సెబీ చైర్మన్‌ను పిలుస్తాం | Public Accounts Committee to look into allegations against Sebi Chief Madhabi Puri Buch | Sakshi
Sakshi News home page

సెబీ చైర్మన్‌ను పిలుస్తాం

Published Sat, Sep 7 2024 5:36 AM | Last Updated on Sat, Sep 7 2024 5:36 AM

Public Accounts Committee to look into allegations against Sebi Chief Madhabi Puri Buch

ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ కేసీ వేణుగోపాల్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్‌ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. 

ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్‌ షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement