Bihar: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి | | Sakshi
Sakshi News home page

Bihar: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

Published Mon, Aug 5 2024 6:57 AM | Last Updated on Mon, Aug 5 2024 6:57 AM

A Tragic Accident Happened in Hajipur

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కావడియాత్రికులు హైవోల్టేజీ విద్యుత్‌ వైరు తగిలి మృతి చెందారు.

ఈ ప్రమాదంలో  మరో ఆరుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి ఈ కావడి యాత్రికులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న కావడియాత్రికులంతా పహెల్జా నుండి గంగాజలాన్ని తీసుకుని, సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళుతున్నారు.

ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.  మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎస్‌డీపీఓ ఓంప్రకాష్ మాట్లాడుతూ కావడియాత్రికులంతా ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజేకి 11 వేల వోల్టుల విద్యుత్ తీగ తగిలిందన్నారు. ఈ కారణంగానే వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement