ICICI
-
మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?
భారత స్టాక్మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తీవ్రంగా పడిపోయిన మార్కెట్ సూచీల్లో ప్రధానంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్లే అధికంగా ఉన్నాయి. అందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) శంకరన్ నరేన్ చేసిన కామెంట్లు కారణమని కొందరు భావిస్తున్నారు. అసలు ఆయన స్టాక్ మార్కెట్కు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేశారో తెలుసుకుందాం. స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లు గత ఐదేళ్లలో సాధించిన లాభాలను కాపాడుకోవాలని నరేన్ సూచించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్లో ఉన్నాయని, రిస్క్లను నిర్వహించడానికి వైవిధ్యభరితంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.లాభాలు కాపాడుకోవడం: గత ఐదేళ్లలో ఆర్జించిన రాబడులను కాపాడుకోవాలని నరేన్ నొక్కి చెప్పారు. ఆ సమయంలో ఈక్విటీలు లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు గణనీయమైన రాబడులను చూశారని ఆయన పేర్కొన్నారు.ఓవర్ వాల్యుయేషన్: లార్జ్ క్యాప్ స్టాక్స్తో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అధిక విలువను కలిగి ఉన్నాయని నరేన్ అన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) లార్జ్ క్యాప్ స్టాక్స్ను విక్రయించడమే ఈ అసమానతలకు కారణమని, ఇది మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్స్ ధరలను పెంచేలా చేసిందన్నారు.డైవర్సిఫైడ్ స్ట్రాటజీ: ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్, గ్లోబల్ స్టాక్స్, బంగారం, వెండి వంటి పెట్టుబడులను సూచిస్తూ వైవిధ్యభరితంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడులన్నీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టొద్దని తెలిపారు.మార్కెట్ అస్థిరత: 2008-2010 కాలం కంటే 2025 మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు ఈ విభాగాల్లో తమ పెట్టుబడులను రిడీమ్ చేసుకోవాలని సూచించారు.ఇదీ చదవండి: కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?వివరణనరేన్ చేసిన ఈ వ్యాఖ్యలను మార్కెట్ పరిగణలోకి తీసుకుని భారీగా నష్టపోయినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై నరేన్ను వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘భారత మార్కెట్లో దీర్ఘకాలిక వృద్ధి తథ్యం. దానిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రస్తుత సవాలు డబ్బు సంపాదించడం కాదు. దాన్ని పరిరక్షించడం. ఇన్వెస్టర్లు తమ లాభాలను కాపాడుకోవడంపై దృష్టి సారించాలి. ఎప్పటినుంచో చాలామంది అంచనా వేస్తున్నట్టుగానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ భారీగా పెరిగాయి. ఈ పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఈ వ్యవహారంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా మాట్లాడుతూ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఒడిదొడుకులకు లోనుకావద్దని, దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. -
ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?
ప్రస్తుతం అంతటా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం విత్డ్రా లిమిట్ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఎస్బీఐమీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్టచ్’ లేదా ’ఎస్బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్ఆర్ఓ డెబిట్ కార్డ్లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్ డెబిట్ కార్డ్కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్లకు రూ. 1,00,000. అదే జెట్ప్రివిలేజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్తో 1,00,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్లకు డైలీ లిమిట్ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్డ్రా చేసుకోవచ్చు.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్లకు లిమిట్ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.బ్యాంక్ ఆఫ్ బరోడావరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.ఇండియన్ బ్యాంక్సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.యూనియన్ బ్యాంక్మీ ఖాతాకు లింక్ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్రూపే ఎన్సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్తో రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్ల విత్డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్లతో రోజుకు రూ. 1,50,000 విత్డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డ్ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్, రూపే పంజాబ్ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్, ఎన్సీఎంసీ, మాస్టర్ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్డ్రా చేసుకోవచ్చు.రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్ రూ. 50,000. వీసా బిజినెస్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.కోటక్ బ్యాంక్ కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్లతో రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్లు రోజువారీ విత్డ్రాయల్ లిమిట్ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్ ప్లాటినమ్, వరల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినమ్ ఏస్, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్ నియాన్, ప్రివీ లీగ్ ప్లాటినమ్, ప్రివీ లీగ్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది. -
సెబీ చైర్మన్ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
చందా కొచ్చర్ అరెస్టుపై.. సీబీఐకి కోర్టు మొట్టికాయలు!
ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)పై బాంబే హైకోర్టు మెట్టికాయలు వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్ అంశంలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్, జస్టిస్ ఎన్. ఆర్.బోర్కర్ డివిజన్ బెంచ్ 2024 ఫిబ్రవరి 6న కొచ్చర్ దంపతుల అరెస్టును చట్టవిరుద్ధమని పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్ వారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ధృవీకరించింది. కోర్టు జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లో.. కొచ్చర్ దంపతులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అందుకు తగ్గ ఆదారాల్ని చూపించలేకపోయారని, కాబట్టే సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తున్నట్లు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్ల ధర్మాసనం తెలిపినట్లు వెలుగులోకి వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం తగదు ‘చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగానికి సమానం’ అని కోర్టు పేర్కొంది. కానీ కొచ్చర్ దంపతులు విచారణకు సహకరించనందున అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని.. సీబీఐ వాదనను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయకూడదు. విచారణ చేస్తున్న సమయంలో అలా చేస్తున్నట్ల మౌనంగా ఉండే హక్కును కల్పిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
అన్ని కాలాలకూ అనువైనది.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్
కొంత కాలంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కీలక సూచీలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బంగారం ధరలు చెప్పుకోతగ్గంత పెరిగాయి. మార్కెట్ల గమనం పట్ల స్పష్టమైన సంకేతాలు కనిపించనప్పుడు.. అనుభవం లేని ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించడం కష్టమే అవుతుంది. వేర్వేరు సాధనాల్లో ఉండే అస్థిరతలు, అనుకూల అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గం.. మల్టీ అస్సెట్ మ్యూచవల్ ఫండ్స్. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన పనితీరుతో ముందుంది. రాబడులు ఈ పథకం 2002 అక్టోబర్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూస్తే ఏటా 21.13 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై రాబడులను తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలోనూ 22 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్లలో 27 శాతం, ఐదేళ్లలో 15.73 శాతం, ఏడేళ్లలో 14.71 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున సగటు వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. మల్టీ అస్సెట్ ఫండ్స్ విభాగం సగటు రాబడితో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ పథకం రాబడుల్లో అందనంత ఎత్తులో ఉంది. మల్టీ అస్సెట్ అలోకేషన్ విభాగం రాబడి ఏడాది కాలంలో 13.55 శాతం, మూడేళ్లలో 15.42 శాతం, ఐదేళ్లలో 9.35 శాతం, ఏడేళ్లలో 7.69 శాతం, పదేళ్లలో 9.58 శాతం చొప్పున ఉంది. 6–12 శాతం వరకు ఈ పథకమే అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాల నుంచి అద్భుతమైన రాబడులను ఇవ్వడమే కాదు, పనితీరులోనూ ఎంతో స్థిరత్వం కనిపిస్తుంది. అన్ని మార్కెట్ సైకిల్స్లోనూ (ఉద్దాన పతనాలు) ఈ పథకం బలమైన పనితీరు చూపించింది. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఉంటే, గత మూడేళ్లలో 23 శాతం, ఐదేళ్లలో 21.8%, పదేళ్లలో 16.6 శాతం చొప్పున వార్షిక సగటు రాబడిని ఈ పథకం ఇచ్చి ఉండేది. పెట్టుబడుల విధానం.. మల్టీ అస్సెట్ పథకాలు ఈక్విటీ, డెట్, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. దీంతో దీర్ఘకాలంలో రిస్క్ను అధిగమించి మెరుగైన రాబడులకు అవకాశం లభిస్తుంది. ఈ మూడు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. వివిధ సాధనాల్లో ర్యాలీ ప్రయోజనాలను ఈ పథకం రూపంలో సొంతం చేసుకోవచ్చు. అచ్చమైన ఈక్విటీ పథకాలు మార్కెట్ల పతనాల్లో ఎక్కువ నష్టాలను చూస్తాయి. వాటితో పోలిస్తే బహుళ సాధనాలతో కూడిన ఈ పథకంలో పెట్టుబడుల విలువ క్షీణించే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. లంప్సమ్ (ఒకే విడత), సిప్ రూపంలో పెట్టుబడులకు ఈ పథకం అనుకూలం. మార్కెట్ల కంటే ఈ పథకమే రిస్క్లను మెరుగ్గా నియంత్రించగలదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.21,705 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 58 శాతం కేటాయించింది. 14 శాతం డెట్లో ఇన్వెస్ట్ చేసింది. రియల్ ఎస్టేట్లో 0.94 శాతం పెట్టుబడులు పెట్టింది. నగదు, నగదు సమానాల రూపంలో 33.73 శాతం కలిగి ఉంది. -
లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్.. ఫలితాలు ఇలా!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం జంప్చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది. ఆదాయం సైతం అప్ గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్చేశాయి. -
ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తన హెల్త్ పాలసీదారులకు మంచి ఆఫర్ను ప్రకటించింది. పాలసీదారులు నగదు రహిత వైద్యాన్ని ఏ ఆస్పత్రి నుంచి అయినా పొందొచ్చని.. నాన్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమలో ఈ తరహా ఆఫర్ మొదటిదిగా పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు వైద్యం కోసం కస్టమర్లు తమ పాకెట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఐఎల్ టేక్ కేర్’ యాప్ నుంచి ఈ నూతన సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. నగదు రహిత వైద్యాన్ని హాస్పిటళ్లు అందించడంపై ఆధారపడి ఉంటుందని, ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే పాలసీదారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తాము సూచించిన హాస్పిటల్ లేదంటే సమీపంలోని హాస్పిటల్కు వెళ్లొచ్చని సూచించింది. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! -
ఐసీఐసీఐ బ్యాంక్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల జారీని చేపట్టింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. బిజినెస్ వృద్ధికి నిధులను వినియోగించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. రిడీమబుల్ డిబెంచర్ల రూపేణా 50,000 సీనియర్ సెక్యూర్డ్ దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లు బ్యాంక్ తెలియజేసింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వీటిని ఈ నెల 12న(సోమవారం) జారీ చేసినట్లు వెల్లడించింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. 7.63 శాతం కూపన్ రేటుతో వార్షిక చెల్లింపులకు వీలున్న ఈ బాండ్లు ఏడేళ్ల తదుపరి అంటే 2029 డిసెంబర్ 12న రిడీమ్ కానున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలోని సంబంధిత విభాగంలో ఇవి లిస్ట్కానున్నట్లు తెలియజేసింది. -
RBI CBDC: డిజిటల్ రూపీ ట్రయల్స్ షురూ
ముంబై: దేశీయంగా తొలిసారి డిజిటల్ రూపాయి (సీబీడీసీ) ప్రాజెక్టు నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్సేల్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు, వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీ – రిటైల్ సెగ్మెంట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది. ‘డిజిటల్ రూపీ (హోల్సేల్ విభాగం) తొలి పైలట్ ప్రాజెక్టు నవంబర్ 1న ప్రారంభమవుతుంది‘ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన 9 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. సీమాంతర చెల్లింపులకు కూడా పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సీబీడీసీతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది. లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య, ఆర్బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా.. 2022–23లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి. -
రవాణా, లాజిస్టిక్స్లో పెట్టుబడి అవకాశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్ఎఫ్వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది. వృద్ధి అవకాశాలు ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్సైకిల్లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల హవా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి. లాజిస్టిక్స్కు ప్రోత్సాహం భారత్లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడుల అవకాశాలు ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. రిస్క్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులను చాలా సేవలకు కస్టమర్లు ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె కడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే ఫీజులు వసూలు చేయనుంది. అక్టోబర్ 20 నుంచి ఈ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్లు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఐసీఐ వసూలు చేయనున్న రుసుముకి ఇది అదనం కానుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీజు వసూలు చేసే జాబితాలో ఐసీఐసీఐ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మిగతా బ్యాంకులు ఈ తరహా నిర్ణయాన్నే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వెనక ఇంత కథ జరుగుతుందా! అందుకే.. అసలు కథేంటంటే.. క్రెడ్( Cred), రెడ్ గిరాఫీ( RedGiraffe), మైగేట్( Mygate), పేటీఎం( Paytm) మ్యాజిక్ బ్రిక్స్( Magicbricks) వంటి ప్లాట్ఫాంలో ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్ల ద్వారా చెల్లించే వెసలుబాటు ఉంటుంది. ఈ ప్లాట్ఫాంలో కస్టమర్లు తమ కుటుంబాన్ని లేదా స్నేహితులను ఇంటి ఓనర్లుగా చేర్చుకుని, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డుని ఉపయోగించడం ద్వారా నగదు పొందుతున్నారు. సాధారణంగా అయితే క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి ఏటీఎం( ATM) నుంచి నగదు విత్డ్రా చేయాలంటే 2.5-3% వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెడ్ గిరాఫీ( RedGiraffe) మినహా ఈ సేవలను అందిస్తున్న అన్ని ఆన్లైన్ ప్లాట్ఫాంలు రెంట్ పేమెంట్ ధృవీకరించే అద్దె ఒప్పందాన్ని అడగడం లేదు. దీంతో క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫీచర్ ద్వారా అద్దె చెల్లింపు పేరుతో కొందరు కస్టమర్లు సులభంగా, ఏ ఫీజులు లేకుండా నగదుని పొందే అవకాశం ఉంది. ఇటీవల ఈ తరహా చెల్లింపులు ఎక్కువ కావడంతో బోగస్ పేమెంట్లను ఆపేందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్ పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ’ఫెస్టివ్ బొనాంజా’ పేరిట ప్రత్యేక ఆఫర్లనక్ప్రకటించింది. తమ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫైనాన్స్, కార్డ్లెస్ ఈఎంఐ మొదలైన వాటి ద్వారా రూ. 25,000 వరకు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు పొందవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, బిగ్బాస్కెట్, అజియో, రిలయన్స్ డిజిటల్, క్రోమా తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంకు ఈడీ రాకేష్ ఝా తెలిపారు. రుణాలపై కూడా (గృహ, వ్యక్తిగత, బంగారం రుణాలు మొదలైనవి) ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చని వివరించారు. వీటితో పాటు బ్యాంక్ పేర్కొన్న వస్తువులను కొనుగోళ్లు చేసే కస్టమర్లకు కార్డ్లెస్ ఈఎంఐ(EMI), 'నో-కాస్ట్ ఈఎంఐ(EMI) వంటి సౌకర్యాలను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్లు & ఇ-కామర్స్ ప్లాట్ఫాంపై ఆఫర్లు: ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్ఫాంలో ఆన్లైన్ షాపింగ్పై 10% తగ్గింపు. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు: అర్మానీ ఎక్స్ఛేంజ్, కెనాలి, క్లార్క్స్, డీజిల్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్, పాల్ & షార్క్, సత్య పాల్, స్టీవ్ మాడెన్, బ్రూక్స్ & బ్రదర్స్ వంటి లగ్జరీ బ్రాండ్లపై అదనపు 10% క్యాష్బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ & గాడ్జెట్లపై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లలో 10% వరకు క్యాష్బ్యాక్. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్లో కస్టమర్లు ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు. దుస్తులు & ఆభరణాలు: షాపర్స్ స్టాప్, లైఫ్స్టైల్, అజియో, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ దుస్తుల బ్రాండ్లపై అదనంగా 10% తగ్గింపు. అలాగే పీసీ జ్యువెలర్స్ (PCJ) నుంచి కనీసం ₹50,000 కొనుగోలుపై ₹2,500 క్యాష్బ్యాక్ పొందవచ్చు. చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్వ్యాగన్ భారీ షాక్ -
ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ రివ్యూ
ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే సెంట్రల్ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్బీఐ, ఫెడ్ సహా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపు బాటలోనే దూకుడుగా వెళుతున్నాయి. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను చురుగ్గా పెంచాల్సిందేనని, అవసరమైతే వృద్ధి రేటును కూడా త్యాగం చేయాల్సి రావచ్చని ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ పేర్కొనడాన్ని గమనించాలి. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు అస్థిరతలను చూడనున్నాయి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎంతో అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్లో పెట్టుబడి రిస్క్ అవుతుంది. ఈ తరుణంలో అంతర్గత విలువ కంటే తక్కువలో లభించే నాణ్యమైన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వ్యాల్యూ ఫండ్స్ను ఆకర్షణీయంగా భావించొచ్చు. పెట్టుబడులకు ముందు ఆయా కంపెనీల పుస్తక విలువ, క్యాష్ ఫ్లో సామర్థ్యాలను ఫండ్ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది. రాబడులు వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.24,694 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 17 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 24 శాతానికి పైనే పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 14.40 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం. పోర్ట్ఫోలియో.. పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.4 శాతం డెట్ సాధనాల్లో, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు ఏర్పడితే ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా నగదు నిల్వలు పెంచుకుంది. ఇక ఈక్విటీల్లోనూ 81 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 63 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో 19 శాతాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, 12 శాతం హెల్త్కేర్ కంపెనీలకు, 10 శాతం కమ్యూనికేషన్ స్టాక్స్కు, 8 శాతం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో బ్రోకరేజీ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 273 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 795 కోట్లకు చేరింది. సంస్థాగత ఈక్విటీల విభాగం ఆదాయం 17 శాతం నీరసించి రూ. 49 కోట్లకు చేరింది. మార్కెట్లో పరిమాణం మందగించడం, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు క్షీణించడం ప్రభావం చూపింది. కాగా.. పంపిణీ బిజినెస్ ఊపందుకుంది. 28 శాతం జంప్చేసి రూ.152 కోట్లకు చేరింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ తదితర ప్రొడక్టులు ఇందుకు సహకరించాయి. మార్జిన్ ఫండింగ్ ద్వారా రూ. 619 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపుకాగా.. 80 లక్షల మంది క్లయింట్ బేస్ను కలిగి ఉంది. క్యూ1లో కొత్తగా 4.4 లక్షల మంది జత కలిశారు. ఇదే కాలంలో ఇతర బ్రోకింగ్ సంస్థలు జిరోధా 62 లక్షలు, అప్స్టాక్స్ 52 లక్షలు, గ్రో 38 లక్షలు, ఏంజెల్ వన్ 36 లక్షల చొప్పున క్లయింట్లను గెలుచుకోవడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 469 వద్ద ముగిసింది. -
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్పై ఐసీఐసీఐ లాంబార్డ్ గురి..
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అదనపు పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలియజేసింది. సంస్థ స్థూల ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,977 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.14,003 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. వార్షికంగా ప్రీమియం ఆదాయంలో 28.7 శాతం వృద్ధి నమోదైంది. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని విజయవంతంగా విలీనం చేసుకుంది. ఈ విలీనం అనంతరం జీడీపీఐ పరంగా పరిశ్రమలో రెండో స్థానానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ చేరుకుంది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ 2021–22లో 11 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘పరిశ్రమకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యధిక వ్యాపారాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా మంచి వృద్ధిని చూస్తోంది. రిటైల్ హెల్త్ విభాగంలో వృద్ధి అవకాశాల దృష్ట్యా మా పెట్టుబడులను పెంచాం. రిటైల్ హెల్త్ ఏజెన్సీ బృందంలో విక్రయదారుల సంఖ్యను పెంచాం’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్గుప్తా వాటాదారులకు వివరించారు. అధిక వృద్ధి నమోదు.. ‘‘సంస్థ మోటారు ఇన్సూరెన్స్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పరిమిత వృద్ధినే చూసింది. సరఫరా సమస్యలు, డిమాండ్ సెంటిమెంట్ తక్కువగా ఉండడం కారణాలు. ఇక ద్వితీయ ఆరు నెలల్లో మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంది. పరిశ్రమ కంటే కంపెనీయే అధిక వృద్ధిని సాధించింది’’అని దాస్ గుప్తా తెలిపారు. ఎస్ఎంఈ విభాగంలో 17.8 శాతం వృద్ధిని చూసింది. ఫైర్ ఇన్సూరెన్స్లో సంస్థ వాటా 12.8 శాతం, ఇంజనీరింగ్లో 15.2 శాతం, మెరైన్కార్గో ఇన్సూరెన్స్లో 17.9 శాతానికి చేరుకుంది. -
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం ఓకే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 340 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 329 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం జంప్చేసి రూ. 892 కోట్లకు చేరింది. క్లయింట్ బేస్ 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12.75 చొప్పున తుది డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పూర్తి ఏడాదికి రికార్డు సృష్టిస్తూ రూ. 24 డివిడెండును అందించినట్లు తెలియజేసింది. క్యూ4లో ఆల్రౌండ్ పనితీరు చూపినందుకు సంతోషిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో విజయ్ చందోక్ పేర్కొన్నారు. అన్ని బిజినెస్ విభాగాల్లోనూ వృద్ధి సాధించామని, ఇది మా సామర్థ్యాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 1,383 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 33 శాతం జంప్చేసి రూ. 3,438 కోట్లయ్యింది. -
పెట్రోల్ ధర రూ.12 అప్!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. దేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది. తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది. దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం! -
ఈ బ్యాంకులు దివాలా తీయవ్ ! ఆర్బీఐ కీలక ప్రకటన
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజాలు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేకత ఏమిటి? డీ–ఎస్ఐబీలను ‘టూ బిగ్ టూ ఫెయిల్ (టీబీటీఎఫ్)లుగా పరిగణిస్తారు. ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదన్నది దీని ఉద్దేశ్యం. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనా, దీనిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆయా అంశాల వల్ల ఈ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధుల సమీకరణలో నిర్దిష్ట సాను కూలతలు, ప్రయోజనాలను పొందగలుగుతాయి. మరికొన్ని ముఖ్యాంశాలు... ఆర్బీఐ ప్రకటనకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... డీ–ఎస్ఐబీ నిర్ధారణ ఫ్రేమ్వర్క్ 2014 జూలైలో జారీ అయ్యింది. ఈ ఫ్రేమ్వర్క్ కింద సేకరించిన వ్యాపార గణాంకాల ప్రాతిపదికన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు 2015, 2016ల్లో ఆర్బీఐ డీ–ఎస్ఐబీ హోదా ఇచ్చింది. 2017 మార్చి 31న హెచ్డీఎఫ్సీకి కూడా ఇదే హోదా లభించింది. కాగా, డీ–ఎస్ఐబీల కోసం అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) సౌలభ్యతను ఏప్రిల్ 1, 2016 నుండి దశలవారీగా ప్రారంభించడం జరిగింది. 2019 ఏప్రిల్ 1 నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది. తగిన మూలధన కల్పనలో ఈ సౌలభ్యత కీలకమైనది. బ్యాంక్ షేర్ ధరలు ఇలా... నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో (ఎన్ఎస్ఈ)లో మంగళవారం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల షేర్ ధరలు వరుసగా రూ. 483.50 (2.70% అప్), 772.85 (1.07% పెరుగుదల), 1,528.55 (0.59% పురోగతి) వద్ద ముగిశాయి. చదవండి: ముత్తూట్ విభాగానికి షాక్.. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ రద్దు! -
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్మార్కెట్స్ కొత్త రికార్డులను నమోదుచేసిన విషయం తెలిసిందే. రంకెలేస్తు వచ్చిన బుల్ను బేర్ ఒక దెబ్బతో పడగొట్టింది. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకలు, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించే విషయంలో అమ్మకాల జోరు ఊపందుకోవడంతో స్టాక్మార్కెట్లు కొద్దిరోజుల నుంచి కుప్పకూలుతూ వచ్చాయి. అక్టోబర్ 29 రోజున దేశీయ సూచీలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్ల రూ. 4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. బేర్ కొట్టిన దెబ్బకు రిలయన్స్, హెడీఎఫ్సీ లాంటి టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయాయి. అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీలు గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 2,48,542.3 కోట్లను కోల్పోయాయి. బలహీనమైన విస్తృత మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా సంస్థలు తమ మార్కెట్ విలువను కోల్పోవడం జరిగింది. టాప్-10 మార్కెట్ క్యాప్ కంపెనీల జాబితాలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడింది. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ►రిలయన్స్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.56,741.2 కోట్లు తగ్గి రూ.16,09,686.75 కోట్లకు చేరుకుంది. ►హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్ల వద్ద స్థిరపడింది. ►టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ.37,452.9 కోట్లు తగ్గి రూ.12,57,233.58 కోట్లకు చేరుకుంది. ►ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,678.78 కోట్లు తగ్గి రూ.7,01,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. ►కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,545.09 కోట్లు తగ్గడంతో రూ.4,03,013 కోట్లకు చేరింది. ►బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 18,774.8 కోట్లు తగ్గింది. దీంతో ఎమ్-క్యాప్ విలువ 4,46,801.66 కోట్లకు చేరుకుంది. ►హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) రూ. 14,356 కోట్లు తగ్గి రూ. 5,62,480.40 కోట్ల వద్ద స్థిరపడింది. ►హెచ్డిఎఫ్సి వాల్యుయేషన్ రూ.10,659.37 కోట్లు తగ్గి రూ.5,14,217.69 కోట్లకు చేరుకోగా.. ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత మేర నష్టాలను చవిచూసింది. గతవారంలో సుమారు రూ.490.86 కోట్లు తగ్గి రూ.4,48,372.48 కోట్లకు చేరింది. ►టాప్-10 మార్కెట్ క్యాప్ కల్గిన కంపెనీలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే రూ. 30,010.44 కోట్లను జోడించి రూ. 5,56,507.71 కోట్లకు తీసుకుంది. చదవండి: గూగుల్పే మాదిరిగా...వాట్సాప్లో రూ. 255 వరకు క్యాష్బ్యాక్..! -
ఇకపై ‘టెలిగ్రామ్’ లో ఇన్సూరెన్స్ సేవల గురించి తెలుసుకోండి
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది. టెలిగ్రామ్పై చాట్బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. -
ఏటీఎం కేటుగాళ్లు.. అసలు సంగతి ఇది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్కు చెందిన సెక్యూర్ వాల్యూ సంస్థలో కస్టోడియన్గా పని చేసిన కృష్ణకు ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.1.3 కోట్లు కాజేయడానికి ఆ సంస్థలో ఉన్న లోపాలే కలిసి వచ్చాయని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇతడితో పాటు మాజీ సహోద్యోగి రాజశేఖర్ను సైతం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. న్యాయస్థానం అనుమతితో ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్న అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే పలు వ్యవస్థాగత లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించారు. ► సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని చేపట్టింది. వరంగల్కు చెందిన రాపాక రాజశేఖర్రెడ్డి గతంలో ఈ సంస్థలో కస్టోడియన్గా పని చేశాడు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన రూ.1.23 కోట్లు మరికొందరితో కలిసి కాజేసిన ఆరోపణలపై గతంలో అరెస్టు అయ్యాడు. ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఇదే సంస్థలో కస్టోడియన్గా పని చేస్తున్న గండెల్లి కృష్ణకు ఓ రూట్ అప్పగించారు. ► సెక్యూర్ వాల్యూ సంస్థ ప్రతి నెలా కచ్చితంగా ఆడిటింగ్ నిర్వహించేది. అయితే ఆ రోజు ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఆడిటింగ్ చేయనున్నారో ముందే సిబ్బందికి చెప్పేది. ఇలా విషయం తెలుసుకునే కృష్ణ మరో ఏటీఎం నుంచి డబ్బు తెచ్చి అందులో పెట్టేవాడు. మరోపక్క ఓ ఏటీఎం మిషన్ను తెరవడానికి రెండు పాస్వర్డ్స్ వినియోగించాల్సి ఉంటుంది. భద్రత నిబంధనల ప్రకారం ఒక్కో పాస్వర్డ్ ఒక్కో ఉద్యోగికి చెప్పి బాధ్యుడిని చేయాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం రెండింటినీ ఒకే కస్టోడియన్కు చెప్పేస్తోంది. ► ఒక్కో పాస్వర్డ్ వ్యాలిడిటీ గడువు గరిష్టంగా 24 గంటల మాత్రమే. ఆ మరుసటి రోజు ఏ ఏటీఎంలో డబ్బు నింపాలో దానివే చెప్పాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం ఆయా రూట్లలో ఉన్న అన్ని ఏటీఎంలవీ కస్టోడియన్లకు వాట్సాప్ ద్వారా పంపించేస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకున్న కృష్ణ సంస్థ నిర్వాహకులకు అనుమానం రాకుండా వ్యవహరించాడు. మూడు నెలల కాలంలో ఏటీఎంల్లో నింపాల్సిన రూ.కోటి కాజేశాడు. ఏ ఒక్క ఏటీఎం నుంచీ మొత్తం డబ్బు కాజేయలేదు. ఒక్కో దాని నుంచి కొంత చొప్పున మాయం చేశాడు. ► ఫలానా రోజు ఏ ఏటీఎంలో ఆడిటింగ్ జరుగుతుందో తెలుస్తుండటంతో.. మరో దాంట్లో నుంచి అవసరమైన మొత్తం తెచ్చి అందులో నింపి తప్పించుకునేవాడు. ఈ వ్యవహారాల్లో తన మాజీ సహోద్యోగి రాజశేఖర్ సలహాలు తీసుకుంటూ కొంత మొత్తం చెల్లించాడు. ఓ దశలో తన వ్యవహారం బయటపడుతుందని భావించిన కృష్ణ ఆ విషయం రాజశేఖర్కు చెప్పాడు. ఇద్దరూ కలిసి రూ.30 లక్షలు కాజేయాలని, ఆపై కృష్ణ పోలీసులకు లొంగిపోవాలని పథకం వేశారు. అనుకున్నట్లే కాజేసిన కృష్ణను తన వాహనంపై పికప్ చేసుకున్న రాజశేఖర్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన వాటా తాను తీసుకుని ఉడాయించాడు. స్వాహా చేసిన డబ్బును కృష్ణ తన చెందిన వాటితో పాటు తన భార్య బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేశాడు. ఆపై ఆన్లైన్ బెట్టింగ్లో దాదాపు 90 శాతం కోల్పోయాడు. చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు ఐసీఐసీఐ ‘హాస్పిక్యాష్’
బెంగళూరు: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్కు చెందిన గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీ ‘గ్రూపు సేఫ్ గార్డ్’ను ఆఫర్ చేయనుంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే చికిత్సల వ్యయాలతో సంబంధం లేకుండా.. ఈ పాలసీలో ప్రతిరోజూ ఎంచుకున్న మేరకు నగదును చెల్లించడం ఉంటుందని ఇరు కంపెనీలు ఉమ్మడిగా ఓ ప్రకటనలో తెలిపాయి. గ్రూపు సేఫ్ గార్డ్ పాలసీలో హాస్పిక్యాష్ బెనిఫిట్ కింద ప్రతిరోజూ కనీసం రూ.500 నుంచి గరిష్టంగా ఎంచుకున్న మేరకు పరిహారాన్ని పాలసీదారులు పొందడానికి వీలుంటుంది. అందుబాటు ధరలకే, కాగిత రహిత, సౌకర్యవంతమైన పాలసీ ఇదని, ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరినా లేదా ముందుగా నిర్దేశించుకున్న మేర చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరినా నగదు ప్రయోజనాన్ని పొందొచ్చని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు తీపికబురు -
12న అమెజాన్ స్మాల్ బిజినెస్ డే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ డిసెంబరు 12న స్మాల్ బిజినెస్ డే నిర్వహిస్తోంది. స్టార్టప్స్, మహిళా వ్యాపారులు, చేతివృత్తులు, నేతపనివారు, స్థానిక దుకాణదారులకు చెందిన ఉత్పత్తులను ఈ సందర్భంగా విక్రయిస్తారు. డిజిటల్ చెల్లింపులు జరిపితే 10 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీలకు 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. స్మాల్ బిజినెస్ డే ఈ ఏడాది జరుపుకోవడం ఇది రెండవసారి. (రిలయన్స్ డీల్: అమెజాన్కు సమన్లు) ఈడీకి లేఖ రాసిన సీఏఐటీ అమెజాన్పై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) లేఖ రాసింది. ఉత్పత్తులను అతి తక్కువ ధరల్లో విక్రయిస్తూ కోట్లాది మంది చిన్న వర్తకులకు కష్టాలను తెచ్చిపెడుతోందని లేఖలో పేర్కొంది. ‘అమెజాన్ 2012 నుంచి నిర్లక్ష్యంగా, స్పష్టంగా చట్టాలు, నియమ, నిబంధనలను ఉల్లంఘించింది. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఇతర అనుబంధ కంపెనీలు, బినామీలు మార్కెట్ప్లేస్ ఆధారిత విధానం పేరుతో మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇది ఎఫ్డీఐ పాలసీ, ఫెమా యాక్ట్ను ఉల్లంఘించినట్టే’ అని వివరించింది. -
ఐసీఐసీఐ సెక్ రికార్డ్ -ఫెడరల్ బ్యాంక్ జోరు
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బ్రోకింగ్, రీసెర్చ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కౌంటర్కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 569కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 548 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌటర్ 38 శాతం జంప్చేయడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 22న క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు వెల్లడించేందుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బోర్డు సమావేశమవుతోంది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించాక అంటే మే 7 తదుపరి రూ. 361 స్థాయి నుంచి ఈ షేరు 53 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు రూ. 54 సమీపానికి ఎగసింది. ప్రస్తుతం 5 శాతం జంప్చేసి రూ. 52 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 401 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 3,444 కోట్లను అధిగమించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.99 శాతం నుంచి 2.96 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరుకి గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటీ రూ. 74 టార్గెట్ ధరతో బయ్ రేటింగ్ను ప్రకటించింది. -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
కరోనా: ఐసీఐసీఐ గ్రూప్ 100 కోట్ల విరాళం
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి కట్టడికి జరుగుతున్న పోరులో ఐసీఐసీఐ గ్రూప్ దేశానికి మద్దతుగా నిలిచింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్న ఐసీఐసీఐ గ్రూపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని మంగళవారం ప్రకటించింది. ఇందులో రూ.80 కోట్లు పీఎంకేర్స్కు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలకు రూ.20 కోట్లు అందించనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రెసిడెంట్ సందీప్ బాత్రా ప్రకటించారు. కరోనా వైరస్ దేశ ప్రజలపై గట్టి సవాల్ విసిరింది.(కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) ఈ సమయంలో అందరం కలసి కట్టుగా నిలబడి పోరాటాలని కోరుతున్నామని బాత్రా తెలిపారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తాము ఈ విరాళాన్ని అందిస్తున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ -19 వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 2.13 లక్షల సర్జికల్ మాస్కులు, 40వేలకు పైగా ఎన్95 మాస్కులు, 20వేల లీటర్ల శానిటైజర్లు, 16వేల గ్లౌజ్లు, 5300 వ్యక్తిగత రక్షణ సూట్లు (పీపీఈ), 2600 ప్రొటెక్టివ్ ఐ గేర్, 50 థర్మల్ స్కానర్లు, వెంటీలేటర్లను వివిధ ఆసుపత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అందించామని చెప్పారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న ప్రజలకు తమ సేవలను కొనసాగిస్తామని వెల్లడించారు. (పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు) -
‘యస్’ ప్రణాళికకు కేంద్రం ఓకే..
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ‘ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్ బ్యాంక్ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్ తప్పుకుంటారన్నారు. ఎస్బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుం దని, మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ పెట్టుబడులు.. యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానమవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు క్సే ్చంజీలకు తెలిపింది. రాణా కపూర్పై మరో సీబీఐ కేసు.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అవంత రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి, రాణా కపూర్ ప్రతిఫలంగా ఢిల్లీలోని ఓ భవంతిని అత్యంత చౌకగా తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే.. అవంత సంస్థలకు రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు ప్రతిగా బ్లిస్ అబోడ్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలోని బంగళాను రూ. 378 కోట్లకు కపూర్ కొనుగోలు చేశారు. ఈ బ్లిస్ అబోడ్ అనే సంస్థ ఇద్దరు డైరెక్టర్లలో బిందు కూడా ఒకరు. బంగళాను కొన్న వెంటనే రాణా కపూర్ .. దాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి రూ. 685 కోట్లు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్లిస్ అబోడ్, అవంత రియల్టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తమ కార్యాలయాల్లో సోదాల వార్తలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తోసిపుచ్చింది. అస్థిరతల కట్టడికి చర్యలు: సెబీ న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు సెబీ, కేంద్రం చొరవ తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ ప్రకటించింది. తీవ్ర అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 10 శాతం కుప్పకూలడంతో ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక మందగమనం, చమురు ధరల పతనంపై ఆందోళనలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా చలిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సెబీ, స్టాక్ ఎక్సేంజ్లు సన్నద్ధంగా ఉన్నాయి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలకు ఉపశమనం కల్పిస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలకు ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వంలోని భిన్న శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఎదురైన సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రంగాలతో నేను సమావేశం నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఆయా పరిశ్రమలు సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తాము ఎంత మేరకు మెరుగ్గా సాయం అందించొచ్చన్న దానిపై ప్రతి శాఖా ఎంతో సమయం వెచ్చిస్తోంది’’ అని మంత్రి వివరించారు. -
ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్ రుణాలు
ముంబై: ఫైనాన్స్ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్ డ్యురబుల్స్, క్రెడిట్ కార్డులు) కారణంగా రుణ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండడం, అదే సమయంలో వినియోగదారుల డేటా లభ్యత పెరగడం, డేటా అనలైటిక్స్ వినియోగం అన్నవి చౌక గృహ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల వృద్ధికి దారితీయనున్నట్టు ఈ సంస్థ వివరించింది. -
ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్ లాభాలు రూ.1,350 కోట్లు–రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 18,574 కోట్ల నుంచి రూ. 21,405 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్ ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ రూ.184 కోట్లు కూడా ఉన్నాయి. ఎన్ఐఐ ఆదాయం బ్రోకరేజీ సంస్థల అంచనాల కంటే బాగుండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికరలాభం రూ. 5 కోట్ల నుంచి రూ. 2,514 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 27,174 కోట్ల నుంచి రూ. 33,869 కోట్లకు పెరిగింది. ♦ వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాన్ని మినహాయించి) రూ .3,247 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,085 కోట్ల కంటే ఎక్కువని బ్యాంక్ పేర్కొంది. ఈ బ్యాంక్ కేటాయింపులు గత ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.5,971 కోట్లుండగా ఇప్పుడు రూ.3,496 కోట్లకు తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్థూలంగా రూ.2,779 కోట్లు ఎన్పీఏలు జతయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్పీఏలు రూ.4,036 కోట్లకు పెరగ్గా, ఇప్పుడు తగ్గడం గమనార్హం. నిరర్ధక రుణా ల రికవరీలు రూ.931 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 6.70 శాతంగా ఉన్న స్థూల ఎన్ పీఏలు ఈ త్రైమాసికం నాటికి 6.49 శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏలు 8.81 శాతంగా ఉండడం తెలిసిందే. నికర ఎన్పీఏలు కూడా మార్చి త్రైమాసికంలో 2.06 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 1.77 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 4.19 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.19 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది. -
మరోసారి ఈడీ ముందుకు కొచర్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ మంగళవారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం దాదాపు ఎనిమిది గంటలపాటు వీరిని ఈడీ ప్రశ్నించింది . వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది. బ్యాంకు రుణాలమంజూరులో మోసం, నగదు బదిలీ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా గతంలో ఆయన్ని ప్రశ్నించింది. వీడియోకాన్ గ్రూప్ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ పునర్వ్యవస్థీకరించడంలో ఆయన పాత్ర గురించి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు రూ.1,875 కోట్ల మేర రుణాలివ్వడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఏడాది క్రితం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. చందా కొచర్ సహకారంతో ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకున్న ధూత్.. ప్రతిగా ఆమె భర్త దీపక్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్లో ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,170 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,170 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,141 కోట్లు) తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంట్లో ట్యాక్స్ రిఫండ్ ప్రయోజనాల కారణంగా రూ.440 కోట్లు, అనుబంధ కంపెనీల లాభం రూ.489 కోట్ల మేర ఉండటం విశేషం. అయితే స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.1 డివిడెండ్ను కంపెనీ ఇవ్వనున్నది. తగ్గిన స్టాండ్అలోన్ లాభం... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,020 కోట్లుగా ఉన్న నికర లాభం(స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 5 శాతం తగ్గి రూ.969 కోట్లకు చేరిందని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. స్టాండ్అలోన్ పరంగా నికర లాభం తగ్గినా, అనుబంధ కంపెనీల తోడ్పాటుతో ఈ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.33,760 కోట్ల నుంచి రూ.36,784 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్ల నుంచి 27 శాతం ఎగసి రూ.7,620 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతం నుంచి 3.72 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 15 శాతం పెరగ్గా, రుణాలు 17 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. గత క్యూ4లో రూ.7,300 కోట్ల బకాయిలను రద్దు చేశామని, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 60 శాతం నుంచి 80 శాతానికి ఎగసిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 7.75 శాతం నుంచి 7.38 శాతానికి తగ్గాయి. ఇతర ఆదాయం రూ.5,679 కోట్ల నుంచి 36 శాతం క్షీణించి రూ.3,621 కోట్లకు చేరింది. సగం తగ్గిన తాజా మొండి బకాయిలు.. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 40 శాతం తగ్గి రూ.3,363 కోట్లకు చేరింది. తాజా మొండి బకాయిలు దాదాపు సగం తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.28,730 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు గత ఆర్థి క సంవత్సరంలో రూ.11,039 కోట్లకు తగ్గాయి. మెరుగుపడిన రుణ నాణ్యత... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి 31 నాటికి 8.84 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31 నాటికి 6.70 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 4.77 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయని వివరించింది. ఇది 13 క్వార్టర్ల కనిష్ట స్థాయి అని పేర్కొంది. గత క్యూ4లో తాజా మొండి బకాయిలు రూ.3,547 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు వార్షికంగా తగ్గగా, సీక్వెన్షియల్గా మాత్రం పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,626 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత క్యూ4లో రూ.5,451 కోట్లకు తగ్గాయి. గత క్యూ3లో కేటాయింపులు రూ.4,244 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్ ముగిసిన తర్వా:త ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్0.11 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. అధ్వాన కాలం ముగిసింది మొండి బకాయిలు భారీగా పెరగడం, అవినీతి ఆరోపణలపై సీఈఓ చందా కొచర్ వైదొలగడం వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఈ బ్యాంక్.... అధ్వాన కాలం ముగిసినట్లేనని పేర్కొంది. రుణ నాణ్యతకు సంబంధించిన సైకిల్లో చివరి దశలో ఉన్నామని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. రానున్న కాలంలో మొండి బకాయిలు పేరుకుపోవడం తగ్గగలదన్న అంచనాలున్నాయన్నారు. వడ్డీ వ్యయాలు 1–1.2 శాతం రేంజ్లో ఉండేవని, కానీ మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా ఈ వ్యయాలు 3.5 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడి సాధారణ స్థాయికి వస్తాయని వివరించారు. -
23 శాతం తగ్గిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నికర లాభం
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.340 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.261 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,137 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.16,054 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్కు రూ.1.55 డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ ఎంబెడెడ్ వేల్యూ(ఈవీ) 15 శాతం పెరిగి రూ.21,623 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. -
కార్పొరేట్లకు ‘విదేశీ’ జోష్!
న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్ చోటు చేసుకోవడం దేశీయ పరిశ్రమకు ఉపశమనం వంటిదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పాక్షిక వాటాల విక్రయంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కంపెనీల నుంచి పూర్తిగా తప్పుకోవడం, ప్రమోటర్ల వాటాల ఉపసంహరణలు, తాజాగా ఈక్విటీల జారీ(క్యూఐపీ)తో నిధుల సమీకరణలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘గతేడాది ద్వితీయార్ధం నుంచి మార్కెట్ సెంటిమెంట్ నిద్రాణంగా ఉండగా, గత మూడు వారాల్లో ఇది మారిపోయింది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అనుజ్ కపూర్ తెలిపారు. మార్కెట్లో ఆదరణ డచ్ ఆర్థిక సేవల కంపెనీ ఐఎన్జీ గ్రూపు కోటక్ మహీంద్రాలో తనకున్న మొత్తం 3.06 శాతం వాటాను రూ.7,160 కోట్లకు విక్రయించింది. అలాగే ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబాస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో 9 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.4,751 కోట్లను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్లో బ్రిటన్కు చెందిన స్టాండర్డ్ లైఫ్ 5 శాతం వాటాలను రూ.3,634 కోట్లకు విక్రయించింది. రియల్టీ సంస్థ డీఎల్ఎఫ్ రూ.3,178 కోట్లు, లక్ష్మి విలాస్ బ్యాంకు రూ.421 కోట్ల మేర తాజాగా నిధుల సమీకరణను చేపట్టాయి. ఈ లావాదేవీలకు మార్కెట్లో మంచి ఆదరణే లభించడం గమనార్హం. అంతెందుకు, తాజాగా ముగిసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఫర్సేల్కు సైతం భారీ మద్దతు లభించింది. ఈ స్థాయిలో నిధుల రాకను మార్కెట్ సర్దుబాటు చేసుకోగలదంటున్నారు నిపుణులు. గత నెలలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు రూ.42,000 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఇన్వెస్టర్లలో ఆసక్తి తిరిగి పుంజుకోవడంతో బ్లాక్ డీల్స్, క్యూఐపీలు చోటు చేసుకుంటున్నాయి. నిధుల సరఫరా పరిస్థితులు ఇదే విధంగా ఆశాజనకంగా ఉంటే మరిన్ని లావాదేవీలు జరగొచ్చు’’ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ జీబీ జాకబ్ తెలిపారు. ఈ తరరహా అధిక లిక్విడిటీ మార్కెట్లోకి వచ్చినప్పుడు బ్లాక్ ట్రేడ్స్, క్యూఐపీలకు అవకాశం ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంటున్నారు. మరిన్ని నిధులు: అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇటీవలి ర్యాలీ, ఎన్నికల ఫలితాల పట్ల దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంట్తో మరిన్ని క్యూఐపీలు, బ్లాక్ డీల్స్, ఆఫర్ఫర్సేల్ చోటు చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణంతో ఐపీవో మార్కెట్లో ఇష్యూలు తిరిగి ఆరంభం అవుతాయని అనుజ్ కపూర్ తెలిపారు. ఇటీవలే ఎంబసీ నుంచి వచ్చిన తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)కు మంచి డిమాండ్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీవో మార్కెట్కు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు ఐపీవోలను చేపట్టిన విషయం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ఐపీవోలు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి డీల్స్ ఎక్కువగా జరుగుతున్నందున ఐపీవోలు వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందంటున్నారు. మొత్తం మీద ఐపీవో మార్కెట్ టర్న్అరౌండ్కు ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. -
పుంజులాయిడ్ దివాలాకు ఎన్సీఎల్టీ ఓకే!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్లాయిడ్కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్లాయిడ్ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ అనుమతించింది. ఎన్సీఎల్టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్లాయిడ్ స్టాక్ ఎక్ఛ్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్లోనే పుంజ్లాయిడ్కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్ను వ్యతిరేకించారు. పుంజ్లాయిడ్కు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందు లో ఐసీఐసీఐ బకాయి మొత్తం రూ.854 కోట్లు. -
చందా కొచర్, ధూత్ నివాసాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్తో పాటు వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దక్షిణ ముంబైలోని కొచర్ నివాసంలో, ఔరంగాబాద్లోని ధూత్ నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. కొచర్ నివాసంలో సోదాలు చేయడం ఇదే తొలిసారి. సీబీఐ ఇప్పటికే ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేట్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్పై ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ ఇచ్చిన రుణాల్లో అవకతవకలేమైనా జరిగాయా అన్న కోణంలో జరిగిన ప్రాథమిక విచారణ (పీఈ) అనంతరం చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధికార్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా వీడియోకాన్ గ్రూప్నకు రుణాల మంజూరీలో చందా కొచర్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల మంజూరీలో చందా కొచర్ పాత్ర కూడా ఉండటం, ఆ తర్వాత ఆమె భర్త దీపక్కి చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్లో ధూత్ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడవటంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్కి ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారాయి. -
చందా కొచర్కు ఈడీ షాక్!
న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వీడియోకాన్కు మంజూరు చేసిన రుణాల వివాదంలో ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చందా కొచర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈడీ.. చందా కొచర్తో పాటు వేణుగోపాల్ ధూత్ ఇంటిపై కూడా రైడ్ చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో.. అప్పటి సీఈఓ చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్ని దోషిగా తేల్చింది. అయితే అంతకు ముందే చందా కొచర్ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
చందా కొచర్పై లుక్ అవుట్ నోటీసు
న్యూఢిల్లీ: వీడియోకాన్కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్పై సీబీఐ తాజాగా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదైన వారం వ్యవధిలోనే నోటీసులపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. చందా కొచర్ స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి ఇప్పటిదాకా ఆమెకు సమన్లేమీ జారీ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు పారిపోకుండా నిలువరించేందుకు సీబీఐ లుక్ అవుట్ నోటీసును ఇమిగ్రేషన్ అధికారులకు పంపుతుంది. ఒకవేళ నిందితులు అటువంటి ప్రయత్నమేదైనా చేసిన పక్షంలో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, విచారణ సంస్థలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్ని దోషిగా తేల్చింది. అంతకు ముందే చందా కొచర్ రాజీనామా చేసినప్పటికీ కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
చందకొచర్కు కొత్త చిక్కులు తప్పవా?
-
ఎల్అండ్టీ ఇన్ఫో లాభం 33% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) నికర లాభం సుమారు 33 శాతం వృద్ధి చెంది రూ.375.5 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 282.8 కోట్లు. క్యూ3లో ఆదాయం 31 శాతం పెరిగి రూ. 1,884 కోట్ల నుంచి రూ. 2,473 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే నికర లాభం రూ. 400 కోట్ల నుంచి సుమారు 7 శాతం మేర క్షీణించగా, ఆదాయం మాత్రం రూ. 2,331 కోట్ల నుంచి 6 శాతం వృద్ధి సాధించింది. 2018 డిసెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య 27,513గా ఉంది. ఎన్ఐఐటీ ఆదాయం రూ. 972 కోట్లు న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ. 972 కోట్ల ఆదాయంపై రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే లాభం 33%, ఆదాయం 29% పెరిగాయి. 2017–18 క్యూ3లో ఆదాయం లాభం రూ. 76 కోట్లు. వివిధ మార్కెట్లలో విభాగాలన్నీ మెరుగ్గా రాణించడంతో ఆదాయం భారీగాగా పెంచుకోగలిగామని ఎన్ఐఐటీ టెక్ వైస్ చైర్మన్, ఎండీ అరవింద్ ఠాకూర్ తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్ జీఐ లాభం 239 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నికర లాభం సుమారు 3 శాతం వృద్ధి చెంది రూ. 239 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 232 కోట్లు. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,020 కోట్ల నుంచి రూ. 2,416 కోట్లకు చేరింది. 2019 మే 1 నుంచి మరో అయిదేళ్ల పాటు భార్గవ్ దాస్గుప్తాను ఎండీ, సీఈవోగా కొనసాగించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్బీఐ లైఫ్ లాభంలో 15% వృద్ధి న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎస్బీఐ లైఫ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ. 264 కోట్లకు చేరింది. ఇది అంతక్రితం క్యూ3లో రూ.230 కోట్లు. ఆదాయం రూ.9,586 కోట్ల నుంచి రూ.12,156 కోట్లకు పెరిగింది. ఏయూఎం రూ. 1,11,630 కోట్ల నుంచి రూ. 1,34,150 కోట్లకు చేరింది. -
ఐసీఐసీఐ డిపాజిట్ రేట్లు పావు శాతం పెంపు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్బీఐ రెండు సార్లు కీలక రేట్లను పెంచడం, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మార్కెట్లలో అధిక అస్థిరత నెలకొనడంతో ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి కస్టమర్లలో తిరిగి ఆరంభమైందని ఐసీఐసీఐ రిటైల్ రుణాల విభాగం అధిపతి ప్రణవ్మిశ్రా చెప్పారు. రెండేళ్లకు పైగా, మూడేళ్లలోపు కాల వ్యవధి కలిగిన రూ.కోటి లోపు డిపాజిట్లపై బ్యాంకు ఇక నుంచి 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 46–60 రోజులు, 61–90 రోజులు, 91–120 రోజులు, 121–184 రోజుల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. ఏడాది నుంచి 389 రోజుల డిపాజిట్పై మాత్రం వడ్డీ రేటును 0.15 శాతం పెంచింది. అలాగే, 390 రోజుల నుంచి రెండేళ్ల వరకు కాల డిపాజిట్లపై వడ్డీ రేటును 0.10% పెంచింది. గురువారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్లోకి ఫస్ట్ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్గా చందా కొచర్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ డైరెక్టర్గా ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్ నియామకం దాదాపు ఖరారైంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్గా చందా కొచర్కు అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఓటు వేసింది. ఆగష్టు 30, గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలోఈ మేరకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. వీడియోకాన్ గ్రూప్కు ఇచ్చిన రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చందా కొచర్ను సెలవుపై పంపారు. ఆమెపై ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతుండగా, 2018 జూలై 19 నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్గా చందా కొచర్కు అనుకూలంగా ఓటు వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఐసీఐసీఐ వీడియోకాన్ రుణాల కుంభకోణంలో ప్రధాన ఆరోపణల నేపథ్యంలో సెలవులో ఉన్న ఆమెకు కంటితుడుపు చర్యగా ఈ డైరెక్టర్ పదవిని కట్టబెడుతున్నారని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ, ఇన్గవర్న్ విమర్శించిందికాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీలో ఐసీఐసీఐ బ్యాంక్కు 80 శాతం వాటా ఉంది. -
ఐసీఐసీఐ సిఇఒ చందా కోచ్చర్కు కొత్త కష్టాలు
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా గిరీశ్ చతుర్వేది
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా గిరీశ్ చతుర్వేది
సాక్షి,ముంబై: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా గిరీశ్ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేదిని పార్ట్టైమ్ ఛైర్మన్గా నియమిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో (జూన్,30) ముగియనుంది. ఛైర్మన్గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు ఈ నియమకాన్ని చేపట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న ఎండీ మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు సమ్మతించింది.1977 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. -
‘ఐసీఐసీఐ‘ సన్నిహిత సంస్థలపై నిఘా!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు నుంచి పలు కంపెనీలకు రుణాల జారీ వెనుక బ్యాంకు చీఫ్ చందాకొచర్కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. ఈ వివాదంలో బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలను కలిగిన పలు కంపెనీలకు సంబంధించి పరిశీలన మొదలు పెట్టినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వివాదంలో పేర్లు బయటకు వచ్చిన కంపెనీలకు సంబంధించి మోసపూరిత, ప్రిఫరెన్షియల్ లేదా విలువ తక్కువ చేసి చూపించిన లావాదేవీల ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహారాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ చూడడం లేదని, ఇది పూర్తిగా ఆర్బీఐ పరిధిలోని అంశమని ఆ అధికారి స్పష్టం చేశారు. ఆయా కంపెనీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక ‘నీకది, నాకిది’ రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. వీడియోకాన్ గ్రూపు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత చందాకొచర్ భర్త దీపక్ కొచర్కు చెందిన నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీలోకి నిధుల్ని మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ చీఫ్ చందాకొచర్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు గత నెలలోనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్నుప్రకటించింది. గెలాక్సీ ఎస్9, ఎస్ 9 ప్లస్ డివైస్లపై ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, లేదా పేటీఎం మాల్ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ .9000 క్యాష్బ్యాక్ ఆఫర్ చేస్తోంది. జూన్ 30వ తేదీవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అదనంగా మరో 9వేల రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్, వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు శాంసంగ్ టీజర్ను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్9 64 జీబీ వేరియంట్ ధర, రూ. 57,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 61,900, 256జీబీ వేరియంట్ ధర రూ .65,900 గా ఉంది. అయితే, ఎస్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 64,900 రూపాయలు, 128 జీబీ వేరియంట్ ధర 68,900 రూపాయలు , 256 జీబీ వేరియంట్ ధర 72,900 రూపాయలు లభిస్తుంది. తాజాగా వీటిపై 9వేల భారీ తగ్గింపు లభ్యం. గడువు తేదీ ముగిసిన 90 రోజుల తరువాత కస్టమర్ల ఖాతాలోకి ఈ డిస్కౌంట్ను క్రెడిట్ చేస్తుంది. అలాగే ఫోన్లను కొనుగోలు చేసిన బిల్లును వినియోగదారులు 180 రోజుల లోపు కంపెనీకి అందించాల్సి ఉంటుంది. Remix your everyday with Super Slow-mo on the reimagined camera of Samsung #GalaxyS9 and #GalaxyS9Plus. Get one time screen replacement* and INR 9000.00 cashback* on ICICI Bank Credit Cards or Paytm mall. Move up now: https://t.co/x6LDp29WsO pic.twitter.com/Xyk2esgrUB — Samsung Mobile India (@SamsungMobileIN) June 2, 2018 -
చందా కొచర్: మరో భారీ కుంభకోణం
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ వివాదం ఉచ్చు బ్యాంకు సీఈఓ చందా కొచర్ చుట్టూ మరింత దృఢంగా బిగుస్తూ వుండగానే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ రుణ వివాదాన్ని వెలికి తీసిన అరవింద్ గుప్తానే చందా కొచర్ దంపతులపై మరోసారి తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. మారిషస్ కంపెనీల ద్వారా భారీగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్ లబ్ది పొందినట్లు ఆరోపించారు. ఇందులో ఎస్సార్ గ్రూపు రుయా బ్రదర్స్ కీలక పాత్ర పోషించారనీ, తద్వారా సుమారు రూ. 453 కోట్లు దీపక్ కొచర్ కంపెనీ నూ పవర్ గ్రూప్నకు మళ్ళినట్లు ఆయన ఆరోపించారు. మొత్తం కంపెనీ రుణం 102 కోట్ల డాలర్లు కాగా... ఇందులో 25 శాతం పైగా రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే 35 కోట్ల డాలర్ల రుణం ఇచ్చిందన్నారు. ఈ లావాదేవీలు అన్నింటిపైనా దర్యాప్తు చేయాలనీ, ఈ నిధులు ఎలా బదిలీ అయ్యాయో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల పత్రాలను మే 11న ప్రధాని సహా, సంబంధిత మంత్రిత్వ శాఖ, రెగ్యులేటరీ సంస్థలకు పంపారు. రుయా సోదరుల్లో ఒకరైన రవి రుయా కుమార్తె స్మితి రుయా భర్త నిషాంత్ కనోడియాకు మారిషస్లో మాటిక్స్ అనే గ్రూప్ ఉంది. మారిషస్లోని ఎస్సార్ గ్రూప్ ప్రధాన కంపెనీ ఎస్సార్ క్యాపిటల్ హోల్డింగ్ కంపెనీ నిషాంత్ కనోడియాకు చెందిన మాటిక్స్ గ్రూప్ కంపెనీ మాటిక్స్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లో రూ. 163.53 కోట్లు పెట్టుబడి పెట్టింది. మాటిక్స్ ఫర్టిలైజర్స్ షేర్లను భారీగా కొనుగోలు చేసింది. 2010 డిసెంబర్ నుంచి 2012 మార్చి 21వ తేదీ మధ్య కాలంలో చందా కొచర్ భర్తకు చెందిన నూ పవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో మాటిక్స్ గ్రూప్ రూ. 324.37 కోట్లు పెట్టుబడి పెట్టింది. తమ గ్రూప్నకు చెందిన ఫస్ట్ల్యాండ్ హోల్డింగ్స్ అనే కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి పెట్టుబడి కాగా రెండో పెట్టుబడి రుయాల మేనల్లుడైన అనిరుధ్ భూవల్కాకు చెందిన కంపెనీల ద్వారా చందా కొచర్ భర్త కంపెనీకి నిధులు వచ్చాయి. ఎస్సార్ గ్రూప్నకు చెందిన ఏషియా మోటార్ వర్క్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ దీపక్ కొచర్కు చెందిన నూ పవర్ టెక్నాలజీస్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. నేరుగా పెట్టుబడులు పెట్టడం కాకుండా ఎఎండబ్ల్యూ మోటార్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా రూ. 197 కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నష్టాల్లో కూరుకుపోయిన నూ పవర్ టెక్నాలజీస్ని, కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న భారీ రుణాలకు గాను భర్త దీపక్ కొచర్ నుంచి భారీ మొత్తంలో కంపెనీ కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. ఎస్సార్ స్టీల్ మినెసొటా (అమెరికా) అలగొమా స్టీల్ (కెనడా) కంపెనీల కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన విదేశీ శాఖలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయని తెలిపారు. సింగపూర్, బ్రిటన్, న్యూయార్క్లోని తమ శాఖల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణాలు ఇచ్చిందన్నారు. 2010లో ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు 53 కోట్ల డాలర్ల రుణాన్ని లీడ్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సార్ గ్రూప్కు ఇచ్చింది. అలాగే బ్రిటన్లోని స్లాన్ఫ్లో రిఫైనరీ కొనుగోలు కోసం మరో 35 కోట్ల డాలర్ల రుణాన్ని ఎస్సార్ ఆయిల్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ఆరోపించారు. చందా కొచర్ భర్తకు నూ పవర్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే నూ పవర్ రెన్యూవల్ ఎనర్జీ కంపెనీలోకి వీడియోకాన్ నిధుల తరలింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తాజాగా ఇదే కంపెనీలోకి మారిషస్ నుంచి ఎస్సార్ గ్రూప్ నిధులు వచ్చాయనేది అరవింద్ గుప్తా ఆరోపణ. ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్ శశిరూయా అల్లుడు నిషాంత్ కనోడియా నుంచి రూ. 324.37 కోట్లు నూ పవర్ గ్రూప్లోకి రాగా, రుయాల మేనల్లుడు అనిరుధ్ భూవాల్కా కంపెనీల ద్వారా రూ. 197 కోట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఐసీఐ,ఎస్సార్ గ్రూపు ఖండన అయితే ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. ఎస్సార్ గ్రూప్కు తాము ఒక్కరమే రుణం ఇవ్వలేదని, ఏడు బ్యాంకుల కన్సార్టియం రుణాలనిచ్చినట్టు వాదించింది. అటు అరవింద్ గుప్తా ఆరోపణలపై ఎస్సార్ గ్రూప్ స్పందిస్తూ ఉద్దేశపూర్వక ఆరోపణలంటూ తీవ్రంగా ఖండించింది. నూ పవర్లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్తో తమ గ్రూప్నకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. త్వరలోనే తమ వైఖరిని బహిరంగంగా తెలియజేస్తామని పేర్కొంది. 1980 నుంచి తాము ఐసీఐసీఐతో లావాదేవీలు నిర్వహిస్తున్నామనీ, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఎస్సార్ గ్రూప్ స్పష్టం చేసింది. అటు మాటిక్స్ గ్రూప్ కూడా తమకు ఐసీఐసీఐ బ్యాంక్కు సంబంధం లేదని,తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని వెల్లడించింది. ఫస్ట్ల్యాండ్ హోల్డింగ్స్తో ఎస్సార్కు సంబంధం లేదని తెలిపింది. అలాగే కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న రంగంలో ఉన్నందున నూ పవర్లో తాము పెట్టుబడులు పెట్టామని మాటిక్స్ పేర్కొంది. తరవాత ఆ కంపెనీ నుంచి వైదొలగామని వెల్లడించింది. కాగా వీడియోకాన్-ఐసీఐసీఐ రుణాల కుంభకోణాన్ని 2016 మార్చిలో అరవింద్గుప్తా వెలుగులోకి తెచ్చారు. -
కొచర్ సెలవుపై రగడ.. వివరణ ఇచ్చిన బ్యాంక్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) చందా కొచర్ను స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు మీద వెళ్లాల్సిందిగా బ్యాంక్ బోర్డు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను బ్యాంక్ బోర్డు తోసిపుచ్చింది. ‘ఇండిపెండెంట్ బోర్డు విచారణ పూర్తయ్యేంతవరకు కొచర్ను సెలవు మీద వెళ్లాల్సిందిగా మేం కోరినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. ఆమె వార్షిక సెలవులో ఉన్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే కొచర్ సెలవు తీసుకున్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి బలవంతం లేదు’ అని బ్యాంక్ బోర్డు పేర్కొంది. చందా కొచర్ వారసులను ఎంపిక చేసేందుకు ఎలాంటి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయలేదని కూడా స్పష్టం చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్నకు రుణ మంజూరీ విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొచర్పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. -
చందా కొచర్కు షాక్.. ఐసీఐసీఐ ఖండన!
వీడియోకాన్ కుంభకోణంలో తమ సీఈవో చందాకొచర్కు షాక్ ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. వీడియోకాన్ కుంభకోణంలో స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు చందా కొచర్ను సెలవు మీద వెళ్లాల్సిందిగా ఐసీఐసీఐ బోర్డు ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను తోసిపుచ్చిన ఐసీఐసీఐ.. చందా కొచర్ ప్రస్తుతం వార్షిక సెలవులో ఉన్నారని, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఆమె సెలవు తీసుకున్నారని వెల్లడించింది. వీడియోకాన్ సంస్థకు రుణాల విషయంలో చందా కొచర్పై క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీడియోకాన్కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. చందా కొచర్ భర్త దీపక్ కొచర్కు చెందిన కంపెనీలో వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్ 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు ఇటీవల వెలుగుచూసింది. అంతకుముందు ఆమె నేతృత్వంలోని ఐసీఐసీఐ కన్సార్షియం వీడియోకాన్కు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా గుర్తించడంతో ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ స్కాం విషయంలో కొచర్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని గతంలో ఐసీఐసీఐ బాసటగా నిలిచింది. అయితే, ఈ నెల 29న జరిగిన ఐసీఐసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కొచర్ను సెలవు మీద పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు అన్ని తప్పేనని, తాము అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికార ప్రతినిధి వెల్లడించారు. -
చందా కొచర్పై ఐసీఐసీఐ యూటర్న్
ముంబై: వీడియోకాన్ గ్రూప్నకు రుణాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎండీ, సీఈవో చందా కొచర్పై విచారణ జరపాలని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు తీర్మానించింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై బోర్డు చర్చించి... స్వతంత్ర ఎంక్వైరీకి ఆదేశించినట్లు బుధవారం స్టాక్ ఎక్స్చేంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ‘స్వతంత్రమైన, విశ్వసనీయమైన వ్యక్తి సారథ్యంలో ఈ విచారణ జరుగుతుంది‘ అని వివరించింది. వాస్తవాలను పరిశీలించి, అవసరమైతే ఫోరెన్సిక్స్ దర్యాప్తు, ఈమెయిల్స్ను సమీక్షించడం, సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్స్ను రికార్డు చేయడం మొదలైన అంశాలతో విచారణ సమగ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం తగిన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఆడిట్ కమిటీకి బోర్డు అప్పగించింది. కొన్నాళ్ల క్రితమే క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చినప్పుడు కొచర్ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని బాసటగా నిల్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు... తాజాగా విచారణకు ఆదేశించడం గమనార్హం. తన కుటుంబీకులకు లబ్ధి చేకూర్చేలా కొందరు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తూ బ్యాంకు సీఈవో హోదాలో చందా కొచర్ క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిపారని, బ్యాంకు నైతిక నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రావడం తెలిసిందే. వివాదమిదీ..: తన భర్త దీపక్ కొచర్కి చెందిన న్యూపవర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా.. వీడియోకాన్ గ్రూప్నకు రుణాల మంజూరు విషయంలో చందా కొచర్ వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చాయి. రుణం లభించినందుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్ తీసుకున్న ఈ రుణాలు మొండిబాకీలుగా మారాయి. మరోవైపు, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిశాంత్ కనోడియాకి చెందిన ఫస్ట్ల్యాండ్ హోల్డింగ్స్ నుంచి కూడా 2010లో న్యూపవర్లోకి రూ. 325 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అదే ఏడాది ఎస్సార్ స్టీల్ మినెసోటాకి ఐసీఐసీఐ బ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణమిచ్చింది. ఇది కూడా ప్రస్తుతం మొండిబాకీగా మారడం సందేహాలకు తావిస్తోంది. ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్ కార్యకలాపాలపై 2016లో ఆర్బీఐ విచారణ కూడా జరిపింది. -
దిగొచ్చిన ఐసీఐసీఐ : కష్టాల్లో చందా కొచర్
సాక్షి, ముంబై : వీడియోకాన్-ఐసీఐసీ స్కాంలో ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంకు దిగి వచ్చింది. ఈ కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది. రుణాల వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్పై ఆరోపణలను మొదట్లో కొట్టిపారేసిన బ్యాంకు, తాజాగా వాటిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఏకసభ్య కమిటీని నియమించింది. బ్యాంక్ నియమావళిని ఎలా ఉల్లంఘనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలుబ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపిందన్న కోణంలో విచారణ సాగుతుందని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. బ్యాంక్ నియమావళిని ఉల్లంఘించిన కేసులో చందా కొచర్ను ఐసీఐసీఐ బ్యాంక్ విచారించనున్నది. దీని కోసం బ్యాంక్ బోర్డు.. ప్రత్యేక ప్యానల్ను ఏర్పాటు చేసింది. వీడియోకాన్ సంస్థకు రూ. 3,800 కోట్ల రుణ వ్యవహారంలో చందాకొచ్చర్ సాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2012లో వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణం ఇచ్చింది. వీడియోకాన్ గ్రూప్కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచర్ భర్త దీపక్ కొచర్, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. వీడియోకాన్కిచ్చిన వేలకోట్ల రుణం 2017నాటికి మొండి బకాయిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్కు కొచర్ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇందులో చందాకొచర్ ప్రమేయం ఏమీ లేదని అప్పట్లో ఐసీఐసీఐ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, చందాకొచ్చర్పై తమకు పూర్తి విశ్వాసం ఉందని గట్టిగా వాదించడం, ఈ విషయంలో ఐసీఐసీఐ బోర్డులో కూడా విభేదాలొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. చందాకొచర్ భర్త దీపక్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్లను అనుమానితులుగా చేర్చింది. -
దీపక్ కొచర్కు మళ్లీ ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో బ్యాంకు సీఈఓ చందా కొచర్ భర్త దీపక్ కొచర్కు ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేత అంశాన్ని ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. దీపక్ కొచర్కు వ్యక్తిగత హోదాలోనే ఈ నోటీసులు జారీ చేశామని, నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీ ఎండీగా దీపక్ కొచర్ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల వివరాలు కోరామని ఐటీ వర్గాలు తెలిపాయి. పది రోజుల్లోగా డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. మారిషస్కు చెందిన రెండు సంస్థల (ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్స్) నుంచి నూపవర్ రెన్యువబుల్స్లోకి రూ.325 కోట్ల నిధుల రాకపై ఐటీ శాఖ తన దర్యాప్తులో ప్రత్యేకంగా దృష్టి సారించింది. -
గీతాంజలికి ఐసీఐసీఐ రుణాలపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆభరణాల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం ఇచ్చిన రుణాలపై తాజాగా సీబీఐ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని 31 బ్యాంకుల కన్సార్షియం.. గీతాంజలి గ్రూప్నకు రూ. 5,280 కోట్ల మేర రుణాలిచ్చాయి. దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మలను మార్చి 6న ఎస్ఎఫ్ఐవో ప్రశ్నించింది. సీబీఐ ప్రస్తుతం పీఎన్బీని వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును దర్యాప్తు చేస్తోంది. పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై తీసుకున్న నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎల్వోయూ)ల ద్వారా మోదీ తదితరులు ఈ కుంభకోణానికి తెరతీశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బహ్రెయిన్లోని కెనరా బ్యాంక్ అధికారులు ఇద్దరిని, యాంట్వెర్ప్ (బెల్జియం)లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరినికి సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. -
ఐసీఐసీఐపై ఫిచ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంతో ఇబ్బందుల్లో పడ్డ ఐసీఐసీఐ బ్యాంకు ప్రాభవం మరింత మసకబారుతోంది. తాజాగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుపై ఆరోపణలు సంస్థ రిపుటేషన్ను దెబ్బతీస్తుందని పేర్కొంది. సీబీఐ విచారణ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని తెలిపింది. అంతేకాదు ఐసీఐసీఐలో గవర్నెన్స్పై ప్రశ్నలు తలెత్తాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం వ్యాఖ్యానించింది. బ్యాంకుపై ఆరోపణలను దర్యాప్తు సంస్థ రుజువు అయితే..భారీ ఆర్థిక జరిమానా ప్రమాదంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీవ్రంగానే ఉండనున్నాయని ఫిచ్ అంచనా వేసింది. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన రుణ కేటాయింపు వివాదాన్ని పరిశీలిస్తున్నామని..దీనికనుగుణంగా తదుపరి రేటింగ్ను అంచనా వేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు కీర్తి , ఆర్థిక ప్రొఫైల్కు నష్టాలు గణనీయంగా పెరగడం లాంటి ఇతర పరిణమాల నేపథ్యంలో తగిన రేటింగ్ తీసుకుంటామని తెలిపింది. అలాగే స్వతంత్ర దర్యాప్తునకు బ్యాంకు అయిష్టతను ప్రకటించడం కార్పొరేట్ పాలనా పద్ధతిపై బలమైన సందేహాలను కలగిస్తోందని ఫిచ్ అభిప్రాయపడింది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలీస్తే ఐసీఐసీఐలాంటి ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెర్స్ పటిష్టంగా ఉంటుందనేది తమ విశ్వాసంగా ప్రకటించింది. మెరుగైన-అర్హత కలిగిన బోర్డు సభ్యులు, వృత్తిపరమైన నైపుణ్య నిర్వహణ అంశాల కారణంగా కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా వుంటుందని పేర్కొంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డ్యామేజ్ కంట్రోల్లో పడింది. టాప్ పెట్టుబడిదారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లు మరిన్నివివరాలు కావాలంటూ డిమాండ్ చేశారు. అటు బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త దీపక్ సోదరుడు రాజీవ్ కొచర్ను వరుసగా అయిదవ రోజు కూడా సీబీఐ విచారిస్తోంది. అటు ఐసీఐసీఐలో 12.3 శాతం అధిక వాటా కలిగి వున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కూడా ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. -
వివాదాల్లో చిక్కుకున్న బ్యాంకింగ్ రాణులు
-
ఐసీఐసీఐ స్కాం: ప్రభుత్వ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. బ్యాంకు బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్గా ఉన్న అమిత్ అగర్వాల్ స్థానంలో లోక్ రంజన్ను నియమించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రంజన్ నియమాకం ఏప్రిల్ 5నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు సమాచారం అందించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరోవైపు 3,250 కోట్ల రూపాయల స్కాం ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబీఐ.. చందా కొచ్చర్ భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్పై ప్రాథమిక విచారణ చేపట్టింది. అటు ఈ వివాదంలో అవిస్టా సంస్థపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మూడురోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న దీపక్ కొచ్చర్ సోదరుడు విజయ్ కొచ్చర్ను శనివారం కూడా విచారిస్తోంది. -
చందా కొచర్కు మరో షాక్
-
చందా కొచర్కు మరో షాక్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంలో సీబీఐ చురుకుగా కదులుతోంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. ముంబై విమానాశ్రయంనుంచి సింగపూర్ వెళుతుండగా అతనిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ కేసులో చందాకొచర్ కుటుంబానికి చెందిన సన్నిహితుడిని సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో మరింత విచారణ చేపట్టే క్రమంలో రాజీవ్ను అదుపులోకి తీసుకుంది. అతణ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చందాకొచర్ భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ధూత్పై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ,అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఇంతవరకూ దీపక్ను ప్రశ్నించలేదు. కానీ, దీపక్ కొచర్కుచెందిన న్యూపవర్రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల విలువైన రుణాల మంజూరు సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచర్పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తును వ్యతిరేకించింది. కాగా ఈ రుణ వివాదంలోకి తాజాగా దీపక్ సోదరుడు, చందా కొచర్ మరిది.. రాజీవ్ కొచర్కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్వ్యవస్థీకరణ సేవలు అందించిందనీ, అవిస్టా సేవలు పొందిన వాటిల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, జైప్రకాశ్ పవర్లతో పాటు వీడియోకాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్ తదితర కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని రాజీవ్ కొచర్ ఖండించిన సంగతి తెలిసిందే. భారతీయ బ్యాంకులతో ఎలాంటి సిండికేషన్ ఉండకూడదనే ఒక నియమాన్ని తాము పెట్టుకున్నామన్నారు. ఈక్రమంలో చందా కొచర్ సీఈవోగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇండోనేషియా, దుబాయ్లోని కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదేదో కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా రాజీవ్ కొచర్ కొట్టిపారేశారు. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్.. ప్చ్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో పేలవంగా లిస్టయ్యాయి. ఇష్యూ ధర, రూ.520తో పోలిస్తే బుధవారం 17 శాతం నష్టంతో రూ.431 వద్ద బీఎస్ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్ రూ.431, రూ.463 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 14.4 శాతం నష్టంతో రూ.445 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 13.15 లక్షలు, ఎన్ఎస్ఈలో 74.17 లక్షలు చొప్పున షేర్లు ట్రేడయ్యాయి. మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,337 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకు హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ నుంచి, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కంపెనీ ఐపీఓ 86 శాతమే సబ్స్క్రైబయింది. దీంతో కంపెనీ రూ.4,000 కోట్ల లక్ష్యానికి గాను, రూ.3,515 కోట్ల నిధులను మాత్రమే సమీకరించింది. -
ఐసీఐసీఐ: తొలిసారి స్పందించిన సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ - వీడియోకాన్ రుణ వివాదం విషయంలో ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదని కార్పొరేట్ వ్యవహరాల శాఖ (ఎంసీఏ) సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రిజర్వ్బ్యాంక్ ఈ కేసును పరిశీలిస్తోందని తెలిపారు. మరోవైపు సీఈవో చందా కొచర్కు ఇప్పటికే పూర్తి మద్దతును ఐసీఐసీఐ బోర్డు ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా ఆమెపై స్వతంత్ర దర్యాప్తునకు ఐసీఐసీఐ అంగీకరించలేదు. దాదాపు 3250 కోట్ల రూపాయల వీడియోకాన్-ఐసీఐసీఐ రుణ వ్యవహారాన్నివెలుగులో తెచ్చిన అరవింద్ గుప్తా ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేసిన నేపథ్యంలో బాహ్య ఏజెన్సీలతో స్వతంత్ర దర్యాప్తును బ్యాంకు వ్యతిరేకించింది. చందా కొచర్ భర్త దీపక్ కొచర్తో బిజినెస్ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్కు గ్రూపునకు రుణాలిచ్చారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటికే దర్యాప్తును మొదలుపెట్టింది. ముఖ్యంగా వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్, దీపక్కొచర్ పై ప్రాథమిక దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ మేరకు కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారుల పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్ కొచర్కు చెందిన న్యూపవర్ రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 15శాతం నష్టం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిస్టింగ్లో నష్టాలను మూటగట్టుకుంది. బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఇది 17 శాతం(రూ. 89) నష్టపోయి రూ. 431వద్ద ప్రారంభమైంది. చివరికి 15 శాతం నష్టంతో ముగిసింది. అయితే దీని ఈక్వీటీ షేరు ఇష్యూ ధర రూ. 520. కాగా ఇష్యూకి 78 శాతమే సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ పోర్షన్తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిమాణాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది. -
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
-
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
ముంబై, న్యూఢిల్లీ : కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. క్విడ్ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీడియోకాన్ గ్రూప్నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సందేహాస్పదమయిందని అనిపించకమానదు. ఒక పరిశోధనాత్మక కథనం ప్రకారం డిసెంబర్ 2008లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్తో పాటు ఆమె మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... ఆపై కేవలం రూ.9 లక్షలకు న్యూపవర్లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్కి బదలాయించేశారు. అయితే, వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ‘న్యూపవర్’ కంపెనీ చేతులు మారటం చర్చనీయమైంది. ఇందులో లబ్ధిదారు చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబీకులు కావడంతో ఆమె పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) కట్టనే లేదు. 2017లో వీడియోకాన్ ఖాతాను మొండిపద్దుగా వర్గీకరించారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. న్యూపవర్ ఆర్థిక పరిస్థితి ఇదీ.. 2008 డిసెంబర్లో ఏర్పాటైన న్యూపవర్.. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా నష్టాలు ప్రకటిస్తూనే ఉంది. 2012–17 మధ్య కంపెనీ నష్టాలు రూ.78 కోట్ల మేర పేరుకుపోయాయి. 2017లో రూ.14.3 కోట్ల నష్టం ప్రకటించింది. 2016 మార్చి 31 నాటి దాకా సుప్రీమ్ ఎనర్జీ, పినాకిల్ ఎనర్జీలతో పాటు కొచర్కి న్యూపవర్లో 96.23 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, 2017 మార్చి నాటికి సుప్రీమ్, పినాకిల్తో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా దీపక్ కొచర్ వాటాలు 43.4 శాతంగా ఉన్నాయి. మిగతా వాటాలు మారిషస్కి చెందిన డీహెచ్ రెన్యూవబుల్స్ చేతిలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏమంటుందంటే.. తాజా వ్యవహారంపై ఐసీఐసీఐ స్పందిస్తూ... ‘‘2012లో ఎస్బీఐ సారథ్యంలో 20 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి చమురు, గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాల కోసం వీడియోకాన్కు సుమారు రూ.40,000 కోట్లు రుణాలిచ్చాయి. ఇందులో మా వాటా కేవలం రూ.3,250 కోట్లే. మిగిలిన బకాయి రూ.2,810 కోట్లు.. వడ్డీతో కలసి వీడియోకాన్ చెల్లించాల్సింది రూ.2,849 కోట్లు. 2017లో గ్రూప్ ఖాతాను మొండి పద్దుగా వర్గీకరించాం’’ అని వివరణిచ్చింది. దీనిపై ఐసీఐసీఐ చైర్మన్ ఎం.కె. శర్మ మాట్లాడుతూ... కన్సార్షియంలో ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాకే 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కమిటీ తన వంతు రుణం మంజూరు చేసిందని చెప్పారు. సదరు కమిటీకి అప్పట్లో చందా కొచర్ చైర్పర్సన్గా లేరని స్పష్టం చేశారు. బ్యాంకులో ఏ స్థాయి ఉద్యోగైనా సరే రుణ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. 2009లోనే వదిలేశా: ధూత్ ‘‘నేను 2009లోనే న్యూపవర్ రెన్యువబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ సంస్థల నుంచి వైదొలిగాను. న్యూపవర్లో 24,996 షేర్లను, సుప్రీమ్ ఎనర్జీలో 9,990 షేర్లను అమ్మేసి పూర్తి హక్కులను వదులుకున్నాను. చమురు, టెలికం వ్యాపారాలతో బిజీ అయిపోవడంతో.. ఆ రోజు నుంచి రెండు కంపెనీలతో సంబంధాలు వదులుకున్నాను’’ అని ధూత్ వివరించారు. కానీ ఆర్ఓసీలో దాఖలు చేసిన ఫైలింగ్స్ ప్రకారం చూస్తే 2010 అక్టోబర్ దాకా సుప్రీం ఎనర్జీకి ఆయన యజమానిగా కొనసాగినట్లు, 2010 నవంబర్లో మాత్రమే తన షేర్లను అనుచరుడు పుంగ్లియాకు బదలాయించినట్లుగా తెలుస్తోంది. న్యూపవర్ వివరణ ఇదీ.. ఈ లావాదేవీల్లో పరస్పరం ప్రయోజనాలు పొందారనడానికేమీ లేదని న్యూపవర్ వివరణనిచ్చింది. అసలు పినాకిల్ ఎనర్జీ ట్రస్టుకు గానీ, సుప్రీమ్ ఎనర్జీకి గానీ ఐసీఐసీఐ బ్యాంకుతో ఎలాంటి వ్యాపార సంబంధాలూ లేవని స్పష్టం చేసింది. లావాదేవీలు జరిగాయిలా.. ♦ 2008 డిసెంబర్లో దీపక్ కొచర్, వేణుగోపాల్ ధూత్లు కలసి న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్పీఎల్) ఏర్పాటు చేశారు. ఇందులో ధూత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సంబంధీకులకు 50 శాతం వాటాలుండేవి. అలాగే దీపక్ కొచర్కి, ఆయన తండ్రికి చెందిన పసిఫిక్ క్యాపిటల్ సంస్థకు, చందా కొచర్ సోదరుడి భార్యకు మిగతా 50 శాతం వాటాలుండేవి. ♦ 2009 జనవరిలో న్యూపవర్ డైరెక్టర్ పదవికి ధూత్ రాజీనామా చేశారు. రూ. 2.5 లక్షల మొత్తానికి కంపెనీలో తనకున్న 24,999 షేర్లను దీపక్ కొచర్కి బదలాయించారు. ♦ 2010 మార్చిలో సుప్రీమ్ ఎనర్జీ అనే సంస్థ నుంచి న్యూపవర్కి రూ.64 కోట్ల రుణం (ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ రూపంలో) లభించింది. ఈ సుప్రీమ్ ఎనర్జీలో ధూత్కి 99.9 శాతం వాటాలు ఉన్నాయి. ♦ ధూత్ నుంచి కొచర్కి.. ఆ తర్వాత కొచర్ కుటుంబీకులకు చెందిన పసిఫిక్ క్యాపిటల్ నుంచి షేర్లు సుప్రీమ్ ఎనర్జీకి ఒక ఒక పద్ధతి ప్రకారం న్యూపవర్ షేర్ల బదలాయింపు జరిగింది. ఫలితంగా 2010 మార్చి ఆఖరుకు న్యూపవర్లో సుప్రీమ్ ఎనర్జీ 94.99 శాతం వాటాదారుగా అవతరించింది. మిగతా వాటాలు కొచర్ పేరిటే ఉండిపోయాయి. ♦ 2010 నవంబర్లో ధూత్ సుప్రీమ్ ఎనర్జీలో తనకున్న మొత్తం వాటాలను.. తన అనుచరుడు మహేష్ చంద్ర పుంగ్లియాకు బదలాయించారు. ♦ ఈ పుంగ్లియా.. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 ఏప్రిల్ 29 మధ్య తన వాటాలను పినాకిల్ ఎనర్జీ అనే ట్రస్టుకు బదలాయించారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా దీపక్ కొచర్ ఉన్నారు. ఈ షేర్ల విలువ రూ.9 లక్షలుగా చూపించారు. అంటే న్యూపవర్కి రూ. 64 కోట్ల రుణాలిచ్చిన ధూత్ సంస్థ సుప్రీమ్ ఎనర్జీ .. మూడేళ్ల వ్యవధిలో దీపక్ కొచర్కి చెందిన పినాకిల్ ఎనర్జీ అనే కంపెనీలో కలిసిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.59 కోట్ల జరిమానా బాండ్ల విక్రయ నిబంధనలు ఉల్లంఘించినందుకే... ముంబై: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. హెచ్టీఎం (హెల్డ్ టు మెచ్యూరిటీ) సెక్యూరిటీలను నేరుగా విక్రయించే విషయంలో మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఆర్బీఐ మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమలయ్యేవనే విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు వివరణ ఇచ్చింది. నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తామని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం తనకు లభించిన అధికారాల మేరకు, తాను జారీ చేసిన మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు పాటించకపోవడంతో జరిమానా విధించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పెట్టుబడులను హెల్డ్ ఫర్ ట్రేడింగ్ (హెచ్ఎఫ్టీ), అవైలబుల్ ఫర్ సేల్ (ఏఎఫ్ఎస్), హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ (హెచ్టీఎం) అని మూడు వర్గీకరణలు చేయాల్సి ఉంటుంది. హెచ్టీఎం కేటగిరీలో సెక్యూరిటీలు కాల వ్యవధి తీరే వరకు వాటికి కొనసాగించాలి. ఒకవేళ ఈ విభాగం నుంచి సెక్యూరిటీలను విక్రయించినట్టయితే, అది ఈ విభాగంలో అవసరమైన పెట్టుబడుల్లో 5 శాతానికి మించితే ఆర్బీఐకి తెలియజేయాలి. కానీ, ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేయలేదు. -
బ్రిటిష్ ఆసియన్స్లో ధనిక కుటుంబం.. హిందూజా
లండన్: హిందూజా కుటుంబం బ్రిటన్లోని బ్రిటిష్ ఆసియన్లలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 2017లో ఈ కుటుంబ సంపద విలువ 22 బిలియన్ పౌండ్లు. హిందూజా కుటుంబానికి ఈ తరహా గుర్తింపు లభించడం ఇది వరుసగా ఐదవ ఏడాది. నలుగురు సోదరులు– శ్రీచంద్ పీ హిందూజా, గోపీచంద్ పీ హిందూజా, ప్రకాశ్ పీ హిందూజా, అశోక్ పీ హిందూజా నేతృత్వంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్– 2017లో వీరి కుటుంబ సంపద విలువను అంతక్రితం ఏడాదితో పోల్చితే 3 బిలియన్ పౌండ్లు పెంచింది. బ్రిటన్కు చెందిన ఆసియన్ మీడియా గ్రూప్ (ఏఎంజీ) ప్రచురించిన వార్షిక ‘ఆసియన్ రిచ్ లిస్ట్’ తాజా వివరాలను తెలిపింది. రెండవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ జాబితాలో రెండవ స్థానం– ఇండియన్ స్టీల్ దిగ్గజం– లక్ష్మీ నివాస్ మిట్టల్కు దక్కింది. ఆయన సంపద 14 బిలియన్ పౌండ్లు. 2016లో ఈ విలువ 12.6 బిలియన్ పౌండ్లు. ఐదవ స్థానంలో అనిల్ అగర్వాల్ ►పెట్రోకెమికల్, టెక్స్టైల్స్ కంపెనీ– ఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియా 5.1 బిలియన్ పౌండ్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. ►నాల్గవ స్థానంలో 2.35 బిలియన్ పౌండ్లతో పాకిస్తానీ అన్వర్ పర్వేజ్ (బెస్ట్వే వ్యవస్థాపకులు) ఉన్నారు. ►రిటైల్ దిగ్గజాలు సిమన్, బాబీ అండ్ రాబిన్ అరోరా, మెటల్ కింగ్ అనిల్ అగర్వాల్లు 2.3 బిలియన్ పౌండ్ల సంపదతో సంయుక్తంగా ఐదవ స్థానంలో నిలిచారు. సంపద మొత్తం 80.2 బిలియన్ డాలర్లు... ►దక్షిణాసియాలో మూలాలు ఉన్న 101 మంది బ్రిటన్ మిలియనీర్ల సంపద మొత్తంగా చూస్తే, 2017లో 80.2 బిలియన్ పౌండ్లు. 2016తో పోల్చితే ఈ సంపద 11 బిలియన్ పౌండ్లు పెరిగింది. వీరిలో మొదటి 10 మంది ప్రముఖ బ్రిటిష్ ఆసియన్ల సంపద 54.25 బిలియన్ పౌండ్లు. మొత్తం సంపదలో ఇది 68 శాతం. ►తాజా జాబితాను లండన్లో జరుగుతున్న 21వ వార్షిక ఆసియన్ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో లాంఛనంగా ఆవిష్కరిస్తారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నా... బ్రిటన్ ఆసియన్లు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంకుకూ... ఈ అవార్డుల కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ (ఆసియన్ బిజినెస్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్), హోటల్స్ వ్యాపారవేత్త జోగీందర్ సింగ్ (బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్), బ్రిటన్లో డిష్యూమ్ ఇండియన్ రెస్టారెంట్ల చైన్ చీఫ్ షామిల్ తక్రార్ (రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్)లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతుండటం గమనార్హం. -
ఐసీఐసీఐ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,894 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.2,611 కోట్లు)తో పోల్చితే 27 శాతం క్షీణత నమోదైందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ట్రెజరీ ఆదాయం 92 శాతం తగ్గడం, ఇతర ఆదాయం కూడా తగ్గడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచర్ చెప్పారు. ట్రెజరీ ఆదాయం 92 శాతం క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైందని, ఫారెక్స్ లాభాలు రూ.82 కోట్లే వచ్చాయని వివరించారు. మొత్తం ఆదాయం మాత్రం రూ.27,876 కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధిచెంది రూ.28,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.2,442 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.1,650 కోట్లకు తగ్గిందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయ్... నికర వడ్డీ ఆదాయం రూ.5,363 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.5,705 కోట్లకు పెరిగిందని కొచర్ పేర్కొన్నారు. నిర్వహణ లాభం 10 శాతం వృద్ధితో రూ.4,992 కోట్లకు పెరిగిందని తెలిపారు. రిటైల్ రుణాలు 22 శాతం పెరగడంతో దేశీయ రుణ వృద్ధి 15.6 శాతానికి ఎగసిందని, ఇది ఐదు క్వార్టర్ల గరిష్ట స్థాయి అని వివరించారు. రుణాలు నిలకడగా 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు. రిటైల్ రుణాలు 18–20 శాతం రేంజ్లో, కార్పొరేట్ రుణాలు 10 శాతం మేర వృద్ధి చెందగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని చందా కొచర్ వ్యాఖ్యానించారు. 3.14 శాతంగా నికర వడ్డీ మార్జిన్.. దేశీయ నికర వడ్డీ మార్జిన్ 3.53 శాతం సాధించామని, మొత్తం మీద నికర వడ్డీ మార్జిన్ 3.14 శాతంగా ఉందని చందా కొచర్ వివరించారు. గత క్యూ3లో 7.20 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 7.82 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 3.96 శాతం నుంచి 4.20 శాతానికి పెరిగాయని తెలిపారు. అయితే స్థూల మొండి బకాయిల జాబితాలోకి చేరిన తాజా రుణాలు తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయి, రూ.4,380 కోట్లకు తగ్గాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా పెరిగాయని, గత క్యూ3లో రూ.2,713 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే. ఈ క్యూ2లో రూ.44,488 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.46,039 కోట్లకు పెరిగాయని, నిక మొండి బకాయిలు మాత్రం రూ.24,129 కోట్ల నుంచి రూ.23,810 కోట్లకు తగ్గాయని వివరించారు. కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన తగ్గాయని, ఈ క్యూ2లో రూ.4,503 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆర్బీఐ రెండో మొండి జాబితాలో తమ బ్యాంక్కు చెందిన 18 ఖాతాల రూ.10,000 కోట్ల రుణాలున్నాయని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎన్ఎస్ కన్నన్ చెప్పారు. వీటికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. అంతర్జాతీయ రుణాలు 14.5 శాతం క్షీణించాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్ప లాభంతో రూ.353 వద్ద ముగిసింది. -
పేటీఎం యూజర్లకు ఐసీఐసీఐ రుణాలు
ముంబై: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ద్వారా కొనుగోళ్లు జరిపే తమ కస్టమర్లకు స్వల్పకాలిక తక్షణ రుణ సదుపాయం అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. పేటీఎం ద్వారా కొనుగోళ్లు చేసే వారికి దాదాపు రూ. 20,000 దాకా రుణం అందించనున్నట్లు పేర్కొంది. పేటీఎం–ఐసీఐసీఐ బ్యాంక్ పోస్ట్ పెయిడ్ కార్డ్ మీద తీసుకునే రుణంపై తొలి నలభై అయిదు రోజులదాకా వడ్డీ ఉండదని, ఒకవేళ ఆ వ్యవధిలో గానీ చెల్లించకపోతే.. జాప్యానికి గాను రూ. 50 ఫీజుతో పాటు మూడు శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. రుణపరిమితి ఒక్క లావాదేవీకి రూ. 20,000 మాత్రమే ఉన్నప్పటికీ.. బకాయిని తీర్చేసిన తర్వాత కస్టమర్ మళ్లీ ఈ రుణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ తెలిపారు. ఈ ప్రయోగాన్ని బట్టి ఐసీఐసీఐ బ్యాంక్యేతర కస్టమర్లకు, ఇతర పెద్ద వ్యాపార సంస్థలకు కూడా విస్తరించే అవకాశం పరిశీలిస్తామని పేర్కొన్నారు. -
పాతతరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు
ముంబై: దక్షిణాదికి చెందిన వెనుకటి తరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు ముందున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంటోంది. ఆస్తుల నాణ్యత మెరుగు పడటంతో ఆదాయార్జన అవకాశాలు పెరిగాయని, కొన్నేళ్ల పాటు వరుసగా రుణాల్లో వృద్ధి లేకపోగా, అది మళ్లీ పుంజుకోనుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఫెడరల్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు తామున్న ప్రాంతాల్లో బలమైన స్థితి కారణంగా వేగంగా వృద్ధి చెందనున్నట్టు నివేదికలో పొందుపరించింది. ‘‘అత్యధిక ఆదాయ వృద్ధి అవకాశాలతోపాటు స్థిరమైన నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం), నిలకడైన ఆస్తుల నాణ్యత, తగినంత నిధులు కలిగిన బ్యాంకులకే మా ప్రాధాన్యం. ఈ ఐదు బ్యాంకులు వచ్చే రెండేళ్ల కాలంలో రుణాల్లో 11–22%, ఆదాయాల్లో 12–25% మధ్యలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును సాధించగలవు’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఫెడరల్, సిటీ యూనియన్ బ్యాంకులను కొనుగోలు చేయవచ్చని, మిగిలిన వాటిని హోల్డ్ చేయవచ్చంటూ సిఫారసు చేసింది. -
ఐసీఐసీఐ ఆఫర్: ప్రతీ ఈఎంఐపై క్యాష్బ్యాక్
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు పండుగ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని హోం లోన్లపై 'క్యాష్ బ్యాక్' సదుపాయం కల్పిస్తోంది. ఈ సదుపాయం ఎన్ఆర్ఐలకు కూడా అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ తెలిపింది. కొత్తగా గృహ రుణాలపై 'క్యాష్ బ్యాక్' సదుపాయంతో ప్రారంభించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. కొత్త హోం లోన్లపై ప్రతీ ఈఎంఐ పైనా 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు వెల్లడించింది. 36 నెలల తరువాత మొదటి విడత క్యాష్ బ్యాక్ సొమ్మును ఖాతాదారుడి అకౌంట్లో జమ చేస్తుంది. ఇక ఆ తరువాత నుంచి 12 నెలలకొకసారి ఈ క్యాష్ బ్యాక్ ను క్రెడిట్ చేస్తుంది. కనిష్టంగా 15 సంవత్సరాల కాలపరిమితి గృహ రుణాలకు ఆఫర్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే బ్యాంకులో గృహరుణం తీసుకునే సమయంలో క్యాష్ బ్యాక్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఈఎంఐలో 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సొంత ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ చెప్పారు. దీంతోపాటు ఆస్తి తనఖా రుణాలపై , ఇతర తనఖారుణాలపై కూడా తమ పండుగ ఆఫర్ అందుబాటులో ఉందన్నారు. Just in: ICICI Bank launches #CashbackHomeLoan, offering borrowers benefit of 1% cashback on every EMI for the entire tenure of the loan. pic.twitter.com/njnu7dzXrY — ICICI Bank (@ICICIBank) September 28, 2017 -
ఐసీఐసీఐ లాంబార్డ్ లిస్టింగ్ రోజు లాభమే!
ముంబై: ప్రైవేటు రంగంలోని సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ మార్కెట్ల బలహీనతలోనూ లిస్టింగ్ లాభాల్ని పంచింది. బుధవారం ఎన్ఎస్ఈలో రూ.651 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అయిన రూ.661 కంటే ఒకటిన్నర శాతం తక్కువ. తర్వాతma అమ్మకాల ఒత్తిడికి 3% వరకు పడిపోయి రూ.638.65కి చేరింది. అక్కడ కొనుగోళ్ల మద్దతుతో రూ.694 వరకు పెరిగింది. చివరికి ఆఫర్ ధరతో పోలిస్తే 4.45% లాభంతో రూ.680.10 వద్ద ముగిసింది. రూ.5,700 కోట్ల ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీవో ఈ నెల 19న ముగిసిన విషయం తెలిసిందే. 8,62,47,187 షేర్లను కంపెనీ ఆఫర్ చేసింది. ఇష్యూ 3 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ కాగా, లిస్టింగ్ లాభాలు ఎక్కువగా ఉండకపోవచ్చని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. కాగా, స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తొలి సాధారణ బీమా కంపెనీ ఇదే. జూన్ చివరి నాటికి కంబైన్డ్ రేషియో (నష్టాలు, వ్యయాలను, వసూలైన ప్రీమియంతో భాగించగా వచ్చేది) 102 ఉండగా, దాన్ని సమీప భవిష్యత్తులో 100%కి తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను లాభాల బాట పట్టించడంపై దృష్టి పెట్టినట్టు కంపెనీ ఎండీ భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. -
ఈసారి డర్టీ40
♦ మొండిబకాయిలపై ఆర్బీఐ రెండో అస్త్రం ♦ 40 కంపెనీల జాబితా సిద్ధం ♦ తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు కంపెనీలు ♦ ఐవీఆర్సీఎల్, ఈస్ట్కోస్ట్ ఎనర్జీ, నాగార్జునా ఆయిల్, సోమా ♦ తెలుగు ప్రమోటర్కు చెందిన ఆర్చిడ్ ఫార్మా కూడా... ♦ ఎన్సీఎల్టీకి సమర్పిస్తారనే వార్తలతో కుప్పకూలిన షేర్లు ♦ ఇప్పటికే డిఫాల్టర్లుగా ప్రచారంలో పలు బడా సంస్థలు (సాక్షి, హైదరాబాద్ / అమరావతి) : రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలపై దివాలా చట్టం ప్రయోగించడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 12 పెద్ద కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వగా తాజాగా మరో 40 కంపెనీలతో రెండో జాబితాను తయారు చేసినట్లు తెలియవచ్చింది. భారీగా అప్పుల్లో కూరుకుపోయి వరుస నష్టాలను నమోదు చేస్తున్న కంపెనీలకు చెందిన ఆస్తులను విక్రయించడం ద్వారా వాటి రుణాలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ అధికారమిచ్చింది. దీంతో బ్యాంకులు ఆర్బీఐ అనుమతి మేరకు ఆయా కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు దాఖలు చేస్తున్నాయి. తాజాగా రూపొందించిన జాబితాలో లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలు కలిసి 40 వరకు ఉండవచ్చని సమాచారం. ఈ నలభైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపెనీలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రెండు ఇన్ఫ్రా కంపెనీలు ఐవీఆర్సీఎల్, సోమా ఎంటర్ప్రైజెస్లతో పాటు నాగార్జునా ఆయిల్ రిఫైనరీ, శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నించి చేతులెత్తేసిన ఈస్ట్కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రమోటర్ కె.రాఘవేంద్రరావు తమిళనాడు కేంద్రంగా నడిపిస్తున్న ఆర్కిడ్ కెమికల్స్ (ఇపుడు ఆర్కిడ్ ఫార్మాగా పేరు మార్చుకుంది) తదితర కంపెనీలున్నాయి. వీటి పేర్లన్నీ ఆర్బీఐ ద్వారా బ్యాంకులు ఎన్సీఎల్టీకి సిఫారస్సు చేసినట్లు మంగళవారం మార్కెట్లో వార్తలు షికారు చేయగా... ఆయా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. అధిక ఖాతాలు ఎస్బీఐ వద్దే!! గతంలో ఆర్బీఐ విడుదల చేసిన 12 డిఫాల్టింగ్ కంపెనీలను చూస్తే... దాదాపు అన్ని కంపెనీలకూ ఐసీఐసీఐ ఎంతో కొంత రుణాలు మంజూరు చేసి ఉంది. తాజాగా ఆర్బీఐ జాబితాగా చెబుతున్న 35– 40 కంపెనీలకు గాను దాదాపు 25–26 కంపెనీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నాగార్జునా ఆయిల్ రిఫైనరీ సుమారు రూ.4,000 కోట్ల మేర రుణాలు బకాయి పడగా, ఐవీఆర్సీఎల్ రూ.3,579 కోట్లు, సోమా ఎంటర్ప్రైజెస్ రూ.1,895 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ఐవీఆర్సీఎల్ షేరు ధర 13 శాతం నష్టపోయి రూ.4.65 వద్ద ముగిసింది. నాగార్జునా ఆయిల్ రిఫైనరీ 5.45 శాతం నష్టపోయి రూ. 3.45 వద్ద ముగిసింది. ఇక సోమా ఎంటర్ప్రైజెస్ అన్లిస్టెడ్ కంపెనీ. సోమా ఎంటర్ప్రైజెస్కు మాగంటి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా, మాగంటి అంకనీడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆర్చిడ్ ఫార్మా షేరు సైతం దాదాపు 9 శాతం నష్టపోయి రూ.18.95 వద్ద ముగిసింది. ఉత్తమ్గాల్వా, రేణుకా షుగర్స్ కూడా!! ఈ రెండవ జాబితాలో ఉన్నట్లుగా కొత్తగా ప్రచారంలోకి వచ్చిన కంపెనీల్లో ఉత్తమ్ గాల్వా, కాస్టెక్స్ టెక్నాలజీస్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, రుచి సోయా, వీసా స్టీల్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, ఏసియన్ కలర్స్, ఇస్పాత్ కోటెడ్, యూనిటీ ఇన్ఫ్రా తదితర కంపెనీలున్నాయి. ఇక డిఫాల్టర్ల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టెయిన్లెస్, జయప్రకాష్ పవర్, అబాన్ ఆఫ్షోర్, శ్రీ రేణుక షుగర్స్ వంటి కంపెనీలున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం కంపెనీల అప్పుల విలువ ఎంతుందో తెలియాల్సి ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా, జయస్వాల్ నెకో, రుచిసోయా, జేపీ అసోసియేట్స్, ఉత్తమ్ స్టీల్ కంపెనీల షేర్లు 9 శాతానికిపైగా నష్టపోయాయి. ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ 14 శాతానికిపైగా పడిపోయింది. గత జూన్లో ఆర్బీఐ విడుదల చేసిన ‘డర్టీ డజన్’ ఎగవేతదార్ల రుణాల విలువ రూ.1.75 లక్షల కోట్లు. ఇది మొత్తం నిరర్థక ఆస్తుల్లో 25 శాతానికి సమానం. ఈ కంపెనీలను ఎన్సీఎల్టీకి సిఫార్సు చేసిన తర్వాత రుణాలిచ్చిన బ్యాంకులు లిక్విడేషన్కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 180 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును 270 రోజుల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాభం రూ.406 కోట్లు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. నికర ప్రీమియం ఆదాయం వృద్ధి చెందినప్పటికీ లాభంలో ఎదుగుదల లేదు. కంపెనీ రూ.406 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.405 కోట్లతో పోలిస్తే కేవలం కోటి రూపాయలే మెరుగుపడింది. పాలసీలపై అధిక కమీషన్లు చెల్లించడం, పెట్టుబడులపై ఆదాయం తగ్గడం వంటివి లాభం పెరగకపోవడానికి కారణాలుగా కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ.4,820 కోట్ల ప్రీమియం ఆదాయం లభించింది. 2016–17 జూన్ క్వార్టర్లో ప్రీమియం ఆదాయం రూ.3,509 కోట్లతో పోల్చితే తాజాగా 35%కిపైగా వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం గతేడాది ఇదే క్వార్టర్లో రూ.9,074 కోట్లుగా ఉండగా, తాజా జూన్ త్రైమాసికంలో రూ.8,456 కోట్లకు క్షీణించింది. -
స్టాక్స్ వ్యూ
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.427 ; టార్గెట్ ధర: రూ.546 ఎందుకంటే: కంపెనీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 25 శాతం పెరిగాయి. ఎల్ఎన్జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు అనుకూలంగా ఉండడం, దహేజ్ టెర్మినల్ విస్తరణ దీనికి ప్రధాన కారణాలు. ఎల్ఎన్జీ ధరలు తక్కువగా ఉండడం, దేశీయంగా గ్యాస్ లభ్యత తక్కువగా ఉండడడం, డిమాండ్ పెరుగుతుండడం.. వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు జోరుగా ఉండగలవని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ రంగంలో పోటీ తక్కువగా ఉండడం, దహేజ్, కోచి టెర్మినల్స్ మంచి కాంట్రాక్ట్లను సాధించడం, దేశవ్యప్తంగా గ్యాస్పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. ఐదేళ్లలో ఎల్ఎన్జీ వినియోగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. గ్యాస్కు డిమాండ్ పెరిగితే ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది మొదటివరసలో ఉంటుంది. నిర్మాణంలో ఉన్న జగదీష్ పూర్–హల్డియా పైప్లైన్ అందుబాటులోకి వస్తే, మరిన్ని ప్రాంతాలకు ఈ కంపెనీ గ్యాస్ సరఫరా చేయగలుగుతుంది. టర్మినల్ వృద్ధి 3 శాతంగా ఉంటుందని భావిస్తూ ఈ షేర్ ఏడాది కాలంలో రూ.546కు , మూడేళ్ల కాలంలో రూ.767కు చేరగలదని అంచనా వేస్తున్నాం. భారత్లో ఎల్ఎన్జీకు డిమాండ్ బాగా వుండటం, లేకపోవడం, సరఫరాలు తగినంతగా లేకపోవడం, పోటీ పెద్దగా ఉండకపోవడం, ఎల్ఎన్జీ ధరలు తగ్గే అవకాశాలు అధికంగా ఉండడం.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. స్పాట్, స్వల్పకాలిక అమ్మకాల్లో మార్కెటింగ్ మార్జిన్లు తక్కువగా ఉండడం, ఎల్ఎన్జీ ధరలు పెరిగితే నాఫ్తా, తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలకు డిమాండ్ పెరిగి ఎల్ఎన్జీకి డిమాండ్ తగ్గడం, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరిగితే, ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గి, పీఎల్ఎన్జీ అమ్మకాలు తగ్గడం... ఇవన్నీ ప్రతికూలాంశాలు. బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.529 ; టార్గెట్ ధర: రూ.650 ఎందుకంటే: 2015 ఏప్రిల్లో ఈ షేర్ రూ.1,200 గరిష్ట స్థాయిలో ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 50% వరకూ తగ్గింది. హలోల్ ఇతర ప్లాంట్లలో అమెరికా ఎఫ్డీఏ నిబంధనలు ప్రతికూల ప్రభావం చూపడం, కొన్ని కీలకమైన ఔషధాలకు పోటీ పెరగడం, కొత్త ఔషధ ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం పరిమితంగా ఉండడం.. తదితర అంశాల కారణంగా కంపెనీ షేర్ ధర బాగా తగ్గిపోయింది. అయితే అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న ఔషధాల విలువను, నిలకడగా వృద్ధి చెందుతున్న, నగదు నిల్వలను అందిస్తున్న దేశీయ వ్యాపార విలువను.. ప్రస్తుత షేర్ ధర ప్రతిబింబించడం లేదని చెప్పవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రికవరీ ప్రారంభమవుతుందని భావిస్తున్నాం. హలాల్ ప్లాంట్పై ప్రతికూల ప్రభావం తగ్గడం, స్పెషాల్టీ ఫార్మా విభాగంలో రెండు కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేనుండడం, దీనికి కారణం కానున్నాయి. అమెరికాలో జనరిక్స్ వ్యాపార విభాగం కంటే ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. పోటీ పెరుగుతుండడంతో జనరిక్స్ వ్యాపార వృద్ధి భవిష్యత్తులో చెప్పుకోదగిన స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నాం. అందుకని ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగంపై దృష్టి సారించే కంపెనీల వృద్ధి జోరుగా ఉండనున్నది. ఇక సన్ ఫార్మా ప్రత్యేక ఔషధ విభాగం 2019–20లో బ్రేక్ఈవెన్కు వస్తుందని అంచనా. ర్యాన్బాక్సీ విలీనంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర ఇబిటా ప్రయోజనాలు రావచ్చు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కం పెనీ నగదు నిల్వలు 150 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ కంపెనీ ఏడాదికి 70 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ఫ్లోస్ను సాధిస్తోంది. ప్రత్యేక ఫార్మా వ్యాపారంపై 2–3 ఏళ్లుగా చేస్తున్న వ్యూహాత్మక పెట్టుబడులు, దేశీ మార్కెట్లో నిలకడైన వృద్ధి, అమెరికాలో కాంప్లెక్స్ జనరిక్స్పై దృష్టి సారించడం కంపెనీకి కలిసొచ్చే అంశాలు. -
స్టాక్స్ వ్యూ
ఎస్బీఐ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.308 ; టార్గెట్ ధర: రూ.375 ఎందుకంటే: అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. వాచ్ లిస్ట్లో ఉండే రుణాలు తగ్గుతుండడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, తదితర కారణాల వల్ల రుణ నాణ్యత మెరుగుపడగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీలకు, భారీ ప్రైవేట్ రంగ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల రుణాల విషయంలో బ్యాంక్ సౌకర్యవంతంగా ఉందనే చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వాతావరణం మెరుగుపడితే రుణ నాణ్యత అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరపతి వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగినా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు పెరుగుతున్నాయి. ఈ పోకడ మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర మొండి బకాయిలు తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్(నిమ్), నిర్వహణ మెరుగుపడుతాయనే అంచనాలతో బ్యాంక్ ఆదాయం(స్టాండోలోన్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవని భావిస్తున్నాం. అనుబంధ బ్యాంక్ల విలీనం విషయమై 70వేలకు పైగా ఉద్యోగుల సర్దుబాటు, బ్రాంచ్ల హేతుబద్ధీకరణ, విద్యుత్తురంగ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై ఒత్తిడి అధికంగా ఉండడం... అంశాలు కొంచెం సమస్యాత్మకమైనవి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, అత్యుత్తమంగా ప్రయోజనం పొందే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో 66 శాతంగా ఉండడం, మూలధన నిధులు పుష్కలంగా ఉండడం, రిటైల్ డిపాజిట్లు 95 శాతానికి మించి ఉండడం, నిర్వహణ లాభదాయకత పెంపుపై బ్యాంక్ దృష్టి పెట్టడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.175 ; టార్గెట్ ధర: రూ.215 ఎందుకంటే: మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాల, ట్రక్కు, బస్సు టైర్ల(టీబీఆర్) సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొక్కటి. ప్రయాణికుల కార్ల రేడియల్ టైర్ల సెగ్మెంట్లో 12 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చైనా టైర్ల దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. చైనా టైర్ల దిగుమతి లావాదేవీలు అధికంగా నగదులో జరగడమే దీనికి కారణం. మరో వైపు చైనా టైర్లపై అమెరికా ఎలాంటి సుంకాలు విధించకూడదని నిర్ణయించడంతో చైనా కంపెనీలు భారత్కు కాకుండా అధిక లాభాలు వచ్చే అమెరికా మార్కెట్కు తమ టైర్లను ఎగుమతి చేస్తున్నాయి. ఈ రెండు రణాల వల్ల చైనా నుంచి పోటీ బాగా తగ్గింది. చైనా నుంచి టైర్ల దిగుమతులు తగ్గడం వల్ల కంపెనీ మార్కెట్ వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. టైర్ల తయారీకి కీలకమైన సహజమైన రబ్బరు ధరలు ఇటీవల కాలంలో తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.94గా ఉన్న కేజీ సహజ రబ్బరు ధర ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.159కు పెరిగినా, ప్రస్తుతానికి రూ.140కి పడిపోయింది. ఈ ధర మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ఇతర ముడి పదార్ధాల ధరలు (ముడిచమురుతో సంబంధించిన కొన్ని) కూడా తక్కువగానే ఉన్నాయి. నిర్వహణ పనితీరు రక్షణ నిమిత్తం ఈ కంపెనీతో సహా ప్రధాన టైర్ల కంపెనీలు గత ఆర్నెళ్లలో తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకూ పెంచాయి. ఈ ధరల పెంపు కారణంగా కంపెనీ మార్జిన్స్ మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన కావెండిష్ ఇండస్ట్రీస్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న 2 వీలర్, 3 వీలర్ సెగ్మెంట్లలోకి ఈ కంపెనీ ప్రవేశించడమే కాకుండా, టీబీఆర్ సెగ్మెంట్లో కంపెనీ స్థానం మరింతగా పటిష్టం కానుంది. -
స్టాక్స్ వ్యూ
ఇంజినీర్స్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.155 టార్గెట్ ధర: రూ.182 ఎందుకంటే: ఈ నవరత్న ప్రభుత్వ రంగ కంపెనీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, ఈపీసీ కంపెనీ. భారత హైడ్రోకార్బన్స్, పెట్రోకెమికల్స్ కన్సల్టెన్సీ రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. భారత్లో ఏర్పాటైన 22 రిఫైనరీల్లో 19 రిఫైనరీలు ఈ కంపెనీ సేవలతో ఏర్పాటైనవే. ఎలాంటి రుణభారం లేని ఈ కంపెనీకి ఆదాయం, నికర లాభం పరంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006–16 కాలానికి ఆదాయం 11 శాతం, నికరలాభం 7 శాతం, నెట్వర్త్ 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. కీలకమైన, భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్లు సహజంగానే ఈ కంపెనీకి లభించడం సానుకూలాంశం. రానున్న కొన్నేళ్లలో భారత హైడ్రో కార్బన్ కంపెనీలు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో ఈ కంపెనీకి రూ.11,000 కోట్ల మేర కన్సల్టెన్సీ ఆర్డర్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాం. ఈపీసీ విభాగం అంతంత మాత్రంగానే ఉన్నా కన్సల్టెన్సీ విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. ఆదాయంలో 65 శాతానికి మించి ఉన్న కన్సల్టెన్సీ విభాగం 30 శాతం ఇబిటా మార్జిన్ సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలానికి రూ.5,024 కోట్ల ఆర్డర్లను సాధించింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,061 టార్గెట్ ధర: రూ.2500 ఎందుకంటే: రిటైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల్లో మంచి స్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొకటి. అధిక వృద్ధి, మంచి లాభదాయకత, తక్కువ పోటీ ఉన్న వ్యాపార విధానాన్ని కంపెనీ అనుసరిస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోంది. వచ్చే నెల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాం. ఈ కంపెనీ విలువ మదింపులో పరిగణనలోకి తీసుకోని హౌసింగ్ పైనాన్స్ వ్యాపార విబాగం 3–4 ఏళ్లలో మంచి విలువను సాధిస్తుందని అంచనా. గత నెలలో లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రుణ మంజూరీలు పుంజుకున్నాయి. కంపెనీ పీసీఆర్(ప్రొవిజనల్ కవరేజ్ రేషియో–మొండి బకాయిలను కవర్ చేయడానికి కేటాయించే నిధులు) 81 శాతంగా ఉన్నాయి. ఇది ఇతర ఎన్బీఎఫ్సీల పీసీఆర్ కంటే అధికం. ఫలితంగా మరో రెండేళ్ల వరకూ మొండి బకాయిలకు భారీ కేటాయింపుల అవసరం ఉండదని భావిస్తున్నాం. రుణ వృద్ధి పటిష్టంగా ఉండడం, కేటాయింపు వ్యయాలు తక్కువగా ఉండడంతో లాభదాయకత జోరుగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రిటర్న్ ఆన్ అసెట్(ఆర్ఓఏ) 3 శాతం నుంచి 3.8 శాతానికి, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 12.3 శాతం నుంచి 17.6 శాతానికి చేరగలదని భావిస్తున్నాం.