7 Students Hospitalized In Karnataka Over Spicy Food - Sakshi
Sakshi News home page

టిఫిన్‌లో ఎక్కువ కారం.. విద్యార్థులకు అనారోగ్యం

Jul 28 2023 10:05 AM | Updated on Jul 28 2023 11:16 AM

Students Hospitalized Over Spiciness In Food Karnataka - Sakshi

మైసూరు: జిల్లాలోని గుండ్లుపేటె తాలకాలోని గరగనహళ్లిలో ఉన్న మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో కారం ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న సుమారు 7 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు... గురువారం ఉదయం విద్యార్థులకు టమాటా బాత్‌ టిఫిన్‌ పెట్టారు. అది ఎక్కువగా కారం ఉండటంతో ఏడుమంది విద్యార్థులు కడుపునొప్పి, మంట, వాంతులతో బాధపడసాగారు.

బాధిత విద్యార్థులు వర్ణిత (13), హర్షిత (13), ప్రియ (13), రచన (15), సంజన (15), సంగీత (13), ప్రజ్వల్‌ (15)లను హోరెయాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. ఇందులో ప్రజ్వల్‌కు కడుపునొప్పి ఎక్కువగా ఉండడంతో అతన్ని బేగరు ఆస్పత్రికి తరలించారు. వంట సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.

చదవండి   వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement