RG Kar Case: దిగొచ్చిన వైద్యులు.. కాసేపట్లో మమతా బెనర్జీతో భేటీ | RG Kar Case: Doctors Delegation meeting CM Mamata Banerjee Updates | Sakshi
Sakshi News home page

RG Kar Case: దిగొచ్చిన వైద్యులు.. కాసేపట్లో మమతా బెనర్జీతో భేటీ

Published Wed, Sep 11 2024 4:10 PM | Last Updated on Wed, Sep 11 2024 5:18 PM

RG Kar Case: Doctors Delegation meeting CM Mamata Banerjee Updates

కోల్‌కతా: ఆర్‌జీ కర్‌ జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై 33 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. బెంగాల్‌ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది.

వైద్యులలో 12 నుంచి 15 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి రావాలంటూ సీఎస్‌ మనోజ్‌ పంత్‌ పేరిట ఆహ్వానం వెళ్లింది. అయితే అంతకంటే ముందే.. సీఎం మమతా బెనర్జీతో  చర్చలకు తామూ సిద్ధమంటూ వైద్యులు ప్రకటన చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న అభయ ఘటన ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు ఉండాలని, అందుకోసం  అపాయింట్‌మెంట్‌ కోరుతూ సీఎంవోకు మెయిల్‌ పంపారు. దీంతో.. వెంటనే ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయానికి రావాల్సిందిగా ప్రభుత్వం బదులిచ్చింది. 

ఇదీ చదవండి: అభయ ఘటన. నిందితుడి గురించి షాకింగ్‌ విషయాలు



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement