న జోగిపేట–శంకరంపేట ►నవంబర్ 6న శంకరంపేట నుంచి మద్నూర్ -
గెహ్లోత్ వర్గంపై హైకమాండ్ సీరియస్..!
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలపై బహిరంగ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ సెంట్రల్ లీడర్ కేసీ వేణుగోపాల్ లేఖ పంపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు నుంచి గెహ్లోత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే హెచ్చరికలు పంపటం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇతర నేతలకు వ్యతిరేకంగా, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగ ప్రకటనలు చేయటానికి దూరంగా ఉండాలని పార్టీనేతలకు సూచిస్తున్నాం. ఎవరైనా హైకమాండ్ హెచ్చరికలను బేఖాతరు చేస్తే పార్టీ నిబంధనల మేరకు కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని లేఖ రాశారు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్. సచిన్ పైలట్ వర్గం నేత వేద్ ప్రకాశ్ సొలంకిపై ఆరోపణలు చేస్తూ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ధర్మేంద్ర రాథోడ్ ఓ వీడియో విడుదల చేయటంపై ఇప్పటికే క్రమశిక్షణ నోటీసులు ఇచ్చింది హైకమాండ్. ఈ అంశంపై గెహ్లోత్ వర్గం విలేకరుల సమావేశం నిర్వహించిన కొద్ది సేపటికే.. హెచ్చరిక లేఖ పంపారు కేసీ వేణుగోపాల్. ఇదీ చదవండి: దిగ్విజయ్తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు -
రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్
సాక్షి,న్యూఢిల్లీ: రాజస్థాన్లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. గహ్లోత్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే పార్టీ పరిశీలకునిగా వెళ్లిన మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ వారితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. అయితే గహ్లోత్ వర్గీయులు పైలట్కు సీఎం పదవి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి. దీంతో ఖర్గే, అజయ్ మాకెన్ తిరిగి ఢిల్లీకి పయనమవుతున్నారు. మరోవైపు రాజస్థాన్లో అనూహ్య పరిణామాలను రాహుల్ గాంధీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే హుటాహుటిన కేసీ వేణుగోపాల్ను ఢిల్లీకి పంపారు. ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానం బావిస్తోంది. అసమ్మతి వర్గంలోని ఒక్కో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పరిశీలకులు ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది. అయితే ఎమ్మెల్యేలంతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ ఇళ్లకు వెళ్లారని, ఇవాళ ఎవరితోనూ భేటీ అయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైవు ఇవాళ సాయంత్రం సోనియా గాంధీతో కాంగ్రెస్ పరిశీలకులు, కేసీ వేణుగోపాల్ సమావేశం అవుతారని, ఆ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో పైలట్ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే గహ్లోత్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ వర్గానికి చెందిన వారినే సీఎం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షోభానికి దారితీసింది. బీజేపీ సెటైర్లు.. ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుంటే.. మరోవైపు రాజస్థాన్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చోడో అంటున్నారని బీజేపీ సెటైర్లు వేసింది. దేశాన్ని ఏకం చేయడం కాదు రాహుల్, ముందు మీ ఎమ్మెల్యేలను ఏకం చెయ్ అని ఎద్దేవా చేసింది. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!
జైపూర్: 90 మందికిపైగా ఎమ్మెల్యేల రాజీనామాతో రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్ తన చేతుల్లో ఏమీలేదని, ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్తో గహ్లోత్ ఫోన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేకే వేణుగోపాల్ మాత్రం దీన్ని ఖండించారు. అసలు గహ్లోత్తో తాను ఫోన్లో మాట్లాడలేదేని చెప్పారు. గహ్లోత్ తనుకు గానీ, తాను గహ్లోత్కు గానీ ఫోన్ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్లో తలెత్తిన సమస్యను అధిష్ఠానం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్.. సీఎంగా తప్పుకోవడానికి వీల్లేదని ఆయన వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఒకవేళ గహ్లోత్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో తమ వర్గానికి చెందిన నేతనే సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సచిన్ పైలట్ను మాత్రం సీఎం చేయవద్దని తేల్చిచెప్పారు. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఆయనను సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానంతోనే చర్చిస్తామన్నారు. ఆదివారం సీఎల్పీ సమావేశానికి ముందే ఈ పరిణామం జరగడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్కు గురిచేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్.. మొదట రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలు ఒకరికి ఒకే పదవి అని ఉదయ్పూర్ డిక్లరేషన్ను గుర్తుచేశారు. దీంతో అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేయడానికి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని, కొత్త సీఎంగా సచిన్ పైలట్ బాధ్యతలు చేపడతాని ప్రచారం జరిగింది. గహ్లోత్ వర్గం దీన్ని వ్యతిరేకించడంతో సంక్షోభ పరిస్థితి తలెత్తింది. చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్దే విజయం..
అహ్మదాబాద్: గుజరాత్లో బీజేపీ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అంచనా వేశారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులతో 12 గంటల మారథాన్ సమావేశంలో మాట్లాడుతూ కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఎన్నికల పరిశీలకుడు అశోక్ గహ్లోత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్లో ఇటీవల కల్తీమద్యం కారణంగా చాలా మంది చనిపోయిన విషయాన్ని కూడా వేణుగోపాల్ ప్రస్తావించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు కూడా ఎక్కువయ్యాయని ఆరోపించారు. గజరాత్ ప్రభుత్వం అవినీతి, అసమర్థంగా మారిందని ధ్వజమెత్తారు. అందుకే గతేడాది మంత్రివర్గం మొత్తాన్ని మార్చారని పేర్కొన్నారు. ఇటీవలే ఇద్దరు బీజేపీ నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్లో 90 రోజుల ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ బుధవారం ప్రారంభించింది. ఈ సారి ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నామని, అందరం ఐకమత్యంతో పోరాడుతామని వేణుగోపాల్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపదని అంతా అనుకున్నారని కానీ కొద్ది సీట్ల తేడాతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. ఈసారి బీజేపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందున కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు -
సోలార్ స్కాంలో కాంగ్రెస్ ఎంపీని ప్రశ్నించిన సీబీఐ!
న్యూఢిల్లీ: కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ను సీబీఐ ప్రశ్నించింది. లైంగికంగా వేధించారంటూ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన మహిళ చేసిన ఆరోపణలపై ఆయన స్టేట్మెంట్ నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి వేణుగోపాల్తో పాటు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ, హిబి ఈడెన్, మాజీ మంత్రి ఏపీ అనిల్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్, బీజేపీ లీడర్ ఏపీ అబ్దుల్లా కుట్టీలపై కేసు నమోదైంది. 2012, మే నెలలో జరిగిన సంఘటనపై కేసీ వేణుగోపాల్ను ప్రశ్నించింది సీబీఐ. ఈ కేసును తొలుత కేరళ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు విచారణ గతేడాది సీబీఐకి బదిలీ అయింది. ఇదీ చదవండి: కాంగ్రెస్కు ఆజాద్ షాక్.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా! -
మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి ప్రెస్మీట్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు పిలుపునిచ్చారు. బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పదని అన్నారు. అభ్యర్థి ఎవరు? కేసీ వేణుగోపాల్తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె స్రవంతితోపాటు గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలించినట్టు సమాచారం. సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన రియల్టర్ కృష్ణారెడ్డిని బరిలో దింపే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఎవరు పోటీచేసినా గెలిపించే బాధ్యతను నల్లగొండ జిల్లా నాయకత్వమే చూసుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. ఉప ఎన్నిక కోసం కమిటీ రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యే నేపథ్యంలో.. ప్రత్యేక వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో.. నేతలు రాంరెడ్డి దామోదర్రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్కుమార్ యాదవ్, సంపత్కుమార్, ఈరవత్రి అనిల్లను సభ్యులుగా నియమిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పారు. (క్లిక్: రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి) సస్పెండ్ చేస్తారనే..! రాజగోపాల్ రాజీనామా ప్రకటనపై కాంగ్రెస్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీకి విధేయుడైన నాయకుడిని కోల్పోయామని కొందరు అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతోనే రాజీనామా ప్రకటన చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా.. మంగళవారం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అధిష్టానం నుంచి సమాచారం అందిందని, ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. (క్లిక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?) -
కాంగ్రెస్లో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వట్లేదని, పార్టీ విధానానికి అనుగుణంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్ముందు పార్టీలో పెద్దఎత్తున చేరికలు ఉంటాయని, వాటిపై వ్యూహాత్మకంగా సాగుతున్నామని అన్నారు. అయితే పార్టీలో చేరేవారి గురించి ముందే మీడియాకు తెలియడంవల్ల వారిపై అధికార టీఆర్ఎస్ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని, అందువల్లే వారి గురించి ముందుగా బయటకు తెలియనివ్వట్లేదని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అనేక అంశాలపై నేతల్లో ఉన్న భిన్నాభిప్రాయాలను భేదాభిప్రాయాలుగా భావించాల్సిన అవసరంలేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పార్టీ సమస్యలను అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కలతో కలసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గంటకుపైగా జరిగిన భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితులు, ఇతర పార్టీల నేతల చేరికలు, రాష్ట్రంలో మరోసారి రాహుల్గాంధీ పర్యటన, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ గత ఏడాదిలో చేసిన సంస్థాగత కార్యక్రమాలు, టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు, విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ తదితర అంశాలపై చర్చ జరిగింది. గెలుపు ఒకటే ప్రాతిపదిక కాదు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఒకటే కాకుండా కాంగ్రెస్పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, విశ్వసనీయతను కూడా పరిగణనలోకి తీసుకొని టికెట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. పార్టీలో చేరాలనుకొనేవారికి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని, ఇప్పుడు బీఆర్ఎస్ పేరిట హడావుడి చేస్తున్నారని, ఇదంతా కేవలం మోదీ, బీజేపీలకు ఉపయోగపడటం కోసమేనని విమర్శించారు. మోదీకి అనుకూల పరిస్థితులు సృష్టించేందుకు విపక్షాలను చీల్చే ఉద్దేశంతో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కలలు కంటున్నట్లు తెలంగాణలో టీఆర్ఎస్కు మూడోసారి అవకాశం రాబోదని, వీలైనంత త్వరగా దానిని గద్దె దించి తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని పేర్కొన్నారు. పరేడ్గ్రౌండ్స్లో బీజేపీ చేసిన బలప్రదర్శన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ తమ బలప్రదర్శన చూపించాలని రేవంత్ సవాల్ విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే సభతో తెలంగాణ ప్రజలు ఎవరితో ఉన్నారో స్పష్టత వస్తుందని అన్నారు. పాతవారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గబోదు: భట్టి విక్రమార్క రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని భట్టి పేర్కొన్నారు. అయితే కొత్తవారిని చేర్చుకున్నంత మాత్రాన పాతవారికి పార్టీలో ప్రాధాన్యత ఏమాత్రం తగ్గబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నవారిని దశలవారీగా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్ఎస్, బీజేపీల దోస్తీ బయటపడిందని విమర్శించారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ సందర్భంగా బల ప్రదర్శన చూశాకే, హైదరాబాద్లో బీజేపీ బలప్రదర్శన చేసిందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. -
పోలీసుల ఓవరాక్షన్.. రాజ్యసభ ఎంపీకి చేదు అనుభవం
దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ధ భారీ సంఖ్యలో మోహరించారు. కాగా, రాహుల్ గాంధీకి మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే బందోబస్తులో ఉన్న ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో, కాంగ్రెస్ సీనియర్ నేతకు చేదు అనుభవం ఎదురైంది. నిరసన తెలుపుతూ.. ఈడీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ను పోలీసులు లాక్కెళ్లారు. ఆయనను ఎత్తుకెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించి తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆయన మండిపడ్డారు. This behaviour of Delhi Police with a sitting Rajya Sabha MP and AICC General Secretary @kcvenugopalmp ji is highly condemnable. pic.twitter.com/nWQ3btjxDP — Srinivas BV (@srinivasiyc) June 13, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కార్యాలయం వద్ద టెన్షన్.. టెన్షన్ -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముహుర్తం ఫిక్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 9న సమావేశం కానుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే నవ్ సంకల్ప్ శిబిర్పై ఇందులో చర్చిస్తారన్నారు. -
మేము లేకుండా బీజేపీని ఓడించలేరు
న్యూఢిల్లీ: తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ‘యూపీఏ ఎక్కడుంది’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ భాగస్వామం లేకపోతే ఆత్మలేని శరీరంలా యూపీఏ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. విపక్షాలు ఏకధాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమెందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి ప్రయోజనం కలిగేలా మమత బెనర్జీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. శరద్ పవార్ పరువు తీయడానికి ఆమె కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలమని కలలు కనడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. (చదవండి: యూపీఏ అన్నదే లేదు.. కాంగ్రెస్ పార్టీతో కలవలేం) కాంగ్రెస్ పార్టీ లేకుండానా? బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... ‘మా పోరాటం అధికార పార్టీ (బీజేపీ)పైనే. మాతో చేతులు కలపాలనుకునే వారు మాతో రావాలి, మాతో చేరకూడదనుకునే వారు స్వేచ్ఛగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన రాజకీయ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం లేకుండా ఉంటుందా?’ అని ప్రశ్నించారు. (చదవండి: మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?) బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపాలి: ఖర్గే కాంగ్రెస్ తలపెట్టిన వివిధ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని భాగస్వామి చేయడానికి ప్రయత్నించామని రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రతిపక్షాలు విడిపోయి తమలో తాము పోరాడుకోకుండా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని ఆయన కోరుకున్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా తగ్గించాలి
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను ఇంకా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు. శుక్రవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ...‘పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా ఏం తగ్గించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్డ్యూటీ రూ.9.48, డీజిల్పై రూ.3.56 ఉండేది. ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలి. ఎల్పీజీ రేట్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. నవంబర్ 14 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామ’ని అన్నారు. (చదవండి: పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం) కాగా, గతకొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు సతమతవుతున్నారు. చమురు ధరల అనూహ్య పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర సర్కారు స్వల్పంగా ఎక్సైజ్డ్యూటీ తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించింది. అయితే ఇంకాస్త తగ్గించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. (వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం.. ఎంతంటే?) -
‘ఆక్సిజన్ మరణాల’ పై తీవ్ర దుమారం: ఖండిస్తున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ ఈ ఏడు దేశాన్ని గజగజ వణికించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసులు రెండు లక్షలు దాటగా.. మృతుల సంఖ్య పదివేలు దాటడం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వైద్యారోగ్య సేవలు కరువయ్యాయి. ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ తీవ్రంగా వేధించింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక వందలాది మృతి చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరతతో ఎవరూ మృతి చెందలేదని తాజాగా మంగళవారం ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రకటన ‘పచ్చి అబద్ధం’ అని ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రకటనపై ఢిల్లీ, కర్ణాటక మంత్రులు స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఈ ప్రకటన ‘పూర్తి అవాస్తవం’ అని పేర్కొన్నారు. చాలా మరణాలు ఆక్సిజన్ కొరతతో సంభవించాయని బుధవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సత్యేందర్ జైన్ తెలిపారు. ఆక్సిజన్ కొరతతో మరణాలు లేకుంటే ఆస్పత్రులు ఎందుకు హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఆస్పత్రులు, మీడియా ఆక్సిజన్ కొరత వార్తలను చూస్తునే ఉన్నాయి. ఆక్సిజన్ మరణాలు సంభవిస్తున్నాయని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయా లేదా అని నిలదీశారు. కళ్లారా మరణాలను చూశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాగే ఉంటే త్వరలోనే కరోనా వైరస్ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని సత్యేందర్ జైన్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అయితే ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్క జిల్లాలోనే (చామరాజ్నగర్ జిల్లా ఆస్పత్రి) 36 మంది ఆక్సిజన్ కొరతతో మరణించారని ఓ నివేదిక ధర్మాసనానికి చేరింది. ఈ నివేదికను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్నారాయణ్ ఖండించారు. అవి ఆక్సిజన్ మరణాలు కాదని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో సంభవించిన మరణాలుగా అభివర్ణించారు. ‘ఆ మరణాలు ఆక్సిజన్తో జరగలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది’ అని తెలిపారు. ‘గుడ్డిగా కేంద్రం ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ప్రకటన’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘చాలామంది తమ ఆత్మీయులు, బంధువులను ఆక్సిజన్ కొరతతో కోల్పోయారు. ఆస్పత్రులు, మీడియా వీటిని రోజూ చూస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొరతతో మరణించారని టీవీల్లో ప్రసారాలు వచ్చాయి’ అని తెలిపారు. ఈ అంశంపై వేణుగోపాల్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని.. తప్పించుకునే ధోరణిలో చేసిన ప్రకటనగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కరోనా మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోవడానికి ఈ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు. -
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్ ఎంపికయ్యారు. ఆమె ఎన్నికను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీ ధృవీకరించడంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద సేవలను ఆయన ప్రశంసించారు. కాగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి రేసులో భవానీ రెడ్డి, ఇందిరా రావు, కాల్వ సుజాతలు ఉన్నప్పటికీ సునీతా ముదిరాజ్నే పదవి వరించింది. చదవండి: గవర్నర్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు -
జుకర్బర్గ్కు కాంగ్రెస్ మళ్లీ లేఖ
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి లేఖ రాసింది. సంస్థకు చెందిన భారతీయ విభాగం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ పదేపదే వస్తున్న ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఆ సంస్థ సీఈవో జుకర్బర్గ్ను ప్రశ్నించింది. ఫేస్బుక్ ఉద్యోగులు, అధికార బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇదే అంశంలో ఆగస్టు 17వ తేదీన కూడా జుకర్బర్గ్కు లేఖ రాసిన విషయం గుర్తు చేశారు. కొందరు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో నిబంధనలను ఫేస్బుక్ వర్తింపజేయలేదంటూ వాల్స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనంపై దర్యాప్తు చేయించాలంటూ అప్పట్లో కోరామన్నారు. ‘ఆగస్టు 27వ తేదీన టైమ్ మ్యాగజీన్లో వచ్చిన తాజా కథనంలో ఫేస్బుక్ ఇండియా– అధికార బీజేపీ మధ్య క్విడ్–ప్రొ–కో లింకులున్నాయన్న ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారంతోపాటు ఆధారాలు కూడా ఉన్నాయి. 17వ తేదీన మేం రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరంగా తెలపాలని తాజా లేఖలో ఫేస్బుక్ను కోరాం’అని వేణుగోపాల్ వివరించారు. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా, ఏఐసీసీ డేటా అనలిస్టిక్స్ విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ సూచించే చర్యలను ఫేస్బుక్ అమలు పరిచే వరకు, విచారణ పూర్తయ్యేవరకు ఫేస్బుక్ ‘పేమెంట్ ఆపరేషన్స్’కు అనుమతి ఇవ్వరాదన్నారు. భారత విభాగం ఉద్యోగులపై చేపట్టిన దర్యాప్తులో తేలిన విషయాలను ఫేస్బుక్ బహిర్గతం చేయాలని కూడా వారు కోరారు. టైమ్ మ్యాగజీన్ కథనంతో బీజేపీ–వాట్సాప్ సంబంధాలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘వాట్సాప్కు 40 కోట్ల మంది భారతీయ వినియోగదారులున్నారు. ఈ యాప్ కూడా చెల్లింపుల వేదికగా మారాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. ఇదే అదనుగా వాట్సాప్పైనా బీజేపీ అదుపు సాధించింది’అని ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు. టైమ్ మ్యాగజీన్ కథనాన్ని జత పరిచారు. -
పెట్రో ధరల పెంపు, కాంగ్రెస్ నిరసన బాట
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టనుంది. పెంచిన పెట్రో ధరలను వెనక్కితీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించనున్నారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడం పట్ల నిరసన తెలుపుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో పెట్రో ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అసాధారణ భారం మోపినతీరును ఎండగడతామని చెప్పారు. ఇక జూన్ 30 నుంచి వారం రోజుల పాటు తాలూకా, బ్లాక్ స్ధాయిలో భారీ నిరసనలు చేపడతామని వెల్లడించారు. గత 21 రోజులుగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయిన క్రమంలో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచి భారీగా దండుకుంటోందని దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గినా వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజలకు ఉద్దేశపూర్వకంగానే ఉపశమనం కలిగించడంలేదని ఆరోపించారు. చదవండి : అహ్మద్ పటేల్పై ఈడీ ప్రశ్నల వర్షం -
హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ యూనిట్ రద్దు
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తన పార్టీకి సంబంధించిన యూనిట్ను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు కె.సి. వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుల్దీప్ సింగ్ రాథోర్ మాత్రం పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 'హిమాచల్ప్రదేశ్లో పీసీసీ ,డీసీసీ, బీసీసీ ఎగ్జిక్యూటివ్ పదవులతో పాటు ఆఫీస్ బేరర్లను తొలగిస్తున్నాం. అయితే హెచ్సీసీ పదవి మాత్రం యధాతథంగా కొనసాగుతుందని' వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే హిమాచల్ప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్ష పదవికి కుల్దీప్ సింగ్ రాథోర్ జనవరిలో నియమితులయ్యారు. గతంలో కూడా గుజరాత్, కర్నాటకలోనూ ఇదే తరహాలో కాంగ్రెస్ తన యూనిట్లను రద్దు చేసి పీసీసీ పదవుల్ని మాత్రం అలాగే కొనసాగించింది. -
నవంబర్ 30న ‘భారత్ బచావో ర్యాలీ’
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నవబంబర్ 30న ‘భారత్ బచావో ర్యాలీ’కి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. దీంతోపాటు కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపుతూ నవంబర్ 5 నుంచి 25 వరకు దేశావ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరసనలు చేపడుతామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ ర్యాలీకి ‘భారత్ బచావో ర్యాలీ’ అని పేరు పెట్టినట్టు తెలిపారు. ఎన్డీయే పాలనలో ఆర్థిక మందగమనం, రైతుల అవస్థలు, నిరుద్యోగిత కొనసాగుతోందని విమర్శించారు. -
కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
బెంగళూరు: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్డీ కుమారస్వామి సర్కార్ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్ను విస్తరించడం లేదంటే పునర్వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
సంకీర్ణంలో సంక్షోభం
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు పార్టీల్లోని పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దడం కోసం కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నాయకులతో చర్చలు జరిపేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ బెంగళూరుకు రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా వేణుగోపాల్తోపాటు బెంగళూరుకు రావాల్సి ఉన్నప్పటికీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆయన రావడం లేదని తెలిసింది. కాంగ్రెస్ నేతలైన సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు దినేశ్ గుండూరావు, మంత్రి డీకే శివకుమార్లతో వేణుగోపాల్ ప్రధానంగా భేటీ కానున్నారు. సీఎం కుమారస్వామి ఈ భేటీలో పాల్గొనే చాన్సుంది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కుమారస్వామి కూడా నేరుగా రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కర్ణాటక మంత్రివర్గంలో మార్పులు చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎస్ఎం కృష్ణను ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోళి, సుధాకర్లు కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ముందుజాగ్రత్త చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఊగిసలాటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి కేవలం రెండే సీట్లలో గెలిచి ఘోర పరాభవం చెందడం తెలిసిందే. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ జూన్ 10 తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు ఉండగా, కాంగ్రెస్కు 79, జేడీఎస్కు 37, బీఎస్పీకి ఉన్న ఒక ఎమ్మెల్యేతో కలిపి మొత్తంగా 117 మంది ఎమ్మెల్యేలు అధికారపక్షంలో ఉండగా, బీజేపీకి సొంతంగా 105 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను చేపడుతుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంపై అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్తో పొత్తు లేకపోయి ఉంటే లోక్సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచే వాళ్లమని జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఖాళీ స్థానాల భర్తీ మాత్రమే: సిద్దు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నారన్న వార్తలను మాజీ సీఎం సిద్దరామయ్య తోసిపుచ్చారు. మంత్రివర్గంలో మార్పులు ఏమీ ఉండబోవనీ, అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3స్థానాలను మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘ఇదొక రకం విస్తరణ. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి’ అని సిద్దరామయ్య మైసూరులో చెప్పారు. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం కోసం ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి చేత రాజీనామా చేయిస్తారని వార్తలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ విషయం తనకు తెలీదన్నారు.మంత్రివర్గంలో 34 మంది ఉండాలి. వీరిలో 22 మంది కాంగ్రెస్ నుంచి, 12 మంది జేడీఎస్ నుంచి మంత్రులుగా ఉండేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జేడీఎస్కు చెందిన రెండు, కాంగ్రెస్ నుంచి ఒక స్థానం మంత్రివర్గంలో ఖాళీగా ఉంది. మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు పలువురు నేతలు ఇప్పటికే కుమారస్వామితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాను మంత్రిని కావాలనుకుంటున్నానని కాంగ్రెస్ నేత మునియప్ప అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావులతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సుపపరిపాలనను, సమర్థ పాలనను అందించడమే తమ సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యమనీ, బీజేపీ బెదిరింపులతో తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదని సిద్దరామయ్య అన్నారు. మా వాళ్లు ఒక్కరు కూడా బయటకు వెళ్లరు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే బాగుంటుందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం అన్నారు. అలాగే బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లేదా జేడీఎస్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరనీ, అయోమయాన్ని సృష్టించేందుకు ఆ పార్టీలు పుకార్లు పుట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని 177 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పార్టీ తొలి స్థానంలో ఉంది. మేం 28కి 25 లోక్సభ స్థానాలు గెలిచాం. వాళ్లు శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే బాగుంటుంది. వారు ఆ నిర్ణయం తీసుకుంటే మేం స్వాగతిస్తాం’ అని యడ్యూరప్ప అన్నారు. -
‘లోక్సభ’ జాబితాను 20లోగా పంపండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈనెల 20వ తేదీలోగా అభ్యర్థుల జాబితా పంపాలని అన్ని ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ)లకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ఈసారి స్క్రీనింగ్ కమిటీలకు బదులు ప్రత్యేక కమిటీలకు ఎంపిక బాధ్యతలు అప్పగించింది. గతంలో ఎన్నికలప్పుడు రాష్ట్రాల స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటయ్యేవి. ఈ కమిటీలే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపించేవి. తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్పారు. లోక్సభ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ముందుగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీసీసీ)లు రూపొందించి రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక కమిటీలకు అందజేస్తాయి. ఈ కమిటీల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఆ రాష్ట్ర పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర పీసీసీకి కేటాయించిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత సభ్యులుగా ఉంటారు. వీరు పీసీసీ జాబితాను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులతో ఏఐసీసీ స్థాయిలోని కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపుతారు. తెరపైకి కొత్త విధానం గతంలో స్క్రీనింగ్ కమిటీలు పంపిన జాబితాల్లో చాలాసార్లు.. ఎవరికీ పరిచయం లేని వ్యక్తులు, రాష్ట్రంపై అవగాహన లేని వారు, అసలు స్క్రీనింగ్ కమిటీ సభ్యులకే తెలియని వారి పేర్లు కూడా ఉండేవని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల పెద్దగా పరిచయం లేని వ్యక్తులు పోటీలోకి దిగగా తిరుగుబాట్లు తలెత్తడం, స్థానిక నేతల సహాయ నిరాకరణ వంటివి జరిగాయని ఆ నేత తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు రాజకీయాలు చేస్తూ ఎవరికీ పరిచయం లేని వారికి కూడా స్క్రీనింగ్ కమిటీ జాబితాలో చోటు కల్పించే వారని అన్నారు. ఇలాంటప్పుడు భారీగా డబ్బు కూడా చేతులు మారేదని ఆరోపణలు వచ్చాయన్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ కొత్త విధానాన్ని తెచ్చారని ఆ నేత తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో కీలకమైన పార్టీ బాధ్యతలను నెరవేర్చేవారు, విధాన నిర్ణయాలను అమలు చేసేవారికి ఎంపికలో బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని రాహుల్ భావిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థుల ఎంపిక సత్వరం పూర్తవడంతోపాటు, వారు ఎన్నికల ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించేందుకు కూడా సమయం దొరుకుతుందని తెలిపారు. అయితే, ముఖ్యమైన విధానపర నిర్ణయాల్లో కాంగ్రెస్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాత్ర కీలకంగా మారింది. కేరళ నుంచి లోక్సభకు ఎన్నికైన వేణుగోపాల్ అన్ని పీసీసీల్లోనూ సభ్యుడే. అదేవిధంగా కర్ణాటక పార్టీకి ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కూడా. రానున్న లోక్సభ ఎన్నికలకు గెలిచే అభ్యర్థుల జాబితా తయారీతోపాటు, ఇతర వివరాలను ఇప్పటికే రాహుల్ గాంధీ తీసుకుంటున్నారని సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో కుల సమీకరణాలు, బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, వారి గెలుపోటములపై సొంతంగా సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. -
సీఎల్పీ నేత: ఏకగ్రీవ తీర్మానం చేయనున్న రాహుల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకొనే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. ఇందుకోసం రాహుల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలంగాణ పీసీసీ నాయకులంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆయన గురువారం అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు రాహుల్గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ కోర్కమిటీ, సీనియర్ నేతలతో తాను సమావేశమయ్యానని తెలిపారు. సీనియర్ నేతల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేత ఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు. -
సీఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంపై సందిగ్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టాన దూత, కేరళ ఎంపీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్కు రానున్నారు. అయితే సమావేశానికి సంబంధించిన తేదీని టీపీసీసీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెల 17 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కాను న్నాయి. అందుకు ఒకరోజు ముందు బుధవారం కనుమ రోజు సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారా.. లేదా 17న శాసనసభ ప్రారంభమయ్యే రోజు నిర్వహిస్తారా.. అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎల్పీ నేత పదవి రేసులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సీఎల్పీ నేతగా ఎవరిని నియమిస్తారన్న దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. -
సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేదెవరో?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 16 లేదా 17న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నా.. 17న అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులుగా ప్రమాణం చేసిన అనంతరమే సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఈ సమావేశానికి అధిష్టానం దూతగా కేరళకు చెందిన లోక్సభ సభ్యు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 15న రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఈయన సమక్షంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, సబి తా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, లోక్సభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నా యి. వీరిలో ఉత్తమ్, భట్టిలను సీఎల్పీ నేతగా నియమించే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీ రేసులో రాజగోపాల్రెడ్డి, శ్రీధర్బాబుల పేర్లూ వినిపిస్తున్నాయి. రాజగోపాల్రెడ్డి పేరును అధిష్టానం తీవ్రంగానే పరి శీలిస్తోందని, ఇందుకు తగినట్టు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకునే పనిలో రాజగోపాల్రెడ్డి కొంత చురుకుగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ విప్ గా, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవమున్న శ్రీధర్బాబు కూడా రేసు లో ముందున్నట్టు తెలుస్తోంది. సీఎల్పీ నేతగా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. మొత్తంగా సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటా రనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఆమెపై పరువునష్టం దావా వేశా
సాక్షి, బెంగళూరు: తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని, అలాంటిది దాదాపు 36 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ కర్ణాటక ఇన్చార్జ్ కెసి వేణుగోపాల్ పరోక్షంగా బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజెను విమర్శించారు. ఆమెపై ఇప్పటికే యర్నాకులం న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు రుజువైతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. కేఎస్ఆర్టీసీ కేరళలోని అలెప్పీకి ఏర్పాటు చేసిన బస్ సేవలను ఆయన శనివారమిక్కడ ఆరంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో వేణుగోపాల్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మొదటినుంచీ తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ‘నాపై ఆరోపణలు చేసిన మహిళ పైనే 36 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయంటే ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంతో మీరే అర్థం చేసుకోవచ్చ’ని అన్నారు. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు ఐదుగురు మృతి చెందడం కేవలం ప్రకృతి వైపరీత్యమే అని, ఇలాంటి సందర్భాల్లో ఎవరూ ఏమీ చేయలేరని వేణుగోపాల్ పేర్కొన్నారు. కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేణుగోపాల్ను కాంగ్రెస్ కర్ణాటక ఇన్చార్జ్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ శోభా కరంద్లాజె నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా శుక్రవారం నిరసనలు చేపట్టింది. వేణుగోపాల్ పలువురు మహిళలను వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రానికి పంపడాన్ని వ్యతికరేకిస్తున్నామని ఈ సందర్భంగా శోభా కరంద్లాజె అన్నారు. వేణుగోపాల్ తమ రాష్ట్రానికి రాకుండా చూడాలని సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేజే జార్జ్, దినేశ్ గుండురావులను కోరారు. వేణుగోపాల్ తమ రాష్ట్రానికి వస్తే నల్లజెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కాగా, తనను రేపిస్ట్గా పేర్కొన్న శోభా కరంద్లాజెపై పరువునష్టం దావా వేసినట్టు వేణుగోపాల్ తెలిపారు.