ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు | SBI submits compliance affidavit in Supreme Court | Sakshi

ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు

Mar 14 2024 6:27 AM | Updated on Mar 14 2024 12:09 PM

SBI submits compliance affidavit in Supreme Court - Sakshi

న్యూఢిల్లీ:  దేశంలో రాజకీయ పారీ్టలకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది.

నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖరా బుధవారం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్‌ రూపంలో అందజేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement