Bharat Jodo Yatra
-
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్రాజశేఖర్రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024 -
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్సులు
-
రాహుల్ గాంధీ యాత్రపై సస్పెన్స్.. మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంపై సస్పెన్స్ నెలకొంది. ఈనెల 14వ తేదీ మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి లేనట్టు సమాచారం. అయితే, తాజాగా మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ యాత్రపై సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. మణిపూర్లోని సరిహద్దు పట్టణం మోరేలో తాజాగా మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో మోరేలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన సాయుధ సిబ్బందిని పట్టుకునేందుకు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసుల ఉమ్మడి ప్రయత్నం ద్వారా ప్రస్తుతం కూబింగ్ కార్యక్రమం జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ యాత్రపై బీరెన్ సింగ్ స్పందించారు. రాహుల్ యాత్రకు అనుమతి అంశంలో పరిశీలనలో ఉంది. ఈ విషయంపై వివిధ భద్రతా సంస్థల నుండి నివేదికలు తీసుకుంటున్నాము. వారి నుండి నివేదికలు అందిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14న ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యాత్ర కొనసాగనుంది. 66 రోజుల ప్రయాణంలో 6,713 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. చివరకు భారత్ న్యాయ్ యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనుంది. ఇక, రాహుల్ యాత్ర సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలతో ప్రచారం ప్రారంభించారు. Bharat Jodo Nyay Yatra Preparation in full swing. Visuals from Assam. Nyay Ka Haq Milne Tak! pic.twitter.com/hd6AudvmU8 — Amit Kumar (@yadav_Amit025) January 10, 2024 -
రాహుల్ ఓ రిజర్వ్బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాహుల్ గాంధీ ఓ రిజర్వ్బ్యాంక్ లాంటివారు. రిజర్వ్ బ్యాంకును ఖాళీ చేసేస్తే ఎలా?..’’ అని కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడతను వెంటనే చేపట్టాలని పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు ఆదివారం నాటి సమావేశాల్లో కోరగా.. ‘‘రాహుల్ గాంధీ సేవలను అవసరార్థం వినియోగించుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఖాళీ అయితే ఇబ్బంది కదా.. మీరంతా ఏం చేస్తారు? ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండండి. పార్టీని బలోపేతం చేయండి..’’ అని ఖర్గే హితబోధ చేసినట్టు సమాచారం. దేశంలో ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉందని, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ ఎజెండా ఉచ్చులో పడకుండా మన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన అంశంగా ముందుకు సాగాలని మార్గనిర్దేశనం చేసినట్టు సమాచారం. కట్టు తప్పితే సహించేది లేదు పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పితే సహించేది లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కినా.. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామని, చర్యలు తీసుకున్నాక నిందించవద్దని పేర్కొన్నారు. ఇక ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కొందరు సీడబ్ల్యూసీ సభ్యులు కోరగా.. ఆ చర్చ వచ్చినప్పుడు రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటానని ఖర్గే హామీ ఇచ్చారు. మీరు చేసే సూచనల మేరకే సీట్ల సర్దుబాటు ఉంటుందని, ఆందోళన వద్దని సూచించారు. కర్ణాటక మోడల్తో ముందుకు.. తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలని, దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించారు. పార్టీ నేతలంతా కలసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అంతర్గతంగా సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు. రజాకార్లు మా ఇంటినీ తగలబెట్టారు మొదట దేశం మొత్తం స్వాతంత్య్రం లభించినా హైదరాబాద్ స్టేట్లోని ప్రజలకు స్వాతంత్రం లభించలేదని.. ఆ సమయంలో నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు ఆకాశాన్ని అంటాయని మల్లికార్జున ఖర్గే చెప్పారు. తమ ఇంటిని కూడా రజాకార్లు తగలబెట్టారని తెలిపారు. సెప్టెంబర్ 17న నిజాం పాలనకు చరమగీతం పాడటంలో సర్దార్ పటేల్, కాంగ్రెస్ నేతలుకృషి చేశారని చెప్పారు. సోనియాకు బహుమతి ఇస్తాం: రాష్ట్ర నాయకులు సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఇచ్చినప్పటికీ.. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ను గెలిపించి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వలేకపోయాం. ఈసారి తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆమెకు బహుమతిగా ఇస్తాం’’ అని పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. -
'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ యూనివర్సిటీలోని కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులు ఇండియా పేరును భారత్ గా మార్చడంపై ప్రశ్నించగా రాహుల్ దీనిపై సానుకూలంగా స్పందించారు. రెండిటిలో ఏ పేరైనా తనకు ఆమోదయోగ్యమేనని అన్నారు. ఏదైనా ఓకే.. ఐరోపా రాజకీయ నాయకులతోనూ ప్రవాస భారతీయ నేతలతోనూ సమావేశమయ్యేందుకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ పారిస్లోని పీవో యూనివర్సిటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును 'భారత్'గా మార్చడంపై ఆయన అభిప్రాయం కోరగా రాజ్యాంగంలో ఆ రెండు పేర్లను ప్రస్తావించారు.. ఇండియాగా పిలవబడే భారత్ రాష్ట్రాల సమూహమని అందులో పేర్కొన్నారు కాబట్టి తనకు ఆ రెండిటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమేనని తెలిపారు. दिलचस्प बात है, हम जब भी अडानी पर सवाल उठाते हैं, मोदी जी एक नया ‘distraction’ ले आते हैं। 'INDIA या भारत' भी एक ऐसा ही मुद्दा है। pic.twitter.com/zZDxuavXOV — Rahul Gandhi (@RahulGandhi) September 8, 2023 'భారత్' జోడో? అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమికి ఇండియా అని పేరు పెట్టి బహుశా వారికి విసుగు తెప్పించి ఉంటాము. అందుకే వారు ఇండియా పేరునే మార్చేందుకు సిద్ధమయ్యారన్నారు. మా కూటమికి మేము వేరే పేరును పెట్టేవారమే కానీ దానివలన ప్రయోజనమేమి ఉండదు. కానీ అదేంటో మనుషులు చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాద యాత్రకు 'భారత్ జోడో' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మార్చాల్సిన అవసరమేంటి? ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సందర్బంగా భారత రాష్ట్రపతి అతిధులకు పంపిన డిన్నర్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించడంతో దేశం పేరు మారుస్తున్నారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా రాహుల్ మాత్రం పేరు మార్పుపై అయిష్టాన్ని తెలుపుతూనే పేరు ఆమోదయోగ్యమన్నారు. The BJP government seems to be irritated with the name of our coalition. Now, they've decided to change the name of the country. People act in strange ways. : Shri @RahulGandhi 📍Sciences PO University, Paris Watch the full video here: https://t.co/uuqbjyPGMy pic.twitter.com/vlkXdBq5Yv — Congress (@INCIndia) September 10, 2023 'ఇండియా' కూటమి కాదు.. ఇక ఇండియా కూటమి పేరుపై సాక్షాత్తు ప్రధానమంత్రే అనేక సందర్భాల్లో విమర్శించిన విషయం తెలిసిందే. ఆ కూటమిని 'ఇండియా' అని కాకుండా 'ఘామండియా'(అంటే మూర్ఖులు) అని పిలవమన్నారు. ఇది కూడా చదవండి: మమతా బెనర్జీపై కాంగ్రెస్ అసంతృప్తి -
దేశ భద్రత కోసమే రాహుల్ పోరాటం
సాక్షి, హైదరాబాద్ / ఖైరతాబాద్ / దిల్సుఖ్నగర్ / గచ్చిబౌలి: దేశాన్ని ఒక్కటి చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమాజిగూడ రాజీవ్గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాల వరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఐమాక్స్ ఇందిరాగాంధీ రోటరీ చౌరస్తాలో మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని అహింసా పోరాటాన్ని పునాదిగా వేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు, 4,183 కిలోమీ టర్లు రాహుల్ గాంధీ నడిచారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటించాలి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటే వరకు తరమాల్సిన బాధ్యత ప్రజ లందరిమీద ఉందని రేవంత్ అన్నారు. కేసీఆర్ను గెలిపించాలని ప్రతిసారీ అసదుద్దీన్ చెప్తున్నాడని, అసలు ఎందుకు గెలిపించాలని నిలదీశారు. త్రిపు ల్ తలాక్కు మోదీకి మద్దతుగా నిలిచినందుకా, 370 ఆర్టికల్కు ఓటు వేసినందుకా, నోట్ల రద్దు, జీఎస్టీలో మద్దతు తెలిపినందుకు గెలిపించాలా.. అని అసదుద్దీన్ను ప్రశ్నించారు. లక్ష కోట్లు లూటీ చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నారంటే దాని ఆంతర్యమేంటన్నారు. దేశ హోంమంత్రికి చిల్లర రాజకీయం తగునా 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని తలపెడితే అధికారం ఉంది కదా అని తాము బుక్ చేసుకున్న గ్రౌండ్ను రద్దు చేసి బీజేపీ వాళ్లు గుంజుకున్నారని రేవంత్ నిందించారు. ఇంత చిల్లర రాజకీయం హోంశాఖ మంత్రి చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేశాయని, ఇందుకు ప్రతిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కదలి వచ్చి మూడు రోజులపాటు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టాలని, అత్యద్భుతంగా ఏఐసీసీ సమావే శాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతూ... దేశాన్ని కలిపేందుకు ధర్మాలను ఒకటి చేసేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేశారని ఇది ప్రపంచ రికార్డ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, అంజన్కుమార్ యాదవ్, అనిల్కుమార్ యాదవ్, రోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో భట్టి.. కోదాడలో ఉత్తమ్..ఎల్బీనగర్లో యాష్కీ రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టా యి. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేటలో జరిగిన పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోదాడలో జరిగిన యాత్రలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎల్బీనగర్లో జరిగిన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. రేపు భట్టి పాదయాత్ర ‘డైరీ’ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర డైరీని శనివారం ఆవిష్కరించనున్నారు. సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సురేందర్ రచించిన ఈ డైరీని గాంధీభవన్లో విడుదల చేయనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే హాజరుకానున్నారు. మేకిన్ ఇండియా అని భారత్ పేరు పెడతారా.. మేకిన్ ఇండియా అన్న పీఎం మోదీ ఇప్పుడు ఇండియా పేరు తీసేసి భారత్ పేరు పెడతాననడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమి కడితే.. దాన్ని ఎదుర్కోలేక ఇండియా పేరు మారుస్తానన్న భావదారిద్య్రం ప్రధాన మంత్రికి, బీజేపీకి వచ్చిందంటే సిగ్గుపడాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే గానీ ఈ దేశం పేరు మారిస్తే ఎవరి బతుకుల్లోనూ మార్పులు రావన్నారు. మోదీ పాలనలో దేశ భద్రతకే ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు అధికారం ఖాయం: పొంగులేటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని... అందరికీ ఇందిరమ్మ పథకాలు అందిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో–చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీనియర్ నేత రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్లో ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ జోడో యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న రాహుల్ ప్రధాని అయిన తరువాత పరిష్కరిస్తారని తెలిపారు. -
భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తైన వేళ హైదరాబాద్లో ర్యాలీ
-
యాత్ర 2.0 కోసం కొత్త స్ట్రాటజీ
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. మొదటి దఫా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం.. ఫలితం విషయంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండడంతో రెండో దఫా ఎప్పుడుంటుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో.. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో యాత్ర 2.0 మొదలుకానుందని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో యాత్ర నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ హెడ్ దిగ్విజయ్ సింగ్.. యాత్ర 2.0 కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర-2 ప్రారంభ తేదీ, రూట్మ్యాప్ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ మెంబర్ ఒకరు చెబుతున్నారు. ఈ అంశాలపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్దేనని అంటున్నారాయన. గాంధీ పుట్టిన గడ్డ నుంచే.. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022లో కన్యాకుమారి(తమిళనాడు) నుంచి ప్రారంభమై.. జనవరి 30, 2023 శ్రీనగర్(జమ్ముకశ్మీర్)తో ముగిసింది. యాత్రను ప్రారంభించడానికి ముందు అహ్మదాబాద్(గుజరాత్)లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పించాడు కూడా. దీంతో గాంధీ జన్మస్థలం అయిన పోర్బందర్(గుజరాత్) నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. అలా.. పోర్బందర్ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తలా(త్రిపుర)తో యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తోంది. జోడో యాత్రలా కాకుండా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. దీంతో రెండో దఫా యాత్రను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఎంతలేదన్న యాత్రకు ఆరు నెలల టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి.. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని ఓ సీనియర్ నేత అభిప్రాయపడుతున్నారు. అలాగే సార్వత్రి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు. సమయం తక్కువగా ఉండడంతో యాత్రను మొదటి యాత్రలా పూర్తి మార్గం గుండా కాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో(అదీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో) చేసేలా ఏర్పాట్లు చేసుకునే ఆలోచనను భారత్ జోడో యాత్ర నేషనల్ కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘అడ్డుకునేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నించింది’
శాన్ ఫ్రాన్సిస్కో: భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం శతవిధాల ప్రయత్నాలు చేసిందని.. ప్రజలు సంఘటితంగా దానిని విజయవంతం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రను ఆపేందుకు ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించింది. బీజేపీ.. తన అధికారిని ఉపయోగించి ప్రజలను బెదిరించింది. అలాగే ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసింది. కానీ ఏదీ ఫలించకపోగా.. యాత్ర ప్రభావం మరింతగా పెరిగింది. జాయిన్ ఇండియా అనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో పాతుకుపోయినందువల్లే ఇది జరిగింది. ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు కావాల్సినదంతా ఆర్సెస్-బీజేపీ నియంత్రణలో ఉండిపోయింది. అందుకే భారత్ జోడో యాత్రను ప్రారంభించాల్సి వచ్చిందని రాహుల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అవి(ఆరెస్సెస్-బీజేపీలను ఉద్దేశించి..) భారత రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉన్నాయి. దేశంలో ప్రజల నడుమ కులం, మతం అనే గీతలు గీసి విభజించేందుకు చూస్తున్నాయి. అయితే.. భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను ఏకం చేసింది. భారత్ జోడో యాత్ర ఆద్యంతం ప్రేమ, అప్యాయత, గౌరవంతో కొనసాగింది. ఒకసారి దేశ చరిత్రను గమనిస్తే గురునానక్ దేవ్ జీ, గురు బసవన్న జీ, నారాయణ గురు జీ వంటి ఆధ్యాత్మికవేత్తలు దేశాన్ని ఇదే విధంగా ఏకం చేశారు. వాళ్ల మార్గంలో నేను కూడా దేశ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ స్పష్టం చేశారు. 2022, సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. దాదాపు మూడువేలకిలోమీటర్ల పాటు సాగి ఈ ఏడాది జనవరి 30వ తేదీన కన్యాకుమారిలో ముగిసింది. ఇదిలా ఉంటే.. మరికొన్ని రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈలోపు మూడు నగరాల పర్యటన కోసం అమెరికా వెళ్లిన రాహుల్ అక్కడి చట్ట సభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీలను కలుస్తున్నారు. सरकार ने भारत जोड़ो यात्रा को रोकने के लिए पूरी ताकत लगा दी। लेकिन कुछ काम नहीं किया और यात्रा का असर बढ़ता गया। यह इसलिए हुआ क्योंकि 'भारत जोड़ो' का आइडिया सबके दिलों में है। : अमेरिका के सैन फ्रांसिस्को में @RahulGandhi जी pic.twitter.com/l5W6Fjy25g — Congress (@INCIndia) May 31, 2023 ఇదీ చదవండి: రెజ్లర్ల డెడ్లైన్పై బ్రిజ్ స్పందన ఇది -
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. తెలంగాణ కాంగ్రెస్లో ఫుల్ ‘జోష్’..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ను తెచ్చింది. అటు ఇతర రాష్ట్రాల్లో, ఇటు స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలాకాలంగా ఓటములను భరిస్తూ వస్తున్న టీపీసీసీ నేతల్లో ఈ విజయం మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెప్పే స్థాయిలో ఈ ఫలితాలు రాష్ట్ర నేతలకు ఊపు తెచ్చి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్న అంచనాతో ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ఓడిపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేదని, కానీ కర్ణాటక ఫలితం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు తెచి్చందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, అదే సమయంలో పారీ్టలోకి చేరికలు పెరుగుతాయని చెబుతున్నారు. కలిసికట్టుగా.. కర్ణాటక కాంగ్రెస్తో పోలిస్తే తెలంగాణ పారీ్టలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి. అక్కడ శివకుమార్, సిద్దరామయ్యలు సీఎం కుర్చీ కోసం పోటీపడినప్పటికీ ఎక్కడా అంతర్గత కలహాలు బయటపడకుండా నెట్టుకొచ్చారని, ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. అధికారం దక్కాలంటే అందరం కలిసి పనిచేయాల్సిందేనని, అదే భావనకు అందరు నేతలు వస్తారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తారని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. జోడో యాత్రపై ఆశలు కర్ణాటకలో రాహుల్గాంధీ భారత్జోడో యాత్ర నిర్వహించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 చోట్ల కాంగ్రెస్ గెలుపొందడం తెలంగాణ పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. గత అక్టోబర్, నవంబర్లో తెలంగాణలోనూ రాహుల్ జోడో యాత్ర జరిగింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగ్గా, ఆయా స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు అక్కడి నేతల్లో మొదలయ్యాయి. నారాయణ పేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్పుర, చారి్మనార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగపల్లి, పఠాన్చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది. కర్ణాటక ఫలితాలను బట్టి ఆయా స్థానాల్లో కొంచెం కష్టపడితే విజయం సాధించగలమనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద గెలుపునకు మొహం వాచినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరిహద్దు కర్ణాటకలో దక్కిన విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పినట్టు వెయ్యి ఏనుగుల బలాన్నిచి్చందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అవినీతిపై ప్రచారం రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. సిద్దూ, డీకే కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్కు కలిసొచ్చింది. ఖర్గే అనుభవం ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సానుభూతే ఆయుధం బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం. లింగాయత్ ఓట్లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్వైపు మళ్లారు. ‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’ – కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య లోకల్ వోకల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు. గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టాయి. మైనార్టీల అండదండ.. పోలింగ్కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు. జోడో యాత్ర జోష్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది. -
కర్నాటక ఎన్నికల వేళ రఘువీరా రీఎంట్రీ.. క్రియాశీల పాత్ర పోషిస్తారా?
నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళ క్రితం వరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సొంతూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు హఠాత్తుగా రఘువీరా మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. ఒకనాటి ఈ కాంగ్రెస్ నేత సెకండ్ ఇన్నింగ్స్కు కారణం ఏంటి..? మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళుగా సైలెంట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన్ను ఓటమి పలుకరించింది. అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన రఘువీరా రాజకీయ జీవితంపై రాష్ట్ర విభజన ప్రభావం బాగా పనిచేసింది. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ నాయకులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో రఘువీరా కూడా సైలెంట్గా రాజకీయాల నుంచి పక్కకు జరిగి సొంత గ్రామం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతున్నపుడు ఆయన వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో హఠాత్తుగా ఆయనకు రాజకీయాల మీద గాలి మళ్లింది. కాంగ్రెస్ హైకమాండ్ రఘువీరాను బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించడంతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలోనే తన స్వగ్రామం నీలకంఠాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలతో రఘువీరా సమావేశం నిర్వహించారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. కర్నాటక ఎన్నికల్లో తాను చురుగ్గా పాల్గొనబోతున్నట్లు చెప్పిన రఘువీరా.. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏపీ రాజకీయాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు. గతంలో మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా? లేదా అన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికైతే కర్నాటక ఎన్నికల ప్రచారం మీదే ఆయన దృష్టి సారించారు. అక్కడ ఫలితాలు బాగుంటే తిరిగి ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతారేమో చూడాలి. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న రఘువీరా ఇప్పుడు హఠాత్తుగా కర్నాటక ఎన్నికల రంగంలోకి దిగడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. -
జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు. గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాల కోసమే..
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జనవరి 30న శ్రీనగర్లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు మరోసారి స్పందించారు. సదరు బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించడంతోపాటు రక్షణ కలి్పంచడానికి వీలుగా వారి వివరాలు తెలుసుకొనేందుకు ఆదివారం ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. ప్రత్యేక కమిషనర్ సాగర్ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం ఉదయం పదింటికి తుగ్లక్ రోడ్డులోని రాహుల్ ఇంటికి వెళ్లినా ఆయన్ను కలవలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వెళ్లిపోయింది. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి రావడం ఇటీవల ఇది మూడోసారి. ‘లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ మిమ్మల్ని వేడుకున్న మహిళల వివరాలు తెలపండి’ అంటూ రాహుల్కు ప్రశ్నావళితో నోటీసు పంపించారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ ఇంటికి పోలీసుల వచ్చారన్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో జోడో యాత్ర జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్థానికంగా దర్యాప్తు జరిపామని, మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లు, సమస్యను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్ధారణ కాలేదని ప్రత్యేక కమిషనర్ సాగర్ప్రీత్ హుడా చెప్పారు. ‘‘రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలో తానే స్వయంగా ఆయనను కలిసి, వివరాలు తెలుసుకుంటా’’ అని చెప్పారు. అదానీపై ప్రశ్నిస్తున్నందుకే: రాహుల్ తన ఆరోపణపై రాహుల్ ఆదివారం సాయంత్రం 4 పేజీల్లో ప్రాథమిక ప్రతిస్పందనను పోలీసులకు పంపించారు. గౌతమ్ అదానీ అంశంలో పార్లమెంట్ లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశి్నస్తున్నందుకే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటనలపై కూడా ఇలాంటి శల్యపరీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వడానికి 8 నుంచి 10 రోజుల సమయం కోరారు. కుట్రపూరితంగానే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక రాహుల్ను వేధించి, బెదిరించే కుట్ర ఉందని పార్టీ నేతలు అశోక్ గహ్లోత్, జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చేసే ప్రకటనలపై కేసులు నమోదు చేసే దుష్ట సంస్కృతికి మోదీ సర్కారు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర పారీ్టల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేసే ప్రకటనలపై ఇకపై ఇలాంటి కేసులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. పోలీసులు వారి విధులను వారు నిర్వర్తించారని, ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని తేల్చిచెప్పారు. చట్టప్రకారమే వారు నడుచుకున్నారని తెలిపారు. अडानी के साथ PM मोदी के रिश्ते पर श्री राहुल गांधी के सवालों से बौखलाई सरकार पुलिस के पीछे छिप रही है। भारत जोड़ो यात्रा के 45 दिन बाद राहुल गांधी जी को दिल्ली पुलिस ने नोटिस दिया है, जिसमें उन महिलाओं की जानकारी मांगी गई है जो उनसे मिलीं और खुद के उत्पीड़न के बारे में बात की। pic.twitter.com/fgioVK413V — Congress (@INCIndia) March 16, 2023 చదవండి: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ.. -
ప్రజాస్వామ్యంపై దారుణ దాడి
లండన్: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్దాకా భారత్ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని ఆరోపించారు. ప్రతిష్ట దిగజార్చింది ఆయనే విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు. -
ఉద్యమకారులను విస్మరించి ద్రోహులకు పదవులా?
సిరిసిల్ల: తెలంగాణ వచ్చినంక కాపలా కుక్కలాగా ఉంటానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు పిచ్చి కుక్కలాగా మారారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. ఆ కుక్కను తరిమికొట్టాలని ప్రజల కు పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నచౌక్లో రేవంత్ ప్రసంగించారు. ఉద్యమకారులెవరూ ఆస్తులు కూడబెట్టలేదు.. చరిత్రలో ఎందరో ఉద్యమకారులున్నా ఎవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కానీ సీఎం కేసీఆర్కు మాత్రం వంద ఎకరాలు, ఫామ్హౌస్లు ఎలా వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను ఆయన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ల్యాండ్, స్యాండ్, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లో ఓ చిన్నారిని కుక్క కరిచి చంపితే సీఎం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, ఆదుకోవాలనే సోయి కేసీఆర్కు లేదన్నారు. తెలంగాణ ఇచ్చినోళ్లకు అవకాశం ఇవ్వండి.. ‘తెలంగాణ తెచ్చానని చెప్పే కేసీఆర్కు రెండుసార్లు అవకాశమిచ్చారు. మరి తెలంగాణ ఇచ్చినోళ్లకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి’అని రేవంత్రెడ్డి ప్రజలను కోరారు. 2004లో కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి సోనియాకు కృతజ్ఞతగా కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల నేతన్నలనూ మోసం చేస్తూ.. బతుకమ్మ చీరల పేరిట, మ్యాక్స్ సంఘాల పేరిట మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలను మోసగిస్తూ మాఫియాలను పెంచి పోషిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. నేతన్నలకు నూలు డిపోలు అందుబాటులోకి రాలేదని, అపెరల్ పార్క్ పూర్తి కాలేదని, నేత కార్మికులు ఓనర్లు కాలేదన్నారు. కాగా, నేరెళ్ల దళితులపై పోలీసులు దాడి చేసినప్పుడు మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, ఎవరికి లొంగిపోయారని రేవంత్ ప్రశ్నించారు. సభలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, కార్యక్రమ ఇన్చార్జి గిరీశ్, నేతలు షబ్బీర్అలీ, అంజన్కుమార్యాదవ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె.కె.మహేందర్రెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కమీషన్లు వస్తేచాలా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమాని రాష్ట్రాన్ని శాసిస్తున్న కేటీఆర్.. సొంత నియోజకవర్గంలో శ్రీపాదసాగర్ ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కాల్వ పనులు పడకేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మీకు కమీషన్లు వచ్చేస్తే చాలా?.. కాల్వల్లోకి నీళ్లు రావాల్సిన అవసరం లేదా?’అని ఆ ట్వీట్లో రేవంత్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి కాన్వాయ్లో అపశ్రుతి ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): హాథ్సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోని సింగసముద్రం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. సింగసముద్రంలోకి వెళ్లే కాల్వను పరిశీలించి సిరిసిల్లకు తిరిగి వస్తుండగా రాచర్లతిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని తుర్కపల్లి వద్ద రేవంత్రెడ్డి కాన్వాయ్లోని ఆరు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో రాగట్లపల్లికి చెందిన రవితోపాటు పలువురు విలేకరులు గాయపడ్డారు. రేవంత్ క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
2024 General Election: పొత్తులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
నవ రాయ్పూర్(ఛత్తీస్గఢ్): ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భావసారూప్య పార్టీలతో చేయిచేయి కలిపేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. లక్ష్య సాధన కోసం త్యాగాలు చేసేందుకు వెనుకాడబోమని ఉద్ఘాటించారు. రాయ్పూర్లో పార్టీ ప్లీనరీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఢిల్లీ ప్రధానసేవకుడైన ఆయన ముఖచిత్రంతో రోజూ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఆయన మాత్రం తన సొంత స్నేహితుడి కోసం సేవలందిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘పేదల వ్యతిరేక వైఖరి బీజేపీ డీఎన్ఏలోనే ఉంది. ప్రజాస్వామ్యం ఖూనీకాకుండా ఆపేందుకు ప్రజాఉద్యమం వెల్లువలా రావాల్సిన అవసరమొచ్చింది. భారత్ జోడో యాత్ర.. ప్రజాసమస్యలకు గొంతుకగా మారింది. బీజేపీ హయాంలో రాజ్యాంగ విలువలు, సామాజిక సామరస్యం దెబ్బతిన్నాయి. చైనాతో సరిహద్దు వివాదం, పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు దేశానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని భావసారూప్య పార్టీలే కొత్త ప్రభుత్వపాలన ద్వారా ప్రజాసంక్షేమాన్ని సాధ్యంచేయగలవు. అందుకోసం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సదా సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటరీ, రాజ్యాంగ సంప్రదాయాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ఈడీ, సీబీఐలను బీజేపీ రంగంలోకి దింపింది. ఛత్తీస్గఢ్లో ప్లీనరీ సమావే శాలకు ఇబ్బందికలిగేలా ఇక్కడి నేతలపై ఈడీ దాడులకు తెగబడింది. అయినా నేతలు తెగవతో ఎదుర్కొని సమావేశాలు సజావుగా సాగేలా చేశారు’ అని అన్నారు. రైతుకు రూ.27.. వారికి రూ.1,000 కోట్లు కుబేరుడు గౌతమ్ అదానీని ఉద్దేశిస్తూ.. ‘ దేశం ఎటు పోతోంది? ఓవైపు రైతుకు రోజుకు కేవలం రూ.27 ఆదాయం దక్కుతుంటే ప్రధాని స్నేహితుడు రోజుకు రూ.1,000 కోట్ల ఆదాయం ఎలా రాబట్టగలుగుతున్నారు? కోవిడ్ కాలంలో ప్రధాని స్నేహితుల సంపద 1,300 శాతం ఎగసింది. రైల్, భెయిల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్), సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా).. ఇలా ప్రతీదీ వారికే ధారాదత్తం చేస్తున్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐ అయినా ఉంచుతారో లేక వీరికే అమ్మేస్తారోనని ప్రజల్లో ఆలోచనలు పెరిగాయి. ధరాఘాతంతో దేశ ప్రజల ఇంటి బడ్జెట్ తలకిందులవుతుంటే ఇక్కడి పారిశ్రామికవేత్తలు అపరకుబేరుల అవతారం ఎత్తుతున్నారు. అధికార బుల్డోజర్ కింద పేదలు నలిగిపోతున్నారు. ఓవైపు చైనా భారత భూభాగంలోకి చొరబడుతుంటే విదేశాంగ మంత్రి జైశంకర్ తన తండ్రికి అప్పట్లో ప్రమోషన్ దక్కలేదని వాపోతారు’ అని ఖర్గే అన్నారు. ఇవే మా లక్ష్యాలు ‘ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నిత్యావసర సరకుల ధరలు దించుతాం. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గిస్తాం. రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పిస్తాం. విద్వేష వాతావరణాన్ని చెదరగొట్టి సామరస్యాన్ని సాధించి చూపుతాం. ధన బలం, అధికార బలం లేకుండా చూస్తాం. దేశ పురోభివృద్ధిలో ప్రజలతో కలిసి నడుస్తాం. ముందుండి నడిపిస్తాం’ అన్నారు. సీడబ్ల్యూసీలో 50 శాతం వారికే వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ తన పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసింది. సవరణ ప్రకారం పార్టీ నుంచి ప్రధానులైన నేతలు, మాజీ ఏఐసీసీ చీఫ్లకు సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఉంటుంది. సీడబ్ల్యూసీ సభ్యుల సంఖ్యను 25 నుంచి 35కు పెంచారు. ఇకపై పార్టీలో కేవలం డిజిటల్ మెంబర్షిప్, రికార్డులను కొనసాగిస్తారు. మూడో ఫ్రంట్తో ఎన్డీయేకే మేలు మూడో ఫ్రంట్ అనే మాటే వినపడకుంటే భావసారుప్యత ఉన్న అన్ని పార్టీలను ‘గుర్తించి’, ‘సమీకరించి’, ‘ఏకంచేసే’ బృహత్తర పనికి వెంటనే పూనుకోవాలనే రాజకీయ తీర్మానం ముసాయిదాలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు లౌకిక, సామ్యవాద శక్తుల ఏకీకరణే అసలైన హాల్మార్క్గా నిలుస్తుంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయాల్సిన అత్యవసరస్థితి ఇది. ఆలస్యం చేస్తే అది ఎన్డీయేకే మేలు చేస్తుంది’ అని ముసాయిదాలో నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. -
‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు!
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా భారత్ జోడో యాత్రను మూడు రోజులకే ఆపేయాలనుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వేణు గోపాల్ శనివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన రాహుల్..యాత్రలో తన బదులుగా మరొకరిని పెట్టాలనుకున్నారని కూడా ఆయన చెప్పారు. తన స్థానంలో సీనియర్ నేతలెవరికైనా ఆ బాధ్యతలను అప్పగించాలని సోదరి ప్రియాంకా గాంధీకి చెప్పారన్నారు. కన్యాకుమారి నుంచి యాత్ర మొదలైన మూడు రోజులకే రాహుల్ మోకాలి నొప్పి తీవ్రమైందన్నారు. అయితే, దేవుడి దయతో ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. రాహుల్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర జనవరి 30న జమ్మూలో ముగిసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా.. ‘హాథ్ సే హాథ్’ యాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 26న లాంఛనంగా ప్రారంభమైన ఈ పాదయాత్రలను సోమవారం నుంచి రెండు నెలలపాటు కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే ములుగు చేరుకున్న కాంగ్రెస్ నేతలు మల్లు రవి, బలరాంనాయక్, విజయరమణారావు, సిరిసిల్ల రాజయ్య, చామల కిరణ్కుమార్రెడ్డి తదితరులు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8కి హైదరాబాద్లోని తన నివాసం నుంచి రేవంత్ మేడారానికి బయలుదేరనున్నారు. ములుగుకు వెళ్లిన తర్వాత గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మేడారం చేరుకుని అక్కడ సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభించి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్, పస్రా జంక్షన్ల మీదుగా రామప్ప గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసిన తర్వాత మలిరోజు ఆ గ్రామం నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారని, వారంపాటు అదే నియోజకవర్గంలో తన పాదయాత్ర సాగిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ ఆమోదం తర్వాత భట్టి యాత్ర హాథ్ సే హాథ్ జోడో యాత్రల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే కూడా మేడారం వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలను ప్రారంభించేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్కు ఆమోదం పొందిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ యాత్రలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరోవైపు నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలందరూ సోమవారం తమ తమ నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించనున్నారు. -
వేయాల్సిన అడుగులు ఎన్నో...
దాదాపు 5 నెలలు... 135 రోజులు... 12 రాష్ట్రాలు... 2 కేంద్ర పాలిత ప్రాంతాలు... 75 జిల్లాలు... 4 వేల కిలోమీటర్లు... దేశానికి దక్షిణపు కొస నుంచి ఉత్తరపు కొస దాకా పాదయాత్ర... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ (బీజేవై)కు అనేక లెక్కలున్నాయి. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో దెబ్బతిన్నాక, 2022 వేసవిలో ఉదయ్పూర్ ‘చింతనా శిబిరం’లో ఆత్మవిమర్శలో పడ్డ కాంగ్రెస్ దూరమైన ప్రజలకు దగ్గర కావాలన్న ‘నవ సంకల్పం’తో చేసుకున్న పాదయాత్ర ప్రతిపాదన ఎట్టకేలకు విజయవంతమైంది. విద్వేషాన్ని పెంచుతున్న బీజేపీకి విరుగుడు తామే అన్న పార్టీ చిరకాలపు మాటను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తనకు తానే తరలిన ఆకాశంలా రాహుల్ నడక సాగించారు. కార్యకర్తల్లో ఉత్సాహంతో సారథిగా ఆయనను బలోపేతం చేసినా, సోనియా మార్కు పొత్తుల చతురత కనిపించని ఈ యాత్ర వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు లాభిస్తుందన్నది ప్రశ్న. పార్టీ పునరుజ్జీవనానికి ఇదొక్కటీ సరిపోతుందా అన్నది అంతకన్నా కీలక ప్రశ్న. 2014 ఎన్నికల్లో కనిష్ఠంగా 44 సీట్లే గెలిచిన గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 2017 డిసెంబర్లో అధ్యక్షుడై, ఆపైన 2019లో 52 సీట్లే తేగలిగిన నేతగా రాహుల్కు ఇది పరీక్షాకాలం. వదులుకున్న పార్టీ కిరీటాన్ని మరోసారి నెత్తినపెట్టాలని తల్లి సోనియా, సమర్థకులు ప్రయత్నించినా, యువరాజు దేశసంచారానికే మొగ్గుచూపారు. అసమ్మతి, పార్టీ నుంచి పెద్దల నిష్క్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీనీ, కార్యకర్తల్నీ ఒక్కతాటిపైకి తేవడానికీ, మరీ ముఖ్యంగా తన వెంట నడపడానికీ ఆయన అందుకున్న వ్యూహాత్మక అస్త్రం బీజేవై. ప్రాంతీయ పార్టీలు, మోదీ ప్రభంజనం మధ్య కాంగ్రెస్ నానాటికీ తీసి కట్టుగా మారుతున్నప్పుడు ఆ పార్టీకి దశాబ్దాలుగా మూలస్తంభమైన కుటుంబానికి శ్రమదమాదులు తప్పవు. ‘ఇది భారత్ జోడో కాదు, కాంగ్రెస్ జోడో’ అని బీజేపీ ఆది నుంచి అల్లరి చేస్తున్నది అందుకే. అయితే, మతం ఆసరాగా విభజన రాజకీయాలు విజృంభిస్తున్న వేళ... దేశమంతా ‘కలసి పాడుదాం ఒకే పాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అంటూ ప్రేమ, సమైక్యతల రాగంతో రాహుల్ ముందుకు రావడం విస్మరించలేనిది. ఈ యాత్ర అనేక లోపాలతో నిండిన చిరు ప్రయత్నమే అయినప్పటికీ... వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో, నేతల్లో, మేధావుల్లో కాంగ్రెస్కు కొంత సానుకూలత తెచ్చింది. ప్రతి ఒక్కరితో సంభాషిస్తూ, పెరిగిన గడ్డంతో, సామాన్యుల్లో ఒకరిగా తిరుగుతున్న యువరాజుపై సదభిప్రాయమూ పెంచింది. విభజనకు అడ్డుకట్టగా భారతదేశపు మూలకందమైన భిన్నత్వంలో ఏకత్వపు ప్రేమను రాహుల్ భుజాన వేసుకోవడం దేశానికి చారిత్రక అవసరమనే భావన కలిగించింది. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్కీ ఇది అత్యవసరమే. అందుకే, సరైన సమయానికి భారత్ జోడో జరిగిందనుకోవాలి. గత నాలుగేళ్ళలో మూడే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా గెలిచిన కాంగ్రెస్కు రానున్న ఎన్నికల్లో విజయం కీలకం. దాని మాటేమో కానీ, 75 ఏళ్ళ క్రితం భారత తొలి ప్రధాని నెహ్రూ శ్రీనగర్లోని లాల్ చౌక్లో తొలిసారి జాతీయ జెండా ఎగరేసినచోటే, పాదయాత్ర ఆఖరి రోజున రాహుల్ కూడా పతాకావిష్కరణతో చెప్పినమాట చేసిచూపారు. ప్రతీకాత్మకమే అయినా ప్రజాబాహళ్యంలోకి కాంగ్రెస్ అనుకున్న సందేశాన్ని పంపడానికి ఇది పనికొచ్చింది. అధికార బీజేపీపై సమరానికి ప్రతి పక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పాలనుకున్న బహిరంగ సభ వ్యూహం మాత్రం ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేదు. ఏకంగా 21 పార్టీల నేతల్ని కాంగ్రెస్ ఆహ్వానించినా, భారీ హిమపాతం సహా కారణాలేమైనా వచ్చింది ఒకరిద్దరే. ఇది నిరాశాజనకమే. పైగా, ఆమధ్య ఢిల్లీలో, మళ్ళీ ఇప్పుడు ఇలాగే జరిగి, ప్రతిపక్ష ఐక్యత మిథ్యేనని తేలిపోవడం మరో దెబ్బ. వ్యక్తిగతంగా మాత్రం రాహుల్కు ఈ పాదయాత్ర కలిసొచ్చింది. ‘నాన్ సీరియస్ పొలిటీషియన్’, ‘పప్పు’ లాంటి ఎకసెక్కపు మాటల ఇమేజ్ను ఈ యువనేత తుడిపేసుకోగలిగారు. నడకలో పదుగురితో మమేకమై, ప్రజా సమస్యలను లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, పాదయాత్ర చేసినంత మాత్రాన ఓటర్లు వరాల వర్షం కురిపిస్తారనీ, సారథ్యం స్థిరపడుతుందనీ అనుకుంటే పొరపాటు. ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేసినప్పుడే అవి సాధ్యం. సుదీర్ఘ యాత్రతో రాహుల్ మారిన మనిషయ్యారని ఒక విశ్లేషణ. ఆయన స్నేహశీలత జనానికి తెలియడమూ మంచిదే. హర్యానా సహా కొన్ని రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ పెరిగిందనీ సర్వేల సారం. కానీ, ఇప్పటికీ మోదీకి దీటుగా కాంగ్రెస్, రాహుల్ మారనే లేదన్నది నిష్ఠురసత్యం. దాన్ని సరిదిద్దుకొనేలా ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ చేపడతారన్నది ఆసక్తికరం. ప్రతిపక్ష కూటమికి దీర్ఘకాలం సహజ సారథి అయిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ స్థానానికి కూడా పోటీని ఎదుర్కొంటోంది. మోదీకి ప్రత్యామ్నాయం తామేనని చిత్రించుకొనేందుకు పలువురు ప్రాంతీయ సారథులు తొందరపడుతున్నారు. తమలో తాము తోసుకుంటున్నారు. ఈ అనైక్యతతో చివరకు పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీరుస్తుంది. ప్రతిపక్షాలు అది గ్రహించాలి. 2024 సార్వత్రిక ఎన్నికల లోగా ఈ ఏడాదే 9 రాష్ట్రాల అసెంబ్లీ పోరు ఉంది. ఈ ప్రయాణంలో పెద్దన్నగా కాంగ్రెస్ ఆచరణాత్మక దృక్పథంతో పట్టువిడుపులు చూపాలి. ప్రేమ పంచిన ప్రేమ వచ్చును అని కవి వాక్కు. ‘మొహబ్బత్ కీ దుకాన్’ పెట్టుకొని దేశం తిరిగిన పార్టీకీ, నేతకూ ఏం చేయాలో చెప్పనక్కర్లేదు. దేశం ఈ మూల నుంచి ఆ మూలకు ఒక పాదయాత్ర ముగిసిపోయి ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్, రాహుల్లు నడవాల్సిన దూరం చాలానే ఉంది. వేయాల్సిన అడుగులు మిగిలే ఉన్నాయి. -
ముగిసిన జోడో యాత్ర..
ముగిసిన జోడో యాత్ర.. -
Bharat Jodo Yatra: హింసను ప్రేరేపిస్తున్నారు
శ్రీనగర్: ‘‘దేశంలో స్వేచ్ఛాయుత, లౌకిక విలువలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ నిత్యం దాడి చేస్తున్నాయి. వాటికి పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం నిరంతరం హింసను ప్రేరేపిస్తున్నాయి’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మండిపడ్డారు. ఆ విలువల పరిరక్షణకే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు పునరుద్ఘాటించారు. జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది. సభలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని, షేర్ ఏ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో సభ నిర్వహించింది. దీనిలో తొమ్మిది విపక్ష పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విపరీతంగా కురుస్తున్న మంచులో తడుçÜ్తూనే రాహుల్ మాట్లాడారు. హింస ఎంతటి బాధాకరమో మోదీ లాంటివారికి ఎన్నటికీ అర్థం కాదంటూ ఆక్షేపించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీల హత్యోదంతాలను గుర్తు చేసుకున్నారు. ‘‘వారిక లేరని ఫోన్ కాల్స్ ద్వారానే తెలుసుకున్నా. ఆ దుర్వార్తలు విని విలవిల్లాడిపోయా. అలాంటి ఫోన్ కాల్స్ అందుకోవాల్సి రావడంలో ఉండే అంతులేని బాధను, నొప్పిని కశ్మీరీలు అర్థం చేసుకోగలరు. పుల్వామా వంటి ఉగ్ర దాడులకు బలైన ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలు అర్థం చేసుకోగలవు. నేను, నా చెల్లెలు అర్థం చేసుకోగలం. అంతేగానీ మతిలేని హింసను ప్రేరేపించే మోదీ, అమిత్ షా (కేంద్ర హోం మంత్రి), అజిత్ దోవల్ (జాతీయ భద్రతా సలహాదారు), ఆరెస్సెస్ నేతల వంటివాళ్లు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దాని తాలూకు బాధను వాళ్లెప్పుడూ అనుభవించనే లేదు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సైనికుడు కావచ్చు, సీఆర్పీఎఫ్ జవాను కావచ్చు, కశ్మీరీ కావచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ వారు ఇక లేరనే దుర్వార్త మోసుకొచ్చే అలాంటి ఫోన్ కాల్స్కు శాశ్వతంగా తెర దించడమే జోడో యాత్ర లక్ష్యం. అంతే తప్ప నా స్వీయ లబ్ధి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. దేశ ప్రజల కోసం. దేశ పునాదులను నాశనం చేయజూస్తున్న భావజాలానికి అడ్డుకట్ట వేయడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. కశ్మీర్లో నడవాలంటే వారికి భయం బీజేపీ అగ్ర నేతలకు దమ్ముంటే తనలా జమ్మూ కశ్మీర్లో పాదయాత్ర చేయాలని రాహుల్ సవాలు విసిరారు. ‘‘అది వారి తరం కాదు. చేయలేరు. ఒక్కరు కూడా జమ్మూ కశ్మీర్లో నాలా నడవలేరు. ఎందుకంటే వారికి అంతులేని భయం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కశ్మీర్లో పాదయాత్ర వద్దని నాకు సలహాలొచ్చాయి. బులెట్ ప్రూఫ్ కార్లో చేయాలని స్థానిక యంత్రాంగమూ సూచించింది. నడిస్తే నాపై ఏ గ్రెనేడో వచ్చి పడొచ్చని హెచ్చరించింది. బహుశా నన్ను భయపెట్టడం వారి ఉద్దేశం కావచ్చు. కానీ నేను భయపడలేదు. నన్ను ద్వేషించేవారికి నా తెల్ల టీ షర్టు రంగు (ఎర్రగా) మార్చే అవకాశం ఎందుకివ్వకూడదని ఆలోచించా. ఈ రాష్ట్రం నా సొంతిల్లు. కశ్మీరీలు నావాళ్లు. వాళ్లతో కలిసి నడిచి తీరాలని నిర్ణయించుకున్నా. కశ్మీరీలు నాపై గ్రనేడ్లు విసరలేదు. హృదయపూర్వకంగా అక్కున చేర్చుకున్నారు. అంతులేని ప్రేమతో ముంచెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మనస్ఫూర్తిగా స్వాగతించి నన్ను తమవాణ్ని చేసుకున్నారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘నాకు లేనిదీ, బీజేపీ నేతలకున్నదీ భయమే. నిర్భయంగా జీవించడాన్ని మహాత్మా గాంధీ నుంచి, నా కుటుంబం నుంచి నేర్చుకున్నా’’ అన్నారు. కాంగ్రెస్ ర్యాలీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రాతో పాటు డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్ నేతలు మాట్లాడారు. 22 పార్టీలకు ర్యాలీకి కాంగ్రెస్ ఆహ్వానం పంపగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, జేడీ(యూ) తదితర ముఖ్య పక్షాలు గైర్హాజరయ్యాయి. సోదరితో సరదాగా... భారీ భద్రత, యాత్ర, రాజకీయాలు, ప్రసంగాలు, విమర్శల నడుమ రాహుల్ కాసేపు సోదరి ప్రియాంకతో సరదాగా స్నోబాల్ ఫైట్ చేస్తూ సేదదీరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక వీడియోలో రాహుల్ రెండు మంచు ముక్కలను వెనక దాచుకుని ప్రియాంకను సమీపించి ఆమె తలపై కొట్టి ఆట పట్టించారు. ఆమె కూడా ఆయన వెంట పడి తలంతా మంచుతో నింపేశారు. తర్వాత జోడో యాత్ర క్యాంప్ సైట్ వద్ద, అనంతరం పీసీసీ కార్యాలయంలోనూ రాహుల్ జాతీయ జెండా ఎగురవేశారు. యాత్రలో తనతో పాటు కలిసి నడిచిన భారత యాత్రీలకు కృతజ్ఞతలు తెలిపారు. వణికించే చలిలోనూ ఇన్ని రోజులుగా కేవలం తెల్ల టీ షర్టుతోనే యాత్ర చేసిన రాహుల్ ఎట్టకేలకు సోమవారం జాకెట్ ధరించారు. తర్వాత పొడవాటి సంప్రదాయ బూడిద రంగు కశ్మీరీ ఫేరన్ ధరించి ర్యాలీలో, సభలో పాల్గొన్నారు. ఇదే సొంతిల్లు కశ్మీర్ తన సొంతిల్లని రాహుల్ పదేపదే గుర్తు చేసుకున్నారు. ‘‘రాష్ట్రంలో నడుస్తుంటే అప్పుడెప్పుడో సరిగ్గా ఇవే దారుల గుండా నా పూర్వీకులు కశ్మీర్ నుంచి అలహాబాద్ వెళ్లారన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నేను నా ఇంటికి తిరిగొస్తున్నట్టు ఫీలయ్యా. ఎందుకంటే నాకంటూ ఓ ఇల్లు లేదు. చిన్నతనం నుంచీ ప్రభుత్వ ఆవాసాల్లోనే బతికాను. వాటిని నా ఇల్లని ఎప్పుడూ అనుకోలేకపోయాను. నా వరకూ ఇల్లంటే ఓ ఆలోచన. జీవన విధానం. కశ్మీరియత్ శివుని ఆలోచనా ధార. శూన్యత్వం. అహంపై పోరాడి గెలవడం. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. దీన్నే ఇస్లాంలోనూ ఫనా అన్నారు. అస్సాం, కర్నాటక, మహారాష్ట్ర... అన్ని రాష్ట్రాల్లోనూ ఈ భావధార ఉంది. దీన్నే గాంధీ వైష్ణో జనతో అన్నారు. నా పూర్వీకులు ఇక్కణ్నుంచి వెళ్లి అలహాబాద్లో గంగా తీరాన స్థిరపడి కశ్మీరియత్ను యూపీలో ప్రచారం చేశారు. అదే గంగా యమునా పవిత్ర సంగమం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా ఇంటికి వెళ్తున్నట్టు అన్పిస్తోంది’ అంటూ జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించే ముందు తల్లి సోనియాకు, తనకు రాహుల్ మెసేజ్ చేశారని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఎవరేమన్నారంటే... ఎన్నికల యాత్ర కాదు భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దేశ ప్రజలనందరినీ ఒక్కటి చేయగలనని రాహుల్ పాదయాత్రతో నిరూపించారు – మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు లౌకిక పార్టీలన్నీ ఒక్కటవాలి బ్రిటిష్ పాలనపై ఐక్యంగా పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. అలాగే బీజేపీ పాలనపైనా పోరుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలి. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి పశ్చిమం నుంచి తూర్పుకూ... శాంతి, సౌభ్రాతృత్వాలు కోరుకునే వారికి దేశంలో కొదవ లేదని జోడో యాత్ర నిరూపించింది. దక్షిణం నుంచి ఉత్తరానికి చేసినట్టుగానే దేశ పశ్చిమ కొస నుంచి తూర్పుకు కూడా రాహుల్ పాదయాత్ర చేయాలి. నేను ఆయన వెంట నడుస్తా. ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ రాహుల్ ఓ ఆశాకిరణం రాహుల్గాంధీలో దేశానికి ఒక నూతన ఆశా కిరణం దొరికింది. – మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు విభజన రాజకీయాలే ముప్పు విభజన రాజకీయాలు దేశానికెప్పుడూ హానికరమే. వాటిని వ్యతిరేకిస్తూ నా సోదరుడు చేసిన యాత్రకు జనం వస్తారో లేదోనని అని నేను మొదట్లో అనుకున్నా. కానీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆద్యంతం వారు భారీగా తరలి వచ్చి సంఘీభావంగా నిలిచారు. ఐక్యతా స్ఫూర్తిని చాటారు. దేశమంతా యాత్రకు ఇంతగా మద్దతుగా నిలవడం నిజంగా గర్వకారణం. – ప్రియాంకా గాంధీ వద్రా చదవండి: కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్.. -
కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్..
శ్రీనగర్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనగర్లో సోమవారం ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. భారీ సభకు ఏర్పాట్లు చేసింది. అయితే కశ్మీర్లో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి మంచు వర్షం కురుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం చూసి రాహల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంచులో ఆటలాడుకున్నారు. ఒకరిపై ఒకరు మంచు పెల్లలు విసురుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా రాహుల్ మంచు విసిరి ఆహ్లాదంగా, సంతోషంగా గడిపారు. రాహుల్, ప్రియాంక మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. शीन मुबारक! 😊pic.twitter.com/V9Y8jCf0MS — Congress (@INCIndia) January 30, 2023 చదవండి: త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్! -
నేటితో ముగియనున్న జోడో యాత్ర
శ్రీనగర్: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లో ముగియనుది. ఈ సందర్భంగా శ్రీనగర్లోని లాల్చౌక్ క్లాక్ టవర్ వద్ద అత్యంత కటుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948లో ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగరేయడం విశేషం. రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని చెప్పారు. సెప్టెంబర్ 7న మొదలైన రాహుల్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 4 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మతసామరస్యమే ప్రధాన ఎజెండా సాగిన ఈ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ ఉల్లాసంగా కనిపించారు. సోమవారం ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రీనగర్లోని ఎస్కే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకం విపక్షాల మధ్య విభేదాలున్నా, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై పోరులో అవి ఐక్యంగా ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జోడో యాత్రలో పాల్గొనబోమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చెప్పడంపై ఆయన స్పందించారు. జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి చేరినప్పటికీ ఫలితం మాత్రం దేశమంతటా ఉందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల విద్వేషం, అహంకారంల స్థానంలో తమ యాత్ర దేశానికి సోదరభావమనే ప్రత్యామ్నాయాన్ని చూపిందని అన్నారు. -
చలో ‘భారత్ జోడో’ సభ
సాక్షి, హైదరాబాద్: గతేడాది సెప్టెంబర్ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జమ్మూ, కశ్మీర్లోని శ్రీనగర్కు తరలివెళ్లారు. సోమవారం జరిగే ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే శ్రీనగర్కు చేరుకున్నారు. ఆదివారమే రేవంత్రెడ్డి శ్రీనగర్లో రాహుల్గాంధీని కలిశారు. వీరితోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, చామల కిరణ్కుమార్రెడ్డి తదితరులు శ్రీనగర్కు వెళ్లారు. భారత్ జోడోయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులకు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈ నాయకులందరూ శ్రీనగర్ బాట పట్టారు. నేడు సంఘీభావంగా సర్వమత ప్రార్థనలు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. భారత్ జోడోయాత్ర ముగింపు, గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాల్లో ప్రత్యేక పూజలు చేయాలని ఇటీవల జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. జనవరి 26న హాథ్ సే హాథ్ జోడో యాత్రలను లాంఛనంగా ప్రారంభించగా, 30న అన్ని మతాల ప్రార్థనలు చేసి, ఫిబ్రవరి 6 నుంచి అట్టహాసంగా హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించి రెండు నెలలపాటు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ముగిసిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. కాశ్మీర్లో కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిన విషయం తెలిసిందే. 2022 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 29 2023 వరకు దాదాపు 150 రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగింది. కాగా, జనవరి 30(సోమవారం)న కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీనగర్లో యాత్ర ముగింపు భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే, భారత్ జోడో యాత్ర ముగిసిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వచ్చింది. రైతులు, నిరుద్యోగ యువత సమస్యలు తెలుసుకున్నాను అని కామెంట్స్ చేశారు. Bharat Jodo Yatra received a great response in the country. We saw the resilience and strength of the people of India during this journey. We also got to hear about the issues being faced by farmers, and unemployed youth in the country: Congress MP Rahul Gandhi in Srinagar, J&K pic.twitter.com/cpqjKZ7Rdz — ANI (@ANI) January 29, 2023 -
భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం
అవంతిపురా/శ్రీనగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం పునఃప్రారంభమైంది. రాహుల్ గాంధీ ఉదయం 9.20 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. భద్రతాపరమైన లోపాలున్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం యాత్రను నిలిపేయడం తెలిసిందే. దాంతో శనివారం మూడంచెల భద్రత కల్పించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడిలో మరణించిన 40 సీఆర్పీఎఫ్ జవాన్లకు రాహుల్ గాంధీ శనివారం నివాళులర్పించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో బస్సు ధ్వంసమైన చోట పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. యాత్రలో ప్రియాంకా గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. శనివారం లెథ్పురాలో సోదరుడు రాహుల్ గాంధీపాటు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని చుర్సూలో పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం రాహుల్ గాంధీతోపాటు జోడో యాత్రలో పాల్గొన్నారు. తాజా గాలి పీల్చుకున్నట్లే ఉంది: ముఫ్తీ కశ్మీర్లో జోడో యాత్ర జరగడం తాజా గాలి పీల్చుకున్నట్లుగా ఉందని మెహబూబా ముఫ్తీ శనివారం ట్వీట్ చేశారు. 2019 తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారని చెప్పారు. యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడవడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జోడో యాత్ర ఆదివారం ఉదయం పంథాచౌక్ నుంచి పునఃప్రారంభం కానుంది. శ్రీనగర్లో బోలివార్డ్ రోడ్డులోని నెహ్రూ పార్కు వరకూ యాత్ర సాగుతుంది. సోమవారం శ్రీనగర్ ఎంఏ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జెండా ఎగురవేస్తారు. అనంతరం ఎస్కే స్టేడియంలో విపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షాకు మల్లికార్జున ఖర్గే లేఖ జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న భారత్జోడో యాత్రకు తగిన భద్రత కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్రలో భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. -
రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతమైనట్టేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగిన ఈ యాత్ర విజయవంతమైనట్టేనా? నూటా పాతికేళ్ల పై చిలుకు సుదీర్ఘ చరిత్రలోఎన్నడూ లేనంత నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్న కాంగ్రెస్కు కాస్తయినా కొత్త ఊపిరులూదేనా...? వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆశించిన మేరకు ఓట్లను ‘జోడి’ంచేనా...? కాంగ్రెస్. గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఎంతో ఘనచరిత్ర ఉన్న పార్టీ. మహా మహా నాయకులెందరినో దేశానికి అందించిన పార్టీ. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలిన జన సమ్మోహన పార్టీ. దేశాన్ని ఒక్కతాటిపై నడిపిన పార్టీ. కానీ కొన్నేళ్లుగా సొంత నేతలనే ఒక్కతాటిపై నడపలేక ఆపసోపాలు పడుతోంది. ఏదో చెయ్యాలి. మళ్లీ ఎలాగైనా పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలి. ఈ తపన, మథనం నుంచి పుట్టిన ‘భారత్ జోడో యాత్ర’ పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తుందా? లేదా లెక్క తప్పుతుందా? వేచి చూడాల్సిందే! దేశ ప్రజలను ఈ యాత్ర ద్వారా రాహుల్గాంధీ ఏ మేరకు ప్రభావితం చేయగలిగారన్నది కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చే సీట్ల సంఖ్య ద్వారానే తేలుతుంది. చకచకా.. చలాకీగా... రాహుల్గాంధీ. కాంగ్రెస్కు చివరి ఆశాకిరణం. జోడో యాత్ర. రాహుల్గాంధీకి చివరి ఆశాకిరణం. ఈ యాత్రపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్గాంధీ చలాకీగా నడుస్తూ, జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూ కశ్మీర్లో ముగుస్తుంది. దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ రాజకీయ ప్రస్థానం మిగతా రాజకీయ నాయకులకు విభిన్నంగా ఉంటుంది. పట్టాభిషేకమే తరువాయి అనే యువరాజు హోదాలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనలో సహజసిద్ధమైన చొరవ, దూకుడు ఒకింత తక్కువేనని చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా చాలాకాలం పాటు అమ్మచాటు బిడ్డలానే కొనసాగడం, నాయకత్వం వహించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా వెనక్కు తగ్గడం ఆయన రాజకీయ శైలికి అద్దం పడుతుంది. ఇవాళ్టికీ కాంగ్రెస్కు అన్నీ ఆయనే. అయినప్పటికీ, ప్రతిపక్షాలకు మాత్రం ‘పప్పూ’గా మిగిలిపోయారు. ప్రతిపక్షాల అక్కసు ఎలా ఉన్నా, తనేమిటో నిరూపించుకోవడాదనికి జోడో యాత్ర రాహుల్కు మంచి అవకాశాన్నిచ్చింది. దాన్ని ఆయన హుందాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. జనం నుంచి యాత్రకు మంచి స్పందనే వచ్చింది. చాలామంది ప్రముఖులు, మేధావులు రాహుల్తో కదం కలిపి సంఘీభావం తెలిపారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఓ మెట్టు పైకి లేపారు. అయితే కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఈ యాత్ర ఒక్కటే దోహదపడుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆదరణ ఓటుగా మారుతుందా అన్నది మరో చిక్కు ప్రశ్న. వరుస ఓటములే నేపథ్యం... ప్రస్తుతం కేవలం మూడంటే మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవడం కష్టమే! మహా అయితే లోక్సభలో తమ సీట్ల సంఖ్యను కొద్దో గొప్పో పెంచుకోగలదు. అంతే. నిజానికి కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అదే గొప్ప విజయంగా భావించవచ్చు. 2014 ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ ఆ తర్వాత సంస్థాగత మార్పులపై కసరత్తు చేసి 2017లో యువరాజు రాహుల్గాంధీని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టింది. అప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన తల్లి సోనియాగాంధీ నుంచి పార్టీ రాజదండం అందుకున్న రాహుల్ ఊహించినంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆయనలో చొరవ, దూకుడు, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండే కలుపుగోలుతనం లోపించాయనేది ఈ సమయంలోనే స్పష్టమైంది. పద్మవ్యూహంలాంటి రాజకీయ రణాంగణంలో మెతగ్గా, హుందాగా ఉంటే నడవదు. యుద్ధాన్ని ముందుండి నడిపించే సైన్యాధిపతిలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఊహకందని వ్యూహాలతో ముందుకురకాలి. ఆలోచిద్దాం, చేద్దాంలతో పని నడవదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలు రాహుల్గాంధీ పనితీరుకు అగ్నిపరీక్ష పెట్టాయి. కానీ ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా కుదేలైంది. అధ్యక్ష పదవి సోనియా నుంచి రాహుల్కు మారినా కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసి కొన్నాళ్లపాటు నిస్తేజంగా ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలంతా కూడా సుదీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయారు. గత మేలో ఉదయ్పూర్లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిరంలో మేధోమథనం చేసి భారత్ జోడో యాత్రకు రూపకల్పన చేశారు. ఆదరణ ఓటుగా మారేనా? ‘జోడో యాత్ర’ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో ఆగుతూ.. కదులుతూ... సాగుతోంది. వివాదాలకూ, వివాదాస్పద వ్యాఖ్యలకూ దూరంగా ఉంటూ, మనసులోని మాటను జనాలతో పంచుకుంటూ రాహుల్ యాత్రను కొనసాగిస్తున్నారు. సామాజిక సమస్యలు, మత సామరస్యం, ఆర్థిక అసమానతలు, రాజకీయ పెత్తందారీ పోకడల వంటి అంశాలే అజెండాగా ప్రజలతో మమేకమై చిట్టిపొట్టి విలేకరుల సమావేశాల్లో తన గళం వినిపిస్తూ వచ్చారు. ప్రధాన మీడియా చానళ్లు, పత్రికలకు సాధ్యమైనంత దూరంగా ఉన్నారు. యాత్ర సాగుతున్న తీరు, అభిమానుల ఆత్మీయ స్పర్శ, విలేకరుల సమావేశాలను తన హాండ్లర్ ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేయడాన్ని యాత్ర తొలి రోజు నుంచి ఏనాడూ మిస్ కాలేదు. ప్రతిపక్షాలు రుద్దిన ‘పప్పూ’ ట్యాగ్ నుంచి బయట పడటానికి ఇది బాగా దోహదపడింది. యాత్ర మొదలైన సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఈ యూట్యూబ్ చానల్కు లక్షల్లో కొత్త వీక్షకులు జతగూడారు. ప్రధాని మోదీ పనితీరు, బీజేపీ అధికార దర్పం పట్ల అసంతృప్తిగా ఉన్నవాళ్లను రాహుల్ తన కొత్త వ్యవహార శైలితో ఆకర్షించగలిగారు. గత జనవరితో పోలిస్తే ఆయనకు స్వల్పంగా జనాదరణ పెరిగిందని పలు చానళ్ల సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ ఆదరణ వచ్చే జనవరికి పెరుగుతుందో, తరుగుతుందో చూడాలి. ఈ యాత్ర కాంగ్రెస్లో కచ్చితంగా కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు. అయితే ఇదొక్కటే చాలదు. అటు లోక్సభలోనూ, ఇటు ప్రజల్లోనూ నిర్మాణాత్మక విమర్శలు, చేతలతో ప్రజల విశ్వాసం చూరగొనడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలి. సొంతింట్లోనే చిచ్చు రాజేసే క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలి. అధికారం లేనిచోట ఒక్కతాటిపై నిలిచే ప్రయత్నం చేయాలి. తాను మారిన మనిషినని ఈ పాదయాత్ర ద్వారా రాహుల్గాంధీ నిరూపించుకున్నట్టే యాత్ర ద్వారా చేకూరిన లబ్ధిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోగలగాలి. లేదంటే రాహుల్ భారత్ జోడో యాత్ర ఓటు జోడో యాత్రగా మారకుండా సుదీర్ఘ ‘ఈవినింగ్ వాక్’గానే మిగిలిపోతుంది! -
Kashmir: రాహుల్ భారత్ జోడో యాత్రలో మెహబూబా ముఫ్తీ..
శ్రీనగర్: భద్రతా లోపాల కారణంగా కశ్మీర్లో శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం శనివారం మళ్లీ ప్రారంభమైంది. అవంతిపొర నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ రాహుల్తో పాటు యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా మరోసారి సోదురుడితో పాటు కలిసి నడిచారు. #WATCH | Congress party's Bharat Jodo Yatra resumes from Awantipora, Jammu & Kashmir. PDP chief Mehbooba Mufti joins Rahul Gandhi in the yatra. (Video: AICC) pic.twitter.com/l3fLfIoTu5 — ANI (@ANI) January 28, 2023 #WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra joins Rahul Gandhi in the party's Bharat Jodo Yatra at Awantipora, Jammu & Kashmir. pic.twitter.com/Awr5MgyH2z — ANI (@ANI) January 28, 2023 భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ ఒబ్దుల్లా రాహుల్తో పాటు యాత్రలోనే ఉన్నారు. భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకుని భారత్ జోడో యాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా జనవరి 30న శ్రీనగర్లో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖులు ఈ సభకు హాజరవుతున్నారు. చదవండి: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ -
పరిస్థితి అంతంత మాత్రమేనట!
పరిస్థితి అంతంత మాత్రమేనట! మళ్లీ కశ్మీర్ టూ కన్యా కుమారికి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది సార్! -
రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జమ్ముకాశ్మీర్లోని బనిహాల్లో సాగుతున్న రాహుల్ యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్పీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఒమర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ను పెంచడం కోసం కాదని, దేశంలోని పరిస్థితిని మార్చడం కోసమేనని చెప్పారు. అందువల్లే తాను ఈ యాత్రలో పాల్గొన్నట్లు వివరించారు. ఈ యాత్రను గాంధీ వ్యక్తిగత కారణాలతో ప్రారంభించలేదని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చేస్తున్న యాత్రగా అభివర్ణించారు. ఈ ప్రభుత్వం అరబ్ దేశాలతో స్నేహం చేస్తున్నప్పటికీ దేశంలోని అతిపెద్ద మైనారిటీ నుంచి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ప్రతినిధులుగా లేరని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ..దీని పునరుద్ధణ కోసం కోర్టులో పోరాడతాం అన్నారు. ఈ సందర్భంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు పూర్తయిందని, చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయన్నారు. రెండు ఎన్నికల మధ్య ఈ గ్యాప్ చాలా ఎక్కువే అని చెప్పారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడూ కూడా జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎన్నికలు కోసం అడుక్కోవాలని కోరుకుంటోందని అన్నారు. అయినా తాము బిచ్చగాళ్లం కాదని దాని కోసం తాము అడుక్కోమని తేల్చి చెప్పారు. కాగా ఈ యాత్రలో ఇరు నాయకులు ఒకేలాంటి టీషర్ట్ల ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. యాత్రకు బ్రేక్ చక్కగా సాగిసోతున్న రాహుల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్ పడింది. ఆయన భద్రతా దృష్ట్యా అనుహ్యంగా రద్దైంది. ఈ రోజు రాహుల్ జోడో యాత్రలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా ..కేవలం కిలోమీటర్ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. ఐతే కాశ్మీర్లో ఆయన కోసం ఊహించని విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనకు కారణమైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేశాయి. రాహుల్ శ్రీనగర్కు సమీపంలోని బనిహాల్ టన్నెల్ దాటిన తర్వాత పెద్ద ఎత్తున భారీ జన సముహం రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ కదలేకపోయినట్లు తెలిపాయి, అదీగాక అక్కడ తగిన విధంగా భద్రత లేకపోవడంతోనే యాత్ర ఆపేయవలసి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గాంధీని భద్రతా వాహనంలో తీసుకెళ్లి యాత్రను విరమింపజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాల భద్రతకు సంబంధించి తగిన సంఖ్యలో పోలీసుల లేరని, తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సమాచారం. (చదవండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు?
పొద్దు మీకింది. ఎప్పటి తీర్గనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ్కి బోయిన. పాన్ డబ్బ మా అడ్డ. దినాం పొద్దు మీకంగనే మా దోస్తు లందరు గాడ జమైతరు. నాత్రి తొమ్మిది గొట్టె దాంక ముచ్చట బెడ్తం. నేను బోకముందు మా దోస్తులు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు. ‘‘మొన్న ఓటర్ల దినాన మా వాడ కట్టు ఓటర్లు మీటింగ్ బెట్టిండ్రు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘మీటింగ్ బెట్టి ఏం జేసిండ్రు’’ అని సత్నారి అడిగిండు. ‘‘తీర్మానాలు జేసిండ్రు’’ ‘‘గయేంటియో జర జెప్పు’’ ‘‘గ్యాస్ బండ దర బెంచిండ్రు. బస్ చార్జిలు బెంచిండ్రు. కరెంటు చార్జిలు గుడ్క బెంచిండ్రు. మనం గుడ్క ఓటు దర బెంచాలె. ఓటును అగ్వ దరకు అమ్మే సవాల్ లేదు. ఉద్దెర నడ్వదు. అంత నగతే. గిట్ల నగతిస్తె గట్ల ఓటేస్త మనాలె. గుండు గుత్త ఓట్ల కోసం కుల పెద్దకు రూపాయ లిచ్చినమని లీడర్లు జెప్తె నమ్మొద్దు. ఓటరు అంటె ఎవడు. దేవునసుంటోడు. దేవునికి ఏ తీర్గ పూజలు జేస్తరో గదే తీర్గ లీడర్లు ఓటర్కు పూజలు జెయ్యాలె’’ అని యాద్గిరి ఇంకేమొ జెప్పబోతుంటె ఇస్తారి అడ్డం దల్గి – ‘‘నోటుకు ఓటు గాకుంట ఇంకేమన్న తీర్మానాలు జేసిండ్రా?’’ అని అడిగిండు. ‘‘చేసిండ్రు. ఓటు ఏసెతంద్కు బోయెటోల్లని మోటర్ల దీస్క బోవాలె. లైన్ల శానసేపు నిలబడే పనిబడ్తె కాల్లు నొవ్వకుంట తలా ఒక కుర్సి ఏసి కూసుండ బెట్టాలె. ఎండ దాకకుంట షామియానాలు ఎయ్యాలె. షామియాన ఏసేటి మోక లేకుంటె తలకొక ఛత్రి బట్టే సౌలత్ బెట్టాలె. ఎండ కాలంల ఓట్లేసే పని బడ్తె సల్లటి సోడలు తాపియ్యాలె. గదే సలికాలమైతె ఛాయ్, కాఫి ఇయ్యాలె’’ అని యాద్గిరి జెప్పిండు. ‘‘కూట్లె రాయి దీయనోడు ఏట్లె రాయెట్ల దీస్తడు అని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటరు. గని గాల్లే గురువింద ఇత్తు అసుంటోల్లన్న సంగతిని యాది మరుస్తున్నరు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గా సంగతేందో జెర జెప్పు’’ అని సత్నారి అన్నడు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్ల ముంగట దలిత బందు పద్కం బెట్టిండ్రు. ఎట్లన్న జేసి గెల్వాలని గా నియోజక వర్గంల అమలు జేసిండ్రు. వాసాల మర్రిల 75 మంది దళితులకు గీ పద్కం కింద తలా పది లచ్చల రూపాయ లిచ్చిండ్రు. అటెంకల నియోజక వర్గంకు 500 మందికి దలిత బందు పద్కం కింద తలా పది లచ్చలు ఇస్తమన్నరు. మల్ల గిప్పుడు 200 మందికే ఇస్తమంటున్నరు. బడ్జెట్ బెట్టి యాడాదైంది. గని పోయిన పది నెలలల్ల ఒక్కడంటె ఒక్క నికి గుడ్క ఈ పద్కం కింద రూపాయలియ్య లేదు. బీఆర్ఎస్ సర్కారొస్తె దేసమంత దలిత బందు పద్కం బెడ్త మని కేసీఆర్ అన్నడు. రాస్ట్రంలనే అమలు జెయ్యనోడు దేసంల అమలెట్ల జేస్తడు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘హాత్ సే హాత్ యాత్ర సంగతేంది?’’ ‘‘వొచ్చె నెల ఆరో తారీకు కెల్లి రాస్ట్రంల హాత్ సే హాత్ జోడో యాత్ర జేస్తమని కాంగ్రెస్ లీడర్లు అంటున్నరు. ముందుగాల చబ్బీస్ జన్వరి కెల్లి గీ పాదయాత్ర జేద్దామను కున్నరు. రాహుల్ గాంది బారత్ జోడో పాదయాత్ర కశ్మిర్లకు బోయింది. గని జమ్ముల చబ్బీస్ జన్వరి దినాన గాకుంట ముప్పై తారీకు రాహుల్ జెండ ఎగిరేస్తడట. బారత్ జోడో కతమైన చబ్బీస్ జన్వరి దినాన్నే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర షురువు జేద్దామని కాంగ్రెస్ లీడర్లు అను కున్నరు. గని జమ్ముల రాహుల్ పబ్లిక్ మీటింగ్ వాయిద బడ బట్కె తెలంగానల పాదయాత్ర గుడ్క వాయిద బడ్డది. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘హాత్ సే హాత్ జోడో అంటె చెయ్యితోని చెయ్యి గల్పుడు. చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు. కుస్తి పట్టేటి ముంగట గల్పుతరు. చెయ్యి తోని చెయ్యి గల్పుడు అంటె చెయ్యిచ్చుడు. గీ రొండిట్ల ఏం జేస్తమని కాంగ్రెస్ జెప్తున్నది’’ అని సత్నారి అడిగిండు. ‘‘కోడి గుడ్డు మీద బూరు బీక్తున్నవు. పస్కలొచ్చినోనికి దునియంత పచ్చగనే కండ్ల బడ్తదట’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గాంది బవన్కు వొచ్చేటి సవాల్ లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీనడ్మ గాంది బవన్కు వొచ్చిండు. రేవంత్ రెడ్డిని గల్సిండు. ఇద్దరం గల్సి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర జేద్దామన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లప్పుడు కాంగ్రెస్ కిలాఫ్ మాట్లాడిన వెంకట్ రెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్ దీస్కోవాలెనని కొండా సురేక అంటున్నది. ముందుగాల్ల లీడర్ సే లీడర్ జోడో అయినంకనే హాత్ సే హాత్ జోడో అంటె బాగుంటది’’ అని సత్నారి అన్నడు. ‘‘ఆది శంకరాచార్య అందరి కన్న ఫస్టు కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండ్రు. మల్ల గిప్పుడు శంకరాచార్య తీర్గనే రాహుల్ గాంది గుడ్క కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండని కశ్మీర్ మాజి ముక్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక్క తీర్గ తారీఫ్ జేసిండు. గాయిన శంకరాచార్య అనంగనే రాహుల్కు ముగ్గురు దేవులల్ల ఒక్కడైన శంకరుడు యాది కొచ్చిండు. యాదికి రాంగనే గాయిన చెయ్యి సూబెట్టిండు. బారత్ జోడో యాత్ర అనేటి తపస్సు జేసిన. చేసినంకనే మీకు అరచెయ్యి అంటె అభయ ముద్ర సూబెడ్తున్న అని రాహుల్ గాంది అన్నడు’’ అని యాద్గిరి జెప్పిండు. నాత్రి తొమ్మిది గొట్టినంక ఎవలింటికి గాల్లు బోయినం. (క్లిక్ చేయండి: మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
సారీ మేము రావడం లేదు.. ఖర్గే ఆహ్వానానికి నో చెప్పిన సీఎం నితీశ్!
కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా, భారత్ జోడో యాత్ర జనవరి 30వ తేదీన జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో ముగియనుంది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభ కోసం విపక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో భావసారుప్యత కలిగిన దేశంలోని 24 రాజకీయ పార్టీలకు చెందిన నేతలను జోడో యాత్ర ముగింపునకు ఆహ్వానించింది. ఈ మేరకు జనవరి 30వ తేదీన ముగింపు సభలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. రాజకీయ నేతలకు లేఖలు రాశారు. అయితే ఖర్గే ఆహ్వానాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తిరస్కరించింది. దీంతో, కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ముగింపు సభ ఆహ్వానంపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజివ్ రంజన్ సింగ్ స్పందించారు. భారత్ జోడో యాత్ర ముగింపు సభకు ఎందుకు రాలేకపోతున్నామనే దానిపై వివరణ ఇచ్చారు. తాము అదే రోజున పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. నాగాలాండ్లో పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అందువల్ల తాము భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనలేకపోతున్నామని ఖర్గేకి లేఖ రాశారు. అయితే, జోడో యాత్ర మాత్రం సక్సెస్ అవ్వాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. -
అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(52) మరోసారి పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. సరైన వ్యక్తి దొరికితేనే తాను పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారాయన. Curly Tales తరపున ఇంటర్వ్యూ చేసిన యాంకర్.. మొహమాటంగానే పర్సనల్ ప్రశ్న అడగొచ్చా అంటూ పెళ్లి గురించి ప్రస్తావించింది. అసలు రాహుల్ గాంధీ జీవితంలో పెళ్లి ప్రస్తావన ఉందా? చేసుకోరా? అని అడిగింది. దీంతో ఆయన.. సరైన వ్యక్తి తగిలితే తప్పకుండా వివాహం చేసుకుంటానని బదులిచ్చారు. ప్రత్యేకించి ఎలాంటి విశేషాలేమైనా ఉండాలా? యాంకర్ అడగ్గా.. అలాంటివేం లేదని, ప్రేమగా ఉండి, తెలివైన వ్యక్తి అయి ఉంటే చాలని రాహుల్ బదులిచ్చారు. దీంతో బయట ఎంతో మందికి ఈ సందేశం వెల్లిందని యాంకర్ సరదాగా చెప్పగా.. నన్ను ఇప్పుడు ఇబ్బందిలో పడేస్తున్నారా? అంటూ యాంకర్తో చమత్కరించారాయన. ఇదిలా ఉంటే.. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ ఇంతకు ముందు కూడా తన పెళ్లి గురించి ప్రస్తావించారు కూడా. తన తల్లి(సోనియా గాంధీ), నానమ్మ(ఇందిరా గాంధీ)ల గుణాల కలబోత ఉన్న అమ్మాయి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకుంటానని పేర్కొన్నారాయన. ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో ఆయన యాత్ర కొనసాగుతోంది. జనవరి 30వ తేదీన యాత్ర శ్రీనగర్లో ముగియనుంది. Rahul Gandhi ji's Chit-chat on marriage with Kamiya Jani of curly tales. pic.twitter.com/IGABLIerbu — Nitin Agarwal (@nitinagarwalINC) January 22, 2023 -
భద్రత మధ్య జోడో యాత్ర
సాంబా (జమ్మూకశ్మీర్): జమ్ములో జంటపేలుళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆదివారం ఉదయం కథువా నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మధ్యాహ్నానికి సాంబా జిల్లాలోని చక్ నానక్కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది.సోమవారం మధ్యాహ్నానికి రాహుల్ గాంధీ జమ్ము చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. రాహుల్ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న ఆయన ఈ యాత్రతో బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. విద్వేషాలు సృష్టిస్తున్నారు: రాజ్నాథ్ రాహుల్ గాంధీ అధికారం కోసం ప్రజల్లో విద్వేషాలను సృష్టిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. రాహుల్ వల్ల అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు. ఆదివారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ప్రజాభిమానం, నమ్మకం పొందడం ద్వారానే అధికారం లభిస్తుందని ఆయన అన్నారు. -
మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా రాహుల్తో పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం జోడో యాత్రపై ఇంతవరకు స్పందించలేదు. ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మమతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు విపక్షాలన్నీ ఎకమవ్వాలని చూస్తుంటే.. మమత మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించారు. మోదీకి, దీదీకి మధ్య 'మో-మో' ఒప్పందం ఉందని, ప్రధానిని అప్సెట్ చేసేలా మమత ఏ పని చేయరని ఆరోపించారు. మోదీకి వత్తాసు.. శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినా మమత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అధిర్ రంజన్ అన్నారు. బెంగాల్లో కాంగ్రెస్ను అంతమొందించాలని మోదీ అంటే.. దీదీ కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే మమత బెనర్జీ కూడా ఇదే విషయమై ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. ప్రధాని మోదీకి ఎదురు నిలబడే సత్తా దీదీకి ఉందని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో విపక్షాలను ఆమె ముందుండి నడిపించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే పలువురు నేతలు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రజాభీష్టం మేరకు ప్రధాని పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
కాశ్మీర్లో బాంబు పేలుళ్లు.. రాహుల్ యాత్రపై వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్లోని నర్వాల్ వద్ద శనివారం ఉదయం బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో వరుస పేలుళ్ల ధాటికి తొమ్మిది మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ బాంబు దాడికి ఉగ్రవాదలు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వరుస బాంబు దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రపై టెన్షన్ నెలకొంది. భారత్ జోడో యాత్ర ముందే ఇలా బాంబు దాడులు జరగడంతో రాహుల్ యాత్ర కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాడి జరిగిన నర్వాల్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు, అమ్మకాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్రపై సంగ్ధిదం నెలకొంది. కాగా, భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమలో కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ప్రణాళిక ప్రకారమే జమ్మూ కాశ్మీర్లో భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. యాత్ర ప్రారంభానికి రెండు వారాల ముందుగానే నేను లెప్ట్నెంట్ గవర్నర్ను కలిశాను. భద్రత విషయంపై ఆయనతో చర్చించాను. జమ్మూ కాశ్మీర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భద్రతా సిబ్బందితో నిరంతరం టచ్లోనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం వారి బాధ్యత. రాహుల్ యాత్ర ఎట్టిపరిస్థితుల్లో కొనసాగుతుంది. భద్రత విషయం భద్రతా సిబ్బంది చూసుకుంటారు’ అని స్పష్టం చేశారు. "2 weeks before yatra began, I met J&K L-G & all our leaders in J&K are in constant touch with the security personnel. It is their responsibility to take care of such incidents. #BharatJodoYatra will continue no matter what" : KC Venugopal, #Congress General Secretary (ANI) pic.twitter.com/l2Ou8Bc8uA — NewsMobile (@NewsMobileIndia) January 21, 2023 -
భారత్ జోడో యాత్రలో సియాచిన్ హీరో..ఆయనే నాకు స్ఫూర్తి!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం జమ్మకశ్మీర్లోకి ప్రవేశించింది. ఈ యాత్రలో రాహుల్ తోపాటు పరమ వీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బానా సింగ్(రిటైర్డ్) పాల్గొన్నారు. ఆయన శుక్రవారం జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాకు చేరుకున్న రాహుల్తో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా రాహుల్గాంధీ బానా సింగ్ చేతిని పట్టుకుని కనిపించారు. ఈ యాత్రలో బానాసింగ్ పాల్గొన్నందుకు ట్విట్టర్ వేదికగా ఆయన్ను రాహుల్ అభినందించారు. భారత్ ఆదర్శాలను రక్షించడం గురించి మాట్లాడినప్పుడూ బానాసింగ్ వంటి ధైర్యవంతులైన దేశభక్తులు పేర్లే గుర్తు తెచ్చుకుంటాను అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సియాచిన్ మంచుకొండలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరువేసిన పరమవీర చక్ర విజేత కెప్టెన్ బానాసింగ్ నాతోపాటు ప్రతి దేశభక్తునికి స్ఫూర్తి అని చెప్పారు రాహుల్. ఈ కథువాలోని జోడో యాత్రలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా పాల్గొన్నారు. "భారత్ జోడో యాత్ర కాశ్మీర్ వరకు రావడం చాలా పెద్ద విషయం అన్నారు. వాస్తవానికి, దేశాన్ని ఏకం చేయాలంటే మాత్రం యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పారు. మేము దేశం ఏకం కావాలని మేము కోరుకుంటున్నందున తాను శివసేన నుంచి వచ్చి పాల్గొన్నాను." అని చెప్పారు. ఇదిలా ఉండగా, కెప్టెన్ బానా సింగ్ (రిటైర్డ్) ఆపరేషన్ రాజీవ్కు చేసిన కృషికి అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమవీర చక్రను అందుకున్నారు. అతను సియాచిన్ గ్లేసియర్లోని పాకిస్థాన్ ఖైద్ పోస్ట్ను స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పోస్టుకు 'బానా పోస్ట్' అని పేరు కూడా పెట్టారు. जब भी भारत और उसके आदर्शों की रक्षा की बात होती है, बाना सिंह जैसे देश के वीर सपूतों का नाम लिया जाता है। सियाचिन की बर्फ़ीली ऊंचाइयों पर तिरंगा लहराने वाले परमवीर चक्र विजेता, कप्तान बाना सिंह जी मेरे और हर देशभक्त की प्रेरणा हैं। pic.twitter.com/5hEWIi3T4T — Rahul Gandhi (@RahulGandhi) January 20, 2023 (చదవండి: ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు) -
ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు 125 రోజుల ప్రయాణంలో సుమారు 3,400 కిలోమీటర్లు చేసిన పాద యాత్రలో కేవలం తెల్లటి టీషర్ట్ మాత్రమే ధరించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. చలికాలం సమీపించి గజగజలాడిస్తున్న ఆయన తెల్లటి టీ షర్ట్ మాత్రమే ధరించడం అందరిలో ఒకటే ఉత్సుకతను రేకెత్తించాయి. చివరికి మీడియా ముందుకు వచ్చి రాహుల్ని ఈవిషయమై ప్రశ్నించగా..పేదవాళ్లను, కార్మికులను ఈ ప్రశ్న ఎందుకు వేయరు అని ఎదురు ప్రశ్నించారు. తాను ముగ్గురు చిన్నారులన చూశానని వారు చలికి వణకుతూ కనిపించారే గానీ స్వెటర్లు ధరించలేదని, వారే తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారికి చలి అనిపించేంత వరకు తాను ధరించనని, అప్పటి వరకు తనకు కూడా చలిగా అనిపించదంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ చివరికి జమ్మూలో యాత్ర ప్రవేశించగానే రాహుల్కి జాకెట్ ధరించక తప్పలేదు. ఈ మేరకు గురువారం రాహుల్ భారత్ జోడో యాత్ర పంజాబ్ నుంచి జమ్మూలోకి ప్రవేశించింది. చలికాలంలో సైతం టీషర్టు ధరించి ఉత్తర భారతదేశం గుండా దిగ్విజయంగా పాదయాత్ర చేసి అందర్నీ షాక్ గురిచేసిన ఆయన ఈరోజు యాత్రలో తోలిసారిగా జాకెట్లో కనిపించారు. ఉదయం నుంచి జమ్మూలోని పలు ప్రాంతాల్లో చినుకులు కురుస్తుండటం వల్ల గాంధీ చివరకు రక్షణ దుస్తులు ధరించక తప్పింది కాదు. దీంతో ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు రాహుల్పై వ్యంగోక్తులు విసరడం, చురకలింటించడం, ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, రాహుల్ జనవరి 25న జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్లో జాతీయ జెండాను ఎగరువేస్తారు. ఆ తర్వాత రెండురోజలు అనంతరం జనవరి 27న అనంత్నాగ్ మీదుగా శ్రీనగర్లో ప్రవేశించనున్నారు. అదీగాక భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో నడవవద్దని భద్రతా సంస్థలు గాంధీకి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ జమ్మూలో ప్రవేశించగానే అక్కడి అగ్రనేత నేషనల్కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఘన స్వాగతం పలికారు. పైగా చివరి దశకు చేరుకున్న ఈ యాత్రలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ యాత్ర జనవరి 30న శ్రీనగర్లో గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. (చదవండి: యూత్ ఐకాన్గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా) -
జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్ను హగ్ చేసుకునేందుకు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. పంజాబ్లోని హోషియార్పూర్లో మంగళవారం పాదయాత్ర జరుగుతుండగా.. భద్రతా వలయాన్ని చేధిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీని దాటుకొని వచ్చిన ఎల్లో జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. రాహుల్ పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్కు జెడ్-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే. అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న సీఆర్పీఎఫ్ సరైన భద్రత కల్పించడంలో విఫలమవుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. చదవండి: మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే కాగా పంజాబ్లోని హోషియార్పూర్లోని తండాలో మంగళవారం ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్తోఆటు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్లు రాహుల్ గాంధీతో యాత్రలో పాల్గొన్నారు. Security breach under the AAP govt. This is how AAP is providing security to Rahul Gandhi Ji. pic.twitter.com/kyTV6fMHxr — Shantanu (@shaandelhite) January 17, 2023 -
భారత్ జోడో యాత్రలో విషాదం.. కుప్పకూలి ఎంపీ మృతి
ఛండీగఢ్: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, జలంధర్ ఎంపీ సంటోఖ్ సింగ్ చౌదరి గుండె పోటుతో కన్నుమూశారు. శనివారం ఉదయం యాత్ర మొదలైన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. లూథియానా ఫిలౌర్ నుంచి రాహుల్ గాంధీతో కలిసి కాలి నడకన బయలుదేరిన కాసేపటికే సంటోఖ్ సింగ్ కుప్పకూలిపోయారు. గుండె వేగంగా కొట్టుకోవడంతో.. వెంటనే ఆయన్ని ఆంబులెన్స్లో ఫగ్వారాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. గుండె పోటుతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్రకు బ్రేక్ వేశారు. హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరారు. ఇదిలా ఉంటే.. సంటోశ్ సింగ్ చౌదరి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్లు కూడా ఎంపీ మృతిపై ట్విటర్ ద్వారా తమ సంతాపం తెలియజేశారు. #WATCH | Punjab: Congress MP Santokh Singh Chaudhary was taken to a hospital in an ambulance in Ludhiana, during Bharat Jodo Yatra. Details awaited. (Earlier visuals) pic.twitter.com/upjFhgGxQk — ANI (@ANI) January 14, 2023 Deeply shocked and saddened to learn about the untimely passing away of our MP, Shri Santokh Singh Chaudhary. His loss is a great blow to the party and organisation. In this hour of grief, my heart goes out to his family, friends and followers. May his soul rest in peace. — Mallikarjun Kharge (@kharge) January 14, 2023 సంటోఖ్ సింగ్ చౌదరి(76).. గతంలో పంజాబ్ కేబినెట్లోనూ పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా తెలుపొందారు. -
భారత్ జోడో యాత్రలో ఉండగా కుప్పకూలిన సంతోఖ్ సింగ్
-
అందుకే భారత్ జోడో యాత్ర సక్సెస్ అయ్యింది
ఫతేగఢ్ సాహిబ్ (పంజాబ్): అధికార బీజేపీ దేశంలో హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి దుయ్యబట్టారు. ‘‘కానీ మన దేశం ఎప్పుడూ ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచింది. అందుకే భారత్ జోడో యాత్ర ఇంతగా విజయవంతమవుతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఆయన యాత్ర బుధవారం పంజాబ్లోకి ప్రవేశించింది. ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాను సందర్శించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ మతాలను, కులాలను పరస్పరం ఎగదోస్తూ దేశ వాతావరణాన్నే కలుషితం చేశాయంటూ ధ్వజమెత్తారు. అందుకే దేశానికి ప్రేమ, ఐక్యతలతో కూడిన మరో దారి చూపాలనే యాత్ర మొదలు పెట్టినట్టు చెప్పారు. మీడియా కూడా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి పెను సమస్యలను పక్కన పెట్టి 24 గంటలూ ప్రధాని మోదీని చూపించడానికే పరిమితమవుతోందంటూ చురకలంటించారు. 21 పార్టీలకు ఆహ్వానం భారత్ జోడో యాత్ర జనవరి 30న జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ముగియనుంది. ఈ సందర్భంగా జరిపే ముగింపు సభలో పాల్గొనాలని కోరుతూ 21 పార్టీల అధ్యక్షులకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు. -
ఆ ముగ్గుర్నీ కలిశాకే ఈ నిర్ణయం తీసుకున్నా!..ఎప్పటికీ స్వెటర్స్ వేసుకోను
భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ టీషర్ట్స్ ధరించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ కూడా శీతాకాలంలో ఇంత భయంకరమైన చలిలో సైతం రాహుల్ ఎందుకు టీషర్ట్స్ వేసుకుంటున్నారంటూ మీడియాతో సహా సర్వత్ర ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై స్పందించారు. తాను ముగ్గురు బాలికలను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆ చర్చలకు తెరదించారు. వారిని కలిసిన తర్వాత నుంచే టీ షర్టులు ధరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందరూ ఈ టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నారు చలిగా అనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. "ఐతే నేను కేరళలో ప్రవేశించినప్పుడూ కాస్త వేడిగ, తేమగా ఉంది. కానీ మధ్యప్రదేశ్లోకి వచ్చేటప్పటికీ కాస్త చల్లగా ఉంది. అప్పుడే అక్కడకి చిరిగిన బట్లతో ముగ్గురు పేద బాలికలు నా దగ్గరికి వచ్చారు. సరైన దుస్తులు ధరించకపోవడంతో చలికి గజగజ వణకుతున్నారు. దీంతో ఆరోజు నేను నిర్ణయించుకున్నా వారికి చలి అనిపించేంత వరకు(వారు స్వెటర్లు ధరించేంత వరకు) తనకు చలి అనిపించదు. అప్పటి వరకు నేను కూడా స్వెటర్స్ ధరించను. అంతేకాదు ఆ ముగ్గురు బాలికలకు చలి అనిపిస్తే రాహుల్కి కూడా చలి అనిపిస్తుందని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. అయినా తాను టీషర్ట్స్ వేసుకోవడం అనేది ప్రధానాంశం కాదని, ఈ యాత్రలో తన వెంట వస్తున్న పేద రైతులు, కూలీలపై దృష్టి పెట్టండని మీడియాకి చురకలంటించారు. పేద రైతులు, కార్మికులు, వారి పిల్లలు చిరిగిని బట్టలు, టీషర్ట్లు, స్వెటర్లు ధరించకుండా ఎందుకు ఉన్నారో అనేది ప్రధానం, దాని గురించే ఆలోచించండి." అని చెప్పారు రాహుల్. కాగా జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాజస్తాన్, ఉత్తరప్రదేశ్లలో జరిగింది. జనవరి 30 కల్లా జమ్ము కాశ్మీర్లోని శ్రీనగర్కి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. इस टी-शर्ट से बस इतना इज़हार कर रहा हूं, थोड़ा दर्द आपसे उधार ले रहा हूं। pic.twitter.com/soVmiyvjqA — Rahul Gandhi (@RahulGandhi) January 9, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!
అంబాలా/చండీగఢ్: ఆరెస్సెస్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది. కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు. రాహుల్ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్రాజ్ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. -
రాహుల్ గాంధీకి ఆ సత్తా ఉంది: టీఎంసీ నేత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రశంసలు కురిపించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా. ఇది చారిత్రక, విప్లవ యాత్రగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ యూత్ ఐకాన్గా ఎదిగారని కొనియాడారు. గతంతో పోలిస్తే ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందన్నారు. కొందరు ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలను చూస్తున్నారని, కానీ దేశంలోనే అత్యంత పట్టుదల నాయకుడిగా ఎదిగారాని పేర్కొన్నారు. ‘రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే సత్తా ఉంది. ఆయన కుటుంబం నుంచి పలువురు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేశారు. సంఖ్యాపరంగా చూసుకుంటే 2024లో మమతా బెనర్జీ గేమ్ ఛేంజర్గా మారనున్నారు. మమతా బెనర్జీ ఒక ఉక్కు మహిళ, ప్రస్తుతం ఆమెను ఎవరూ తేలికగా తీసుకోలేరు.’అని పేర్కొన్నారు సిన్హా. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ చేపట్టిన రథ యాత్ర, మాజీ ప్రధాని చంద్రశేఖరన్ చేపట్టిన యాత్రలతో భారత్ జోడో యాత్రను పోల్చారు శత్రుఘ్న సిన్హా. 2024 ఎన్నికలపై భారత్ జోడో యాత్ర కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్నారు. ప్రధాని ఎవరనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని, విభిన్న రాజకీయ పార్టీల ప్రజలంతా ఏకతాటిపైకి వస్తారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: 75 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్తు కనెక్షన్.. సంతోషంలో ప్రజలు -
పూజల పార్టీ బీజేపీ
కురుక్షేత్ర: సమాజంలో పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిపోతున్న భయంతోపాటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలియజేశారు. పాదయాత్రను ఒక తపస్యగా భావిస్తున్నామని చెప్పారు. పాదయాత్ర అనేది నిరాడంబరతను సూచిస్తుందని, ఇదొక ధ్యానం లాంటిదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తపస్యను నమ్ముతోందని, అధికార బీజేపీ ఒక పూజల సంస్థ అని విమర్శించారు. తపస్యపై బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కే ప్రజలంతా పూజలు (ఆరాధన) చేయాలని అవి కోరుకుంటున్నాయని ఆక్షేపించారు. బలవంతంగానైనా జనంతో పూజలు చేయించుకోవాలని ప్రధాని మోదీ ఆశిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల తపస్య అంటే మోదీకి భయమని, అందుకే మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారని దుయ్యబట్టారు. హరియాణాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటం అనేది తపస్య కోసం జరిగిన యుద్ధమని అన్నారు. ఆ సమయంలో బీజేపీ/ఆర్ఎస్ఎస్ పెద్దలు బ్రిటిష్ పాలకులకు పూజలు చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూజల ప్రభావాన్ని ఎదిరించడానికి లక్షలాది మంది నేడు కాంగ్రెస్ పార్టీతో కలిసి తపస్యలో నిమగ్నమయ్యారని ఉద్ఘాటించారు. హిందూ దేవుళ్ల అభయ ముద్ర నుంచే కాంగ్రెస్ పార్టీ గుర్తు (హస్తం) పుట్టిందని రాహుల్ అన్నారు. తాను ఒక తపస్వినని చెప్పారు. ఇకపైనా తపస్విగానే కొనసాగుతానని వివరించారు. తన యాత్ర రాజకీయ పోరాటం కాదని స్పష్టంచేశారు. బీఎస్సీ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు వ్యతిరేకంగా పోరాడితే అది రాజకీయ పోరాటం అవుతుందన్నారు. తమది ధర్మం కోసం సాగుతున్న సిద్ధాంతపరమైన పోరాటమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశంలో రైతన్నలు కష్టాల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఉత్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..'
చండీగఢ్: హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు దక్షిణాది కంటే హిందీ రాష్ట్రాల్లోనే విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. హరియాణాలో జోడో యాత్రలో భాగంగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈమేరకు మాట్లాడారు. 'కేరళలో భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు విశేష స్పందన వచ్చింది. కానీ బీజేపీ పాలిత కర్ణాటకలో ఆదరణ ఉండదని అన్నారు. కానీ కన్నడ నాట ఇంకా ఎక్కువ మంది యాత్రకు తరలివచ్చారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టినప్పుడు అక్కడ యాత్ర ఫెయిల్ అవుతుందని అన్నారు. కానీ జనం ఇంకా భారీగా తరలివచ్చారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో యాత్రను ఆదరించరని అన్నారు. కానీ దక్షిణాది కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే లభిస్తోంది. ఈసారి కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు' అని రాహుల్ అన్నారు. అలాగే తన గురించి బీజేపీ పట్టించుకుంటుందని, తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. తాను మాత్రం అసలు బీజేపీని పట్టించుకోనని స్పష్టం చేశారు. మన పని మనం చేసుకుంటే పోతే ఫలితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భగవత్గీత శ్లోకాన్ని గుర్తు చేశారు. అర్జునుడు చేప కంటికి గురిపెట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడో చెప్పలేదని పేర్కొన్నారు. బీజేపీ దేశాన్ని విద్వేషం, మతం ప్రాదిపదికన విడదీస్తోందని, కాంగ్రెస్ చరిత్రలో ఎనాడూ ఇలా చేయలేదని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించి దేశాన్ని ఏకం చేయడానికే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ మరోమారు స్పష్టం చేశారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్.. -
ఫుల్ జోష్లో జోడో యాత్ర..చొక్కా లేకుండా మద్దతుదారులు డ్యాన్సులు
ఉత్తర భారతదేశంలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఇళ్లకే పరిమితమయ్యేలా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినా ఇవేమి లెక్కచేయకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడోయాత్ర జయపద్రంగా సాగిపోతోంది. అదీగాకా రాహుల్ ఈ చలిలో కేవలం టీ షర్టు ధరించి చేయడం ఒక హాట్ టాపిక్గా కూడా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడూ ఈ గడ్డ గట్టే పొగమంచు చలిలో కాంగ్రెస్ కార్యక్తరలు బస్టాప్పై నుంచుని ప్రజలకు అభివాదం చేయగా..మరికొందరూ కాంగ్రెస్ మద్దతుదారులు బస్ టాప్పై నుంచోని డ్యాన్స్లు చేస్తూ ఆకర్షణగా కనిపించారు. ఈ ఘటన హర్యానాలోని కర్నాల్లో సాగుతున్న జోడో యాత్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా, భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తిరిగి హర్యానాలోకి ప్రవేశించింది. జనవరి 10 కల్లా నాలుగు జిల్లాలను కవర్ చేయనుందని అధికారిక వర్గాల సమాచారం. అయినా డిసెంబర్ 21 నుంచి 23 వరకు మొదటి దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తదితర జిల్లాను చుట్టి.. సుమారు 130 కిలో మీటర్లు పర్యటించినట్లు తెలిపారు. #WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK — ANI (@ANI) January 8, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్..
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అయితే హరియాణలో రాహుల్ శనివారం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ప్రత్యేక అతిథి కన్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ అతిథి ఎవరో కాదు.. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పెంపుడు శునకం ల్యూనా. ఇదంటే రాహుల్కు ఎంతో ఇష్టమట. అందుకే ఆయనతో పాటు పాదయాత్రలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్, ప్రియాంక గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. Luna has been patiently watching you pour all your love on her other canine cousins. So she decided enough is enough - and joined you herself! You see, no one wants to share your affection :) We get you Luna! (Luna, lives with Priyanka Ji - Rahul Ji adores her) pic.twitter.com/6CcpBMKUPt — Congress (@INCIndia) January 7, 2023 ఎట్టకేలకు భారత్ జోడో యాత్ర 100 రోజులు దాటిన తర్వాత ల్యూనాను ఆహ్వానించారు. అని ప్రియాంక ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా ఈ ఫొటోలను షేర్ చేసింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇతరులపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇక తాను కూడా భాగం కావాలనుకొని ల్యూనా పాదయాత్రకు వచ్చిందని ట్వీట్ చేసింది. హర్యానాలో రాహుల్ యాత్రలో బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ టీ షర్టులో కన్పించిన విషయం గురించి అడిగారు. అందుకు రాహుల్ బుదిలిస్తూ.. తాను రుషి, మునిలా ఓ తపస్సులో ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: 'ఆ విషయం తెలిస్తే రౌత్ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు' -
మోదీ హయాంలో రెండు రకాల భారత్లు
పానిపట్: ‘‘నరేంద్ర మోదీ ఏలుబడిలో రెండు రకాల భారత్లు కనిపిస్తున్నాయి. ఒకటి కోట్లాది కార్మికులు, రైతులు, నిరుద్యోగులది. రెండోది దేశంలోని సగం సంపదను గుప్పెట్లో ఉంచుకున్న 100 మంది ధనికులది’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ చెబుతున్న హిందుస్తాన్ నిజ స్వరూపం ఇదేనని ఎద్దేవా చేశారు. శుక్రవారం జోడో యాత్ర సందర్భంగా హరియాణాలోని పానిపట్లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దు విధానాలను ఆయుధంగా వాడుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: Joshimath Sinking: దేవభూమికి బీటలు! -
ఆజాద్ పార్టీకి షాక్.. తిరిగి కాంగ్రెస్ గూటికి 17 మంది కశ్మీర్ నేతలు..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం గులాంనబీ ఆజాద్తో కలిసివెళ్లిన 17 మంది సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వీరంతా సొంతగూటికి చేరుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లోకి ప్రవేశించడానికి రెండు వారాల ముందు వీరంతా మళ్లీ కాంగ్రెస్లోకి రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్నిస్తోంది. సొంతగూటికి వచ్చిన 17 మంది కాంగ్రెస్ నాయకుల్లో కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, పీసీసీ మాజీ చీఫ్ పీర్జాద మహమ్మద్ సయీద్ వంటి ముఖ్య నాయకులున్నారు. వీరంతా రెండు నెలల క్రితం గులాం నబీ ఆజాద్తో కలిసి కాంగ్రెస్ను వీడి వెళ్లారు. ఆయన స్థాపించిన కొత్త పార్టీలో చేరారు. అయితే పార్టీలో తమకు విలువ ఇవ్వడం లేదని, ఆయనను నమ్మి మోసపోయామని కొద్ది రోజుల క్రితమే వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ పార్టీ నుంచి కొందరు సస్పెండ్ కూడా అయ్యారు. శుక్రవారం మొత్తం 19 మంది కశ్మీర్ నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరాల్సి ఉంది. అయితే ఇద్దరు కశ్మీర్ నుంచి ఢిల్లీ రాలేకపోయారు. గులాం నబీ ఆజాద్ కూడా తిరిగి కాంగ్రెస్లోకి వస్తారా? అని కేసీ వేణుగోపాల్ను ప్రశ్నించగా.. తనకు ఆయన గురించి ఏమీ తెలియదని చెప్పారు. కాంగ్రెస్ సిద్దాంతాలను నమ్మేవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చని స్పష్టం చేశారు. చదవండి: ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్.. -
అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో..
-
Rahul Gandhi: అన్నాచెల్లెలి అనురాగం
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి.. ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన. తన జీవితంలో తన అన్న రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా.. ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, 2023 వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర.. నెలాఖరులో జమ్మూ కశ్మీర్లో చివరి దశకు చేరుకోనుంది. -
'అంబానీ, అదానీ రాహుల్ను కొనలేరు.. నా అన్న వారియర్..'
లక్నో: అంబానీ, అదానీ దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, మీడియాను కొన్నట్లుగా రాహుల్ గాంధీని కొనలేరని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు వారియర్ అని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోని సరిహద్దులో ఘన స్వాగతం పలికారు ప్రియాంక. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు. దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు. రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయిందని పేర్కొన్నారు. తన సోదరుడు యుద్ధవీరుడని ప్రశంసించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్లోనే కన్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా అతనికి ఏమీ కాదని పేర్కొన్నారు. मेरे भाई सत्य का कवच पहनकर चल रहे हैं। : @priyankagandhi जी#BharatJodoYatra pic.twitter.com/chp3baB0Pb — Congress (@INCIndia) January 3, 2023 కాంగ్రెస్కు పునరుత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 150 రోజులు, 3,500 కిలోమీటర్లు కవర్ చేస్తూ కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. రాహుల్ పాదయత్రలో పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో కొనసాగుతోంది. చదవండి: 'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్బై.. -
భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు భద్రతా వైఫల్యాలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిన సీఆర్పీఎఫ్ రాహులే నిబంధనలు ఉల్లంఘించారని బదులిచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతూ భారత్ జోడో యాత్రలో పాల్గొనలా? అని ప్రశ్నించారు. అది ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు బుల్లెట్ ప్రూఫ్ కార్లను విస్మరించి నిబంధనలను తుంగలో తొక్కినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యక్తులను, పార్టీలను బట్టి ప్రోటోకాల్స్ మారుతాయా అని నిలదీశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈమేరకు మాట్లాడారు. భారత్ జోడో యాత్ర దేశ భావోద్వేగాలకు సంబంధించిందని, తనకు చాలా విషయాలు నేర్పిందని రాహుల్ అన్నారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే 2024లో ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే బీజేపీ గెలవడం కష్టం అన్నారు రాహుల్. ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ విజన్తో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. తన దృష్టంతా విద్వేషం, ఆగ్రహావేశాలపై పోరాడటమేనని పేర్కొన్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
మోదీని ఓడించాలంటే.. అలా చేయాల్సిందే: ఏకే ఆంటోనీ
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ మనసులోని మాటను బయటపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీని ఓడించాలంటే వ్యూహాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విజయం కోసం మైనారిటీలను మాత్రమే నమ్ముకుంటే కష్టమని కుండబద్దలు కొట్టారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ వారం ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే కాంగ్రెస్ ప్రయత్నం.. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మైనారిటీ, మెజారిటీ రెండు వర్గాల మద్దతు అవసరమని ఆంటోనీ అన్నారు. హిందువులతో పాటు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి విదితమే. రాజకీయ ప్రయోజనాల కోసమే సాఫ్ట్ హిందుత్వ ధోరణిని కాంగ్రెస్ అవలంభిస్తోందని కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందుత్వపై బీజేపీకి మాత్రమే సర్వహక్కులు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. భారతీయులుగా చూడడం లేదు: మాలవియా ఆంటోనీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవియా ట్విటర్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘కాంగ్రెస్కు, భారతీయులు భారతీయులుగా కనబడటం లేదు. మెజారిటీ, మైనారిటీ, హిందూ, ముస్లింలుగా దేశ పౌరులు విభజించబడ్డారు. మోదీని ఓడించేందుకు మైనారిటీల మద్దతు సరిపోదు కాబట్టి హిందువులను కలుపుకుపోవాలని యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన ఏకే ఆంటోనీ పిలుపునిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు ఆలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంద’ని మాలవియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు) -
‘బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే’.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు
లఖ్నవూ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలన్న కాంగ్రెస్ పిలుపును తోసిపుచ్చారు. జోడో యాత్రకు దూరంగా ఉండిపోయారు. ఈ అంశంపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీజేపీల సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు. ‘మా పార్టీ సిద్ధాంతం భిన్నమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. మీ ఫోన్కు ఆహ్వానం వచ్చి ఉంటే నాకు పంపించండి. వారి యాత్రతో మా మనోభావాలు ఉన్నాయి. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ’అని పేర్కొన్నారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు.. యూపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న తరుణంగా ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి -
రాహులే భద్రతా నిబంధనలు ఉల్లంఘించారు: సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో పర్యటించినప్పుడు సరైన భద్రత కల్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు కాంగ్రెస్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర పారామిలిటరీ దళం(సీఆర్పీఎఫ్) స్పందించింది. రాహుల్ గాంధీనే భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు, ఇతర సెక్యూరిటీ సంస్థలతో కలిసి రాహుల్ పర్యటను తామే భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. అన్ని మార్గదర్శకాలను పాటించినట్లు చెప్పింది. అవసరమైన సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారని పేర్కొంది. డిసెంబర్ 24 పర్యటనలో రాహుల్ గాంధీనే తరచూ భద్రగా నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ విషయాన్ని ఆయనకు పదే పదే చెప్పినట్లు వివరించింది. రాహుల్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. ఈ మరునాడే సీఆర్పీఎఫ్ ఈ విషయంపై స్పదించింది. చదవండి: 'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు -
‘అలాంటి అమ్మాయి అయితే ఓకే’.. పెళ్లిపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం విషయం చాలా సార్లు చర్చకు వచ్చినా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఐదు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయారు. అయితే, తాజాగా తనకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన రాహుల్.. పెళ్లిపై పలు విషయాలు పంచుకున్నారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్నించగా.. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ ఇరువురి గుణాలు కలగలిసిన భాగస్వామితో జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లిగా అభివర్ణించారు రాహుల్. ఈ క్రమంలో ఆమె లాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అని అడగగా ‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యం ఇస్తాను(నా ఆలోచనల్లో లేదు). కానీ, నా తల్లి, నాయనమ్మల గుణాలు కలగలిసి ఉంటే మంచిది.’ అని సమాధానమిచ్చారు రాహుల్. ఈ సందర్భంగా మోటర్ సైకిల్, సైకిల్ నడపడానికి తాను ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు రాహుల్. ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే చైనా సంస్థను గుర్తు చేసుకున్నారు. తన ఇంటర్వ్యూను ట్విట్టర్లో షేర్ చేసిన రాహుల్ తనకు కారు కూడా లేదని వెల్లడించారు. తన వద్ద ఉన్న సీఆర్-వీ కారు తన తల్లిదని స్పష్టం చేశారు. కార్లు, బైకుల అంటే తనకు ఇష్టం లేదని, కానీ, రైడ్కు వెళ్లడమంటే ఇష్టమని చెప్పారు. ఇదీ చూడండి: రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్! -
రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత్ జోడో యాత్రలో పలు సందర్భాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయాని, సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసింది. జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరుకోనుంది. అయితే, ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో యాత్ర భద్రత చర్యల్లో లోపాలు బయటపడ్డాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీకి ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అయితే భారత్ జోడో యాత్రలో జనాలను నియంత్రించడం, వారిని రాహుల్ గాంధీకి సమీపంలోకి రాకుండా చూడడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొంది కాంగ్రెస్. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్తో పాదయాత్ర చేస్తున్న వారు ఆయనకు భద్రత వలయంగా ఏర్పడి రక్షణ కల్పిస్తున్నారని తెలిపింది. ఢిల్లీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోతున్నారని వెల్లడించింది. హరియాణాలో కొందరు దుండగులు భారత్ జోడో యాత్ర కంటెయినర్లలోకి ప్రవేశించారని గురుగ్రామ్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొంది. ‘భారత్ జోడో యాత్ర అనేది దేశంలో శాంతి, సామర్యాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న పాదయాత్ర. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతీకార రాజీకీయాలకు పాల్పడకూడదు. కాంగ్రెస్ నేతల భద్రత, రక్షణకు భరోసా కల్పించాలి. జనవరి 3 నుంచి భద్రతా పరంగా సున్నితమైన పంజాబ్, జమ్మూకశ్మీర్లోకి యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాం.’అని లేఖలో డిమాండ్ చేసింది కాంగ్రెస్. ఇదీ చదవండి: అత్యంత అవినీతిమయం.. సోనియా కుటుంబంపై బీజేపీ తీవ్ర విమర్శలు -
రాహుల్ యాత్రకు యూపీ నేతలు ముఖం చాటిన..కాశ్మీర్ నేతలంతా కదిలి వస్తారు!
న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం రాహుల్ భారత్ జోడో యాత్రకు తొమ్మిది రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 3న ఢ్లిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదుగా యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు యూపీ నేతలు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జమ్ము కాశ్మీర్ నాయకులంతా హాజరయ్యే అవకాశం పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఈ యాత్రలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటామని ట్వీట్టర్ ద్వారా తమ పూర్తి మద్దతును తెలిపారు. అంతేగాదు సీపీఐకి చెందిన ఎంవై తరిగామి గూప్కార్ కూటమికి చెందిన మరో సభ్యుడు కూడా హాజరవుతారని అంటున్నారు. కాగా, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ వేదికగా.."భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరాల్సిందిగా నన్ను అధికారికంగా ఆహ్వానించారు. అతని అలు పెరగని ధైర్యానికి వందనం. ఫాసిస్ట్ శక్తులను ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తితో నిలబడటం తన కర్తవ్యమని నమ్ముతున్నాను. మెరుగైన భారతదేశం కోసం అతనితో కలిసి పాల్గొంటాను." అని ట్వీట్ చేశారు. ఈ మేరకు భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల కోసం జమ్ము చేరుకున్న కాంగ్రెస్ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్టాడుతూ..యాత్ర ఇక్కడకు చేరుకోగానే కాశ్మీర్లో జెండా ఎగురవేస్తారని చెప్పారు. యాత్రలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తరిగామి తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఇదిలా ఉండగా, యూపీ నుంచి జయంత్ చౌదరి ఇప్పటికే రానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి దూరమైన అఖిలేష్ యాదవ్ కూడా హజరయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఆయన వస్తారా లేక ప్రతినిధిని పంపుతారా అనేదానిపై స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్తో విభేదిస్తున్న మాయావతి కూడా అధికారికంగా స్పందించ లేదు. ఐతే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేసినప్పటికీ పలు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ యాత్రను అడ్డుకునేందుకు ఆప్ కోవిడ్ ప్రోటోకాల్లను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర ఆపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ కూడా రాసింది. దీంతో కాంగ్రెస్ నేత ఈ యాత్రను ఆపేందుకు ఇదోక సాకుగా చెబుతున్నారంటూ మండిపడ్డారు కూడా. (చదవండి: భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై) -
అఖిలేశ్, మాయవతిలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం!
లఖ్నవూ: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న యాత్ర త్వరలోనే ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. అందులో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బహజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు.. లఖ్నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మను సైతం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 3న ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర. గాజియాబాద్ జిల్లాలోని ’లోని’ ప్రాంతంలో ప్రారంభమై బాఘ్పత్, శామిలి జిల్లాల మీదుగా హరియాణాలోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజల మనసులను తెలుసుకునేందుకు యాత్ర ఒక్కటే మార్గమని సూచించారు. ప్రస్తుతం విపక్షం మొత్తం ఈ ప్రభుత్వంపై ఒకే ఆలోచన ధోరణిలో ఉందని, అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
వణుకు ఆయనకు రావట్లే.. యాత్ర గురించి చెప్పినప్పుడల్లా మీకు వస్తోంది..!
వణుకు ఆయనకు రావట్లే.. యాత్ర గురించి చెప్పినప్పుడల్లా మీకు వస్తోంది..! -
రాహుల్ స్పీచ్లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ని పలువురు ఈ శీతకాలంలో మీరు ఎందుకు కేవలం టీ షర్ట్ ధరించి నడుస్తున్నారు, మీకు చలిగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా రాహుల్ రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఎప్పుడైనా ఇలా అడిగారా అని ఎదురు ప్రశ్న వేశారు. నులు వెచ్చని బట్టలు ప్రాథమిక వస్తువులు, వాటిని కొనుగోలు చేయని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను సుమారు 2,800 కిలోమీటలర్లు నడిచాను కానీ అది ఏమంతా పెద్ద విషయం కాదు. నిజానికి వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, రోజు చాలా దూరం నడుస్తారు, కష్టపడతారు అని చెప్పారు. ఈ యాత్రలో అన్నిరకాల ప్రజలను కలిశాను. తాను ఇప్పుడూ ఎవరి చేయినైనా పట్టుకుని వారు ఏం పని చేశారో చెప్పగలను అన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ జోడో యాత్ర కాశ్మీర్లో ముగియనుంది. "నాకు సాధారణ ప్రజలలో ద్వేషం కనిపించలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. కానీ నాకు యాత్ర ప్రారంభించినప్పుడూ ప్రజల్లో ద్వేషం ఉంటుందేమోనని చాలా భయపడ్డాను." అని అన్నారు. రాహుల్ చేపట్టిన ఈ జోడోయాత్రలో ప్రముఖులు, స్టార్లు, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే తోపాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రాతో సహా అగ్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. (చదవండి: జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందన్నారు’) -
భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో రాహుల్ గాంధీకి భారీ మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా రాహుల్కు మద్దుతు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, అనూహ్యంగా రాహుల్ యాత్రలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ పాల్గొని తన మద్దతు ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. దేశం కోసం చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. రాహుల్ జోడో యాత్రలో పాల్గొనవద్దని చాలా మంది చెప్పారు. రాహుల్ యాత్రలో పాల్గొంటే పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుందని చెప్పారు. నేను భారతీయుడిగా ఇక్కడ ఉన్నాను. మా నాన్న కాంగ్రెస్ వాది. నేను వివిధ సిద్ధాంతాలను కలిగి ఉండి, నా సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాను. కానీ దేశం విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. నేను అద్దం ముందు నిలబడి నాకు నేను చెప్పుకున్నాను. ఇది.. దేశానికి, నాకు అత్యంత అవసరమైన సమయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. பாஜக அரசின் சர்வாதிகார ஆட்சிக்கு எதிராக தற்போது தலைநகர் டெல்லியில் நடைபெற்று வரும் இந்திய ஒற்றுமை பயணத்தில் மக்கள் நீதி மய்யம் கட்சியின் தலைவர் திரு @ikamalhaasan அவர்கள் திரு @RahulGandhi யுடன் இணைந்தார்.@maiamofficial #BharatJodoYatra#இந்திய_ஒற்றுமை_பயணம்#JodoJodoDilliJodo pic.twitter.com/U95qquqpIn — Tamil Nadu Congress Committee (@INCTamilNadu) December 24, 2022 ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోకి చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా, పాదయాత్రలో భాగంగా రాహుల్ ఇప్పటికే 3వేల కిలోమీటర్లు పూర్తి చేశారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీర్లో ముగిసేలోపు రాహుల్ 3,570 కిమీలు ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగానే 12 రాష్ట్రాలను రాహుల్ కవర్ చేయనున్నారు. Many people ask me why I'm here. I'm here as an Indian. My father was a Congressman. I had various ideologies & started my own political party but when it comes to the country, all political party lines have to blur. I blurred that line & came here - Actor Kamal Haasan pic.twitter.com/M9MSd9CTPm — Armaan (@Mehboobp1) December 24, 2022 భారత్ జోడో యాత్ర శనివారం న్యూఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకున్న సందర్బంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశాన్ని వాస్తవ సమస్యల నుండి మళ్లించడానికి బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని అన్నారు. ఇది ప్రధాని మోదీ ప్రభుత్వం కాదు.. అంబానీ, అదానీల ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Bharat Jodo Yatra: జోడో యాత్రలోనే కరోనా ఉంటుందా?: రాహుల్
ఫరీదాబాద్: బీజేపీ నాయకులు ఎన్ని సభలైనా నిర్వహించుకోవచ్చు గానీ తాము మాత్రం పాదయాత్ర చేపట్టకూడదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. భారత్ జోడో యాత్రలో ఆయన శుక్రవారం సాయంత్రం హరియాణాలోని ఫరీదాబాద్లో బహిరంగ సభలో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఎన్ని సభలైనా పెట్టుకుంటామంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారని గుర్తుచేశారు. జోడో యాత్రలోనే వారికి కరోనా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో విద్వేషాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. రైతులు, యువత మనసులను భయంతో నింపి, దాన్ని విద్వేషంగా మార్చాలన్నదే బీజేపీ కుతంత్రమని మండిపడ్డారు. కానీ, దేశంలో రైతులు, యువతతో సహా సామాన్య ప్రజలంతా ప్రేమ అనే భాషను మాట్లాడుతున్నారని, కలిసి నడుస్తున్నారని రాహుల్ చెప్పారు. జోడో యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించనుంది. -
రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనున్న కమల్ హాసన్
న్యూఢిల్లీ: రాజకీయవేత్త తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ శనివారం రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల తోపాటు పార్లమెంటేరియన్లు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ముక్కల్ నీది మయ్యం(ఎంకెఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక కమల్ హాసన్ కూడా రాహుల్ తనను యాత్రలో పాల్గొనమని ఆహ్వానించారని, డిసెంబర్ 24న ఢిల్లీలో జరిగే భారత్ జోడో యాత్రోల పాల్గొంటానని చెప్పారు కూడా. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ యాత్రలో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది దాక పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి అన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని బదర్పూర్ సరిహద్దులోకి ప్రవేశించనున్న ఈ యాత్రలో వివిధ రంగాలకు చెందిన ప్రజలు చేరతారు. ఆపోలా ఆస్పత్రి మీదుగా వెళ్లి.. ఆ తర్వాత భోజన విరామం తీసుకుని యాత్ర తిరిగి ప్రారంభిస్తామని చౌదరి చెప్పారు. ఆ తదనంతరం నిజాముద్దీన్ వైపు వెళ్లి, ఎర్రకోట వైపు వెళ్లే ముందు ఇండియా గేట్ సర్కిల్ ఐటీఓ ఢిల్లీ కాంట్ దర్యాగంజ్వైపు యాత్ర సాగనుందని వెల్లడించారు. అక్కడ రాహుల్, యాత్రలో పాల్గొన్న మరికొందరు నేతలు కారులో రాజ్ఘాట్, వీర్బూమి, శాంతివన్లను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని చెప్పారు. జనవరి 3న ఉత్తరప్రదేశ్ నుంచి యాత్ర పునః ప్రారంభమవుతుందని, మళ్లీ రెండోవ దశలో హర్యానాకు, ఆపై పంజాబ్ నుంచి కాశ్మీర్వైపు యాత్ర సాగనుందని వివరించారు. కాగా సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్లో పర్యటించింది. (చదవండి: టీవీ మెకానిక్ కూతురు..తొలి ముస్లిం ఫైటర్ పైలట్గా) -
ఎంత బెదిరించినా లాభం లేదు.. మాస్క్ పెట్టుకోనైనా..
ఎంద బెదిరించినా లాభం లేదు.. మాస్క్ పెట్టుకోనైనా కశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తారట ప్రతిపక్షనాయకుడు! -
‘ఆరోగ్య మంత్రి నేను.. తగ్గేదేలే!’ కాంగ్రెస్కు మాండవియా కౌంటర్
న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో మార్గదర్శకాలు పాటించాలని, లేదంటే యాత్రను ఆపాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన లేఖపై రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేశాయి. యాత్రను ఆపాలని చేస్తున్న రాజకీయ కుట్రగా పేర్కొన్నాయి. తాజాగా కాంగ్రెస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియా. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ను కోరుతూ లేఖ రాయడం రాజకీయం కాదని నొక్కి చెప్పారు. ‘ఇది ఏ మాత్రం రాజకీయ కాదు. నేను ఆరోగ్య మంత్రిని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోవిడ్ నియమాలను అనుసరించాల్సిన అవసరం, ఆ ప్రక్రియలోని పురోగతిని నేను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలి. కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు ఎంపీలు నాకు లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు వంటి కాంగ్రెస్ నేతలు కరోనా బారినపడ్డారు.’ అని పేర్కొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. అంతకు ముందు కేంద్ర మంత్రి లేఖపై మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రను ఆపేందుకు కరోనాను ఒక సాకుగా చూపుతున్నారని, అది బీజేపీ కొత్త పన్నాగమని విమర్శించారు. మరోవైపు.. యాత్రను అడ్డుకునేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తెచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. ప్రస్తుతం కేంద్రం లేఖపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదీ చదవండి: చైనా పరిస్థితి ఒక హెచ్చరిక.. కరోనాపై లోక్సభలో ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన -
‘కరోనా ఒక సాకు’.. కేంద్రం లేఖపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. హరియాణాలోని నుహ్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం -
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో... నెలకో పాదయాత్ర
నూహ్ (హరియాణా): ‘‘కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటం కొత్తదేమీ కాదు. రెండు భిన్న భావజాలాల మధ్య వేలాది ఏళ్లుగా జరుగుతూ వస్తున్నదే. ప్రజల గొంతుకగా నిలవడమే కాంగ్రెస్ సిద్ధాంతం. కొద్దిమంది పెద్దలకు మాత్రమే సర్వం దోచిపెట్టడం బీజేపీ సిద్ధాంతం’’ అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. ఆయన భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్తాన్ నుంచి హరియాణాలోకి ప్రవేశించింది. పలువురు మాజీ సైనికులు తదితరులు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా అతి శీతల వాతావరణంలోనూ భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఏసీల్లో కూర్చుని, కార్లలో తిరిగితే అర్థం కాని ఎన్నో విషయాలను యాత్ర ద్వారా తెలుసుకుంటున్నా. మన దేశంలో రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య భారీ అగాథముంది. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుంది. ప్రజల గొంతు వినే అవసరం లేదన్నది నాయకుల అభిప్రాయం. అందుకే గంటల కొద్దీ ప్రసంగాలిస్తుంటారు. దాన్ని మార్చేందుకు నేను ప్రయత్నిస్తున్నా. రోజూ ఆరేడు గంటలు నడుస్తున్నా. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, యువత, చిరుద్యోగుల వంటి అన్ని వర్గాల వారి అభిప్రాయాలు వింటూ సాగుతున్నాం. చివర్లో చాలా క్లుప్తంగా మాత్రమే మేం మాట్లాడుతున్నాం’’ అని చెప్పారు. ఇకపై ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనీసం నెలకో రోజు నేతలు పాదయాత్ర చేయాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచిస్తానన్నారు. -
సమానత్వానికి సరికొత్త మాధ్యమం
ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని మార్పు చేయాలని తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనడం దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుంది. గ్రామస్థాయి వ్యవసాయ, చేతివృత్తుల సమాజాలకు చెందిన పిల్లలు తప్పనిసరై స్థానిక భాషల్లోనే చదువుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు. సంపన్నులు మాత్రమే అన్ని అవకాశాలను పొందగలిగే తరహా కొత్త భారతీయ వర్గ వ్యవస్థను ఇంగ్లిష్ విద్య అనుమతించకూడదు. భావజాలపరమైన నేతలందరూ ఈ విషయంలో విద్యా కపటత్వంతో వ్యవహరించారు. పేద, ధనిక పిల్లలందరూ ఒకే భాషా (ఇంగ్లిష్) విద్యను కలిగి ఉండాలని స్పష్టమైన వైఖరిని తీసుకోకుంటే మానవ సమానత్వం అనే లక్ష్యాన్ని భారతదేశం సాధించలేదు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజ స్థాన్లోని ఆల్వర్లో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఇలా చెప్పారు. ‘‘పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను బీజేపీ నేతలు కోరుకోరు. కానీ ఆ పార్టీ నేతలందరి పిల్లలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకే వెళతారు. వాస్తవానికి పేద రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవాలనీ, పెద్ద కలలు కనాలనీ, వ్యవ సాయ పొలాల నుంచి బయటకు వెళ్లి జాతీయ వార్తల్లోకి వెళ్లాలనీ వారు కోరుకోవడం లేదు. ’’ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తర్వాత తెలంగాణ కూడా ఆ నమూనాను అనుసరించింది. భారత్ జోడో యాత్రలో భాగంగా మొదట దక్షిణ భారతదేశం నుంచి నడక ప్రారంభించిన రాహుల్ గాంధీ తర్వాత ఉత్తర భారత దేశంలో యాత్ర కొనసాగిం చారు. ఆ తర్వాత రాజస్థాన్లో ఇటీవలే పై ప్రకటన చేశారు. ఢిల్లీ నుంచి, ఆర్ఎస్ఎస్–బీజేపీ విధానంగా హిందీని ముందుకు నెట్టాలని ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఒక జాతీయ నాయకుడు తొలిసారిగా స్థిరమైన వైఖరి తీసుకున్నారు. ఒకే దేశం, ఒకే భాష అనే ఆర్ఎస్ఎస్–బీజేపీ విధానంలో భాగంగానే వీరిద్దరూ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ విద్య దాకా ప్రభుత్వ రంగంలో హిందీ భాషను ముందుకు నెడుతున్నారు. అదే సమ యంలో ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వదిలేస్తున్నారు. గ్రామస్థాయి వ్యవ సాయ, చేతివృత్తుల సమాజాలకు చెందిన పిల్లలు తప్పనిసరిగా స్థానిక భాషల్లోనే చదువుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు. పేద వ్యవసాయ కార్మికులు, కూలీల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని రాహుల్ గాంధీ ఆ ర్యాలీలో చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా మరిన్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను తెరవాలనీ, అప్పుడే పేద పిల్లలు పెద్ద కలలు కనగలరనీ అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సమాన భాష, నాణ్యమైన స్కూల్ విద్యపై జాతీయ చర్చను రేకెత్తి స్తుంది. బీజేపీ, కమ్యూనిస్టు నాయకులను ఇది వణికిస్తుంది. ఆర్ఎస్ఎస్–బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అందరికీ సమాన మాధ్యమ విద్యను ఎన్నటికీ అమలుచేయవు. ఇక కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్లో దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కేరళలో కూడా అమలు చేయడం లేదు. ఆర్ఎస్ఎస్–బీజేపీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మెడిసిన్, ఇంజినీ రింగ్ సహా ఉన్నత విద్యాసంస్థలను హిందీ మాధ్యమంలోకి మార్చేస్తు న్నాయి. అంటే పేదలకు స్పష్టమైన హిందీ దిశని ఇది చూపిస్తుంది. నెహ్రూ హయాం నుండి అమలవుతూ వస్తున్న – ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని మార్పు చేయాలని రాహుల్ గాంధీ ఇప్పుడు కోరు కుంటున్నారు. బ్రిటిష్ వారి నుంచి అప్పుడే స్వాతంత్య్రం సాధిం చడం, మత ఘర్షణల వాతావరణంలో ఇంగ్లిష్ వర్సెస్ హిందీని జాతీయ భాషా విధానంగా చేపట్టిన కాలంలో నెహ్రూ తొలి ప్రధానిగా గందరగోళంలో ఉండేవారు. కానీ అంబేడ్కర్ ఆ కాలంలోనే ఇంగ్లిష్ మాధ్యమ విద్యను కోరుకున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వల్ల ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. కానీ అదే సమయంలో ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియంను అలాగే ఉంచేశారు. అదే విధానాన్ని ఆర్ఎస్ఎస్–బీజేపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు పాటించారు. భావజాలపరమైన నేతలం దరూ భాషకు సంబంధించిన ఈ విద్యా కపటత్వంతో ఉత్పాదక వర్గాల పిల్లలను పేలవమైన ప్రాంతీయ భాషా విద్యతో కూడిన ఆధునిక బానిసత్వ పరిస్థితుల్లో ఉంచేశారు. 2019లో ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆ విద్యాపరమైన కపటత్వంపై దాడి చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల హిందీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించి స్పష్ట మైన వైఖరిని తీసుకున్నారు. కాబట్టే పార్టీ మేనిఫెస్టోలోనూ, 2024లో జరగబోయే జాతీయ ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనూ నూతన విద్యా విధానాన్ని చొప్పించడానికి సంబంధించిన విధివిధానాలపై కృషి చేయవలసిందిగా జాతీయ నాయకత్వం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ యూనిట్లను ఆదేశించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ రంగ విద్యా విధానంలో, ప్రస్తుత హిందీ మీడియంలో చదువుతున్న శూద్ర, దళిత, ఆదివాసీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్, బిహార్లో నితీశ్ కుమార్, తేజస్విని యాదవ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతలు, ఇంకా ప్రాంతీయ పార్టీల నేతలు... ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి తమదైన విద్యా విధానంతో ముందుకు రావలసి ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలు చాలావరకు తమ కుటుంబాల్లోని పిల్లలను ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేరుస్తూనే, మరోవైపు హిందీ భాషా దురహంకారంలో కూరుకుపోయి ఉంటున్నాయి. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం స్కూల్, కాలేజీ విద్యపై ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర బడ్జెట్లో హేతుపూర్వకమైన మొత్తంలో కూడా ఖర్చుపెట్టడం లేదు. రాజకీయ పార్టీలతోపాటు దేశంలో అనేక ప్రభుత్వేతర, పార్టీయే తర సంస్థలు ఉంటున్నాయి. ఇలాంటి సంస్థల్లోని కీలక సభ్యులందరూ తమ పిల్లలను ప్రైవేట్ మీడియం పాఠశాలల్లో చదివిస్తుంటారు. కానీ ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలల గురించి మౌనం పాటిస్తుం టారు. పేద, ధనిక పిల్లలందరూ ఒకే భాషా (ఇంగ్లిష్) విద్యనూ, రెండో భాషగా తమ మాతృభాషనూ పొందే హక్కును కలిగి ఉండా లని రాజకీయ పార్టీలు, పౌర సమాజంలోని కీలక శక్తులు ఒక స్పష్ట మైన వైఖరిని తీసుకోకుంటే మానవ సమానత్వం అనే లక్ష్యాన్ని భారతదేశం సాధించలేదు. ప్రపంచంతో మాట్లాడగల హక్కు, ప్రపంచం అందించే ప్రతి అవ కాశాన్ని పొందే హక్కు... దేశంలోని ఏ కుటుంబంలో లేదా కులంలో పుట్టినా సరే... పిల్లలందరికీ హక్కుగా ఉండాలి. సంపన్నులు అన్ని అవకాశాలు పొందుతూ, అన్ని విజ్ఞాన నిర్మాణాలను పొందగలిగే తరహా కొత్త భారతీయ వర్గ వ్యవస్థను ఇంగ్లిష్ విద్య అనుమతించ కూడదు. వర్గ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రజలను సమీకరించే కమ్యూనిస్టు నేతలు ఇన్ని సంవత్సరాలుగా విద్యా సమానత్వం విష యంలో కపటధారుల్లాగా కొనసాగటానికి బదులుగా ఈ అంశాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్–బీజేపీ నేతలు ఈ సమస్య విషయంలో రాహుల్ గాంధీని ఏమాత్రం ఎదుర్కోలేరు. ఎందుకంటే వీరందరూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ ల్లోనే చేర్పించారని ఆయన స్పష్టంగా చెప్పారు. గడ్డం తీసుకోకుండా, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్న రాహుల్ గాంధీ ఒక మునిలాగా కాకుండా విద్యలో సమానత్వాన్ని వ్యాపింపజేయడానికి సిద్ధమవు తున్న పేద రైతులా కనిపిస్తున్నారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో ప్రేమను, శాంతిని, సమైక్య జీవితాన్ని పంచిపెట్టాలంటే ఆత్మన్యూ నతా భావం, ఆత్మాధిక్యతా భావం లేకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడు కునే భాషను కలిగి ఉండటం మొట్టమొదటి అవసరంగా ఉంటుంది. రాహుల్ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర– భవిష్యత్తులో పిల్లలం దరికీ అందుబాటులో ఉండే జాతీయ భాషగా ఇంగ్లిష్ను స్వీకరించేలా ప్రతి ఒక్కరినీ కలుపుతుందని ఆశిద్దాం! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారా?.. లాక్డౌన్ విధిస్తారా?’
కరోనా వైరస్ టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. కొద్దిరోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో, చైనాలో ఇప్పటికే పలు పాంత్రాల్లో లాక్డౌన్ సైతం విధించి చైనీయులపై అక్కడి సర్కార్ ఆంక్షలు సైతం విధించింది. ఈ తరుణంలో కరోనా కేసులు విషయంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కాగా, కరోనా కేసులు పెరుగుతాయనే వైద్య నిపుణుల సూచనలు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవీయా కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను సైతం వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగానే భారత్ జోడో యాత్ర.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చేసుకోవాలని, టీకా వేసుకున్న వారే ఈ యాత్రలో పాల్గొనాలని.. లేని పక్షంలో యాత్రను వాయిదా వేసుకోవాలని లేఖలో రాహుల్ కోరారు. ఇక, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాండవీయా లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారా?. దేశంలో బహిరంగ సభలు పెట్టకూడదనే షరతు ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ నేతలకు వర్తిస్తాయా?. దేశంలో మరోసారి కరోనా లాక్డౌన్ విధించబోతున్నారా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో వైరస్ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. సీనియర్ సిటిజన్లు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. ఇక, అంతకు ముందు.. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ మాండవీయా ట్వీట్ చేశారు. ఇక కోవిడ్పై ప్రధానంగా జరిగిన హైలెవల్ రివ్యూలో మంత్రితో పాటు అధికారులంతా మాస్కులు ధరించి ఉండడం గమనార్హం. -
ఇదేందయ్యా రాహుల్.. కాంగ్రెస్ కార్యకర్తకు చేదు అనుభవం!
దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర ముగిసింది. ప్రస్తుతం రాజస్థాన్లో జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే, రాహుల్ యాత్రపై అటు బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. యాత్రలో జరుగుతున్న చిన్న తప్పిదాలను ఎత్తిచూపుతూ బీజేపీ నేతలు కాంగ్రెస్పై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే భారత్ జోడో యాత్రలో చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ చేసిన పనిని బీజేపీ హైలైల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి పలు ప్రశ్నలు సంధించింది. కాగా, రాజస్థాన్లో రాహుల్ యాత్ర సందర్బంగా మంగళవారం జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ క్రమంలో సభావేదిక మీదకు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా నేతలు ఒకానొక సమయంలో ఒకరినొకరు తోసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సభ ముగిసిన అనంతరం.. కొందరు కార్యకర్తలు రాహుల్ గాంధీతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ తరుణంలో కొందరు కార్యకర్తలు రాహుల్ మీదకు దూసుకొచ్చారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, ఓ కార్యకర్త తన ఫోన్తో సెల్ఫీ తీసుకుంటుండగా సహనం కోల్పోయిన రాహుల్ గాంధీ.. ఫోన్ను కోపంతో పక్కకు జరిపారు. ఈ క్రమంలో సీరియస్ కూడా అయ్యారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోకు రాహుల్ గాంధీ ఎందుకంత చిరాకుగా ఉన్నారు? అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ యాత్రపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్ అనుసరించడం సాధ్యం కాకపోతే.. దేశ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని రాహుల్, అశోక్ గెహ్లాట్ను కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయా లేఖ రాశారు. యాత్రలో టీకాలు తీసుకున్న వారు మాత్రమే పాల్గొనాలి అని స్పష్టం చేశారు. Rahul Gandhi loses cool on stage during Bharat Jodo Yatra event, BJP calls him 'frustrated'#RahulGandhi #Congress #BharatJodoYatra #BJP #ViralVideo pic.twitter.com/hZuqs1YPJt — Free Press Journal (@fpjindia) December 21, 2022 -
జోడో యాత్రపై రాహుల్కు కేంద్రం హెచ్చరిక..
న్యూఢిల్లీ: చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు. ఈ యాత్రలో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేశారు. కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే భారత్ జోడో యాత్రలో అనుమతించాలని కేంద్రమంత్రి హితవు పలికారు. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోతే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జోడో యాత్రను రాహుల్ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈమేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్కు మాండవీయ లేఖ రాశారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమై ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల మీదుగా పాదయాత్ర చేసిన రాహుల్.. ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. చదవండి: రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు.. -
Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్..
చెన్నై: రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ నెల 24న తాను పాల్గొనబోతున్నట్లు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చెప్పారు. యాత్రలో పాల్గొనాలంటూ రాహుల్ తనను ఆహ్వానించారని చెప్పారు. ఆదివారం పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో కమల్ మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో కమల్తోపాటు కార్యకర్తలు కూడా పాల్గొంటారని మక్కల్ నీది మయ్యం అధికార ప్రతినిధి మురళి అప్పాస్ వెల్లడించారు. చదవండి: రూ.13 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్.. -
కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్
జైపూర్: చైనా మన మీదకి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చైనా నుంచి మనకు ముప్పు ఉందని రెండు, మూడేళ్లుగా నాకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. కానీ కేంద్రం దాన్ని దాచి పెడుతూ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. 20 మంది సైనికుల ప్రాణాలు తీసింది. అరుణాచల్ ప్రదేశ్లో మన జవాన్లను కొట్టింది. లద్దాఖ్, తవాంగ్లో ఘర్షణలు జరిగాయి. ఇన్ని జరిగినా మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోంది’’ అంటూ ధ్వజమెత్తారు. చైనా ఆయుధ సంపత్తి, వాటిని నియోగిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. బీజేపీని ఓడించేది మేమే కాంగ్రెస్ను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, ఎప్పటికైనా బీజేపీని ఓడించేది తమ పార్టీయేనని రాహుల్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పనైపోయిందంటున్నారు. కానీ బీజేపీ ఎప్పటికైనా కాంగ్రెస్ చేతిలోనే ఓడుతుంది. కాంగ్రెస్కు కోట్లాది మంది కార్యకర్తల బలముంది. వారి సేవల్ని పూర్తిగా వినియోగించుకుంటే రాజస్థాన్లో అఖండ విజయం ఖాయం’’ అన్నారు. కాంగ్రెస్ నుంచి నేతల నిష్క్రమణను మీడియా ప్రస్తావించగా, ‘పోయేవాళ్లందరినీ పోనిస్తాం. కాంగ్రెస్పై నమ్మకమున్న వాళ్లే మాతో ఉంటారు’’ అన్నారు. బీజేపీకి బీ టీమ్ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ–టీమ్గా మారిందని రాహుల్ ఆరోపించారు. ఆప్ లేకుంటే గుజరాత్ ఎన్నికల్లో గెలిచే వాళ్లమన్నారు. ‘‘ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్ఫథం లేదు. దేశానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది కాంగ్రెస్కు మాత్రమే తెలిసిన విద్య. వచ్చే ఎన్నికల్లో ఇతర విపక్షాలతో కలిసి పని చేస్తాం. మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు’’ అన్నారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తదితరులు రాహుల్తో కలిసి నడిచారు. ‘నెహ్రూ భారత్’ కాదిది: బీజేపీ న్యూఢిల్లీ: చైనా యుద్ధానికి వస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పి కొట్టింన్నిలాంటి మాటలతో సైనికుల స్థైర్యాన్ని రాహుల్ దెబ్బ తీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. ‘‘1962లో మనపై చైనా యుద్ధానికి కాలుదు వ్వినప్పటి నెహ్రూ కాలపు భారత్ కాదిది. మోదీ నేతృత్వంలోని కొత్త నవీన భారత్. కయ్యానికి కాలు దువ్వే వాళ్లకు గట్టిగా జవాబిస్తాం’’ అన్నారు. -
ఆ పార్టీ లేకుంటే గుజరాత్లో గెలిచేవాళ్లం: రాహుల్ గాంధీ
జైపూర్: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ఆపార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కీలకపాత్ర పోషించిందని రాహుల్ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ లేకుంటే అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించేదని తెలిపారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటమికి ఆప్ కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆప్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్కు నష్టం చేకూర్చిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ బీజేపీకి బీటీమ్గా వ్యవహరించిందనిమండిపడ్డారు. కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఆప్ బీజేపీతో కుమ్మకైందని దుయ్యబట్టారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు రాహుల్. ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీని ఓడించాలన్న దృక్పథమే లేదని విమర్శించారు. అయితే రాహుల్ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. గుజరాత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనున్న ఉన్న ఆప్ను బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయని పేర్కొంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులో మొదలైన యాత్ర ఫిబ్రవరి నెలలో కశ్మీర్లో ముగియనుంది. 150 రోజులపాటు మొత్తం 3,500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడక యాత్ర సాగనుంది. జోడోయాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర 2,800 కిమీలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశించనుంది. అనంతరం ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రల్లో పర్యటిస్తూ చివరకు జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్ -
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చైనా నుంచి వచ్చే ముప్పును తక్కువ అంచనా వేస్తుందని విమర్శించారు. డ్రాగన్ దేశం యుద్ధానికి కాలు దువ్వుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని అంగీకరించడం లేదని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర భాగంగా రాజస్థాన్లోని దౌసాలో రాహుల్గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా ఉన్నారు, కాగా డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖవద్ద భారత్, చైనా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుపడ్డారు ‘చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల సరళి, వాడకం చూస్తే అర్థమవుతోంది.. అది యుద్ధం కోసమేనని. కానీ మన ప్రభుత్వం దానిని గుర్తించడం లేదు. భారత ప్రభుత్వం వ్యూహాలపై కాదు, సంఘటనలపై పనిచేస్తోంది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన సైనికులపై దాడి చేసింది. దీంతో డ్రాగన్తో వచ్చే ముప్పు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేస్తోంది. మోదీ చైనా బెదిరింపులను విస్మరిస్తున్నారు. ఓవైపు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దాడికి సిద్ధమవుతుంటే.. భారత ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిద్రపోతుంది’ అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్ -
భారత్ జోడో యాత్ర @ 100 రోజులు: మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి?
జైపూర్: భారత్ దక్షిణ కొన నుంచి ఒక్క అడుగుతో మొదలైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర వడివడిగా ముందుకు సాగుతూ శుక్రవారం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. కన్యాకుమారినుంచి కశ్మీర్దాకా సాగే 3,500 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ యాత్రలో రాహుల్కు మద్దతుగా అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే ఈ ప్రజాదరణ 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటుబ్యాంక్ను పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల ముగిసిన గుజరాత్, హిమాచల్ శాసనసభ ఎన్నికలు పార్టీకి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అయితే, యాత్ర ఫలితం వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో చూస్తే యాత్ర.. పార్టీకి పూర్వవైభవాన్ని తెస్తుందని ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝా విశ్లేషించారు. ‘ ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ మరోసారి క్షేత్రస్థాయిలో బలపడుతోంది. తన ఇమేజ్పై బీజేపీ కురిపిస్తున్న నకిలీ, తప్పుడు కథనాలను పటాపంచలు చేస్తూ కొత్త రాజకీయ బ్రాండ్గా రాహుల్గాంధీ ఎదుగుతున్నారు’ అని ఆయన అన్నారు. కాగా, యాత్రలో రాహుల్ ఆహార్యం, విమర్శలపై కాంగ్రెస్, బీజేపీ వాగ్భాణాలు సంధించుకున్నాయి. నెరిసిన గడ్డంతో ఇరాన్ నియంత సద్దాం హుస్సేన్లా ఉన్నాడంటూ రాహుల్పై బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం, వివాదాస్పద క్రైస్తవ బోధకుడితో రాహుల్ భేటీ, పాదయాత్రకు కోట్లాది మంది ప్రజానీకం మద్దతు వంటి భిన్న అంశాలతో పాదయాత్ర ముందుకుసాగుతోంది. మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి? దౌసా: చైనా సైనికుల చొరబాటు యత్నంపై చర్చించకుండా మోదీ సర్కార్ తప్పించుకుంటోందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా ఆరోపించారు. రాజస్తాన్లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా దౌసాలో మీడియాతో మాట్లాడారు. ‘చైనా అంశంలో ప్రధాని మోదీ మౌనం వెనుక ఉద్దేశమేంటి? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చైనాకు క్లీన్చిట్ ఇస్తారు. మోదీ గుజరాత్కు సీఎంగా ఉన్న కాలంలో అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చైనా మాండరీన్ భాషను ప్రవేశపెట్టాలనుకున్నారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగేలా జమ్మూకశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో స్మార్ట్మీటర్లు బిగించే బాధ్యత మోదీ ఒక చైనా కంపెనీకి కట్టబెట్టారు. గుజరాత్లో స్థానిక సంస్థలను కాదని చైనా కంపెనీలకు భూమి కేటాయించారు. పీఎం కేర్స్ ఫండ్కు చైనా కంపెనీలు విరాళాలు పంపాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందే ’ అని అన్నారు. -
గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మహానేతలతో పోల్చవద్దని పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు ఆధారపడవద్దని, ప్రస్తత తరం పరిస్థితులు పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పార్టీ నాయకుడు ఒకరు రాహుల్ను మహాత్మా గాంధీతో పోల్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'ఇలా పోల్చడం తప్పు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి నాయకులతో పోల్చడం సరికాదు. మహాత్మ గాంధీ గొప్ప వ్యక్తి. దేశ స్వేచ్ఛ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. 10-12 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నన్ను ఆయనతో పోల్చవద్దు.' అని రాహుల్ అన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీల గురించి కూడా ప్రస్తావించి భారమైన హృదయంతో సందేశం ఇచ్చారు. 'రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ఎంతో చేసి అమరులయ్యారు. తమ వంతు కృషి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రతి సమావేశంలో వాళ్ల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ.. వాళ్లు చేయగలిగినంత చేశారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ల వంతు భూమిక పోషించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనే దానిపైనే దృష్టి సారించాలి. ప్రజల కోసం ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి' అని రాహుల్ పేర్కొన్నారు. मैं अपने कांग्रेस पार्टी के मित्रों से थोड़ी कड़ी बात कहना चाहता हूं। इंदिरा गांधी जी और राजीव गांधी जी ने अच्छा काम किया... लेकिन कांग्रेस को हर मीटिंग में यह दोहराना नहीं चाहिए। हमें अब ये बोलना चाहिए कि हम जनता के लिए क्या करेंगे। यह ज्यादा जरूरी है। - @RahulGandhi जी pic.twitter.com/0VyYfb478S — Congress (@INCIndia) December 14, 2022 రాహుల్ భారత్ జోడో యాత్రలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా బుధవారం రాజస్థాన్లో రాహుల్తో పాటు కలిసి పాదయాత్ర చేశారు. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ యాత్రతో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. చదవండి: వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి -
రాహుల్ గాంధీ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ భారత్ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్తాన్లో కొనసాగుతుంది. ఇంతవరకు రాహుల్ యాత్రలో ఎంతోమంది సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అందులో భాగంగా రాహుల్ భారత్ జోడో యాత్రలో తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో... ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు సాగుతున్న ఈ యాత్రలోకి జాయిన్ అయ్యే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం అని ట్వీట్ చేశారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్తో రఘరామ్ రాజన్ ఏదో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్గాంధీ చేపట్టిన జోడోయాత్రలో పాల్గొనడంపై బీజీపీ పలు విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్గా అభివర్ణించుకుంటున్నారని పేర్కొంది. రఘురామ్ రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన్ను అవకాశవాదిగా బీజేపీ నేత అమిత్ మాల్వియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్లో ముగియునున్న భారత్ జోడో యాత్రలో ఇప్పటి వరకు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్థార్లు జాయిన్ అయ్యారు. వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, స్వయం-స్టైల్ గాడ్ మాన్ నామ్దేవ్ దాస్ త్యాగి (కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందారు), నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఉన్నారు. Former Governor of RBI, Dr. Raghuram Rajan joined Rahul Gandhi in today’s #BharatJodoYatra pic.twitter.com/BQax4O0KSF — Darshnii Reddy ✋🏻 (@angrybirddtweet) December 14, 2022 (చదవండి: పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!.. ప్రతిపక్ష నేత ఎంపికపై ఉత్కంఠ) -
రాహుల్ జోడో యాత్రలో ప్రియాంక కూతురు.. ఫోటోలు, వీడియోలు వైరల్
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. ఈనెల 5వ తేదీన జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశించింది. తాజాగా రాహుల్ యాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కుటుంబం పాల్గొంది. సోమవారం(96వ రోజు) బుండీ జిల్లాలోని తేజాజీ మహారాజ్ వద్ద ఉదయం 6 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమవ్వగా.. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయాతో సహా వందలాది మహిళలు రాహుల్తో కలిసి పర్యటించారు. మహిళా సాధికారత పేరుతో సాగుతున్న సోమవారం నాటి జోడోయాత్రలో అధిక సంఖ్యలో మహిళలు రాహుల్తో కలిసి నడుస్తుండటంతో దీనిని ‘నారీ శక్తి పాదయాత్ర’గా అభివర్ణించింది కాంగ్రెస్. కోటా-లాల్సోట్ మెగా హైవేపై రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు. Smt @priyankagandhi in the #BharatJodoYatra today. pic.twitter.com/aEBKVpncYr — Lavanya Ballal (@LavanyaBallal) December 12, 2022 చలిని కూడా లెక్కచేయకుండా దాదాపు 5,000పైగా మహిళలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అంతా కలిసి బాబాయి గ్రామం నుంచి స్వైమాధోపూర్ జిల్లాలోని పిపాల్వాడ వరకు నడిచారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత कहीं दूर तक ज़मीं नजर नहीं आती है ये तुम्हारी मोहब्बतों का असर है। वाह राजस्थान...#BharatJodoYatra pic.twitter.com/0hf4cel4gW — Congress (@INCIndia) December 12, 2022 కాగా రాహుల్ రాజస్థాన్లో గత ఏడు రోజులుగా పర్యటిస్తున్నారు. బుండీ జిల్లాలో ఇది చివరి రోజు. అనంతరం టోంక్ జిల్లాలోకి ప్రవేశించారు. డిసెంబర్ 21న హర్యానా రాష్ట్రంలోకి అడుగు పెట్టనున్నారు. గత 17 రోజుల్లో దాదాపు 500 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు. అయితే జోడో యాత్ర మొత్తంలో ఇప్పటి వరకు తిరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ మాత్రమే. ఇక సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగింది. మొత్తం 150 రోజుల్లో 3,570 కి.మీ.లు ప్రయాణించి 2023 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో ముగియనుంది. Mr @RahulGandhi , Ms @priyankagandhi #BharatJodoYatra #Rajasthan pic.twitter.com/O4A9hDstZv — Supriya Bhardwaj (@Supriya23bh) December 12, 2022 -
బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్
జైపూర్: దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాజస్థాన్లో యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఝలావార్లో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్సెస్(ముద్దులు) వర్షం కురిపించారు. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే.. ఈ విధంగా ప్రవర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ప్రస్తుతం రాహుల్ గాంధీ ముద్దుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మంగళవారం ఉదయం ఖేల్ సంకుల్ నుంచి యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఝలావర్ నగరాన్ని దాటుకుని వెళ్లారు. రాహుల్తో పాటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, ఆర్పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోటస్రా, సచిన్ పైలట్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సుమారు 12 కిలోమీటర్ల యాత్ర తర్వాత దేవరిఘాటాకు చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత 3.30 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే యాత్ర మోరు కలాలన్ ఖేల్కు చేరుకుంటుంది. नफ़रत का जवाब सिर्फ़ मोहब्बत है !!❤️🔥💗 ये तस्वीर देखिये..👇🏻 pic.twitter.com/IHkagK97xW — Rajasthan Youth Congress (@Rajasthan_PYC) December 6, 2022 ఇదీ చదవండి: ‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ -
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
జోడో యాత్రలో వివాదాస్పద కంప్యూటర్ బాబా.. బదులివ్వాలన్న బీజేపీ
అగర్మాల్వా(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం వివాదాస్పద గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో మహుదియా గ్రామం వద్ద శనివారం ఆయన రాహుల్తో కలిసి నడిచారు. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై చేయి చేసుకున్న కేసులో నాందేవ్ 2020లో అరెస్టయ్యారు. అలాంటి పలు కేసులున్న, జైలుకు వెళ్లొచ్చిన నిందితునితో రాహుల్తో కలిసి నడవడమేంటని బీజేపీ నిలదీసింది. అయితే, దేశ క్షేమం కోసం చేపట్టిన యాత్రలోకి సాధువులతో సహా అందరూ ఆహ్వానితులేనని కాంగ్రెస్ బదులిచ్చింది. అయితే ఈ కంప్యూటర్ బాబాకు 2018లో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహాయ మంత్రి హోదాతో కూడిన పదవి కట్టబెట్టింది! అనంతరం బీజేపీతో పొసగక ఆయన కాంగ్రెస్ పంచన చేరారు. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ను శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడని సస్పెండ్ చేశారు..!
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ బార్వానీ జిల్లాలో రాహుల్గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్రకు హాజరైనందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్ కన్నోజే సస్పన్షన్కి గురయ్యాడు. ఆయన కనాస్యలోని రాష్ట్ర గిరిజన వ్యవహార విభాగంలో ఒక ప్రాథమిక పాఠశాల్లోని ఉపాధ్యాయుడు. అతను యాత్రలో పాల్గొన్న ఒకరోజు తర్వాత ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారంటూ అధికారులు సస్పెండ్ చేశారు. అతని సస్పెన్షన్ ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గిరిజన వ్యవహారాల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రఘవన్షి మాట్లాడుతూ...కన్నోజే ముఖ్యమైన పని కోసం సెలవు కోరారు. కానీ అతను రాజకీయ కార్యక్రమానికి హాజరై సోషల్మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడు. ఆయన నవంబర్ 24న ఒక రాజకీయ పార్టీ భారత్ జోడో యాత్రకు హాజరై ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారు. అదువల్లేఈ వేటు విధించినట్లు తెలిపారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా డిపార్ట్మెంట్ చైర్పర్సన్ కెకె మిశ్రా ట్విట్టర్ వేదికగా....శివరాజ్సింగ్ చౌహన్ ప్రభుత్వం ఉద్యోగులను రాష్ట్ర స్వయం సేవక్ సంఘం(ఆర్ఎస్ఎస్) శాఖలలో మాత్రమే పాల్గొనడానికి అనుమతించిందని ఎద్దేవా చేశారు. రాజేష్ కన్నోజ్ అనే గిరిజనుడు ఆ యాత్రలో పాల్గొని రాహుల్కి విల్లు, బాణం బహుమతిగా ఇచ్చినందుకే ఆయనపై వేటు వేశారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర ఈ ఆదివారం రాజస్తాన్లోకి ప్రవేశించనుంది. (చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ!) -
పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు!. ఆయనతో పాటు పలువురు సీనియర్లు సైతం సమావేశాలకు గైర్హాజరు కాబోతున్నారని సమాచారం. రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యాత్రంలో పలువురు నేతలు కూడా రాహుల్ వెంట ఉన్నారు. ఈ క్రమంలో.. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండానే యాత్రను కొనసాగించాలని రాహుల్, ఆ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారం(డిసెంబర్ 7వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎవరు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం ప్రతిపక్ష నేత ఎంపిక విషయంపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. ఎంపిక చేయబడిన ఏఐసీసీ కీలక సభ్యులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఇది వరకు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఉండేవారు. అయితే.. ఆయన అధ్యక్ష పదవి చేపట్టడంతో ఇప్పటికీ ఆయన స్థానంలో మరొకరి నియామకం జరగలేదు. దీంతో ఆయన్నే కొనసాగించాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: కవితకు నోటీసులిస్తే రాష్ట్రం ఉద్యమించాలా? -
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. మాజీ సీఎం వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కమల్నాథ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జోడో యాత్రపై కమల్నాథ్ అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్ మిశ్రా అనే పండింతుడితో కమల్నాథ్ మాట్లాడుతున్నారు. ‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 గంటలు నడవాలి. మధ్యప్రదేశ్లో యాత్ర కోసం రాహుల్ మూడు ప్రీ కండిషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని చెప్పారు.’అని కమల్నాథ్ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావటంతో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ‘కమల్నాథ్ జీ.. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’అని విమర్శించారు. Bharat Jodo Yatra: कमल नाथ का वीडियो वायरल, बोले- हम तो सात दिन से मर रहे हैं https://t.co/UChv8Xf1mL#KamalNath #BharatJodoYatra #MadhyaPradesh #Naidunia pic.twitter.com/mOX1m9SZrR — NaiDunia (@Nai_Dunia) December 1, 2022 ఇదీ చదవండి: శశి థరూర్కు తప్పని చిక్కులు.. సునంద మృతి కేసులో కోర్టు నోటీసులు -
Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 83వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆయనతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్ ఈ పాదయాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇటీవలే రాహుల్తో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. భర్త రాబర్ట్తో వాద్రాతో వచ్చి తొలిసారి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాలను కవర్ చేసి 1,209 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 11 గంటల వరకు 18.95% పోలింగ్ -
దేశం సంగతి దేవుడెరుగు!.. మీకు ప్రయోజనం చేకూరింది అంతే చాలు!
దేశం సంగతి దేవుడెరుగు!.. మీకు ప్రయోజనం చేకూరింది అంతే చాలు! -
Bharat Jodo Yatra: పాదయాత్రతో నాలో ఓపిక పెరిగింది: రాహుల్
ఇండోర్: భారత్ జోడో యాత్రతో తనలో ఓపిక, ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం పెరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్లో పాదయాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాలో ఓపిక పెరగడం ఎంతగానో సంతృప్తినిస్తోంది. 8 గంటలు నడిచినా విసుగు రావడం లేదు. ఎవరైనా నెట్టినా కోపం రావడం లేదు. యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరించాల్సిందే. ఆటంకాలు ఎదురైనంత మాత్రాన విరమించుకోవడం సరికాదు. ప్రజలు చెప్పేది సావధానంగా వింటున్నా. ఇది నాకెంతో మేలు చేస్తోంది. పాదయాత్ర ఇప్పటిదాకా ఎన్నెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది’’ అని చెప్పారు. -
మా నాయకుడే అలా అన్నాక ఇక వివాదం ఎక్కడిది!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక చిన్న మాటతో ఆ ఇద్దరి నాయకుల మధ్య రగడకు చెక్ పెట్టారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య గత కొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవలే సీఎం ఆశోక్ గెహ్లాట్.. 2020లో పైలట్ కాంగ్రెస్ పార్టీని కూల్చేయడానికి ప్రయత్నించిన ద్రోహి అని తిట్టిపోశారు. అలాగే పైలట్ కూడా ఒక సీనియర్ నాయకుడుగా ఐక్యతగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి మాటలు తగదు అంటూ గెహ్లాట్కి కౌంటరిచ్చారు. దీంతో ఇరువురి మధ్య తారా స్థాయిలో విభేధాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఈ వివాదం మీ యాత్రకు అవరోధం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా..ఇది ఎలాంటి ప్రభావం చూపదని తేల్చి చెప్పారు. అంతేగాదు ఆశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ఇద్దరూ తమ పార్టీకి ఆస్తులు అని, అదే మా పార్టీ అందం అని రాహుల్ చెప్పారు. దీంతో వారి మధ్య ఉన్న రగడ కాస్త గప్చుప్ అంటూ సద్దుమణిగిపోయింది. ఈ మేరకు ఆశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..మా నాయకుడు మమ్మల్ని పార్టీకి ఆస్తులు అని చెప్పినప్పుడూ ఇక మా మధ్య వివాదం ఎక్కడ ఉంటుందని కొట్టిపారేశారు. అంతేగాదు గెహ్లాట్, సచిన్ ఇద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చి.. డిసెంబర్ 4న రాజస్తాన్లో అడుగుపెట్టనున్న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర పెద్ద విజయాన్ని సాధిస్తుందని పునరుద్ఘాటించారు. మా పార్టీయే మాకు అత్యన్నతమైనది, అది కీర్తీవంతంగా సాగాలని కోరుకుంటున్నాని అన్నారు. అలాగే సచిన్ పైలట్ కూడా ఈ భారత్ జోడోయాత్ర చేస్తున్న రాహుల్కి రాజస్థాన్ ఘన స్వాగతం పలుకుతుందని అన్నారు. (చదవండి: కాంగ్రెస్ సభలో ఎద్దు హల్చల్.. బీజేపీ కుట్రేనటా!) -
రాహుల్ వీడియోను ట్రోల్ చేస్తున్న బీజేపీ!
ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇప్పుడు మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ప్రజాదరణను చూరగొని కాంగ్రెస్కు పూర్వ వైభవం తేవాలనే ఏకైక లక్ష్యంతో చేపట్టిందే భారత్ జోడోయాత్ర. కాగా, రాహుల్ తన జోడోయాత్రలో భాగంగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. గతవారం మహారాష్ట్రలో భారత్ జోడోయాత్ర చేపట్టిన క్రమంలో రాహుల్ అండ్ పార్టీ చిట్చాట్లో పాల్గొన్న సందర్భంలో ఒక వీడియో చేసింది. అది కూడా బీజేపీ-ఆర్ఎస్ఎస్లను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే చేసింది. అందులో మార్షల్ ఆర్ట్స్ను జోడించాడు రాహుల్. ఒక వ్యక్తిపైకి ఎవరైనా సమూహంగా వచ్చి దాడి చేస్తే దాన్ని ఎలా అడ్డుకట్టవేయాలో రాహుల్ తన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్తో చూపించాడు. ప్రత్యక్ష యుద్ధంలోనే కాదు.. పరోక్ష యుద్ధంలో కూడా ఒక వ్యక్తి తన శక్తిని ఎలా కూడగట్టుకోవాలో రాహుల్ ఆ వీడియోలో చూపించాడు. ఇందులో ఒక నాయుకుడు మోకాళ్లపై కూర్చొని ఉండగా, కొంతమంది నాయకులు సమూహం వచ్చి వరుసగా నిల్చొని అతన్ని నెట్టే యత్నం చేస్తారు. అక్కడ సమూహంగా వచ్చిన వారికి, సింగిల్ ఉన్న వ్యక్తికి ఉన్న పోటీ పెట్టాడు రాహుల్. కానీ మోకాళ్లపై కూర్చొన్న వ్యక్తి వాళ్లను నిలువరిస్తాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా బీజేపీ-ఆర్ఎస్ఎస్ల నుంచి వచ్చే ఎదురుదాడులను ఇలానే ఎదుర్కోవాలని చెప్పే యత్నం చేశాడు. ఇదే తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు రాహుల్. దీనిపై ఇప్పుడు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ వీడియోను షేర్ చేస్తూ రాహుల్పై జోక్లు వేస్తున్నారు. ‘ హే రాహుల్.. నువ్వు టెక్నిక్స్ చెప్పావ్ కానీ నువ్వు ప్రత్యక్షంగా పాల్గొనలేదే. నువ్వు లేకుండా మేము ఏం చెయ్యాలి’ అని బీజేపీ నేత అమిత్ మాలవియా ఆ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను మిగతా బీజేపీ నేతలు కూడా షేర్ చేస్తూ జోక్లు వేస్తున్నారు. జపాన్ మార్షల్ ఆర్ట్ ఆకిడోలో బ్లాక్ బెల్ట్ పొందిన రాహుల్.. తన జోడోయాత్రలో ఆ టెక్నిక్స్ను సమయం వచ్చినప్పుడుల్లా వినియోగించడం గమనార్హం. Oh Rahul! What will we do without you? pic.twitter.com/hlFWQeQdTX — Amit Malviya (@amitmalviya) November 26, 2022 -
జోడో యాత్రలో రాహుల్ బైక్ రైడ్.. వీడియో వైరల్
కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ మధ్యప్రదేశ్లో బైక్ రైడ్తో సందడి చేశారు. ఈ మేరకు ఆయన హెల్మట్ ధరించి భద్రతా సిబ్బంది నడుమ బ్లూ కార్పెట్పై బైక్తో రైడ్ చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ జంతు సంరక్షణ గురించి చర్చించాలనుకున్నఇద్దరు రైడర్లు రజత్ పరాశర్, సార్థక్లను కలిశారు. ఈ క్రమంలో ఒక రైడర్ మాట్లాడుతూ...రాహుల్గాంధీ అద్భుతమైన వ్యక్తి, అతనిని కలిసినప్పటి నుంచి అతనిపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఆయన జంతు ప్రేమికుడు అని తెలుసు. అందువల్లే రాహుల్ని కలిసి రోడ్లపై జంతు మరణాలపై చర్చించాలనుకుంటున్నాను అని గాల్వియర్కి చెందిన సివిల్ ఇంజనీర్ రజత్ అన్నారు. రజత్ వీధి కుక్కల సంరక్షణ భాద్యతను చేపట్టిన జంతు ప్రేమికుడు. ఈ జోడో యాత్రలో 10 నెలల జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన మార్వెల్ అనే కుక్క కూడా రాహుల్తో కలిసి పాల్గొని సందడి చేసింది. రాహుల్ కూడా సదరు జంతుకు ప్రేమికులని, ఆ కుక్కను తన యాత్రలో పాల్గోనమంటూ ఆహ్వానించారు. తన మార్కెల్కు ఈ యాత్ర కోసం శిక్షణ ఇచ్చానని, అది తన బైక్ వెనుక సీటులో ఊయల మాదిరిగా సెటప్ చేసిన దాంట్లో సౌకర్యవంతంగా కూర్చొని ఈ యాత్రలో పాల్గొంటుందని చెప్పారు జంతు ప్రేమికుడు రజత్. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో సుమారు 3500 కి.మీ పాదయాత్ర సెప్టెంబర్లో తమిళనాడు నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది దాదాపుగా సగం యాత్ర పూర్తిచేసుకోవడమే గాక ఈ యాత్ర జనవరిలో ముగియనుంది. Watch: Rahul Gandhi's Bike Ride During #BharatJodoYatra In Madhya Pradesh https://t.co/q3qbFKbWh2 pic.twitter.com/yivEsNICea— NDTV (@ndtv) November 27, 2022 (చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్) -
బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటి వరకు అయిదు రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రోజుకీ సగటున 20-25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. భిన్న నేపథ్యాలు, భిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం 12 రాష్ట్రల్లో యాత్ర కొనసాగనుంది. 150 రోజుల్లో ఆయన 3,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు పాల్గొని జోడో యాత్రలో జోష్ నింపుతున్నారు. వీరే కాక వేలాది మంది విద్యార్థులు, యువత, మధ్య వయస్కులు, మహిళలు, ఉద్యమకారులు.. ఇలా ఎందరో రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఒలంపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ జోడో యాత్రలో జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో కాంగ్రెస్ నాయకుడితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్తో మాట్లాడుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో ఇద్దరూ హర్యాన్వీ స్టైల్లో తమ మీసాలు తిప్పారు. బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్లు కూడా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహుల్, విజేందర్ సింగ్తో పాటు పక్కన ప్రియాంక కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है। शुक्रिया आपका...🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9 — Congress (@INCIndia) November 25, 2022 హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఒలింపిక్స్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్గా నలిచారు. కామన్వెల్త్ గేమ్స్లో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ బాక్సర్గా రాణిస్తూ అనేక దేశాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు. -
భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా?
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందకు సంబంధించిన ఓ వీడియోనూ ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ వీడియోను మొదట మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసిందని, కానీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు గమనించాక వెంటనే దాన్ని డిలీట్ చేసిందని మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని విమర్శలు గుప్పించారు. After Richa Chaddha’s public application to join Rahul Gandhi’s Bharat “Jodo” Yatra, “Pakistan Zindabad” (listen towards the end of the video) slogans raised in Khargon. INC MP posted the video and then deleted it after the faux pas came to light. This is Congress’s truth… pic.twitter.com/ZkVEkd4pCf — Amit Malviya (@amitmalviya) November 25, 2022 అయితే మాలవీయ ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఖండించారు. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోనూ షేర్ చేసి తమపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. A video doctored by the Dirty Tricks Department of the BJP is doing the rounds to discredit the highly successful #BharatJodoYatra. We are taking the necessary legal action immediately. We are prepared for such tactics, and there will be payback. — Jairam Ramesh (@Jairam_Ramesh) November 25, 2022 ఈ విషయంపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోకి ప్రవేశిస్తుంది. చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం.. -
కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయి.. రాహుల్ ఆసక్తికర ట్వీట్
భోపాల్: భారత్ జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రోహిన్తో కలిసి గురువారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. చెల్లెలితో కలిసి నడుస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసిన రాహుల్.. ''మనం కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయంటూ'' పేర్కొన్నారు. ప్రియాంక వాద్రా భారత్ జోడోలో పాల్గొనడం ఇదే తొలిసారి. సోనియాగాంధీ కర్ణాటకలో రాహుల్తో కలిసి నడిశారు. रास्तों से लड़कर हमने कई मुक़ाम बनाए हैं। साथ हैं तो यकीन है, मंज़िल ज़रूर पाएंगे। pic.twitter.com/hDuIdsVoNr — Rahul Gandhi (@RahulGandhi) November 24, 2022 సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర.. నవంబర్ 23న మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఐదు లోక్సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదకొండు రోజులపాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. చదవండి: (కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య) -
‘రాహుల్ గాంధీ.. ఇరాక్ సద్దాం హుస్సేన్లా ఉన్నారు’
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేల పొలిటికల్ లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. అధికార బీజేపీ మరోసారి అధికారం కోసం సరికొత్త ప్రచారంతో ముందుకు సాగుతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్తో పోల్చారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల పద్ధతులు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంస్కృతులను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు అని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరడానికి బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ డబ్బు చెల్లించిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, అంతుకుముందు కూడా హిమంత.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్కు ఓటు వేసిన వ్యక్తులు త్వరలో బీజేపీలో చేరుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా గడ్డం పెంచుకున్నప్పుడు ఆయనపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే, మేము నిజమైన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాము. అసలు విషయాలను పక్కదారి పట్టించడం బీజేపీ నేతలకు మాములే అంటూ ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందని అన్నారు. Rahul Gandhi looks like Saddam Hussein, says Assam CM Himanta Sarma#RahulGandhi #SaddamHussein #HimantaBiswaSarma #Congress #BJP #Gujarat #BharatJodoYatra https://t.co/u0Of4sOXXn — NewsDrum (@thenewsdrum) November 23, 2022 -
భారత్ జోడో యాత్రిలతో దిగ్విజయ్ సింగ్ డ్యాన్స్
-
Gujarat Assembly Election 2022: అధికారం కోసమే జోడో యాత్ర
సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అధికారం కోల్పోయినవారు మళ్లీ గద్దెనెక్కడానికి పాదయాత్ర సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిని చాలా ఏళ్ల క్రితమే ప్రజలు గద్దెదింపారని చెప్పారు. మోదీ సోమవారం గుజరాత్లోని సురేంద్రనగర్, నవసారి, జంబూసార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా, తన(మోదీ) ఔకత్(స్థాయి) ఏథమిటో బయటపెడతామని సవాళ్లు విసురుతున్నారని ఆక్షేపించారు. వారి ఆహంకారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వారు(కాంగ్రెస్ పెద్దలు) రాజకుటుంబం నుంచి వచ్చారని, తాను కేవలం ఒక సేవకుడినని, తనకు పెద్ద స్థాయి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు గతంలో తనను దిగజారుడు భాషలో దూషించారని గుర్తుచేశారు. స్థాయిల సంగతి పక్కనపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుందామని ప్రతిపక్షానికి హితవు పలికారు. తన దృష్టి మొత్తం దేశ ప్రగతి పైనే ఉందని.. అవమానాలు, దూషణలను జీర్ణించుకుంటానని చెప్పారు. గుజరాత్ ఉప్పు తింటూ అవమానిస్తున్నారు నర్మదా ప్రాజెక్టును అడ్డుకొని, గుజరాత్ గొంతెండిపోయేలా చేసినవారిని పక్కన పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. నర్మదా ప్రాజెక్టును వ్యతిరేకించిన వారికి గుజరాత్ ప్రజలు బుద్ధిచెప్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అప్పట్లోనే తాను గట్టిగా వాదించానని, ఇప్పుడు ఈ లాభాలు కళ్లముందే కనిపిస్తున్నాయని వివరించారు. పాదయాత్ర చేస్తున్న వారికి వేరుశనగ పంటకు, పత్తి పంటకు మధ్య తేడా తెలియదని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు గుజరాత్లో తయారవుతున్న ఉప్పు తింటూ గుజరాత్నే అవమానిస్తున్నారని తప్పుపట్టారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఉప్పులో గుజరాత్ వాటా 80 శాతం ఉందని గుర్తుచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కొన్ని స్థానాల్లో గెలిపించడం ద్వారా సురేంద్రనగర్ జిల్లా ప్రజలు పొరపాటు చేశారని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. -
రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కటీఫ్ లేనట్టే?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది. సోమవారం ట్వీట్ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. pic.twitter.com/FpaxllR7jk — Sanjay Raut (@rautsanjay61) November 21, 2022 చదవండి: మెగాస్టార్పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్ చేసిన మోదీ -
రాహుల్ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్ అగాడీకి బీటలు?
ముంబై: వీర సావర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గురువారం సావర్కర్పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత అరవింద్ సావంత్ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్ వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా శనివారం అభిప్రాయపడ్డారు. అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్ వారి నుంచి సావర్కర్ రూ.60 పెన్షన్ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్కు సావర్కర్పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్కు తక్షణం గుడ్బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్సాహెబ్ దన్వే శనివారం డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు. -
నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు
-
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు
ఇండోర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాపు ముందు ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్లో అడుగు పెట్టగానే బాంబులేసి చంపేస్తామని లేఖలో ఉంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఈ లేఖ ఎవరి పని అయి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిపై తీవ్ర అభియోగాలు మోపి విచారణ చేపట్టారు. వీర్ సావర్కర్ ప్రాణభయంతో బ్రిటిషర్లను క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన తరుణంలో ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం యాత్రలో మహాత్మ గాంధీ మునివనవడు తుషార్ గాంధీ.. రాహుల్తో పాటు పాదయత్రలో పాల్గొన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్లోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు మహారాష్ట్రలో కేసు పెట్టారు. స్వతంత్ర సమరయోధుడైన తన తాతను రాహుల్ అమమానించారని మండిపడ్డారు. చదవండి: నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్ -
నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్
ముంబై: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోని ప్రముఖులు ఈ జోడో యాత్రలో పాల్గొని ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక రాహుల్ ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రాహుల్ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షెగావ్కి చేరుకోగానే మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ షెగావ్లోని భారత్ జోడో యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం అనేది ఒక చారిత్రత్మకమని ప్రశంసించింది. రచయిత, కార్యకర్త అయిన తుషార్ గాంధీ రాహుల్ గాంధీతో ఈ యాత్రలో హుషార్గా పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీల ముని వనవళ్లు ఈ యాత్రలో కలిసి నడవడం అత్యద్భుతమని, ఇద్దరు దివగంత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులగా అభివర్ణించింది. ఈ యాత్రలో తుషార్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, దీపేందర్ హుడా, మిలిందా దేవదా, మాణిక్ ఠాక్రే, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తాప్, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలే తదితరలు రాహుల్ వెంట నడిచారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Rahul Gandhi Ji resumes his Padyatra with massive crowds from Akola, Maharashtra. Mahatma Gandhi's great-grandson @TusharG Ji joins #BharatJodoYatra. The Yatra is heading to Shegaon. pic.twitter.com/QRmnkTeMXs — Madhu (@Vignesh_TMV) November 18, 2022 ఈ మేరకు తుషార్ గాంధీ ట్విట్టర్లో ...షేగావ్ తన జన్మస్థం అని, జనవరి 17, 1960న తన అమ్మ వయా నాగ్పూర్ హౌరా మెయిల్లో ప్రయాణిస్తున్నప్పుడూ షేగావ్లో ఆగిపోయిందని అప్పుడే తాను పుట్టానని చెప్పుకొచ్చారు. ఈ సాయంత్రం షెగావ్లో జరిగే బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో చివరి దశలో ఉంది. నవంబర్ 20కల్లా మధ్యప్రదేశ్లో ప్రవేశించనుంది. తుషార్గాంధీ అరుణ్మణిలాల్ గాంధీ తనయుడు. అరుణ్ మణిలాల్ గాంధీ.. గాంధీ-కస్తూరబా గాంధీల రెండో సంతానం అయిన మణిలాల్ మోహన్ దాస్ తనయుడు. (చదవండి: రాహుల్ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్.. ఫోటోలు, వీడియోలు వైరల్) -
రాహుల్ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్.. ఫోటోలు, వీడియోలు వైరల్
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారంతో 71వ రోజుకి చేరింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. రాహుల్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు సైతం యాత్రలో పాల్లొంటున్నారు. జోడో యాత్ర అకోలా నగరంలో కొనసాగుతున్న సందర్భంగా బాలీవుడ్ నటి రియా సేన్ రాహుల్ గాంధీతో జాయిన్ అయ్యారు. రాహుల్తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచారు.రాహుల్, రియా సేన్ కలిసి నడుస్తున్న ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు రియా సైతం రాహుల్ని కలిసిన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. సినీ నటిగా మాత్రమే కాకుండా గర్వించదగిన పౌరుడిగా ఈ యాత్రలో భాగమైనందుకు సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. #BharatJodoYatra में शामिल हुई अभिनेत्री रिया सेन। अब सड़कें इंक़लाब की गवाह बन रही है। pic.twitter.com/U1PJ3ouRh4 — Congress (@INCIndia) November 17, 2022 కాగా రియా.. ఝంకార్ బీట్స్, నౌకదుబి వంటి సినిమాలతో పాపులారిటీ సాధించారు. ఇంతకుముందు నటి పూజాభట్ రాహుల్ గాంధీకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్లో జోడో యాత్ర కొనసాగిన క్రమంలో రాహుల్తో కలిసి నడిచారు. ఇక సెప్టెంబర్ 7న బారత్ జోడో యాత్ర పేరుతో కన్యకుమారి నుంచి రాహుల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 9న నందేడ్ జిల్లా ద్వారా మహారాష్ట్రలోకి ప్రవేశించింది. लोग जुड़ रहे हैं...डर मिट रहा है...नया सूरज उगने ही वाला है। आज #BharatJodoYatra में अभिनेत्री रिया सेन शामिल हुईं। pic.twitter.com/1XSFtXBAQj — Congress (@INCIndia) November 17, 2022 -
ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్
ముంబై: వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి. అయితే గురువారం మరోమారు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యముంటే తాను చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆపాలని సవాల్ విసిరారు. ఈ పాదయాత్రలో భాగంగా అకోలా జిల్లాలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇది సావర్కర్ విజన్కు, మహాత్మగాంధీ విజన్కు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ విషయంపై చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. మా పార్టీలో నియంతలు లేరు. అని రాహుల్ పేర్కొన్నారు. అలాగే క్షమాభిక్ష కోసం బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖ ప్రతులను రాహుల్ ఆధారంగా చూపారు. ఆయన బ్రిటిషర్లకు భయపడే ప్రాణభిక్ష ప్రసాదించాలని లేఖ రాశారని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్పై రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. హిందుత్వ సిద్ధాంతాలను అమమానిస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. సావర్కర్ను అవమానించేలా మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు. ఉద్ధమ్ థాక్రే కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పదించారు. వీర్ సావర్కర్ అంటే తమ పార్టీకి అపార గౌరవం అని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తాము ధ్రువీకరించబోమని చెప్పారు. మంగళవారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ల చిహ్నం అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండు మూడేళ్లు అండమాన్ జైళ్లో ఉండగానే.. క్షమాభిక్ష ప్రసాదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి దారితీశాయి. చదవండి: అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం -
తెలంగాణలో జోడో తెచ్చిన మార్పేమైనా ఉందా! కాంగ్రెస్ పరిస్థితేంటీ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారు, వెళ్లారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. మహారాష్ట్రలో వెళ్లిపోయింది. ఇంతకీ 12 రోజుల పాటు రాహుల్ తెలంగాణలో గమనించిన అంశాలేంటీ? తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించారా? ఆయన నడుస్తున్న సమయంలో వచ్చిన మునుగోడు షాక్ ఇబ్బంది పెట్టిందా? తెలంగాణలో గ్రాండ్ ఎంట్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై.. ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తోంది. గత నెల 23న కర్నాటక నుంచి మక్తల్లోని కృష్ణా బ్రిడ్జి ద్వారా తెలంగాణలో అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల దూరం నడిచి నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రలో ప్రవేశించారాయన. మక్తల్ దగ్గర ఎంటరై.. జుక్కల్ మద్దునూర్ వద్ద రాహుల్ గాంధీకి వీడ్కోలు పలికారు. కలివిడిగా అడుగులు రాహుల్ పాద యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగిందన్నది కాంగ్రెస్ నేతల మాట. దారివెంట వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ నడిచారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ సమయంలోనూ ప్రజలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారని చెబుతున్నారు. పాదయాత్రలో రాహుల్ వెంట నడిచిన వారిలో బీడీ కార్మికులు, ఉద్యోగులు, ప్రైవేట్ సిబ్బంది, గల్ఫ్లో పని చేసే వారి కుటుంబాలు, ఇతరత్రా కలిశారు. వేర్వేరు వృత్తి కులాల కార్మికులు రాహుల్ గాంధీని కలిసారు. దారి పొడవునా రాహుల్ ప్రజలు తరలి రావడం రాహుల్లో పలుమార్లు జోష్ పెంచింది. తెలంగాణలో ఆయన ప్రధానంగా ఎంచుకున్న అంశాలు.. విద్య, వైద్యం, నిరుద్యోగం. అందుకే ఆ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత ఇమేజ్ బిల్డింగ్కు ప్రయత్నాలు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఉత్సాహ పరుస్తూ రాహుల్ ముందుకు సాగారు. గోండులు, కోయలతో కలిసి నృత్యాలు చేశారు. చర్నాకోలతో విన్యాసం చేశారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. వారు చేసిన కరాటే వంటి ప్రదర్శనలు చూసి ప్రోత్సహించారు. విద్యార్థులతో కలిసి పరుగెత్తారు. ఒగ్గు కళారూపాలు తిలకించారు. వారితో కలిసి డోలు వాయించారు. ఇలా అన్ని వర్గాలతోనూ మమేకమవుతూ రాహుల్ గాంధీ తమ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారన్నది కాంగ్రెస్ నేతల మాట. హైదరాబాద్ లో చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన స్థూపంపై రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేశారు. నెక్లెస్ రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ప్రసంగించారు. టార్గెట్ మోదీ, కేసీఆర్ తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానంగా మోదీ, కెసీఆర్లను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో సమస్యలు ఎత్తి చూపుతూ కేసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ, కేసిఆర్ ఇద్దరు మిత్రులేనని మరీ మరీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని, ధరణి వల్ల భూములు కోల్పోయిన వారి భూములు తిరిగి వారికే ఇస్తామని భరోసా ఇచ్చారు. అత్యంత కీలకమైన పొత్తుల అంశంపై ఊహాగానాలకు రాహుల్ తెర దించారు. టీఎర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. అయినను సీన్ సితారే.! రాహుల్ పర్యటనలో కొన్ని లోపాలూ ఉన్నాయి. పార్టీకి అత్యంత కీలకమైన పర్యటన అయినా.. నేతలంతా ఒక్క తాటిపై నిలబడినట్టు కనిపించలేదు. సొంతింటి అసమ్మతి రాగం ప్రతీ చోటా వినిపించింది. అలాగే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తుండగానే మునుగోడు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి ఉంటే... మొత్తం పాదయాత్రకే ఒక కొత్త జోష్ వచ్చి ఉండేది. కనీసం రెండో స్థానమైనా పరువు కాపాడుకోగలిగేది. కానీ.. వాటన్నింటికి భిన్నంగా మూడో స్థానానికి పరిమితమై.. పాదయాత్ర వేళ రాహుల్ను, కాంగ్రెస్ శ్రేణులను నిరాశకు గురి చేసింది. రాష్ట్ర సమస్యలపై రాహుల్ వేర్వేరు చోట్ల మాట్లాడినా.. దానికి కచ్చితమైన పరిష్కారాలను సూచించలేకపోయారు. తాము అధికారంలోకి వస్తే.. ఇలా చేస్తామన్న విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పించలేకపోయారు. ఎన్నికలకు ఏడాది మంది రాహుల్ కష్టపడి పాదయాత్ర చేసినా.. అది కాంగ్రెస్ను తెలంగాణలో ఎంత వరకు అధికారానికి చేరువ చేస్తుందో చెప్పలేని పరిస్థితి. -
ఇక ఎప్పటికీ యాత్ర ఆపొద్దు సార్!
మీ యాత్ర ప్రభావం మోదీ మీద బలంగా పడింది సార్.. ఇక ఎప్పటికీ యాత్ర ఆపొద్దు సార్! -
Bharat Jodo Yatra: తీవ్ర విషాదం.. పాదయాత్రలో పాల్గొని సీనియర్నేత మృతి
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మంగళవారం విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ పాండే (75) కన్నుమూశారు. నాగ్పూర్కు చెందిన కృష్ణకుమార్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్తో కలిసి పాదయాత్ర చేసే క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఈ విషయంపై జైరాం రమేశ్ మాట్లాడుతూ.. కృష్ణకుమార్ హఠాన్మరణం కలచివేసిందని అన్నారు. ‘దిగ్విజయ్ సింగ్, నాతోపాటు కృష్ణకుమమార్ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం చేత ధరించి నడిచారు. కొద్దిదూరం వెళ్లాక పక్కనున్న వ్యక్తికి జెండా అప్పగించి.. గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయింది’ అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు పాండే పార్టీ కోసం పనిచేశారని జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. (చదవండి: గుజరాత్ బీజేపీ సర్కార్పై చిదంబరం ఫైర్.. తీగల వంతెన ప్రమాదంపై సీరియస్) కాగా, కృష్ణకుమార్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి భారత్ జోడో యాత్ర జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. అక్కడ రాహుల్ గాంధీ, ఇతర నాయకులు, కార్యకర్తలు దివంగత నాయకునికి నివాళి అర్పించారు. అనంతరం తండ్రితోపాటు పాదయాత్రలో పాల్గొన్న కృష్ణకుమార్ కుమారుడు షీలాజ్ పాండేకు భౌతికకాయాన్ని అప్పగించారు. కృష్ణకుమార్ అకాల మృతిపట్ల రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబానికి కృష్ణకుమార్ మృతి ఎంతో బాధాకరమని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన చివరి క్షణాల్లో కూడా ఆయన జాతీయ జెండా మోయడం దేశ పట్ల ఆయన అంకితభావాన్ని తెలియజేస్తుందని అన్నారు. యాత్రా బృందంలో 25 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ తెలిపారు. అయితే, వయసుపైబడ్డ యాత్రికులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముందుగానే పరీక్షలు నిర్వహించి యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం సాయంత్రం జరిగే సభ.. పాండే సంస్మరణ సభగా జరుపుతామని వెల్లడించారు. (చదవండి: ప్రజల్ని కలుస్తూ.. సమస్యలు వింటూ..) कांग्रेस सेवा दल के महासचिव, कृष्णकांत पांडे जी का निधन पूरे कांग्रेस परिवार के लिए बहुत दुःखद है। उनके प्रियजनों को मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। आज, यात्रा के दौरान अंतिम समय में उन्होंने हाथों में तिरंगा थामा था। देश के लिए उनका समर्पण हमें सदा प्रेरणा देता रहेगा। pic.twitter.com/VvC1O5ZJfh — Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022 -
ప్రజల్ని కలుస్తూ.. సమస్యలు వింటూ..
సాక్షి, హైదరాబాద్: దేశ ఐక్యత, సమగ్రతే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో సోమవారంతో ముగిసింది. గత నెల 23న రాష్ట్రంలోకి ప్రవేశించిన రాహుల్... 12 రోజులపాటు 375 కిలోమీటర్ల మేర నడిచారు. మొత్తం 8 జిల్లాలు, 7 లోక్సభ స్థానాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేశారు. సోమవారం రాత్రి రాహుల్ మహారాష్ట్రలోకి ప్రవేశించేసరికి ఆయన యాత్ర చేపట్టి 60 రోజులు పూర్తయింది. ఆప్యాయత, ఉత్సాహాన్ని జోడించి.. రాష్ట్రంలో రాహుల్గాంధీ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహరిచే విధంగా సాగింది. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని గూడేబల్లూరు గ్రామ సరిహద్దులో కృష్ణా నది వంతెనపై యాత్ర ప్రారంభమైన నాటి నుంచి రాహుల్ ఉల్లాసంగా ముందుకు సాగారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనతో కలసి నడిచారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు వింటూ ముందుకు కదిలారు. భోజన విరామ సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా యాత్రలో ప్రదర్శించిన కళారూపాలను ఆస్వాదించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్లోకి ప్రవేశించిన రాహుల్.. చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తన తండ్రి రాజీవ్ గాంధీ గతంలో చేపట్టిన సద్భావన యాత్రను గుర్తుకు తెచ్చారు. ఆ తర్వాత నాయనమ్మ ఇందిరాగాంధీ విగ్రహం సాక్షిగా నెక్లెస్రోడ్డులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లాలోకి భారీ జనసందోహంతో యాత్ర ప్రవేశించగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆంథోల్, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ ఉత్సాహంగా సాగిన యాత్ర.. మేనూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభతో ముగిసింది. రాష్ట్ర సరిహద్దులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలేకు త్రివర్ణ పతాకాన్ని అప్పగించారు. డగ్లేర్ ప్రాంతంలో రాహుల్ యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. బీజేపీ, టీఆర్ఎస్లపై విమర్శనాస్త్రాలు.. షెడ్యూల్ ప్రకారం 16 రోజుల పాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర జరగ్గా, నాలుగు రోజుల విరామం తీసుకున్న రాహుల్గాంధీ 12 రోజుల పాటు నడిచి 10 కార్నర్ మీటింగ్లలో ప్రసంగించారు. మేనూరు వద్ద ఏర్పాటు చేసిన వీడ్కోలు బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. రాహుల్ ప్రసంగాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకొనే సాగాయి. జాతీయ స్థాయిలో బీజేపీ మతం పేరుతో ప్రేరేపిస్తున్న విద్వేషం గురించి, దేశాన్ని వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత మంది బడా వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్న విధానం, ప్రైవేటీకరణ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటోందని, అవినీతికి పాల్పడుతోందని, అన్ని అంశాల్లో బీజేపీకి మద్దతిస్తోందని, ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని కూడా చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్ల మధ్య డైరెక్ట్లైన్ ఉందని, వారు రోజూ మాట్లాడుకుంటారని చెప్పే ప్రయత్నం చేశారు. మేనూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో తెలంగాణ స్ఫూర్తిని సోదాహరణంగా వివరించిన రాహుల్ తెలంగాణ గొంతును ఎవరూ అణచలేరని, ఎవరైనా తెలంగాణ డిమాండ్లను వినాల్సిందేనని వెల్లడించారు. తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తితో అనేక అంశాలు నేర్చుకున్నానని చెప్పిన రాహుల్ తెలంగాణను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తన యాత్రలో భాగంగా చేసిన ప్రసంగాల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా కల్పించారు. రాహుల్ పాదయాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, దిగ్విజయ్సింగ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, దామోదర రాజనర్సింహ, టి. జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, మహేశ్కుమార్గౌడ్, గాలి అనిల్కుమార్, జెట్టి కుసుమ కుమార్, బోరెడ్డి అయో«ధ్యరెడ్డి, కొమ్మూరి ప్రతాప్రెడ్డిలతోపాటు అన్ని జిల్లాల పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. -
తెలంగాణ గొంతు నొక్కలేరు
సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణ సమాజంలో ప్రశ్నించేతత్వం, ఎదిరించేశక్తి ఉన్నాయి. పసిపిల్లాడు కూడా నిలదీస్తాడు. తెలంగాణ గొంతును ఎవరూ నొక్కలేరు. ఎవరూ అణచివేయలేరు. దేశానికి ధైర్యాన్ని, శక్తిని అందించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. ఈ శక్తి దేశానికి ఎంతో అవసరం. తెలంగాణలో పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. తెలంగాణను వదిలివెళుతున్నందుకు బాధగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది’అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో చివరి రోజైన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాహల్ ప్రసంగించారు. సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, మ«దుయాష్కీ, సంపత్ కుమార్, వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, గంగారాం, సుదర్శన్రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడా... రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో గంటలకొద్దీ మాట్లాడానని రాహుల్ గాంధీ చెప్పారు. బంగారు తెలంగాణ అనే వాగ్దానం కేవలం నోటిమాటగానే మిగిలిపోయిందని వారంతా పేర్కొన్నారని... వారి ఆశలు, కలలు ఎలా ఆవిరయ్యాయో, భవిష్యత్తు ఎలా ప్రశ్నార్థకంగా మారిందో ఆవేదనతో తనకు వివరించారన్నారు. పాదయాత్రలో ఓ చిన్నారి ఒంటరిగా వచ్చి తనను కలిశాడని.. తండ్రి డెంగీతో బాధపడుతుండటం వల్ల వెంట రాలేకపోయినట్లు ఆ పిల్లాడు చెప్పాడన్నారు. దీంతో చిన్నారి తండ్రికి వైద్యం చేయించాలని తన సిబ్బందిని పురమాయించినట్లు రాహుల్ వివరించారు. తెలంగాణలో పేదోడికి వైద్యం అందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. అలాగే ఆ పిల్లాడు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులు కట్టలేక చదువు మానేసే పరిస్థితి ఉందన్నారు. పేద పిల్లలు చదువుకోలేక, పేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తెలంగాణ ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణ కలలను టీఆర్ఎస్ పాలకులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ భూములను లాక్కుంటున్నరు దళితులు, గిరిజనులకు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల నుంచి లాక్కున్న భూములను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి ఇస్తామన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. మోదీ, కేసీఆర్ కలిసే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పేదలు, రైతుల, సామాన్యుల ఆస్తులను లాక్కొని వ్యాపారవేత్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం కేసీఆర్ కక్కుర్తి... సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని, రాత్రిపూట ధరణి పోర్టల్ను తెరిచి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలకు భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల కలలను నాశనం చేశాడన్నారు. ఇదో మరుపురాని ఘట్టం.. రాష్ట్రంలో పాదయాత్ర తనకు మరపురాని ఘట్టమని, ప్రజలు అందించిన ప్రేమానురాగాలు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు తనలో కొత్త శక్తిని ఇచ్చాయన్నారు. ప్రజల నవ్వులు, కన్నీళ్లను తన మనసులో నింపుకుని ముందుకు సాగుతానన్నారు. సాంస్కృతికంగా తనకు కలిగిన విశిష్ట అనుభూతి, అనుభవాన్ని సదా స్మరించుకుంటానన్నారు. డప్పు వాయిద్యాల కోలాహలం, బోనాల సందడి, కొమ్ము, ధింసా నృత్యాలు తనకెంతో ఆనందాన్ని పంచాయన్నారు. అలాగే టీ కాంగ్రెస్ కార్యకర్తలు అందించిన స్ఫూర్తిని ఎన్నడూ మరచిపోనని రాహుల్ పేర్కొన్నారు. కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. కాగడాలతో ర్యాలీగా వెళ్తున్న రాహుల్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు -
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు బూస్టర్డోస్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి బూస్టర్ డోస్లా పనిచేస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త మార్గాన్ని చూపుతుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాహుల్గాంధీ వెంట యాత్రలో పాల్గొన్న ఆయన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతం అవుతోందని, అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎంతో అవసరమని రమేశ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్డౌన్ ప్రారంభమైందని, ఈ రెండు ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎంఐఎం, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, బీజేపీని గద్దెదించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాహుల్ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర ఎన్నికల యాత్ర కాదని రమేశ్ స్పష్టం చేశారు. -
రైతుల కష్టాలపై కేసీఆర్ నిర్లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/జోగిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు రాష్ట్రంలో రైతుల గోడు ఏమాత్రం పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. నిత్యం రైతులతో మమేకమై వారి సంక్షేమం కోసం పనిచేయాల్సిన కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములు ఎలా లాక్కోవాలో చూస్తున్నారని, దళితులు, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, రైతులకు వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు కేసీఆర్ మద్దతు పలికారని పునరుద్ఘాటించారు. ఉద్యోగాలిచ్చే, ఉపాధి అవకాశాలను కల్పించే రంగాలను మోదీ, కేసీఆర్లు కలిసి నిర్వీర్యం చేశారని విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శనివారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పెద్దపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు, జీఎస్టీతో కుదేలు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో చిరు వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు కుదేలయ్యాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీహెచ్ఈఎల్, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్న మోదీ బడా పారిశ్రామిక వేత్తలకు, బడా వ్యాపా రులకు మేలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ పాలనలో దేశం, రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని చెప్పారు. సిలిండర్ ధర రూ.400 ఉందంటూ అప్పట్లో విమర్శించిన మోదీ.. ఇప్పుడు దాని ధర రూ.1,000 దాటినా, పెట్రోల్ ధర రూ.వంద దాటినా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల మాట వినాలి బహిరంగ సభ వేదికపై నాగిరెడ్డి అనే రైతుతో రాహుల్ మాట్లాడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం చేస్తోందని నాగిరెడ్డి అన్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాల సబ్సిడీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, జీఎస్టీతో ఎరువుల ధరలు పెరిగాయని, ధాన్యానికి మద్దతు ధర అందడం లేదని చెప్పారు. రాహుల్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.. నాగిరెడ్డి వంటి రైతుల మాట వింటే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, జీవన్రెడ్డి, వంశీచంద్రెడ్డి, శ్రీధర్బాబు తదితరులు సభలో పాల్గొన్నారు. రాహుల్ను కలిసిన మునుగోడు నాయకులు.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున పనిచేసిన పార్టీ ముఖ్య నేతలు శనివారం రాహుల్గాంధీని కలిశారు. యాత్ర విరామ సమయంలో వారితో రాహుల్ సమావేశమయ్యారు. మండల ఇన్చార్జీలతో ఫొటోలు దిగారు. వృద్ధులతో ఆప్యాయంగా.. చౌటకూర్ నుంచి దానంపల్లి వరకు నిర్వహించిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్గాంధీ.. వృద్ధులను ఆప్యాయంగా పలకరించడం, రోడ్డుపైనే ఫుట్బాల్ ఆడడం, గీత కార్మికుడు వినియోగించే లొట్టి, మోకు ధరించడం, కుండల తయారీలో పాలు పంచుకోవడం, కళాకారులతో ముచ్చడించడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
రాహుల్ పాదయాత్రలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు!
దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రలో టీకాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. ఇక, కర్నాటకలో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోకు కేజీఎఫ్-2 పాటను కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు. దీంతో, తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. అయితే, కర్నాటకలో రాహుల్ జోడోయాత్ర సందర్భంగా పాదయాత్ర ఫొటోలకు బ్యాక్ గ్రౌండ్గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్ఆర్టీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్, జైరామ్ రమేశ్పై కేసు పెట్టింది. आओ, तुम्हें 'सपनों के भारत' की ओर लेकर चलें...#BharatJodoYatra pic.twitter.com/4sZinLl8sS — Congress (@INCIndia) October 11, 2022 -
Bharat Jodo Yatra: రాహుల్కు గుర్తుండిపోయేలా..!
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 12 రోజుల పాదయాత్ర ముగించుకుని మహారాష్ట్రకు వెళ్లనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలకాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈనెల 7వ తేదీన రాహుల్ రాష్ట్ర సరిహద్దు దాటి డెగ్లూరు వద్ద మహారాష్ట్రలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సరిహద్దు గ్రామం మెనూరులో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. యాత్ర తెలంగాణలో ప్రవేశించిన సమయంలో కర్ణాటక సరిహద్దులో పెద్ద ఎత్తున జనం స్వాగతం పలికిన విధంగానే వెళ్లేటప్పుడు కూడా మహారాష్ట్ర సరిహద్దులో భారీయెత్తున ప్రజలతో వీడ్కోలు పలకాలని, రాహుల్గాంధీకి గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. 6న కార్నర్ సభ ఉండదు 7వ తేదీన మెనూరులో నిర్వహించనున్న బహిరంగ సభ, మిగతా మూడురోజుల పాటు జరిగే పాదయాత్రను విజయవంతం చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. జోడో యాత్ర మక్తల్లో అడుగుపెట్టినప్పటి నుంచీ రాహుల్గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని, మునుగోడులో ఉప ఎన్నికలు ఉన్నప్పటికీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ నేతలు పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేశారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రేవంత్ మాట్లాడుతూ..ఆరో తేదీన ఎలాంటి కార్నర్ మీటింగ్ ఉండదని, ఏడో తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆ నియోజకవర్గాల నేతలకు అవకాశం ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదని, ఈ మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు పాల్గొనాలని రేవంత్ సూచించారు. అదే విధంగా 7వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల లోపే బహిరంగ సభను పూర్తి చేసుకోవాలని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలను ఈ సభకు తీసుకురావాలని చెప్పారు. 7వ తేదీన రాత్రి 9:30 గంటల సమయంలో రాహుల్గాంధీని మహారాష్ట్ర నేతలకు అప్పగిస్తామన్నారు. రాహుల్ పాదయాత్ర సమయంలో కవరేజీ రాకుండా కొన్ని అంశాలను తెరపైకి తేవడం ద్వారా కొందరు కుట్ర చేసినప్పటికీ, పత్రికలు, మీడియా మంచి కవరేజీయే ఇచ్చాయంటూ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని స్థానిక నేతలతో కలిసి రేవంత్ పరిశీలించారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లి రూట్ను కూడా పరిశీలించారు. స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. విశ్రాంతి..అటవిడుపు శుక్రవారం పాదయాత్రలో విరామం తీసుకున్న రాహుల్గాంధీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను బస చేసిన గుడారంలోనే ఉన్నారు. సాయంత్రం బయటకు వచ్చిన ఆయన.. ఆ సమయంలో తనతో పాటు దేశమంతా కలిసి నడుస్తున్న భారత యాత్రీలు ఫుట్బాల్, క్రికెట్ ఆడుతుండడంతో కొంతసేపు ఆ మ్యాచ్లు చూశారు. వారిని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత మళ్లీ తన గుడారంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పనిచేసిన నాయకులు శుక్రవారం రాహుల్గాంధీని కలిసేలా షెడ్యూల్ ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. -
రాహుల్... భారతీయాత్మ ఇదీ!
భారతదేశం వివిధ భాషలు, ఆహార– ఆహార్యాలు, ప్రాంతాలు, కుల – మత – వర్గాలు, సంస్కృతీ సంప్రదాయాల సంగమస్థలి. భారతీ యాత్మకు ఇదే నిదర్శనం. భారత్పై దండయాత్రలు చేసిన విదేశీయ శక్తులన్నీ ఈ వైవిధ్యాన్ని ఉపయో గించుకొని, విభజించి పాలించు విధానం ద్వారానే ఆధిపత్యం చలాయించాయి. ఆనాటి దురాక్రమణ దారులే కాదు, ఇప్పటి కొన్ని విదేశీ శక్తులు సైతం ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే దుర్బుద్ధితో ప్రజల మధ్య విభేదాలు రాజేస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం అనేక రాజకీయ పార్టీలు తమ కంటూ ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయాలనే అనుసరించాయి, నేటికీ అనుస రిస్తున్నాయి. మన దేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. దేశ విభిన్నత్వాన్ని కాపాడుతూనే సమైక్యతకు పాటుపడేవారు ఒకరకం. జాతీయ సమైక్యతా భావనను తుంగలో తొక్కి విభేదాలను విద్వేషాల స్థాయికి తీసుకెళ్లి, పబ్బం గడుపుకొనేవారు రెండోరకం. లక్షలాది భారతీయుల ఉచకోతకు, కోట్లాది మంది నిరాశ్రయులు కావడానికి దారితీసిన దేశ విభజన వంటి విషాద ఘటనల నుంచి వారింకా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. నేర్చుకోరు. కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ రెండో తరహా నాయకుల కోవకు చెందినవారు. కుటుంబ పాలన నిలబెట్టుకోవడానికి తన పార్టీ ఇన్నాళ్లూ అనుసరిస్తూ వచ్చిన విధానానికి భిన్నమైన రీతిలో ఆయన పాదయాత్ర చేపట్టారు. దేశ విభజనకు కారణమైన వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో ఇప్పుడు సాగుతున్న నాటకానికి సూత్రధారి కావడమే విచిత్రం, విస్మయకరం. దేశాన్ని కలిపి ఉంచుతున్నది ఏమిటో, ఎందుకో – రాహుల్ గాంధీకి పట్టదు, పట్టింపు లేదు. ఆయన ముత్తాత, దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వేసిన బాటలోనే ఆయన పయనిస్తున్నారు. దేశాన్ని ఒకటి చేస్తున్న దేమిటో తెలుసుకోవడానికి, కనీసం అర్థం చేసుకోవడానికీ ఆనాడు నెహ్రూ ప్రయత్నించలేదు. ‘‘ఏదో వారిని (ప్రజల్ని) కలిపి ఉంచుతోంది. భారత్ విభిన్న నైసర్గిక, ఆర్థిక, సాంస్కృతిక స్వరూప – స్వభావాలు కలిగి ఉన్నది. అనేక వైరుధ్యాలు! అయినప్పటికీ – ఏవో తెలియని గట్టి బంధాలు వారందరినీ కలిపి ఉంచుతున్నాయి’’ – అని స్వాతంత్య్రానికి ఏడాది ముందు ప్రచురించిన ‘ద డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, జవహర్లాల్ నెహ్రూ చేసిన తీవ్ర తప్పిదాలకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఆయన, ఆయన వారసులు తీసుకున్న అనేక చర్యలు దేశంలో విభజన బీజాలే నాటాయి. దేశాన్ని కలిపి ఉంచుతున్న బలమైన బంధం ఏమిటన్నది నెహ్రూకు అర్థంగాక పోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఆరని కుంపటి అయ్యింది. భారతీయత కన్నా ఒక మతమే మిన్న అనీ, దేశ భిన్నత్వాన్ని కాపాడాలంటే ఆ మతానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న దురవగాహనే వారిని ముందుకు నడిపింది, దేశాన్ని వెనక్కి నడిపింది. ఆ దరవ గాహనతోనే నెహ్రు, కశ్మీర్ సమస్యను అంత ర్జాతీయం చేశారు. ఎనిమిదేళ్లనాడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేదాకా – కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం కరాళ నృత్యం చేసింది. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తçప్పులు చేసినందువల్లే రెండు మత వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. దాని ఓటుబ్యాంకు రాజకీయాలతో సమస్య ముదిరింది. ఇందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్దే. ఈ బాధ్యతను అది స్వీక రిస్తుందా? ఇది జోడోనా లేక తోడోనా? నెహ్రూ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరంకుశ నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించడానికి సర్దార్ పటేల్ గట్టి చర్యలు చేపట్టకపోయి ఉంటే... దేశం మధ్యలో తెలంగాణ మరో అగ్ని గుండమయ్యేది. రాహుల్ కుటుంబ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రజల మధ్య కులమతాలు, ప్రాంతాలు, భాషలంటూ విభజన రేఖలు గీసింది. మహిళల అభ్యున్నతి గురించి రాహుల్ తరచూ మాట్లాడుతుంటారు. ఇతర మతాలకు చెందిన మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకూ హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు – రాహుల్ తండ్రి, అప్పట్లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని అటకెక్కించారు. దేశ ప్రజలందరినీ ఒకే గాటన కట్టే దిశలో ముందడుగు వేసే బదులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతీ– సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాలు అంటూ వారి మధ్యన మరింత ఎత్తున గోడలు కట్టారు. లింగాయత్లు–హిందువులు; రాజ్పుత్లు–ఇతరులు; హిందువులు–ముస్లింలు; దళితులు–అగ్ర కులాలు అంటూ వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి, తమాషా చూడట మొక్కటే పరమ పవిత్ర కర్తవ్యంగా ఆ పార్టీ భావిస్తోంది. తన ‘తోడో’ రాజకీయాల కోసం అందివచ్చే ఎలాంటి అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టడం లేదు. 130 కోట్ల మందికి పైగా భారతీయులు భక్తి – శ్రద్ధలతో దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ... భారత్ ఒక దేశం కాదు, జాతీ కాదు, కేవలం రాష్ట్రాల సమాహారం మాత్రమేనంటూ వింత, వితండ వాదనను రాహుల్ తెరమీదకు తెచ్చారు. నెహ్రూ పేర్కొన్నట్లు – దేశ ప్రజలందరినీ కలిపి ఉంచుతున్న బలమైన బంధం– భారతీయత – అంటే ఏమిటన్నది అర్థం చేసుకోగలిగితే– ‘జోడో’ లక్ష్యం సాధించే దిశగా సాగిపోవడం, గమ్యం చేరడం రాహుల్ గాంధీకి పెద్ద కష్టమేమీ కాదు! (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం) - కిశోర్ పోరెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి -
భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం
ఎనభై ఏళ్ల క్రితం జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం సెప్టెంబర్ 7న మొదలైంది. దాని స్ఫూర్తితో 2022 సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ పాదయాత్రను ప్రారంభించారు.12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనున్న ఈ యాత్ర ప్రజల ఐక్యతను ఇనుమడింపచేసే యాత్ర. విభిన్న సంప్రదాయాలు, ఎన్నో కులాలు, మతాలు, భాషలు ఉన్న ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటే... వారిని విభజించేందుకు ప్రయత్ని స్తున్నాయి మతోన్మాద శక్తులు. ఈ శక్తుల పట్ల ప్రజలను అప్రమత్తులను చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. దేశంలో అసహన మతోన్మాద విభజన రాజకీయాలు ఒకవైపు, రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు వంటి సమస్యలు మరొకవైపు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న స్థితిలో రాజకీయాల పట్ల ప్రజలని చైతన్య పరుస్తూ సాగుతున్నది యాత్ర. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు సొంతంగా తెలుసు కుంటున్నారు రాహుల్. తాను వెళ్లిన ప్రతిచోటా సాధారణ ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన మేధావి వర్గంతో భేటీ అవుతూ స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. రాహుల్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే... దేశాన్ని ఏ శక్తులూ విచ్ఛిన్నం చేయలేవు అని నమ్మకం కలుగుతోంది. భారత రాజ్యాంగ మూల సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు విరుద్ధంగా... దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ‘ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను’ నినాదంతో పాలిస్తున్న వారికి వ్యతిరేకంగా ఒక ఆశాకిరణంలా ఈ యాత్రను ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఉంది. ఎనిమిదేళ్ల క్రితం ఎన్నో ఆశలతో కొత్త పాలకుడి కోసం ఎదురు చూసిన యువత ఆశలను మోదీ వమ్ము చేశారు. నిరుద్యోగం, విద్వేషం, విభజన రాజకీయాలు చూసి కుంగిపోయి ఉన్న విద్యార్థి, నిరుద్యోగ యువతకు పునరుత్తేజంగా కనిపిస్తోంది రాహుల్ పాదయాత్ర. ఆయనలో ఇటీవలి కాలంలో మంచి రాజకీయ పరిణతి కనిపిస్తోంది. అసమర్థుడు అనే ముద్రతో బయలుదేరి అజేయుడుగా అందరి ప్రేమ ఆప్యాయతలు పొందుతూ వడివడిగా కశ్మీర్ వైపు పురోగమిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తన యాత్ర కొనసాగుతోంది. 60 ఏళ్ల పోరాటం, ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జనం ఆశించిన పాలన అందక పోవడంతో... మళ్లీ పిల్లలు, పెద్దలు, విద్యార్థి, నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలు, మేధావులు; కుల, మత, రాజకీయాలకు అతీతంగా సరికొత్త ఆశలతో రాహుల్ యాత్రలో భాగం అవుతున్నారు. ఈ యాత్రతో ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఏర్పడ్డ సానుకూల ధోరణిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఆ పార్టీకి ఇక్కడ పోయిన జవసత్వాలు తిరిగి వస్తాయి. (క్లిక్ చేయండి: బాధ్యత తీసుకోవడమూ ఆదర్శమే!) - వలిగొండ నరసింహ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్, ఓయూ -
పోతరాజు అవతారమెత్తిన రాహుల్
-
పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం
సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోతరాజు అవతారం ఎత్తారు. ఆయన తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోతురాలు రాహుల్ను కలిశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్కు వివరించారు. ఈ క్రమంలో పోతరాజుల నుంచి కొరడా అందుకున్న రాహుల్ దానితో కొట్టుకున్నారు. రాహుల్ చేసిన విన్యాసానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. మరోవైపు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతోంది.. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారురు. ఏఐసీసీ, రాష్ట్ర అగ్రనేతలు ఆయన వెంట నడుస్తున్నారురు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించగా.. బీహెచ్ఈఎల్ లింగంపల్లి వద్ద కాంగ్రెస్ ముఖ్యనేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, పటాన్చెరు మీదుగా ముత్తంగి వరకు సుమారు 11 కి.మీ పాదయాత్ర కొనసాగింది. చదవండి: రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులు -
తెలంగాణలో రోజంతా నడుద్దామా?.. రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: యాభై రెండేళ్ల వయసు.. చుట్టూ వందలు, వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు.. పెద్ద ఎత్తున పోలీసు భద్రత... ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి వేగంగా, వడివడిగా రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అనూహ్య ప్రతిపాదనను తీసుకువచ్చారు. రోజంతా విరామం లేకుండా ‘వాకింగ్ మారథాన్’చేద్దామని, ఒక్కరోజులో వీలున్నన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్దామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అన్నారు. రాహుల్గాంధీ చేసిన ఈ అనూహ్య ప్రతిపాదనతో నిర్ఘాంతపోవడం అక్కడే ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరుల వంతయింది. 100 కి.మీ రికార్డు యోచనలో రాహుల్? మంగళవారం టీ బ్రేక్ సమయంలో రాహుల్గాంధీ చేసిన ఈ మారథాన్ ప్రతిపాదనకు ఎలా స్పందించాలో అర్ధం కాక వేణుగోపాల్, రేవంత్రెడ్డిలు కొంతసేపు మౌనంగా ఉన్నారని సమాచారం. ఆ తర్వాత తేరుకున్న రేవంత్రెడ్డి ‘విరామం లేకుండా వాకింగ్ మారథానా?.. ఇప్పటికే మీ వేగాన్ని అందుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్రలోకి వెళ్లి నాందేడ్ దాటిన తర్వాత మీరు మారథాన్కు ప్లాన్ చేసుకోండి.’అని రాహుల్తో సరదాగా వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలతో కేసీ వేణుగోపాల్ కూడా ఏకీభవించడంతో ప్రస్తుతానికి వాకింగ్ మారథాన్ ప్రతిపాదనను రాహుల్ పక్కన పెట్టారని, కశ్మీర్ వరకు వెళ్లేలోపు కచ్చితంగా ఆయన మారథాన్ చేస్తారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమవుతోందని, ఈ నేపథ్యంలోనే ఒకేరోజు దాదాపు 100 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాలన్నది రాహుల్ ఆలోచన అయి ఉంటుందని చెబుతున్నారు. 8 రోజులు.. 170కి పైగా కిలోమీటర్లు ఈ నెల 23వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా కృష్ణా మండలం గూడేబల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్గాంధీ బుధవారం నాటికి ఎనిమిది రోజుల్లో 170కి పైగా కిలోమీటర్లు నడిచారు. తొలి రోజు కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే నడిచిన ఆయన మిగిలిన ఏడు రోజుల్లోనే 166 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం గమనార్హం. అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ పాదయాత్ర అంటే కేవలం నడుచుకుంటూ వెళ్లడమే కాదు. దారిలో కనిపించిన వారందరినీ పలకరించుకుంటూ రాహుల్ యాత్ర సాగుతోంది. ఆయన ఉదయం, సాయంత్రం నడిచే సమయంలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన ముందూ, వెనుకా నడుస్తున్నారు. ముందు భాగంలో పోలీసులు ఏర్పాటు చేసిన వలయంలో నడుస్తున్న రాహుల్.. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తనతో కలిసి నడుస్తున్న వారిలో కొందరిని దగ్గరకు పిలిచి మాట్లాడుతున్నారు. దారిలో వచ్చే గ్రామాల్లో రోడ్డుకిరువైపులా, మిద్దెల మీద, చెట్లు, వాహనాలపైనా తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలందరినీ రాహుల్ పలకరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలల విద్యార్థులు, కూలీలు, బస్సులు, ఇతర వాహనాల్లో వెళుతున్న ప్రయాణికుల వద్దకు ఆయనే వెళ్లి మాట్లాడుతున్నారు. పరుగెత్తడం, బస్సు ఎక్కడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, జిమ్నాస్టిక్స్, కళారూపాలను వీక్షించడం లాంటివి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నడిచే సమయంలోనే కలుస్తున్నారు. విశ్రాంతి, విసుగు లేకుండా.. మధ్యాహ్నం విశ్రాంతి సమయంలోనూ పలువురిని కలుస్తున్న రాహుల్గాంధీ వారితో కూడా ఆప్యాయంగా వ్యవహరిస్తున్నారు. తనను కలిసేందుకు వెళ్లినవారితో కలివిడిగా మాట్లాడడమే కాకుండా వారి సమస్యలను శ్రద్ధగా వినడం, వారి కుటుంబ పరిస్థితులను ఆరా తీయడం, పిల్లల చదువుల గురించి అడగడం, చిన్నారులను దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. మొత్తం మీద పాదయాత్రను రాహుల్ జనాకర్షకంగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెక్యూరిటీ కారణాల రీత్యా కూడా రాహుల్ పాదయాత్ర వేగంగా సాగుతోందని పోలీసులు చెబుతుండగా.. 3,750 కిలోమీటర్లు 150 రోజుల్లో నడవాలి కదా, ఆమాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? అంటూ ఆయనతో కలిసి నడుస్తున్నవారు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
మిత్రులకు మోదీ.. కుటుంబానికి కేసీఆర్.. రాహుల్ ధ్వజం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి లూటీ చేసిన ప్రజాధనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ మిత్రులకు కట్టబెడితే, రాష్ట్రంలో ప్రాజెక్టులపై వస్తున్న కమీషన్లను సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులకు పంచుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. కేంద్రంలో మోదీ ఎలా వ్యవహరిస్తున్నారో చూసి.. రాష్ట్రంలో కేసీఆర్ కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భారత్జోడో యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. మధ్యాహ్నం విరామం అనంతరం బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి ముత్తంగి వరకు సుమారు 12 కి.మీ పాదయాత్ర చేసిన రాహుల్ ముత్తంగి వద్ద బహిరంగసభలో ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో ఇద్దరు నేతలూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేశారని విమర్శించారు. రాత్రి కాగానే ‘ధరణి’లోనే.. సీఎం కేసీఆర్ రాత్రి కాగానే ధరణి పోర్టల్ తెరచి భూములు ఎవరు అమ్మారు.. ఎవ రు కొన్నారో చూస్తుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఉదయం లేవగానే ఏ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేస్తే ఎక్కువ కమీషన్ వస్తుందోనని కేసీఆర్ లెక్కిస్తుంటారని ఆరోపించారు. తెలంగాణలో భూములన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించిన ఆయన.. ధరణి పోర్టల్లో మొదటి స్థానం కేసీఆర్దే ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం బిల్లులకు కేసీఆర్ మద్దతు రైతుబిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై ఉంటే.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ బిల్లు విషయంలో నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పలు బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. దేశ రక్షణ రంగానికి పృథ్వీ, అగ్ని వంటి క్షిపణిలను అందించే బీడీఎల్తో పాటు, బీహెచ్ఈఎల్, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని రాహుల్గాంధీ విమర్శించారు. ఆయా ప్రభుత్వం రంగ సంస్థల ఉద్యోగులను కేంద్ర సర్కారు భయాందోళనలకు గురి చేస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజల మూలధనంతో నెలకొల్పిన ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హింసాద్వేషాల విస్తరణకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లపైనా రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో హింస, ద్వేషాలను విస్తరింప చేయడానికి వ్యతిరేకంగా తమ భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ రెండూ కూడా దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్గాంధీ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో చిరువ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలు కుదేలయ్యాయని చెప్పారు. తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతల కారణంగా తన పాదయాత్ర అలసట లేకుండా ముందుకు సాగుతోందని చెప్పారు. బహిరంగ సభలో ఏఐసీసీ నేతలు బోసురాజు, కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేద ప్రజలకు మోదీయే పెద్ద ఉపద్రవం: కేటీఆర్ -
‘ఢిల్లీలో మోదీకి కేసీఆర్.. తెలంగాణలో కేసీఆర్కు మోదీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్ వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టిస్తోందని, ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరి సొత్తు కాదని, అవి దేశ ప్రజల సొత్త అని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయబోమని భరోసా ఇచ్చారు. ‘ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారు. 25కి.మీ నడిచినా అలసట మాకు ఎవరికి రాదు. ప్రజల ప్రేమాభిమానాలు మాకు అలసట అనేది లేకుండా చేస్తున్నాయి. దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే యాత్ర లక్ష్యం. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టించి, ప్రజల్ని భయాందోళనకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తోంది. భారత్ డైనమిక్స్ దేశ రక్షణ కోసం క్షిపణులను తయారు చేస్తోంది. బీహెచ్ఈఎస్, బీజీఎల్ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఉద్యోగులను భయపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలు భారత దేశ మూలధనం. బీజేపీ ప్రజల ఆస్తులను తమ వ్యాపార మిత్రులకు కట్టబెట్టాలని చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయం. ఇందుకోసం ఉద్యోగులు, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది. ’అని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే.. దేశంలో, రాష్ట్రంలో యువకులకు చదువుకు తగిన ఉద్యోగాలు లభించడం లేదన్నారు రాహుల్. ఇంజనీరింగ్ చదివిన వారు కూలీలుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ దేశ ఆర్థక వ్యవస్థకు వెన్నెముక లేకుండా చేశారని దుయ్యబట్టారు. ‘నల్లధనాన్ని వెనక్కు తెస్తానన్న మోదీ.. నోట్ల రద్దు చేశారు. జీఎస్టీ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రోడ్డున పడేశారు. అక్కడ మోదీ చేసిందే ఇక్కడ కేసీఆర్ చేస్తున్నారు. తెలంగాణలో భూములు ఏమయ్యాయి? ధరణి పోర్టల్లో మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి. ఢిల్లీలో మోదీకి కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్కు మోదీ సహకారం ఇచ్చుకుంటున్నారు. ప్రజల్లో భయాన్ని పారద్రోలేందుకే భారత్ జోడో యాత్ర. కేసీఆర్ కమీషన్ల సొమ్మును తన కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నాడు. ఇదీ చదవండి: Bharat Jodo Yatra: సుప్రభాత్లో తేనీటి రుచి.. థ్యాంక్స్ భట్టీజీ.. -
బోయినపల్లి నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర
-
Rahul Gandhi: సుప్రభాత్లో తేనీటి రుచి.. థ్యాంక్స్ భట్టీజీ..
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో ఉత్సాహభరితంగా కొనసాగింది. అడుగడుగునా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలతో పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. సాయంత్రం జోడో యాత్ర మార్గంలో వీధిదీపాలు నిలిచిపోవడంతో చీకట్లోనే కొనసాగింది. నగరవాసులు రాహుల్ను చూసేందుకు పోటీ పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులు కొనసాగిన యాత్ర మంగళవారం శంషాబాద్ నుంచి ప్రారంభమై నగరంలోని నెక్లెస్ రోడ్ వరకు సాగింది. రాహుల్ గాంధీ కాలేజీ విద్యార్థులతో కలిసి నడక సాగించారు. ►మార్గమధ్యలో ఓ విద్యార్థిని చేసిన భరత నాట్యాన్ని కొద్దిసేపు ఆగి తిలకించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వద్ద యువకులు అథ్లెటిక్ విన్యాసాలు ప్రదర్శించారు. వేముల రోహిత్ తల్లిని కలిసి ఓదార్చారు. గగన్ పహాడ్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. డప్పు కళాకారులతో ఆయన సెల్ఫీ దిగారు. మార్గమధ్యలో రాక్ క్రాఫ్ట్ మార్బుల్ దుకాణం ప్రాంగణంలో రాహుల్ టీ తాగి సేదతీరారు. విద్యార్థులతో ముచ్చట్లు.. వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ రాహుల్ను ఆకట్టుకున్నారు. దీంతో ఆయన ముగ్గురు విద్యార్థులను పిలిపించుకుని వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. వ్యవసాయ వర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇది సరైంది కాదని ప్రైవేటు యూనివర్సిటీలకు ఐసీఆర్ గుర్తింపు ఇవ్వొద్దు అంటూ రాహుల్కు విద్యార్థులు వివరించారు. శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద రోడ్డుపక్కన నిల్చున్న వృద్ధుడి చెంతకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ వద్ద పతాకావిష్కరణ భారత్ జోడో యాత్రలో భాగంగా చార్మినార్ కట్టడం వద్ద రాజీవ్ సద్భావన స్తూపంపై పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. సాయంత్రం 4 గంటలకు పురానాపూల్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు నగరవాసులు బోనాలు, శివసత్తులు, పోతురాజులు, కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర కోకాకీతట్టీ, పాల్కీ గార్డెన్, మూసాబౌలి చౌరస్తా, కసరట్టా, లాడ్బజార్ ద్వారా చార్మినార్ వరకు కొనసాగింది. కోకాకీతట్టీ వద్ద భవనంపై నుంచి గులాబీలు చల్లి రాహుల్గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సుప్రభాత్లో తేనీటి రుచి.. చార్మినార్ వద్ద జెండావిష్కరణ అనంతరం గుల్జార్హౌజ్ చౌరస్తా దాటి ముందుకు వెళ్లారు. నఫ్రత్ చోడో.. భారత్ జోడో... రాహుల్గాంధీ పీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. అఫ్జల్గంజ్ వద్ద సదర్ దున్నలను రాహుల్కు చూపించి సదర్ ఉత్సవాలపై వివరించారు. నాంపల్లిలో బల్దియా మహిళా కార్మికులతో ముచ్చటిస్తూ రాహుల్ ముందుకు సాగారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుప్రభాత్ హోటల్లో తేనీరు సేవించారు. కాంగ్రెస్ శ్రేణులు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో కూడిన ప్లకార్డుల ప్రదర్శించి రాహుల్ దృష్టిని ఆకర్షించారు. ప్రాచీన నగారా భేరి.. థ్యాంక్స్ భట్టీజీ.. భారత్ జోడో యాత్రలో అంతకుముందు రాహుల్ శంషాబాద్ వద్ద అతి ప్రాచీనమైన నగారా భేరి కళారూపాన్ని ప్రదర్శించారు. కొమ్ము బూరలు ఊదుతూ నగారా భేరీ వాయిస్తున్న కళాకారుల మధ్యలోకి రాహుల్ వెళ్లి డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు. నిజాం నవాబు కాలం నాటి ఈ కళారూపం విశిష్టమైన ‘నగారా భేరి’ని విశిష్ట వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోందని భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన విశిష్ట అతిథి (రాహుల్ జీ) మీరే కాబట్టి ఈ కళారూపాన్ని ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క చెప్పడంతో.. థ్యాంక్స్ భట్టీ జీ అంటూ రాహుల్ ప్రశంసించారు. బిర్లా మందిరం ఏర్పడిన స్థానంలో నౌబత్ పహాడ్పై నగారా భేరి మోగించి నిజాం బయటికి వస్తున్నారనే సంకేతానికి ఉపయోగించేవారని చెప్పారు. శంషాబాద్లో ఆవు హల్చల్... భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న క్రమంలో శంషాబాద్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలోకి ఆకస్మాత్తుగా ఓ ఆవు దూసుకొచ్చింది. అప్రమత్తమైన నేతలు చెల్లాచెదురుగా పరుగెత్తారు. కాగా.. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండో రోజు పాదయాత్ర ఇలా.. నగరంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు బుధవారం 27 కిలోమీటర్ల మేర సాగనుంది. ఓల్ట్ బోయిన్పల్లిలోని రాజరాజేశ్వరీ నగర్ గాంధీయన్ ఐడియోలజీ సెంటర్ నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర న్యూ బోయిన్పల్లి, ఫిరోజ్గూడ, బాలానగర్ మెయిన్ రోడ్, మూసాపేట హబీబ్నగర్, కూకట్పల్లి సుమిత్రా నగర్, అశోక్నగర్, హఫీజ్ పేటల మీదుగా మదీనాగూడకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమై.. మియాపూర్ ఇందిరానగర్, దుర్గా ఎస్టేట్, గౌతమీనగర్ కాలనీ, రాంచంద్రాపురం కాకతీయ నగర్, పటాన్చెరు శాంతినగర్ మీదుగా రాత్రి 7 గంటలకు ముత్తంగి హరిదాస్ పాయింట్కు చేరుకుంటుంది. అక్కడ కార్నర్ మీటింగ్తో నగరంలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. ►అడుగుల్లో ఉత్సాహం.. పాదాల్లో ఉల్లాసం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం.. అంతటా నీరాజనం.. అదే జన సందోహం.. ►తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు.. పోతరాజుల విన్యాసాలు.. మేళవించిన సంప్రదాయాలు.. కళాబృందాల ప్రదర్శనలు.. ► విద్యార్థులు, యువత, వృద్ధులు.. అన్ని వర్గాల ప్రజలతో మాటాముచ్చటా.. వారి కష్టసుఖాలు తెలుసుకుని నేనున్నాననే భరోసా.. ►శంషాబాద్ నుంచి నగరంలోకి అడుగిడి.. చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన స్తూపంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపి.. ►ఇలా మంగళవారం శంషాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిరోజు ‘భారత్ జోడో యాత్ర’ ఘనంగా జనం కేరింతల నడుమ సాగింది. -
మీరేం చెయ్యాలో చెప్పడానికి వచ్చార్సార్! పర్మిషన్ ఇస్తే వచ్చి కలుస్తారట!!
మీరేం చెయ్యాలో చెప్పడానికి వచ్చార్సార్! పర్మిషన్ ఇస్తే వచ్చి కలుస్తారట!! -
గాలిపై కూడా పన్నులు వేస్తారు
(భారత్జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) దేశాన్ని మోదీ, అమిత్షా అమ్ముకుతింటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గాలి మినహా అన్నింటా ఇద్దరూ కలిసి అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. గాలి పీల్చడం వల్లనే ప్రజలు బతుకుతున్నారు కాబట్టి ఆ గాలిపై కూడా రాబోయే కాలంలో వారు పన్నులు విధిస్తారని ఎద్దేవాచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన మల్లికార్జున ఖర్గే మంగళవారం ఇక్కడ జరిగిన భారత్జోడో యాత్రలో రాహుల్గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఖర్గేకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీనేత భట్టివిక్రమార్క స్వాగతం పలికారు. ఆ తర్వాత రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఖర్గే నెక్లెస్రోడ్డులో సభకు హాజరయ్యారు. మేం చేయకపోతే ప్రధాని అయ్యేవాడా? గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ ఏమీ చేయకపోతే ఈ దేశానికి మోదీ ప్రధాని అయ్యేవాడా అని ఖర్గే ప్రశ్నించారు. ‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని మేం నిలబెట్టినందునే మోదీ ప్రధాని అయ్యారు. ఆ ఫలితాన్నే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రక్షించినందునే ప్రధాని హోదాలో మోదీ దేశవిదేశాలు తిరుగుతున్నారు’ అని అన్నారు. జై తెలంగాణా అని నినదించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారమిచ్చిన ప్రజలకే అన్యాయం చేయాలని చూస్తోందని, వారి భూములను లాక్కుంటోందని, అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టడంలో మోదీ, కేసీఆర్ ఒకటేనని, వారి మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణానది పరవళ్లు తొక్కినట్టు, నల్లమల అడవుల గుండా కృష్ణానది ప్రవహించినట్టు లక్షలాది మంది యువత రాహుల్తో కదం తొక్కుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ వద్ద దిక్కులు పిక్కటిల్లేలా అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలకతీతంగా ప్రజలు గొంతు కలిపారు. రాహుల్కు అండగా నిలబడి మోదీ అరాచకాలను తుదముట్టిస్తామని చాటి చెప్పారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. నాడు రాజీవ్గాంధీ చార్మినార్ నుంచి సికింద్రాబాద్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు సద్భావన యాత్ర జరిపితే.. మతం పేరుతో దేశ విభజన, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా నేడు రాహుల్ జోడోయాత్ర హైదరాబాద్లో నిర్వహించారని చెప్పారు. -
భారత్ జోడో యాత్రలో గల్ఫ్ కార్మికుల డిమాండ్లు
తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మంగళవారం శంషాబాద్ నుంచి బోయినపల్లి మార్గంలో ఆసక్తికర సంఘటన జరిగింది. 'స్టేట్ యాత్రీ' పాసులు కలిగిన ఇద్దరు యువకులు ప్లకార్డులు పట్టుకుని భారత్ జోడో యాత్రలో నడుస్తున్నారు. ఇది గమనించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత (సీఎల్పీ లీడర్) భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వారిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జేఏసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్నామని అన్నారు. గల్ఫ్ వలస కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన పెరుగు మల్లికార్జున్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన దీటి నర్సింలు వారికి తెలిపారు. దేశ సమగ్రత కొరకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ యాత్ర ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పడానికి అడుగులో అడుగువేసి నడుస్తున్నట్లు వివరించారు. డిమాండ్ల సాధనలో గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల నిబద్ధత, పట్టుదల పట్ల ముగ్ధులైన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరి, కాంగ్రెస్ నాయకులు డా.శ్రవణ్ కుమార్ హైదరాబాద్, బహదూర్ పురలోని లెగసీ ప్యాలస్లో ఏర్పాటు చేసిన యాత్రీస్ క్యాంప్ (వసతి శిబిరం)లో ప్లకార్డులను ఆవిష్కరించారు. భారత ప్రభుత్వం రూ.10 లక్షల 'ప్రవాసి భారతీయ బీమా యోజన' పథకాన్ని అన్ని క్యాటగిరీల గల్ఫ్ కార్మికులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి అనే డిమాండ్లతో ఉన్న మూడు ప్లకార్డులు సహ యాత్రీలను విశేషంగా ఆకర్షించాయి. -
Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో కలకలం!
-
Hyderabad: నగరానికి రాహుల్ జోడో యాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు నగరంలో అడుగుపెట్టనుంది. రెండు రోజులపాటు 60 కిలోమీటర్ల యాత్ర కొనసాగనుంది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు నగర శివారులోని శంషాబాద్ మాతా టెంపుల్ నుంచి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఆరాంఘర్ మీదుగా తాడ్బండ్ సమీపంలోని లెజెండ్ ప్యాలెస్కు చేరుకుంటుంది. అక్కడ 10.30 గంటలకు అల్పాహారం అనంతరం రాహుల్ విరామం తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు పురానాపూల్ వద్ద ప్రారంభమయ్యే పాదయాత్ర హుస్సేనీ ఆలం, లాడ్ బజార్ మీదుగా 4.30 గంటలకు చార్మినార్కు చేరుకుంటుంది. అక్కడ రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తూపంపై జాతీయ పతాకాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభయ్యే పాదయాత్ర గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా 7 గంటలకు నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటుంది. ప్రత్యేక ఆకర్షణగా కళారూపాలు భారత్ జోడో పాదయాత్రలో తెలంగాణ సంస్కృతి కళా రూపాలు ఆకర్షణగా నిలవనున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, సదర్ విన్యాసాలు, పీర్లు, తోలుబొమ్మలు, బాజా భజంత్రీలు, మంగళ హారతులు, జానపద కళా విన్యాసాలు ప్రదర్శించనున్నారు. పాదయాత్ర పొడవునా.. ప్రతి రెండు కిలో మీటర్లకు ఒక కళా బృందాలను ఏర్పాటు చేసి ప్రదర్శన నిర్వహించనున్నారు. పాదయాత్రకు అడుగడుగునా స్వాగత తోరణాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రేణుల్లో జోష్.. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్ మీద ఉన్నాయి. నగరానికి ఆయన ఆరు నెలల వ్యవధిలో రెండోసారి రానుండటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అప్పట్లో వరంగల్ సభ మరుసటి రోజు చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించారు. రోజంతా నగరంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలిగించారు. తాజాగా రాహుల్ పాదయాత్ర పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరం మీదుగా కొనసాగే జోడోయాత్ర పార్టీకి జవసత్వాలు నింపగలదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చదవండి: కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్ నివేదన పూర్వవైభవమే లక్ష్యంగా.. నగరంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికైన వారు సైతం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన పార్టీకి నగర అధ్యక్షుడు రాజీనామాతో రెండేళ్లుగా చుక్కాని లేని నావగా పరిస్థితి కొనసాగుతోంది. ఈ తరుణంలో రాహుల్ జోడో యాత్ర కేడర్లో నూతనోత్తేజం నింపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కార్నర్ మీటింగ్లో ఖర్గే నెక్లెస్ రోడ్లో జరిగే కూడలి సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆయన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెక్లెస్రోడ్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. భారత్ జూడో యాత్ర సందర్భంగా మంగళవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాదయాత్ర కొనసాగే ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పురానాపుల్, ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, పోలీస్ కంట్రోల్ రూం, రవీంద్ర భారతి, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఐమాక్స్ మీదుగా పాదయాత్ర కొనసాగనుండటంతో మూడు కిలో మీటర్ల రేడియస్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తారు. నెక్లెస్ రోడ్లులో కార్నర్ మీటింగ్ను పురస్కరించుకొని పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్, వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ, అంబులెన్సులకే అనుమతి: ‘భారత్ జోడో’ యాత్ర సందర్భంగా మంగళవారం నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సోమవారం రాత్రి ఆయన ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఆరాంఘర్, పురానాపూల్ జంక్షన్, ముసబౌలి, లాడ్బజార్, చార్మినార్, నయాపూల్, అఫ్జల్గంజ్, మొజంజాహీ మార్కెట్, గాందీభవన్, నాంపల్లి, పోలీసు కంట్రోల్రూమ్, రవీంద్రభారతి, ఆర్బీఐ రోడ్డు నుంచి తెలుగు తల్లి ఫ్లైవర్ లెఫ్ట్ నుంచి ఐమాక్స్ రోటరీ వరకు యాత్ర సాగుతుంది. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు సైతం అనుమతి లేదని రంగనాథ్ స్పష్టంచేశారు. ఉస్మానియా, కేర్ ఆసుపత్రులకు (నాంపల్లి) ఎమర్జెన్సీగా వెళ్లే వారు ముందస్తుగా తమకు సమాచారం అందిస్తే ప్రత్యేక, ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామన్నారు. అంబులెన్స్కు ప్రత్యేక రూట్ ఇస్తామన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. -
హైదరాబాద్ లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర
-
60వేల మందితో రాహుల్కు స్వాగతం
కొండాపూర్(సంగారెడ్డి): నవంబర్ 3న సంగారెడ్డిలో ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు 60వేల మందితో స్వాగతం పలుకు తామని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మల్కాపూర్లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెహ్రూ ప్రధాని అయ్యాక రాంచంద్రాపూర్లో బీహెచ్ఈఎల్, ఇందిరా గాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక బీడీఎల్, ఓడీఎఫ్ వంటి పరిశ్రమలు, సోనియాగాంధీ హయాంలో సంగారెడ్డిలో ఐఐఐటీ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగతుందని, యాత్రను విజయవంతం చేయాలని కోరారు. మండలాల అధ్యక్షులు ప్రభు, బుచ్చిరాములు, రాంరెడ్డి, ప్రకాష్ చెర్యాల ఆంజనేయులు, ప్రభుదాసు, రఘు గౌడ్, వెంకటేశం గౌడ్, సునీల్ పాల్గొన్నారు. -
రండి.. జోడో యాత్రలో కదం తొక్కుదాం
సాక్షి, హైదరాబాద్: రేపటి భవిష్యత్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో అడుగులు వేద్దామని, తెలంగాణ సమాజం తరలిరావాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం చార్మినార్ నుంచి నెక్లెస్రోడ్ వరకు పాదయాత్ర, సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. దేశ ఐక్యతే మన ప్రాధాన్యత అని చాటుదామని, దేశం కోసం ఒక్కరోజు ఒక్క గంట గడప దాటి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ సమాజాన్ని ఉద్దేశిస్తూ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్తిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్నే కాదు.. ఇంతటి ఆర్థిక పరిపుష్టి గల నగరాన్ని మనకందించిన కాంగ్రెస్ నవ నాయకుడు రాహుల్ గాంధీ మన ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఫాంహౌస్కే పరిమితమైతే.. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశం నిర్బంధంలో ఉంది. ప్రజల వేషభాషలు కూడా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు లోబడాల్సిన దుస్థితి నెలకొంది. ఉపాధి, ఉద్యోగం లేక 22 కోట్ల మంది యువత నిర్వీర్యమైపోతోంది. చమురు ధరలు చుక్కలనంటాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆకలి సూచీలో 107వ స్థానానికి మన దేశం పడిపోయింది. వ్యవస్థల విధ్వంసానికి అంతే లేదు. మరోవైపు టీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ, ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలు అమలు కాలేదు. పోడు భూములకు పట్టాలు ఒక బోగస్ మాట. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతున్నాయి. భూకుంభకోణాలకు అంతే లేదు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ రాహుల్ భారత్ జోడో పాదయాత్రగా బయలుదేరారు’’అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. -
రాహుల్ యాత్రలో కలకలం! భద్రతా వలయాన్ని దాటి వచ్చిన వ్యక్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగించారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన యాత్ర 10 గంటల సమయంలో కొత్తురుకు చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్న రాహుల్.. మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి.. రాత్రి ఏడు గంటలకు తొండుపల్లిలో బస చేశారు. కాగా సాయంత్రం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తొండుపల్లి, షాపూర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కాళ్లపై పడిన కార్యకర్త జోడో యాత్రలో ఓ వ్యక్తి పోలీసు భద్రతా వలయాన్ని దాటు కుని వచ్చి రాహుల్ గాంధీ కాళ్లపై పడటం కలకలం రేపింది. పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని లాగేశారు. ఆ వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించి వదిలేసినట్టు సమాచారం. ఇక మరో వ్యక్తి కూడా పాదయాత్రలోకి చొచ్చుకువచ్చి రాహుల్ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ పిలవడం వల్లే ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయాన్ని దాటి ఆయన వద్దకు వచ్చారని.. పాదాలను తాకి, ఫొటోలు తీసుకునేందుకు యత్నించారని బాలానగర్ డీసీపీ సందీప్ పేర్కొనడం గమనార్హం. బస్సుపై ఎక్కి.. సెల్ఫీ దిగి.. రాహుల్ పాదయాత్రగా వస్తున్న సమయంలో పాల్మాకుల వద్ద రోడ్డు పక్కన కొందరు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి రాహుల్ గాంధీకి అభివాదం చేశారు. వారిని గమనించిన రాహుల్ స్వయంగా ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికులతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. రాహుల్ వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా బస్సుపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. -
టీఆర్ఎస్తో జోడీ లేదు.. ఆ ప్రశ్నే తలెత్తదు: రాహుల్ గాంధీ
ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం.. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోంది. విద్వేషం, హింసను ప్రేరేపించడం ద్వారా దేశాన్ని విభజించాలనేది ఒక సిద్ధాంతమైతే.. దేశాన్ని ఐక్యంగా ఉంచాలనేది మరో సిద్ధాంతం. బీజేపీ ప్రేరేపిస్తున్న హింస, విద్వేషాలను భారత సమాజం అంగీకరించదు. బీజేపీ ఆర్థిక విధానాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేయడాన్ని మేం అంగీకరించబోం. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీతో పోరాడటం రెండు నిమిషాల్లో అయ్యేది కాదు. ఇందుకోసం భారత్ జోడో యాత్ర ఒక మార్గం. 26 ఏళ్ల వయసులోనే అనుకున్నా... ఇప్పుడు చేస్తున్నా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలన్న ఆలోచన ఎవరిదో స్పష్టంగా చెప్పలేను. యాత్ర చేయాలన్న విషయాన్ని సాధారణంగానే పార్టీలో చర్చించుకున్నాం. ఆ సమయంలో కోవిడ్ రావడంతో సాధ్యం కాలేదు. కానీ పాదయాత్ర చేయాలన్నది నా మనస్సులో నిండిపోయింది. పార్టీలోని ఇద్దరు, ముగ్గురు పెద్దలు కూడా ఇదే విషయం చెప్పారు. అంతకన్నా ముందు నాకు 25–26 ఏళ్ల వయసున్నప్పుడే పాదయాత్ర చేయాలనుకున్నా. అప్పుడు నేను రాజకీయాల్లోనూ లేను. అప్పట్లో సాధ్యం కాలేదు. మనసులో కోరిక ఉండిపోయింది. ఇప్పుడు యాత్ర చేపట్టడం బాగుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాజకీయ యుద్ధం చేసేందుకు ఇది మంచి మార్గం. కాంగ్రెస్ పార్టీకి కూడా యాత్ర మేలు చేస్తుంది. యాత్ర ద్వారా వ్యక్తిగతంగా చాలా నేర్చుకుంటున్నా. దేశ వాస్తవిక పరిస్థితులను తెలుసుకుంటున్నా. (భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): టీఆర్ఎస్ అవినీతికి, ఆ పార్టీ వైఖరికి కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకమని.. టీఆర్ఎస్తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా టీఆర్ఎస్తో కలిసివెళ్లే ప్రశ్నే తలెత్తదని చెప్పారు. తెలంగాణలో తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ నేకాదు అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చని.. అమె రికా, చైనా, ఇతర దేశాల్లో పోటీచేసినా తమకు ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్గాంధీ.. సోమ వారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యవస్థీకృత స్వరూపానికి తీవ్ర నష్టం కలిగించిందని.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలకు ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసం చేపట్టిన భారత్ జోడో యాత్ర కచ్చితంగా రాజకీయ కార్యక్రమమేనని చెప్పారు. ఈ సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. ‘‘టీఆర్ఎస్ అవినీతి పార్టీ, ఆ పార్టీ అవలంబించే వైఖరితో మేం కలిసి పనిచేయలేం. ఆ ప్రశ్నే లేదు. తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ లూటీ చేస్తోంది. దళితులు, గిరిజనుల నుంచి భూములను లాక్కుంటోంది. విద్యా వ్యవస్థను నాశ నం చేస్తోంది. మేం అన్ని విధాలా టీఆర్ఎస్కు వ్యతిరేకం. ఆ పార్టీతో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం ఉండదు. దీనిపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీనే దీనిపై గందరగోళాన్ని సృష్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అందరం కలిసి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధిస్తాం. కేసీఆర్ అమెరికాలో పోటీ చేయాలనుకున్నా స్వాగతిస్తాం ఏ నాయకుడైనా తన పార్టీని కావాల్సిన విధంగా ఊహించుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే తరహాలో జాతీయ పార్టీని నడపాలని అనుకుంటున్నారు. ఆయన అలా అనుకుంటే మాకేం ఇబ్బంది లేదు. ఆయన గ్లోబల్ పార్టీ నడపాలనుకున్నా అడ్డుకోవాల్సింది ఏమీ లేదు. అంతర్జాతీయ పార్టీని నడపాలని.. అమెరికా, చైనా, ఇతర దేశాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావించవచ్చు. అందుకు కూడా మాకు ఇబ్బంది లేదు. స్వాగతిస్తాం కూడా. వ్యవస్థలపై పద్ధతి ప్రకారం దాడి కొన్నేళ్లుగా దేశంలోని వ్యవస్థల మౌలిక స్వరూపానికి చాలా నష్టం జరుగుతోంది. పద్ధతి ప్రకారం వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. మీడియాతోపాటు న్యాయ, అధికార వ్యవస్థలను నా శనం చేస్తున్నారు. జాతీయ స్థాయితో పాటు క్షేత్ర స్థాయి వర కు ఇది జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలకు ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తాం. ఈ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో నడిచేలా చూస్తాం. మేమొస్తే స్వేచ్ఛా వాతావరణం ప్రస్తుతం దేశం ఉపాధి సృష్టించలేని దుస్థితికి వెళ్లిపోయింది. అధికార కేంద్రీకరణ, క్రోనీ క్యాపిటలిజం వంటివే దీనికి కారణం. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకు లబ్ధి కలిగేలా చేస్తూ ఇతర పోటీదారులను తప్పించడం ద్వారా నియంతృత్వాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే స్వేచ్ఛా వాణిజ్య వాతావరణాన్ని కల్పిస్తాం. ఇతర పార్టీలవారూ యాత్రలో.. ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే జిమ్కు వెళ్లొచ్చు. ఇలా యాత్ర చేయడం కాదు. దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టాం. యాత్రలో లక్షలాది మంది మాతో వచ్చి చేరుతున్నారు. వారి మనోభావాలను పంచుకుంటున్నారు. కాంగ్రెసేతర పార్టీల కార్యకర్తలు, సాధారణ ప్రజలు కలసి వస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేయాలనుకున్నాం. వీలైనన్ని రాష్ట్రాల మీదుగా యాత్ర జరిగేలా ప్లాన్ చేశాం. బీసీల లెక్కను ప్రజల ముందు పెట్టాలి దేశంలో ఓబీసీ జనాభా గణనను తలపెట్టిందీ, చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. బీసీల జనాభా లెక్కలను ప్రజల ముందు పెట్టాల్సిందే. దేశ జనాభా స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. అంతకు మించి వేరే ఆలోచన లేదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ప్రజాస్వామ్యంపై వాళ్లనెందుకు అడగరు? మాది ప్రజాస్వామ్యయుత పార్టీ. కాంగ్రెస్లో నియంతృత్వం నడవదు. పార్టీ అధ్యక్షుడిని కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎన్నుకున్నాం. మా పార్టీ డీఎన్ఏలో నియంతృత్వం అనేదే లేదు. అంతర్గత విభేదాలు సహజం. అయినా పార్టీ నేతలంతా కలసి పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్లలో ఇలాంటి ఎన్నికలు జరగవు. మీడియా కూడా ఎప్పుడూ కాంగ్రెస్ గురించి, ఎన్నికలు, విభేదాల గురించి అడుగుతుందేతప్ప.. టీఆర్ఎస్, బీజేపీలలో ప్రజాస్వామ్యం గురించి ఎందుకు ప్రశ్నించదో అర్థం కాదు. ఆ పార్టీలకు అంత డబ్బు ఎక్కడిది? బీజేపీ, టీఆర్ఎస్లు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్నదే ప్రశ్న. అది అవినీతి నుంచే వస్తోంది. అందుకే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు ప్రజల సొమ్ము దోచుకుని వారికే ఎన్నికల రూపంలో పంచిపెడుతున్నాయి. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య సారూప్యత కనిపిస్తుంది. నేనేం చేయాలో ఖర్గే నిర్ణయిస్తారు గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అక్కడ కాంగ్రెస్ బలంగా పోరాడుతోంది. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారే తప్ప ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్లో బలంలేదు. కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో నా పాత్ర ఏమిటనేది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారు. పక్కదారి పట్టించినా దారి మళ్లం కొందరు యాత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేం భారత్ జోడో యాత్ర నుంచి దారిమళ్లదల్చుకోలేదు. ఇది క్రీడా యాత్ర కాదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల విభజన కుట్రలపై రాజకీయ పోరాట చర్య. విద్వేషం, హింసను ప్రేరేపించడం ద్వారా దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు బలహీనపరుస్తున్న తీరును, జాతి వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర లక్ష్యం. మతం, కులం, పేద, ధనిక అనే భేదం లేకుండా అందరినీ కలవడమే ప్రస్తుతానికి నా ఉద్దేశం. ప్రజలతో మా బంధం బలపడుతుంది కాంగ్రెస్కు, ప్రజలకు మధ్య బంధం బలహీనపడిందని చెప్పానేగానీ తెగిపోయిందని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ బంధాన్ని మెరుగుపర్చుకునేందుకు భారత్ జోడో యాత్ర రూపంలో ఓ మంచి అడుగు పడింది. ఈ యాత్ర ద్వారా ఏదో మ్యాజిక్ జరగాలని కూడా మేం కోరుకోవడం లేదు. దేశం ఎటు వెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీకి ఓ దృష్టి, ఉద్దేశం, లక్ష్యం ఉన్నాయి. వాటిని కాపాడుకుంటే ప్రజలతో మా బంధం నిలబడుతుంది, బలపడుతుంది. గాంధీజీ నేర్పిన భావోద్వేగమే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓవైపు నుంచి రాజకీయ సంస్థలాగానే చూస్తాం. కానీ వాస్తవంగా బీజేపీ అనేది భావోద్వేగం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల్లో ఈ ఉద్వేగం చాలా బలంగా ఉంది. ఆ భావోద్వేగం పరాకాష్టకు చేరడమే ద్వేషం. సావర్కర్, గోల్వాల్కర్ వంటి నాయకుల గురించి కూడా నేను చదువుకున్నాను. తరచిచూస్తే వారి భావనలో విద్వేషం కనిపించదు. కానీ భయం కనిపిస్తుంది. ఆ భయం నుంచే విద్వేషం పుడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా భావోద్వేగమే. గాంధీజీ నేర్పిన ఉద్వేగం మాది. భయానికి వ్యతిరేకంగా ఘర్షణ పడడమే ఆయన మాకు నేర్పారు. ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. భయాన్ని తరిమికొట్టాలని, పిరికిపంద చర్యలకు పాల్పడవద్దని చెప్తున్నాం. దీనితోనే బీజేపీ పతనం ప్రారంభమవుతుంది..’’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. గుజరాత్ ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదు విలేకరుల సమావేశానికి ముందు గుజరాత్లోని కేబుల్ బ్రిడ్జి ప్రమాద మృతులకు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. అయితే ఆ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘గుజరాత్ ప్రమాద ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదు. ప్రజలు చనిపోయారు. దీన్ని రాజకీయం చేయడం ఆ మృతులను అవమానించడమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ ప్రెస్మీట్కు ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు మాణిక్యం ఠాగూర్, మధుయాష్కీగౌడ్, జెట్టి కుసుమకుమార్, బోరెడ్డి అయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నితీష్, టీఆర్ఎస్తో మాట్లాడితే మాకు సంబంధం లేదు: రాహుల్ గాంధీ
సాక్షి, రంగారెడ్డి: విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని తెలిపారు. దేశ సమగ్రతకు, సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం తిమ్మాపూర్లో రాహుల్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పోరేట్ వర్గాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు అంత డబ్బు ఎలా వస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పార్టీకి ఎలాంటి అవగాహన లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. .కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘నితీష్, టీఆర్ఎస్తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చని, దాంతో తమకు సంబంధం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేస్తోంది. విద్యను ప్రైవేటీకరణ చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఖర్గే చూసుకుంటారు. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులపై పోరాట యాత్ర. దేశంలో బీజేపీ హింసను ప్రేరేపిస్తోంది. బీజేపీపై పోరాటం కోసమే నా భారత్ జోడో యాత్ర. ప్రజలు కాంగ్రెస్తో విడిపోలేదు. ప్రజలతో కనెక్ట్ కావడానికే యాత్ర. బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ. కశ్మీర్ వెళ్లిన తర్వాత నేనేం అనుకుంటున్నా అనేది చెప్తా.’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. చదవండి: ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు! -
తెలంగాణలో ఆరో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
-
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు.. ఇదిగో ఇలా వెళ్లండి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో ఆ కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షాద్నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు అమలు చేశారు. జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వాహనాలను ఒకే లేన్లో అనుమతించారు. మరో లేన్లో వచ్చే వాహనాలను అమిత్ కాటన్ మిల్, బూర్గుల క్రాస్ రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్నగర్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి షాద్నగర్ వైపు వచ్చే వాహనాలను కేశంపేట క్రాస్ రోడ్, చటాన్పల్లి రైల్వే గేట్ మీదుగా మళ్లించారు. పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలను షాద్నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు మళ్లించారు. రాహుల్కు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా నేతలు తరలిరావడంతో ఆయా మార్గాలు రద్దీగా మారాయి. సోమవారం రెండోరోజు ఇలా.. ♦పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికిల్స్ షాద్నగగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్ మీదుగా వెళ్లాలి. ♦సిటీ నుంచి షాద్నగర్కు వెళ్లే వెహికిల్స్ కొత్తూరు వై జంక్షన్, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి. ♦జడ్చర్ల నుంచి షాద్నగర్ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికిల్స్ వన్వేలో వెళ్లాల్సి ఉంటుంది. శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. ♦మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ♦బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలు పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్గూడ, గొల్లపల్లి, కిషన్గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మూడో రోజు (నవంబర్ 1న).. ♦ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. ♦బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్పాస్, గగన్పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం -
కమీషన్ల కోసమే ప్రాజెక్టులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెట్టాల్సిన ఖర్చును కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులకు మళ్లించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిలిపేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ నిధులతో కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. షాద్నగర్ నియోజకవర్గ శివారులో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ... లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పి యువతను మోసగించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలోనూ నిరుద్యోగం తాండవిస్తోందని, చదువుకున్న వాళ్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, ఆదివాసీలకు భూములు తిరిగిస్తాం.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిరోజూ ధరణి పోర్టల్ చూస్తుంటాడు. ఈరోజు ఎన్ని ఎకరాల ఆదివాసీ, దళిత, గిరిజన భూములను లాక్కున్నామనే విషయంలో ప్రతి రాత్రికి ఆయనకు ఓ రిపోర్టు వస్తుంది. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటోంది. మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను చక్కబెడతాం. ఆదివాసీ, దళిత, గిరిజనుల భూములను తిరిగి వారికి ఇప్పిస్తాం. తిరిగి ఇప్పించడమే కాదు...ఆ భూములపై వారికి హక్కులు కల్పిస్తాం’అని రాహుల్గాంధీ భరోసా ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండూ ఒక్కటేనని, ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతుంటాయని, ఆ తర్వాత రెండు పార్టీలు కలసి పనిచేస్తుంటాయని చెప్పారు. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల గొంతును నొక్కేస్తున్నాయని, రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాహుల్ జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత రంగంపై, చిరు వ్యాపారులపై విధించిన జీఎస్టీని ఎత్తేస్తామని చెప్పారు. ప్రధాని స్పందించరేం? కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉంటే గగ్గోలు పెట్టిన మోదీ... ప్రస్తుతం అదే సిలిండర్ ధర రూ. 1,100 దాటినా ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 70, డిజిల్ ధర లీటర్కు రూ. 56 ఉండగా గగ్గోలు పెట్టిన మోదీ... ప్రధాని అయ్యాక వాటి ధరలు రూ. 100 దాటించారని.. అయినా పెట్రో ధరల పెరుగుదలపై స్పందించడంలేదని విమర్శించారు. పెరిగిన ధరలు పేదలను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయన్నారు. నడుస్తూ.. పరిగెడుతూ.. రాహుల్ ఆదివారం ఉదయం జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించి రాజాపూర్, కేతిరెడ్డిపల్లి, బాలానగర్లోని పెద్దాయపల్లి గేట్ మీదుగా సాయంత్రానికి రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. పాదయాత్ర రాజాపూర్ దాటాక కొందరు చిన్నారులను కలిసిన రాహుల్ వారితో కలిసి పరుగు పోటీలో పాల్గొన్నారు. ఆయన ఒక్కసారిగా పరుగెత్తడంతో రేవంత్రెడ్డి తదితరులు సైతం పరుగులు పెట్టారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఆయనతో కలిసి కేరింతలు కొడుతూ పరుగు తీశారు. ఐదోరోజు రాహుల్ మొత్తంగా 26 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. -
రాహుల్ గాంధీ చేయి పట్టుకుని నడవడంపై పూనమ్ వివరణ
రాహుల్ గాంధీ, పూనమ్కౌర్ ఫోటోపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నటి పూనర్ కౌర్ పాల్గొన్న విషయం తెలిసిందే. చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత చీరలో మెరిసిపోతూ రాహుల్ చేతిలో చేయి వేసి పట్టుకొని కొద్ది దూరం నడిచారు. అయితే యాత్రలో నడుస్తుండగా రాహుల్తో పూనమ్కౌర్ చేయిపట్టుకున్న ఫోటోపై చర్చ నడుస్తోంది. పూనమ్ కౌర్ చేయిపట్టుకొని రాహుల్ గాంధీ నడవడంపై పలువురు ట్రోల్ చేస్తున్నారు. This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti - I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6 — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022 తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్ చేశారు. దీనిపై వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తున్నారు. మోదీ మహిళలతో ఉన్న ఫోటోలను రీట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించారు. ‘ఇది నిన్ను నువ్వే తక్కువగా చేసుకుంటున్నట్టుగా ఉంది. మన ప్రధాని నారీ శక్తి గురించి చెబుతుంటారు కాదా. నేను జారిపడబోతుంటే రాహుల్ గాంధీ నాచేయిపట్టుకున్నారు’ అని పూనమ్ కౌర్ వివరణ ఇచ్చారు. చదవండి: డ్రగ్స్ నిషా.. రెండురోజులు లేవలేదు, ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు! -
‘జోడో ’ఎంట్రీలో ఏం జరిగింది..షేక్ హ్యాండ్స్ ఎందుకు మిస్సయ్యాయి?
రాహుల్ జోడో యాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ చాలా ఏర్పాట్లే చేసింది. అయితే ఎంట్రీ రోజే పీసీసీ చేతులెత్తేసిందంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. జోడో యాత్ర ఎంట్రీలో అనుకున్నదొకటి అయితే.. అయింది మరొకటని చెబుతున్నారు. పక్కా ప్లాన్.. అట్టర్ ఫ్లాప్ ఈ నెల 23వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ ఎంట్రీకి చాలా రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేసింది టీ పీసీసీ నాయకత్వం. యాత్ర సక్సెస్ చేయడానికి 13 రకాల కమిటీలను వేసింది. యాత్ర కర్ణాటక నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో రాహుల్ ను ఆహ్వానించేందుకు 41మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీ వేసింది. కానీ జోడో యాత్ర రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజు ఒకటి అనుకుంటే మరోకటి జరిగిందని చర్చించుకుంటున్నారు టీ కాంగ్రెస్ నాయకులు. షేక్ హ్యాండ్స్ ఎందుకు మిస్సయ్యాయి? భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించాక రిసెప్షన్ కమిటీలోని 41 మంది సభ్యులు రాహుల్ ను ఆహ్వానించాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఠాగూర్ లేదా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాని నేతలందరిని రాహుల్కు పరిచయం చేయాల్సి ఉంది. కానీ ఇదేమీ జరగకుండానే జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి జాతీయ జెండాను ఇవ్వడం ఒక్కటే పద్దతి ప్రకారం జరిగింది. మిగిలిన కార్యక్రమం ఏదీ అనుకున్నట్లుగా జరగలేదు. దీంతో రిసెప్షన్ కమిటీ సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తొక్కిసలాట? ఇక రాహుల్ యాత్ర రాష్ట్రంలో ప్రవేశించిన సందర్భంగా రాహుల్ను చూసేందుకు, కలిసేందుకు వేల మంది కార్యకర్తలు సరిహద్దు ప్రాంతానికి వచ్చారు. కార్యకర్తల మధ్య కొందరు సీనియర్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సమాచారం. తొక్కిసలాటలో కిందపడి కొందరికైతే తీవ్ర గాయాలయ్యాయి. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రలో కిందపడిపోయారు. పొన్నాల చేయికి గాయం అయింది. ఇక ఉత్తమ్ కుమార్ కింద పడిపోగా అక్కడే ఉన్న పొలీసు అధికారి సేవ్ చేసినట్లు తెలుస్తోంది. లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తీవ్రంగా గాయాలు అయ్యేవట. మరో నేత బలరాం నాయక్ సైతం కింద పడిపోయారట. ఇలా చాలా మంది నేతలు కార్యకర్తల నడుమ తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో చాలా మంది నేతలు యాత్రకు దూరంగా ఉంటేనే మంచిదని, వీలైతే మధ్యాహ్నం బ్రేక్ టైంలో రాహుల్ ను కలిస్తే బెటర్ అనుకుంటున్నారట కొందరు నేతలు. -
జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి
సాక్షి, హైదరాబాద్: జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి చేశారు. వన్టౌన్ చౌరస్తా సమీపంలో రాహుల్తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరవత్రి అనిల్, ఆలిండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్యతో కలిసి చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం వేసిన 5శాతం జీఎస్టీ ఎత్తివేయాలని, నేతకు సంబంధించిన ముడి సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని,ఈ మేరకు పార్లమెంట్లో మాట్లాడాలని కోరగా.. రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు పూనమ్ కౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీతక్క, భట్టి, కళాకారులతో రాహుల్ దరువు భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని అవంతి హోటల్ వద్ద ఖమ్మం తదితర జిల్లాలకు చెందిన ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలను రాహుల్ ఆసక్తిగా తిలకించారు. కేసీ వేణుగోపాల్, భట్టి, సీతక్క, సంపత్ కుమార్, కళాకారులతో కలిసి లయబద్ధంగా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల కళారూపాల గురించి రాహుల్కు భట్టి విక్రమార్క వివరించారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు ప్రజాసంఘాలు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ శనివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. చేనేత కుటుంబాల సమస్యలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, విద్యావ్యవస్థ బలోపేతంపై స్పష్టతనిచ్చారు. ►ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నేటికీ పూర్తికాలేదని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో కన్వీనర్ రాఘవాచారి తదితరులు రాహుల్ దృష్టికి తీసుకెళ్లగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ►రాష్ట్రంలో 60 వేల చేనేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సినీనటి పూనమ్ కౌర్, పద్మశ్రీ అవార్డుగ్రహీత అంజయ్య రాహుల్ కలసి వివరించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యావిధానాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుపేద కుటుంబాలు నష్టపోతున్నాయని రాహుల్తో భేటీలో గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్లు పేర్కొనగా తాము గెలిస్తే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందిస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. ►దివ్యాంగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలోని బృందం రాహుల్ను కలసి వినతిపత్రం ఇవ్వగా అధికారంలోకొస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ఘన స్వాగతానికి ఏర్పాట్లు రాహుల్ భారత్ జోడో యాత్ర నవంబర్ ఒకటిన హైదరాబాద్కు చేరుకోనుండటంతో ఈ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలతో విస్తరించి ఉన్న నగరంలో యాత్రను విజయవంతం చేయడం ద్వారా మూడు జిల్లాల్లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం నగరం నలుమూలతోపాటు రాహుల్ పాదయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. అలాగే యాత్రలో పాల్గొనేందుకు భారీ జనసమీకరణకు ప్రణాళిక రచిస్తోంది. దీనిపై మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని విధంగా హైదరాబాద్లో రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒకవైపు యూనివర్సిటీలు, కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ మరోవైపు విద్యారంగానికి తక్కువ నిధులు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఫలితంగా నిరుపేదలు, రైతుల పిల్లలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో తాను ఓ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని కలిశానని.. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ ఫీజును రీయింబర్స్ చేయకపోవడం వల్ల డోర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు చెప్పాడన్నారు. అందుకే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ అధిక నిధులు ఖర్చు పెడతామని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువతీయువకులు వారి కలలను సాకారం చేసుకొనేందుకు వీలుగా ప్రభుత్వ రంగంలోనే యూనివర్సిటీలు, విద్యాసంస్థలను నెలకొల్పుతామన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం మహబూబ్నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన రాహుల్... పాలమూరు యూనివర్సిటీ, బండమీదిపల్లి, మహబూబ్నగర్ వన్టౌన్ చౌరస్తా, అశోక టాకీస్ జంక్షన్, బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ మీదుగా ఏనుగొండలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన శిబిరానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి యాత్ర పారంభించి అప్పనపల్లి, కేసీఆర్ ఎకో పార్క్, మల్లెబోయినపల్లి మీదుగా జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకున్నారు. క్రాస్రోడ్డులో ఫ్లైఓవర్ కింద కార్నర్ మీటింగ్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అవి వ్యాపార పార్టీలు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుతో నిరుపేదలు, చిన్న, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించి సామాన్యుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. దేశంలో గత 35 ఏళ్లలో ఎన్నడూలేని స్థాయిలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని... అదే సమయంలో ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఎక్కువ మంది భారత్లోనే ఉన్నారని రాహుల్ గుర్తుచేశారు. దేశంలో ధనవంతులు ఏం చెబితే అదే జరుగుతోందని... ఇక్కడి ముఖ్యమంత్రి, ఢిల్లీలో ప్రధాని వారికి పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ పార్టీల్లా కాకుండా వ్యాపార పార్టీలుగా మారాయని.. వాటికి నిరుపేదలు, రైతులు, ఇతర వర్గాలతో పని ఉండదని విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. దేశ సంపదను పేదలకు పంచి అభివృద్ధిని సాధించాల్సింది పోయి నలుగురు సంపన్నులకే దోచిపెడుతుండటంతో పేదలు, ధనవంతులనే అంతరాలు ఏర్పడ్డాయని... ఇందుకు కేంద్రంలోని బీజేపీనే కారణమని రాహుల్ ధ్వజమెత్తారు. బీజేపీ అమలు చేస్తున్న విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకే భారత్ జోడో యాత్ర చేస్తున్నాని పునరుద్ఘాటించారు. చేనేత కార్మికులకు పరిహారం.. ప్రపంచంలోనే తెలంగాణ చేనేతకు ఎంతో ప్రాచుర్యం ఉందని.. అయితే కేంద్రం విధించిన జీఎస్టీతో లక్షలాది మంది చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే జీఎస్టీ వల్ల నష్టపోయిన కార్మికులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది పెద్ద విషయమేమీ కాదని.. వాటి లెక్కలు చూసే చెబుతున్నానన్నారు. అలాగే ధరణి పోర్టల్లో మార్పులు చేస్తామని.. దళిత, ఆదివాసీలు, గిరిజనుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికే అందిస్తామన్నారు. కార్నర్ మీటింగ్ అనంతరం రాహుల్ గొల్లపల్లిలో రాత్రి బస చేశారు. శనివారం మొత్తంగా రాహుల్ 20.3 కి.మీ. మేర పాదయాత్ర చేశారు.